కరెంటు షాక్‌తో తండ్రీకొడుకులు మృతి | father and son die of electric shock | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో తండ్రీకొడుకులు మృతి

Nov 12 2015 12:02 PM | Updated on Sep 28 2018 3:39 PM

అనంతపురం జిల్లాలో కరెంటు షాక్‌తో తండ్రీకొడుకులు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గోరంట్ల: అనంతపురం జిల్లాలో కరెంటు షాక్‌తో తండ్రీకొడుకులు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతులు గోరంట్ల మండలం మల్లపల్లి గ్రామంలో  చికెన్‌ షాపు నిర్వహిస్తున్నారు.

గురువారం ఉదయం షాపులో పనులు చేసుకునే క్రమంలో ఇద్దరు కరెంటు షాక్కు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement