ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్!
న్యూఢిల్లీ: కేంద్రమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన నిర్మలా సీతారామన్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ్య సభ్యురాలిగా నామినేట్ చేయాలని బీజేపీ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్ జనార్ధన్ రెడ్డి మృతితో రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి నామినేట్ చేయాలని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించిదని బీజేపీ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ తెలిపారు.
నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేది జూన్ 23 తేది కాగా, జూలై 3 తేదిన ఎన్నికలు నిర్వహిస్తారు. వాణిజ్య శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వంలో బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.