నీరుకొండలో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ప్రారంభం | Chandrababu Naidu Inaugurates SRM University In Amaravati | Sakshi
Sakshi News home page

నీరుకొండలో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ప్రారంభం

Published Sat, Jul 15 2017 12:57 PM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM

రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ప్రారంభమైంది

అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రతిష్టాత్మక ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మొక్కలు నాటారు. రాజధానిలో తొలి ప్రైవేట్‌ విశ్వవిద్యాలయం ఇదే.
 
మంగళగిరి మండలం నీరుకొండ వద్ద నిర్మించిన ఈ వర్సిటీలో ఆగస్టు 7 నుంచి తరగతులు ప్రారంభం కానుండగా ఈ ఏడాది 240 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement