ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య | mother commit suicide with two children | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Nov 25 2015 12:55 PM | Updated on Jun 1 2018 8:54 PM

అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లెలో విషాదం చోటు చేసుకుంది.

నార్పల:  అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు పాలలో   విషం కలిపి ఇచ్చి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లీ కొడుకూ మరణించగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన మాధవి(24)కి ముదిగుబ్బ మండలం కొడవళ్లపల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొన్ని నెలల క్రితం భర్త ఓ హత్యకేసులో ఇరుక్కుని జిల్లా సబ్‌జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి మాధవి తన పుట్టింటి వద్దే ఉంటోంది.
 
భర్త ఎంతకీ జైలు నుంచి విడుదల కావడం లేదనే మనస్తాపంతో మాధవి, తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఉరేసుకుంది. ఈ సంఘటనలో కుమారుడు లోకేశ్వర్ రెడ్డి(3), మాధవి మృతిచెందగా, కూతురు భాను(5)ను మెరుగైన చికిత్స నిమిత్తం పాపను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement