మే 7న గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష | Group-1 Preliminary Examination on May 7 | Sakshi
Sakshi News home page

మే 7న గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష

Apr 29 2017 1:29 AM | Updated on Mar 28 2019 5:39 PM

రాష్ట్రంలో 73 గ్రూప్‌–1 పోస్టుల భర్తీ కోసం ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) మే 7న ప్రిలిమినరీ (స్క్రీనింగ్‌ టెస్టు) పరీక్ష నిర్వహించనుంది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 73 గ్రూప్‌–1 పోస్టుల భర్తీ కోసం ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) మే 7న ప్రిలిమినరీ (స్క్రీనింగ్‌ టెస్టు) పరీక్ష నిర్వహించనుంది. ఈ పోస్టులకు 93,482 మంది దరఖాస్తు చేశారని, వీరికి ఏపీలోని 174 కేంద్రాల్లో ప్రిలిమ్స్‌ నిర్వహించనున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులను ఉదయం 9.30–10.00 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. గ్రేస్‌ పీరి యడ్‌ కింద మరో 15 నిమిషాలు  అంటే 10.15 వరకు అనుమతిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement