'అనంత'లో కొనసాగుతున్న అరెస్ట్ల పర్వం | 19 ysrcp leaders and workers arrested in anantapur distirct | Sakshi
Sakshi News home page

'అనంత'లో కొనసాగుతున్న అరెస్ట్ల పర్వం

May 14 2015 8:25 PM | Updated on Aug 20 2018 4:27 PM

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రసాదరెడ్డి హత్య అనంతరం జరిగిన అల్లర్ల కేసులో  తాజాగా గురువారం మరో 19మంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అనంతపురం జిల్లా రాప్తాడులో  జరిగిన వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి ప్రసాదరెడ్డి హత్యకేసులో నిందితులను అరెస్టు చేయడం కంటే, హత్య జరిగిన ఆవేశంలో కొంతమంది ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టిన అంశాన్నే పోలీసులు సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా వైఎస్ఆర్ సీపీకి చెందిన 64మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement