శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో గత కొన్ని రోజులుగా అక్రమంగా కంకర తవ్వకాలు నిర్వహిస్తున్నారనే విషయం అధికారుల దృష్టికి రావడంతో మైన్స్ విజిలెన్స్ అధికారులు గురువారం రంగంలోకి దిగారు.
టెక్కలి (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో గత కొన్ని రోజులుగా అక్రమంగా కంకర తవ్వకాలు నిర్వహిస్తున్నారనే విషయం అధికారుల దృష్టికి రావడంతో మైన్స్ విజిలెన్స్ అధికారులు గురువారం రంగంలోకి దిగారు. గ్రామ శివారులోని గుట్ట వద్ద మైనింగ్ నిర్వహిస్తూ కంకర తరలిస్తుండగా.. దాడి చేసి రెండు జేసీబీలతో పాటు రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.