'లాకర్లలో నల్లధనం తీస్తేనే ఉపయోగం' | ap bjp leader raghunath babu speaks over currency demonetization | Sakshi
Sakshi News home page

'లాకర్లలో నల్లధనం తీస్తేనే ఉపయోగం'

Nov 20 2016 7:42 PM | Updated on Apr 3 2019 5:16 PM

'లాకర్లలో నల్లధనం తీస్తేనే ఉపయోగం' - Sakshi

'లాకర్లలో నల్లధనం తీస్తేనే ఉపయోగం'

లాకర్లలో సొత్తును బ్యాంకు ఖాతాల్లోకి తీసుకొచ్చినప్పుడే ప్రజలకు ప్రయోజనమన్నారు.

- ఏపీ బీజేపీ అభివృద్ది కమిటీ చైర్మన్
అమరావతి :
బ్యాంకు లాకర్లలో ఉండేందంతా నల్లధనమేనని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథ్‌బాబు చెప్పారు. లాకర్లలో దాచుకున్న సొత్తును బ్యాంకు ఖాతాల్లోకి తీసుకొచ్చినప్పుడే సాధారణ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో నగదు రహిత సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందన్నారు. నల్లధనం అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశ చరిత్రలో గొప్ప ఆర్ధిక సంస్కరణగా నిలిచిపోతాయని చెప్పారు. భవిష్యత్‌లో పెద్ద నోట్ల రద్దు ఫలితాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత నరేంద్రమోదీని మహనీయుడిగా కొనియాడే పరిస్థితి ఏర్పడుతుందని రఘునాథ్బాబు జోస్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement