తుళ్ళూరు(గుంటూరు జిల్లా): తిండి పెట్టండి లేదంటే పనులైనా కల్పించండి’ అంటూ వ్యవసాయ కూలీలు బుధవారం అన్నం గిన్నెలు పట్టుకొని గుంటూరు జిల్లా తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలు, అసైన్డ్, సీలింగ్ భూమి సాగుదారులు, చేతివృత్తిదారులు ప్రదర్శనగా వెళ్లి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పోలీసుల నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లారు. తమ డిమాండ్లపై అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూలీలను కార్యాలయం నుంచి బయటకు రప్పించినప్పటికి అక్కడి నుంచి కదలలేదు.
ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబూరావు మాట్లాడుతూ కౌలు పరిహారం చెక్కులు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. నెలకు రూ.2,500 పింఛనుతో కుటుంబాలు గడవడం సాధ్యపడదని, రూ.9,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాజధాని కమిటీ కన్వీనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ పింఛన్ లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం మరోసారి సర్వే జరిపేందుకు సిద్ధమైందన్నారు. వ్యవసాయకార్మిక జిల్లా సంఘం అధ్యక్షుడు రవి మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యల్ని పరిష్కరించకుంటే మంత్రుల్ని గ్రామాల్లో తిరగనియ్యమని హెచ్చరించారు. అనంతరం కాంపిటెంట్ ఆఫ్ అథారిటీకి చెందిన డిప్యూటీ కలెక్టర్ రహంతుల్లాకు వినతి పత్రం అందచేశారు.
తిండి పెట్టండి లేదా పని కల్పించండి
Published Wed, Jun 24 2015 11:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆంధ్రా అతలాకుతలం..
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సీఎం వైఎస్ జగన్
జగనన్న పాలనలో అందరికీ సంక్షేమం
సంక్షేమానికి ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరికలు
సంక్షేమ పథకాలను ఆపేసే కుట్ర
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
డబ్బు పంపిణీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు
No Headline
మూడోరోజు పోస్టల్ ఓటింగ్ ప్రశాంతం
ఈ ముగ్గురు ప్రత్యేకం!
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement