పందెం కోళ్లు, నగదు ఓ పోలీస్ స్వాహా.. అరెస్టు
సాక్షి, రాజమహేంద్రవరం: తనకు సంబంధంలేని పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న కోడిపందేలపై దాడి చేసి, అక్కడ కోళ్లను, నగదును స్వాహా చేయడానికి ప్రయత్నించాడు ఓ కానిస్టేబుల్. వివరాల్లోకి వెళితే.. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రమణ గురువారం త్రీటౌన్ పరిధి లోని లూథరన్ గిరి వెనుక వైపు జరుగుతున్న కోడిపందేలపై దాడి చేశాడు. అతడిని చూసి పందెగాళ్లు పారిపోయారు.
అక్కడే ఉన్న కోళ్లు, నగదును కానిస్టేబుల్ రమణ స్వాహా చేసేందుకు ప్రయత్నించాడు. ఇది తెలుసుకున్న త్రీటౌన్ కానిస్టేబుళ్లు అతడిని పట్టుకొని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై త్రీటౌన్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబును వివరణ కోరగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కానిస్టేబుల్ రమణపై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
చదవండి : ఏటీఎం కార్డులు మార్చడంలో ఘనుడు