ఆ దమ్ము ముఖ్యమంత్రికి లేదు: కోదండరాం | kodandaram takes on kiran kumar reddy | Sakshi
Sakshi News home page

ఆ దమ్ము ముఖ్యమంత్రికి లేదు: కోదండరాం

Feb 4 2014 1:07 AM | Updated on Jul 29 2019 5:31 PM

తెలంగాణ బిల్లుపై సీఎం ఇచ్చిన కాగితం తెల్లదేమి కాదు, దానిపై రాతలున్నాయి, అయితే ఆ కాగితానికి తెలంగాణను ఆపే దమ్ము లేదని’ టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

సంగారెడ్డి, న్యూస్‌లైన్: ‘తెలంగాణ బిల్లుపై సీఎం ఇచ్చిన కాగితం తెల్లదేమి కాదు, దానిపై రాతలున్నాయి, అయితే ఆ కాగితానికి తెలంగాణను ఆపే దమ్ము లేదని’ టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలను కలిపి ఉంచలేని కిరణ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానంటూ బీరాలు పోతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక సంగారెడ్డి డివిజన్ సమావేశం సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరి గింది.

 

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలోనూ, ఆ తర్వాత విలేకరులతోనూ ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పునర్విభజనపై కేంద్రానికి సర్వహక్కులున్నాయన్నారు. సీఎం 77 ఆర్టికల్ ప్రకా రం అసెంబ్లీలో చేసిన మూజువాణి తీర్మానం కేవలం రాష్ర్ట ప్రభుత్వానికే వెళ్తుందని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement