చంద్రబాబు మెడలు వంచుతాం : ఆళ్ల నాని | Chandrababu Naidu Cheating On Farmers Loan Waiver | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మెడలు వంచుతాం : ఆళ్ల నాని

Nov 6 2014 2:41 AM | Updated on Oct 1 2018 2:03 PM

చంద్రబాబు మెడలు వంచుతాం : ఆళ్ల నాని - Sakshi

చంద్రబాబు మెడలు వంచుతాం : ఆళ్ల నాని

చంద్రబాబు మెడలు వంచైనా రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడుతుందని పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు ఆళ్ల కాళీకృష్ణ

గోపాలపురం : చంద్రబాబు మెడలు వంచైనా రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడుతుందని పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు. రుణాలను తక్షణమే మాఫీ చేయూలని కోరుతూ వైఎస్సార్ సీపీ శ్రేణులు బుధవారం గోపాలపురంలో ధర్నా, నిరసన ర్యాలీలు నిర్వహించాయి. ముఖ్యఅతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధపు మాటలు, అసత్యాలు చెప్పి రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని
 
 ధ్వజమెత్తారు. చంద్రబాబు వైఖరితో ఆందోళన చెందుతున్న రైతులు, డ్వాకా మహిళలకు మద్దతుగా వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు దేవరపల్లి, జంగారెడ్డిగూడెంలో పర్యటించిన చంద్రబాబు పొగాకు, ఆయిల్‌పామ్ రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి వారిని నట్టేట ముంచారన్నారు. రైతు సాధికారిత కార్పొరేషన్‌కు రూ.1.07 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ.5 వేల కోట్లు కేటాయిస్తే ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ఇప్పటికే రైతులు రూ.14 వేల కోట్లను అపరాధ రుసుం కింద చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ‘శేషాచలం కొండల్లోని ఎర్రచందనం అమ్మి రుణాల మాఫీ చేస్తానన్నారని, ఎర్రచందనాన్ని అమ్మితే రూ.వెరుు్య లేదా రూ.రెండు వేల కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందన్నారు. ఆ మొత్తంతో రుణమాఫీ ఏవిధంగా చేస్తారని నాని ప్రశ్నించారు. ఇసుక అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని డ్వాక్రా రుణాల మాఫీకి మళ్లిస్తామని చెప్పిన చంద్రబాబుకు ఇసుకపై ఎంత ఆదాయం వస్తుందో తెలుసా అని నిలదీశారు. రుణమాఫీ చేస్తానని అటు రైతులను, ఇటు డ్వాక్రా మహిళలన నిలువునా ముంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం చేపట్టిన ధర్నాలు ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురై చెప్పులు, రాళ్లతో కొట్టించుకొనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
 
 వంచన మానుకో చంద్రబాబూ : ఎమ్మెల్సీ శేషుబాబు
 పాలకొల్లు:  రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న అన్ని రుణాలను పూర్తిస్థారుులో మాఫీ చేస్తానని వస్తున్నా మీకోసం పాదయూత్రల సందర్భంగా, ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు కురిపించిన చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత మోసపూరిత మాటలతో ప్రజలను వంచిస్తున్నారని ఎమ్మెల్యే మేకా శేషుబాబు ధ్వజమెత్తారు. రుణాల మాఫీని తక్షణమే అమలు చేయూలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రదర్శన, రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలు జరిగారుు. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ టీడీపీ బండారాన్ని బట్టబయలు చేసి, వాగ్దానాలను అమలు చేయించేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేపట్టిందన్నారు. చంద్రబాబు ఒకపక్క రైతులను, డ్వాక్రా మహిళలను రుణాలు కట్టవద్దని చెబుతూనే.. బ్యాంకుల నుంచి నోటీసులు ఇప్పించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాల్లో పింఛన్లు పంపిణీ మినహా ప్రజలకు ఒనగూరేదేమీ లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు,ఎడ్లపల్లి తాతాజీ, నడపన గోవిందరాజులునాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement