పిల్లల గొంతు కోసి చంపిన తల్లి | Mother commits Suicide along with her Two Children | Sakshi
Sakshi News home page

పిల్లల గొంతు కోసి చంపిన తల్లి

Jun 22 2015 8:00 PM | Updated on Apr 4 2019 4:44 PM

ఒక తల్లి తన ఇద్దరు పిల్లల గొంతు కోసి హత్య చేసి అనంతరం తనూ ఆత్మహత్యకు పాల్పడింది.

కంబదూరు (అనంతపురం జిల్లా) : ఒక తల్లి తన ఇద్దరు పిల్లల గొంతు కోసి హత్య చేసి అనంతరం తనూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన సోమవారం సాయంత్రం అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నూతిమడుగు గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తి మధ్యప్రదేశ్‌లో ఆర్మీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతనికి సునీత(30)తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి కృష్ణ(3), రుషి(1) సంతానం. కాగా నెల క్రితమే ఇంటికి వచ్చిన మారుతితో సునీత తననూ మధ్యప్రదేశ్ తీసుకుని వెళ్లాలని, ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నానని చెప్పింది.

అయితే మారుతి అక్కడికి వెళ్లి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాక వచ్చి తీసుకెళ్తానని సర్దిచెప్పాడు. కాగా ఎప్పుడూ ఇలాగే చెబుతూ ఉన్నావని సునీత భర్తతో వాదించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఇంట్లో ఇద్దరి పిల్లల గొంతు కోసి హత్య చేసింది. అదే సమయంలో పిల్లల అరుపులు విని ఆడబిడ్డ లోపలికి వచ్చింది. ఆడబిడ్డను చూపిన వెంటనే సునీత కూడా కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement