రేపు కాపు నేతల అత్యవసర సమావేశం | kapu leaders plans to meet over mudragada, reservations issue | Sakshi
Sakshi News home page

రేపు కాపు నేతల అత్యవసర సమావేశం

Jun 15 2016 1:01 PM | Updated on Jul 30 2018 7:57 PM

ఆంధ్రప్రదేశ్ కాపు నేతలు మరోసారి గురువారం సమావేశం కానున్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కాపు నేతలు మరోసారి గురువారం సమావేశం కానున్నారు. ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన రెండు రోజుల గడువు ముగిసినా సర్కార్ స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గురువారం విజయవాడ లేదా రాజమండ్రిలో భేటీ అయ్యే అవకాశముంది. ఇప్పటికే ముద్రగడ చేస్తున్న ఆమరణ దీక్ష ఏడో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement