ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్! | BJP nominates Nirmala Sitharaman for Rajya Sabha from Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్!

Jun 19 2014 6:33 PM | Updated on Mar 29 2019 9:24 PM

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్! - Sakshi

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్!

కేంద్రమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన నిర్మలా సీతారామన్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ్య సభ్యురాలిగా నామినేట్ చేయాలని బీజేపీ నిర్ణయించింది.

న్యూఢిల్లీ: కేంద్రమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన నిర్మలా సీతారామన్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ్య సభ్యురాలిగా నామినేట్ చేయాలని బీజేపీ నిర్ణయించింది.
 
ఆంధ్రప్రదేశ్ ఎన్ జనార్ధన్ రెడ్డి మృతితో రాజ్యసభ స్థానానికి  ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి నామినేట్ చేయాలని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించిదని బీజేపీ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ తెలిపారు.
 
నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేది జూన్ 23 తేది కాగా, జూలై 3 తేదిన ఎన్నికలు నిర్వహిస్తారు. వాణిజ్య శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వంలో బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement