విజయనగరం కంటోన్మెంట్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను జేసీ, రిటర్నింగ్ అధికారి రామారావు మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తన చాంబర్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ను పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన విధివిధానాల గూర్చి డివిజన్, మండల స్థాయిల్లో ప్రతి ఒక్కరికీ తెలిసేలా అవగాహన కల్పిస్తామని, ఎన్నికల అధికారులకు అప్పగించిన బాధ్యతలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. నామినేషన్లు ప్రారంభం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకూ ప్రతీ అంశం ఎన్నికల సంఘం సూచనల ప్రకారం జరుగుతుందన్నారు.
సమస్యలు ఉత్పన్నమైతే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. 16వ తేదీ వరకూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. జూన్ 17న నామినేషన్ల పరిశీలన, 19న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. జూలై 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఏడవ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. పదో తేదీ నాటికి ఎన్నికల విధులు పూర్తవుతాయని ఆయన చెప్పారు. మొత్తం జిల్లాలో 719 ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల కోడ్ అమలు బాధ్యతను జెడ్పీ సీఈఓ జిల్లా వ్యాప్తంగా చేపడతారన్నారు. మండలాల్లో ఎంపీడీఓలు, డివిజన్లలో ఆర్డీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఎన్నికల కోడ్ అమలు బాధ్యత వహిస్తారన్నారు. సహాయ రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి వ్యవహరిస్తారన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Published Tue, Jun 9 2015 11:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement