‘ఎంపీటీసీ, సర్పంచ్‌ ఓట్లను కూడా గల్లంతు చేశారు’

Alla Ramakrishna Reddy Fires on Chandababu naidu - Sakshi

సాక్షి, అమరావతి : మంగళగిరి నియోజకవర్గంలో 13వేల ఓట్లను టీడీపీ నేతలు గల్లంతు చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎంపీటీసీ, సర్పంచ్‌ ఓట్లను కూడా గల్లంతు చేయడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆర్కే సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. 

ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలతో ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో ప్రభుత్వమే ఓట్ల గల్లంతు కార్యక్రమం చేపట్టిందని ఆర్కే ధ్వజమెత్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top