ఏపీలో 765 పాజిటివ్‌, 12 మంది మృతి | Coronavirus 765 Positive Cases Reported In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 765 పాజిటివ్‌, 12 మంది మృతి

Jul 4 2020 2:34 PM | Updated on Jul 4 2020 8:11 PM

Coronavirus 765 Positive Cases Reported In Andhra Pradesh - Sakshi

న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 24,962 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 765 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి 32 కేసులు, విదేశాల నుంచి వచ్చిన వారివి ఆరు కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 17,699కి చేరింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 311 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 8008కి చేరింది. తాజాగా 12 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 218కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9,96,573 టెస్టులు చేశామని వైద్యారోగ్యశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9473 యాక్టివ్‌ కేసులున్నాయి.
(చదవండి: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు కొల్లు రవీంద్ర)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement