భారీఎత్తున సమైక్య సభకు... | Heavy peoples moved to Samaikya Sankharavam | Sakshi
Sakshi News home page

భారీఎత్తున సమైక్య సభకు...

Oct 26 2013 4:35 AM | Updated on Sep 1 2017 11:58 PM

జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించడం సాంకేతికంగా సాధ్యం కాదనే విషయాన్ని అందరూ గుర్తించారని, ప్రభుత్వంలోని పెద్దలు కూడా బలపరుస్తున్నారన్నారు.

 బెలగాం, న్యూస్‌లైన్:  సమైక్యాంధ్ర ఉద్యమం పార్వతీపురంలో ఉద్ధృతంగా కొనసాగుగోంది. ఉద్యమంలో భాగంగా  ఏపీఎన్‌జీఓ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం  ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని అన్ని బస్సులకు, ప్రధాన రహదారిలో వెళ్తున్న వాహనాలకు, రైల్వేస్టేషన్‌లో ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లకు విభజన వద్దు- సమైక్యాంధ్రే ముద్దు అంటూ స్టిక్టర్లను జేఏసీ నాయకులు, సభ్యులు అతికించారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
 ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించడం సాంకేతికంగా సాధ్యం కాదనే విషయాన్ని అందరూ గుర్తించారని, ప్రభుత్వంలోని పెద్దలు కూడా బలపరుస్తున్నారన్నారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు గంజి లక్ష్మీనాయుడు, కార్యదర్శి జి.వీఆర్‌ఎస్ కిశోర్, నాయకులు కత్తిర నర్సింగరావు, మండల సత్తిబాబు, ఆర్‌ఎస్‌రావు తదితరులు పాల్గొన్నారు.  కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షసమైక్యాంధ్రకు మద్దతుగా   న్యాయవాదులు విధులను బహిష్కరించి  కోర్టు జంక్షన్ వద్ద  శుక్రవారం దీక్షను  కొనసాగించారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నంలో శనివారం జరిగే న్యాయవాదుల జేఏసీ సమావేశంలో తీసుకునే నిర్ణయం ప్రకారం కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో ఏజీపీ పీ. రాజేంద్ర,  న్యాయవాదులు  జి. వెంకట్రావు, ఎస్. ప్రభాకరరావు, పివి క్రిష్ణారావు, గొర్లి రమణ, గిరీష్‌కుమార్‌మారో, జి. విజయశంకర్,  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement