అనంతపురం జిల్లా హిందూపురం మండలం హనుమేపల్లిలో గురువారం దారుణం చోటు చేసుకుంది.
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం మండలం హనుమేపల్లిలో గురువారం దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమకు అడ్డుపడుతున్నాడని యువతి బావ అనిల్పై హరి అనే యువకుడు కొడవలితో దాడి చేశారు. ఈ దాడిలో అనిల్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. దాంతో హరి అక్కడి నుంచి పరారైయ్యాడు.
స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి... నిందితుడు హరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.