breaking news
Heavy peoples
-
రికార్డు సంఖ్యలో ప్రయాణం.. 640 మంది కాదు..823 మంది!
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి గత ఆదివారం బయలుదేరిన విమానంలో అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువ మందే ప్రయాణించినట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. సీ–17 విమానంలో జనం కిక్కిరిసి కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ విమానంలో 640 మంది ప్రయాణికులున్నట్లు అప్పట్లో అంచనా వేశారు. కానీ, వాస్తవానికి ఆ రోజు ఆ విమానంలో 183 మంది చిన్నారులు సహా మొత్తం 823 మంది ప్రయాణించినట్లు ఎయిర్ మొబిలిటీ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్నారులంతా పెద్ద వారి భుజాలపైన, వీపుమీద కూర్చుని ఉన్నారని, వారిని ఇప్పటి దాకా లెక్కలోకి తీసుకోలేదని పేర్కొంది. సీ–17లో ఇంతమంది జనం ప్రయాణించడం కొత్త రికార్డని తెలిపింది. గత ఆదివారం కాబూల్లోకి తాలిబన్లు అడుగు పెట్టడంతో భీతిల్లిన విదేశీయులు, స్థానికులు అమెరికా వైమానిక దళానికి చెందిన విమానంలో చోటు సంపాదించేందుకు ప్రాణాలకు తెగించారు. ఎలాగైనా సరే, దేశం నుంచి బయటపడాలనే ఆత్రుతలో కొందరు విమానం పైన కూడా ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
భారీఎత్తున సమైక్య సభకు...
బెలగాం, న్యూస్లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం పార్వతీపురంలో ఉద్ధృతంగా కొనసాగుగోంది. ఉద్యమంలో భాగంగా ఏపీఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్లోని అన్ని బస్సులకు, ప్రధాన రహదారిలో వెళ్తున్న వాహనాలకు, రైల్వేస్టేషన్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లకు విభజన వద్దు- సమైక్యాంధ్రే ముద్దు అంటూ స్టిక్టర్లను జేఏసీ నాయకులు, సభ్యులు అతికించారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించడం సాంకేతికంగా సాధ్యం కాదనే విషయాన్ని అందరూ గుర్తించారని, ప్రభుత్వంలోని పెద్దలు కూడా బలపరుస్తున్నారన్నారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు గంజి లక్ష్మీనాయుడు, కార్యదర్శి జి.వీఆర్ఎస్ కిశోర్, నాయకులు కత్తిర నర్సింగరావు, మండల సత్తిబాబు, ఆర్ఎస్రావు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షసమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు జంక్షన్ వద్ద శుక్రవారం దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నంలో శనివారం జరిగే న్యాయవాదుల జేఏసీ సమావేశంలో తీసుకునే నిర్ణయం ప్రకారం కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ పీ. రాజేంద్ర, న్యాయవాదులు జి. వెంకట్రావు, ఎస్. ప్రభాకరరావు, పివి క్రిష్ణారావు, గొర్లి రమణ, గిరీష్కుమార్మారో, జి. విజయశంకర్, తదితరులు పాల్గొన్నారు.