గవర్నర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ  | CM YS Jagan meets Governor Biswabhusan Harichandan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ 

Nov 19 2019 4:41 AM | Updated on Nov 19 2019 4:41 AM

CM YS Jagan meets Governor Biswabhusan Harichandan - Sakshi

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ హరిచందన్‌తో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులకు గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావు తదితరులు సాదరంగా స్వాగతం పలికారు.

అనంతరం గవర్నర్‌తో భేటీ అయిన సీఎం వైఎస్‌ జగన్‌ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాల గురించి వివరించారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు గవర్నర్‌కు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కొద్దిసేపు చర్చించారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతుల గౌరవార్థం గవర్నర్‌ దంపతులు రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా విందు ఇచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా గవర్నర్‌ను సత్కరించి మెమెంటో అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement