ముగిసిన సీఎం జగన్‌, ముకేష్‌ అంబానీ భేటీ

MukesH Ambani Meets AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ భేటీ ముగిసింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ సమావేశం జరిగింది. దాదాపు గంటన్నర పాటు సీఎం జగన్‌తో అంబానీ బృందం చర్చలు జరిపింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరు చర్చించినట్టు సమాచారం. ఈ  సమావేశంలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్‌నత్వానీ పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గన్నవరం  ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ముకేశ్‌ అంబానీ బృందానికి స్వాగతం పలికారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top