దాహం...దాహం...

దాహం...దాహం...


ఈ ఏడాది ఎండల తీవ్రతకు దాహార్తితో మూగజీవాలు అల్లాడిపోతున్నాయనేందుకు ఈ చిత్రమే సాక్ష్యం. గొంతెండిపోయి... నీటికోసం అన్వేషిస్తున్న ఓ ఆవుకు కుళాయి కనపడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. కుళాయిని తిప్పేందుకు విఫలయత్నం చేసింది.  దీని అవస్థలు గమనించిన ఓ వ్యక్తి కుళాయి నీటిని వదిలి పక్కకు జరిగాడు. దీంతో మోర ఎత్తి ఇదిగో...ఇలా నాలుక తడుపుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాటర్ వర్క్స్ సమీపంలో షిర్డీ సాయి ఆలయం వద్ద సోమవారం మధ్యాహ్నం కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరాలో బంధించింది.    - వీరభగవాన్ తెలగరెడ్డి, సాక్షి, రాజమండ్రి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top