కరీంనగర్ కమిషనరేట్లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం కమిషనరేట్ కేంద్రంలోని పరేడ్గ్రౌండ్లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. కార్యక్రమాన్ని సీపీ గౌస్ఆలం ప్రారంభించారు.
నగరంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొని, వివిధ రకాల తుపాకులు పరిశీలించారు.
పోలీసులు పరికరాలపై అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్, గన్స్, స్మోక్గన్స్, షెల్స్, బాంబు నిర్వీర్య విభాగం పనితీరు, ఫ్రెమ్ మెటల్ డిటెక్టర్లు, కమాండ్ కంట్రోల్ వాహనం, వజ్ర వాహనాన్ని ప్రదర్శనలో ఉంచారు.
షీటీం, సైబర్క్రైం, యాంటీ నార్కోటిక్ సెల్, ట్రాఫిక్ విభాగానికి చెందిన స్టాళ్లను గురించి వివరించారు.


