తాగిన మత్తులో భార్యను హత్య చేసిన భర్త | Husband kills Wife | Sakshi
Sakshi News home page

తాగిన మత్తులో భార్యను హత్య చేసిన భర్త

Aug 25 2015 2:50 PM | Updated on Jul 30 2018 8:29 PM

తాగిన మైకంలో ఓ భర్త కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలం జె.హోసహల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

కర్నూలు (హాలహర్వి) : తాగిన మైకంలో ఓ భర్త కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలం జె.హోసహల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్వతి(35), గాదె లింగప్ప(40)భార్యాభర్తలు. కాగా లింగప్ప రోజూ తాగి వస్తూ భార్యను వేధిస్తుండేవాడు.

ఈ క్రమంలోనే మంగళవారం కూడా తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఆవేశంలో పక్కనున్న కర్ర తీసుకుని భార్య పార్వతి నెత్తి మీద బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement