
తెలుగు ప్రజలకు కేసీఆర్, బాబు చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ఎదురైన విఘ్నాలన్నీ తొలగిపోయి ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి వినాయక చవితిగా ఈసారి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
కాగా, మరో ప్రకటనలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప రాష్ట్రాన్ని నిర్మించుకునేందుకు సంకల్పించుకున్నామని, ఈ ప్రయత్నంలో ఎలాటి విఘ్నాలు కలగకూడదని విఘ్నేశ్వరుడిని కోరుకుందామని తెలిపారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ కూడా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.