వ్యాన్ - ట్రాక్టర్ ఢీ: ఒకరు మృతి | one person killed in tractor, van accident | Sakshi
Sakshi News home page

వ్యాన్ - ట్రాక్టర్ ఢీ: ఒకరు మృతి

Sep 15 2013 8:13 AM | Updated on Sep 1 2017 10:45 PM

కాగజ్నగర్ మండలం గురుజగూడ గ్రామ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున వ్యాను, ట్రాక్టర్ ఢీ కొన్నాయి.

కాగజ్నగర్ మండలం గురుజగూడ గ్రామ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున వ్యాను, ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు.

 

క్షతగాత్రులను ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement