శ్రీకాళహస్తి, న్యూస్లైన్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన బుధవారం ఎంతో వైభవోపేతంగా జరిగింది. ఆలయంలోని స్వామివారి సన్నిధికి ఎదుట నూతన ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనను శాస్త్రోక్తగా నిర్వహించారు. మొదట గురుదక్షిణామూర్తిని సర్వాంగసుందరంగా అలంకరిం చారు. తర్వాత గురుదక్షిణామూర్తి వద్దే పూజారులు, వేదపండితులు హోమం వెలిగించి మం త్రోచ్ఛారణలతో కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం పంచమూర్తులైన స్వామి, అమ్మవార్లు, వినాయకుడు, సుబ్రమణ్యస్వామి, క న్నప్ప, చండికేశ్వరుని పేర్లతో ధ్వజస్తంభానికి నాలుగు దిక్కుల పూజలు చేశారు. కలశాలలోని పవిత్ర జలాలను, రాగి నాణేలను ఉంచి ప్రధాన అర్చకులు బాబుగురుకుల్, సాంబయ్య ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించారు.
ధ్వజాన్ని అభిషేకించిన ఆకాశగంగ..
పూజల అనంతరం ధ్వజానికి అభిషేకం జరిపేందుకు వేదపండితులు, అర్చక స్వాము లు సన్నద్ధమవుతున్న తరుణంలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో ధ్వజస్తంభం పూర్తిగా తడిసింది. ముక్కోటి దేవతలతోపాటు దివి నుంచి భువికి దిగివచ్చిన వరుణుడు స్వయం గా ఆకాశగంగతో స్వామివారి ధ్వజస్తంభాన్ని అభిషేకించాడంటూ వేదపండితులు, భక్తులు, ఆలయాధికారులు జయజయ ధ్వానాలు చేశా రు. ధ్వజస్తంభంపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీరామచంద్రమూర్తితో పాటు ఆలయాధికారులు గోపాలకృష్ణమూర్తి, కోదండరామిరెడ్డి, రామిరెడ్డి, నాగభూషణం, హరియాదవ్, లోకేష్, వెంకటేశ్వరరాజు, బాబు, లక్ష్మయ్య పాల్గొన్నారు.
శివయ్య ఆశీర్వాదంతోనే విజయవంతం
శ్రీకాళహస్తి శివయ్య ఆశీర్వాదంతోనే ధ్వజ స్తం భాన్ని విజయవంతంగా ప్రతిష్ఠాంచామని ఆల య ఈవో శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడుతూ ప్రతిష్ఠాపన సమయం లో వర్షం రావడం శుభసూచికమన్నారు. ఆల య శిల్పసౌందర్యానికి ఎలాంటి విఘాతం ఏర్పకుండా ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం సాహసోపేతంగా మారిందని చెప్పారు. మొద ట ఆందోళన చెందామని, ఆ దేవుని దయతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా కార్యక్రమం ముగిసిందన్నారు. 112 ఏళ్ల తర్వాత శివయ్య ధ్వజ స్తంభా న్ని తన చేతులమీదుగా ప్రతిష్ఠించే భాగ్యం కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలమని తెలిపారు.
వైభవంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠ
Published Thu, Oct 24 2013 4:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement