కదిరి తేరు చూతము రారండి | Devotees rush in Kadiri temple during Kadhri laxmi narasimhudu | Sakshi
Sakshi News home page

కదిరి తేరు చూతము రారండి

Mar 11 2015 11:03 PM | Updated on Sep 2 2017 10:40 PM

కదిరి తేరు చూతము రారండి

కదిరి తేరు చూతము రారండి

అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మ రథోత్సవం గురువారం అశేష భక్తజన సందోహం మధ్య సరిగ్గా ఉదయం 8.15గంటలకు ప్రారంభం కానుంది.

- దేశంలో మూడవది, రాష్ట్రంలోనే అతి పెద్ద బ్రహ్మరథం
- 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా
- ఆలయ ప్రాంగణంలో పోటెత్తిన భక్త జనం

కదిరి (అనంతపపురం) : అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మ రథోత్సవం గురువారం అశేష భక్తజన సందోహం మధ్య సరిగ్గా ఉదయం 8.15గంటలకు ప్రారంభం కానుంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవం ఇది. ఇప్పటికే ఆలయ ప్రాంగణంతో పాటు తిరు వీధుల గుండా ఉన్న భవనాలు భక్తులతో కిటకిటలాడి పోతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కాలు మోపేందుకు చోటు లే దు. బ్రహ్మోత్సవాల్లో నారసింహుడు తిరు వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించడానికి దేవతలు తమ తమ వాహనాలను పంపుతారని భక్తుల నమ్మకం. సాక్షాత్తు బ్ర హ్మదేవుడే శ్రీవారి రథోత్సవం నాడు రథాన్ని నడిపి స్వామి వారు విహరించడానికి సహకరిస్తారని, అందుకే బ్రహ్మ రథోత్సవం అంటారని ప్రధాన అర్చకులు పార్థసారథిచార్యులు, నరసింహాచార్యులు చెబుతున్నారు. తెల్లటి ఐరావతంపై బుధవారం రాత్రి విహరించిన శ్రీవారు తిరిగి యాగశాలను చేరుకొని, తెల్లవారుజామున రథారోహణం గావిస్తారు. శ్రీదేవి, భూదేవిలను కంకణ భట్టాచార్యులు తీసుకొని వస్తారు. శ్రీదేవి భూదేవిల సమేతంగా బ్రహ్మ రథంపై శ్రీవారు లక్షలాది మంది భక్తాదులకు దర్శన భాగ్యం కల్గిస్తారు.

దేశంలోనే అతిపెద్ద తేరు : నేటి రథోత్సవంలో ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భారీ బ్రహ్మ రథంపై కొలువు దీరి తిరువీధుల్లో భక్తులకు దర్శన మివ్వనున్నారు. తమిళనాడు అండాల్ అమ్మవారి శ్రీ వల్లి పుత్తూరు రథం, తంజావూర్ జిల్లాలోని తిరువార్ రథం తర్వాత దేశంలో అతిపెద్ద రథంగా కదిరి తేరు ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలో అతిపెద్ద బ్రహ్మ రథం ఇదే. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడ ల్పు 16 అడుగులు. 120 ఏళ్ల క్రితం తయారు చేసిన రథం చక్రాలు ఒక అడుగు, ఒక అంగుళం వెడల్పుతో పాటు 8 అడుగుల డయామీటర్‌తో ఉన్నాయి. ఇవి 4 ఏళ్ల క్రితం బ్రహ్మ రథోత్సవం నాడు మరమ్మతుకు రావడంతో వీటి స్థానంలో 2 సంవత్సరాల క్రితం జరిగిన బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఆధ్వర్యంలో కొత్త చక్రాలను అమర్చారు. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా చెక్కారు. వివిధ భంగిమల్లో చెక్కిన ఈ బొమ్మలు అప్పటి శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనం.

పోటెత్తిన భక్తజనం : ఖాద్రీ లక్షీ్ష్మ నారసింహుని బ్రహ్మ రథోత్సవాన్ని చూడడానికి రాష్ట్ర నలుమూలలనుండే కాక పొరుగు రాష్ట్రాలైనా కర్ణాటక , తమిళనాడు నుండి బుధవారం పగలే పెద్ద ఎత్తున భక్తాదులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కాలు మోపేందుకు చోటులేక భక్త జనంతో పోటెత్తింది. ఆలయంలోని అద్దె గదులతో పాటు పట్టణంలోని అన్ని లాడ్జిలలో గదులు ఖాళీ లేవనే సమాధానమే భక్తులకు ఎదురవుతోంది. నెల రోజులకు ముందే లాడ్జిలలో గదులు బుక్ చేసుకున్నారు. చేసేది లేక భక్తులు ఆలయ ప్రాంగణంలోనే కటిక నేలపై నిద్రించడం కన్పించింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం పగలు, రాత్రి తేడా లేకుండా హరికథలు, బుర్రకథలతో పాటు పలు సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement