అంతంకాదు ఆరంభం మాత్రమే:సాయిబాబా | Its only beginning, says electric employees seemandhra jac chairman saibaba | Sakshi
Sakshi News home page

అంతంకాదు ఆరంభం మాత్రమే:సాయిబాబా

Sep 14 2013 1:18 PM | Updated on Sep 5 2018 3:59 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగుల చేపట్టిన సమ్మె అంతం కాదని, ఆరంభం మాత్రమేనని సీమాంధ్ర విద్యుత్ ఐకాస ఛైర్మన్ సాయిబాబా శనివారం హైదరాబాద్లో స్పష్టం చేశారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగుల చేపట్టిన సమ్మె అంతం కాదని, ఆరంభం మాత్రమేనని సీమాంధ్ర విద్యుత్ ఐకాస ఛైర్మన్ సాయిబాబా శనివారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె ఈ రోజు అర్థరాత్రితో ముగిస్తుందన్నారు.

 

రేపటినుంచి విద్యుత్ ఉద్యోగులు విధులకు హాజరువుతారని తెలిపారు. అలాగే సమ్మెలో భాగంగా ప్రభుత్వానికి అప్పగించిన సెల్ ఫోన్ సిమ్ కార్డులను రేపు తిరిగి తీసుకుంటామన్నారు. ఈ నెల 16,17 తేదీల్లో తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని సాయిబాబ ఈ సందర్భంగా వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement