ఆత్మన్యూనతా భావంతో వ్యక్తి ఆత్మహత్య | a person died due to illness and lonelyness | Sakshi
Sakshi News home page

ఆత్మన్యూనతా భావంతో వ్యక్తి ఆత్మహత్య

Feb 12 2015 12:13 AM | Updated on Nov 6 2018 7:56 PM

అనంతపురం రూరల్ పరిధిలోని ఏ నారాయణపురానికి చెందిన వై వెంకటేశ్(28) అనారోగ్యం, మానసిక వేదనతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అనంతపురం రూరల్: అనంతపురం రూరల్ పరిధిలోని ఏ నారాయణపురానికి చెందిన వై వెంకటేశ్(28) అనారోగ్యం, మానసిక వేదనతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబకలహాల కారణంగా కొద్దికాలం కిందట భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. దీనికి తోడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు ఎవరూలేరని ఆత్మన్యూనత భావంతో దిగులు చెందిన వెంకటేశ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణం పొందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement