ఇరాన్పై దాడులు.. WHO హెచ్చరిక
ఇరాన్ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్-అమెరికా భీకర దాడులు చేస్తోంది..
వంటగదిలో పని మనిషి కన్నీళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..!
ఓ భావోద్వేగ క్షణం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. తన ఇంట్లో పని చేసే మహిళ కోసం ఓ యువకుడు నిర్వహించిన పుట్టినరోజు వేడుక సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కృతార్థ అనే యువకుడు తన ఇంట్లో పనిచేసే జ్యోతిని ఆప్యాయంగా ‘దీదీ’ అని పిలుస్తుంటారు. ఓ రోజు అతను.. జ్యోతి వంటగదిలో కన్నీరుపెట్టుకోవడం గమనించాడు. ఏం జరిగిందంటూ విచారించగా.. ఆమె చెప్పిన మాటలు ఆ యువకుడి గుండెల్ని పిండేశాయి. ఇవాళ నా పుట్టినరోజు.. ఒకవేళ నా తల్లి బతికి ఉంటే నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేదంటూ ఆమె వాపోయింది. జ్యోతి చాలా చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయింది. అందుకే తన పుట్టినరోజున ఒంటరితనంతో ఆమె అలా భావోద్వేగానికి లోనయ్యింది. ఆమె గతాన్ని మార్చడం సాధ్యం కాదు కానీ.. ఆమె కళ్లలో సంతోషం చూడడానికి కృతార్థ.. తన స్నేహితులతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందరూ కలిసి ఆమె పుట్టినరోజును సెలబ్రేట్ చేయాలని నిశ్చయించుకున్నారు. వీడియోలో చూపినట్లుగా.. ఆ బృందం ఒక కేక్ ఏర్పాటు చేసి చిన్నపాటి వేడుకను నిర్వహించారు. ఈ వేడుక సమయంలో జ్యోతి తన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ఆర్డర్ చేసుకుని పార్టీ చేసుకోమని.. తన వద్ద ఉన్న 500 రూపాయలను వారికి ఇవ్వబోయింది.. కానీ కృతార్థ, అతని స్నేహితులు ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించారు.. ప్రేమతో ఆమె పుట్టినరోజును జరిపారు. ‘‘ఈ వీడియోలోని నిరాడంబరత, మానవత్వం వేలాది మంది హృదయాలను తాకింది. ఆమె ముఖంలోని ఆ చిరునవ్వే సమాధానం ఇస్తోంది. ఇన్స్టాగ్రామ్లో మనం చూడదగ్గ అత్యుత్తమమైన దృశ్యం ఇది. ఆమె ముఖంలో కనిపిస్తోన్న ఆ ఆనందం వెలకట్టలేనిది’’ అంటూ నెటిజన్లు స్పందించారు. View this post on Instagram A post shared by Kritartha (@tamashewala)
కేరళలో హైడ్రామా.. శశిథరూర్ కాన్వాయ్ అడ్డగింత, దాడి
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో షాకింగ్ ఘటన వెలుగు చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కాన్వాయ్ను అడ్డుకున్న కొందరు దుండగులు ఆయన గన్మెన్పై దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల వేళ ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది.వివరాల మేరకు.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాడు కేరళలోని మలప్పురం జిల్లాలో పర్యటించారు. అక్కడ ప్రచారం ముగిసిన తర్వాత వాండూర్లో జరగనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్తుండగా, తిరువల్లి చెల్లితోడు వంతెన సమీపంలో ఎంపీ కాన్వాయ్ని కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదానికి దిగారు. ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.భద్రతా సిబ్బంది ఫిర్యాదు ఆధారంగా వాండూర్ పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.కలికావుకు చెందిన ఉమ్మారా అనే నిందితుడిపై నాన్బెయిలాబుల్ కేసు నమోదైనట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా, కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.Malappuram, Keralam: A complaint has been filed alleging that the convoy of Congress MP Shashi Tharoor was blocked near Thiruvalli Chellithodu bridge while he was travelling to an election campaign event in Wandoor. The complaint claims that Tharoor’s gunman was assaulted… pic.twitter.com/CVqZ25TzbP— IANS (@ians_india) April 3, 2026
తాతంశెట్టి తాట ఎప్పుడు తీస్తారు?
‘‘మహిళల జోలికి వస్తే తాట తీస్తాం.. ఆడపడుచులను కష్టపెడితే అంతు చూస్తాం.. అతివలను అగౌరవపరిస్తే అక్కడికక్కడే శిక్షిస్తాం’’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకప్పుడు ఆవేశంతో ఊగిపోయారు. స్త్రీల ధన..మాన.. ప్రాణాల రక్షణకే అధిక ప్రాధాన్యమిస్తామని ఊదరగొట్టారు. అయితే ఆదర్శాలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమని నిరూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగినప్పటికీ చేతులు ముడుచుకుని కూర్చున్నారు. కూటమి నేతలు బరితెగించి మహిళలపై దాడులకు పాల్పడుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం రైల్వేకోడూరులో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి తాతంశెట్టి నాగేంద్ర జంకుగొంకు లేకుండా నడిరోడ్డుపైనే ఓ మహిళను విచక్షణారహితంగా కొట్టినా కనీస మాత్రం కూడా స్పందించకుండా కాలయాపన చేస్తున్నారు.తిరుపతి జిల్లా: మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ కల్యాణ .. తమ జనసేన పార్టీ నాయకులే ఓ మహిళపై నడి రోడ్డుపై దాడిచేస్తే పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నస్తున్నారు. సినిమాలో చెప్పినట్టు సభల్లో డైలాగులు చెప్పడం తప్ప తన సొంత పార్టీకి చెందిన నేతలు ఏం చేసినా ఆయనకు పట్టదా అని మండిపడుతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గ కేంద్రంలో పట్టపగలు నడిరోడ్డున జనసేన పార్టీ నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర దళిత మహిళపై పోలీసుల సమక్షంలో.. పోలీసు లాఠీతో దాడిచేశారు. దుర్భాషలాడి వీధి రౌడీలా ప్రవర్తించారు. ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తమ పార్టీ నాయకులే మహిళల పట్ల బరితెగించి ప్రవర్తిస్తుంటే నోరు మెదపడం లేదని స్థానిక మహిళలు ప్రశి్నస్తున్నారు. మొన్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సచివాలయ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడి మోసగించాడని జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తే కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తప్పు చేశాడని అన్ని ఆధారాలున్నా డిప్యూటీ సీఎం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజల ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారని.. అయితే పార్టీ అధికారిక కార్యక్రమాల్లో అతను పార్టీ కండువా వేసుకుని వేదికపై ఆశీనుడవుతున్నా పవన్ కల్యాణ్కు తెలియదా అని నిలదీస్తున్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని, పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఏం చేసినా.. పోలీసులు చూస్తూ ఏమీ చేయక సలాములు కొడుతున్నారని మండిపడుతున్నారు. రైల్వేకోడూరు నడి»ొడ్డున దళిత మహిళపై పోలీసుల సమక్షంలో తాతంశెట్టి నాగేంద్ర దాడిచేస్తే అతనిని అడ్డుకుని చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమంటున్నారు. బాధితురాలు రోడ్డుపై నిరసనకు దిగితే స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సలహాలు ఇచ్చారని దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసులు రాజకీయ నాయకులకు రక్షకులుగా ఉన్నారు తప్ప ప్రజలకు రక్షకులు కాదా అని ప్రశ్నిస్తున్నారు.సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలి రైల్వేకోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారానికి పాల్పడడంతోపాటు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక ప్రభుత్వ ఉద్యోగిని జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారని.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. నియోజకవర్గ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దళిత మహిళపై పోలీసుల లాఠీ తీసుకుని కొట్టడం అమానుషం. నిస్సహాయురాలిగా ఉన్న మహిళను కొట్టడం ఏమిటి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్న సందేహం తలెత్తుతోంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్కు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం ఉన్నా దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి. – ఇసుకపాటి లక్ష్మీనారాయణమ్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, రైల్వే కోడూరు ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు రైల్వేకోడూరు పట్టణం నడి»ొడ్డున ఓ దళిత మహిళపై జనసేన పార్టీ నాయకులు కర్రలతో దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో తీవ్రంగా విఫలం అయింది. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. ఈ విషయంపై సీపీఐ తరఫున పోరాటాలు చేస్తాం. కనీసం పోలీసులు కూడా పట్టించుకోకపోవడం దారుణం. – చింతలపూడి నాగమ్మ, సీపీఐ మండల కార్యదర్శి, ఓబులవారిపల్లె
పుదుచ్చేరిలో విజయ్ ‘వరాల విశ్వరూపం’
ఓటమి బాధలో ఉన్న కేకేఆర్కు గుడ్ న్యూస్
తాతంశెట్టి తాట ఎప్పుడు తీస్తారు?
అమెరికా షాకింగ్ డెసిషన్: భారత డ్రైవర్లపై భారీ వేటు!
‘రాజీనామా చేయ్.. బీఆర్ నాయుడు’
Assam: అభ్యర్థుల భవితవ్యం వాళ్ల చేతుల్లోనే!
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : నెటిజన్లు రియాక్షన్
కొంప ముంచిన బాదం పాలు
టీమిండియాకు శుభవార్త: నితీశ్ రెడ్డిపై గావస్కర్ ప్రశంసలు
యుద్దానికి సిద్ధమవుతున్న భారత్!..అజిత్ దోవల్ రెడ్ఫైల్లో ఏముంది?
పెళ్లయిన నెలకే 'ముగ్గురమయ్యాం' అంటూ రష్మిక పోస్ట్.. ప్రెగ్నెంట్?
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా..
కేరళలో ఎస్పీ బాలు విగ్రహం.. చరణ్ భావోద్వేగం
గ్యాస్ లేకుండా వంట ఎలా చేయాలో చెప్పమంటున్నారు సార్!!
‘కమ్మరావతి’.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ
టీమిండియాలోకి వచ్చేస్తాడు.. భయంగా ఉంది: పాక్ మాజీ క్రికెటర్
ఏటా 2 ఉచిత సిలిండర్లు - కేరళ బీజేపీ మేనిఫెస్టో
జియో హిట్ ప్లాన్: అన్లిమిటెడ్ బెనిఫిట్స్!
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!
హైదరాబాద్లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
అక్కడున్న ప్రతి క్షణం ద్వేషమే: జేమ్స్ ఆండర్సన్
ఒక్క అక్షరమే కదా సార్! మార్చేద్దాం..!
‘4 గంటలకే అన్నీ ఆఫీసులు మూసేయండి’
ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన
గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గిందోచ్!!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
పుదుచ్చేరిలో విజయ్ ‘వరాల విశ్వరూపం’
ఓటమి బాధలో ఉన్న కేకేఆర్కు గుడ్ న్యూస్
తాతంశెట్టి తాట ఎప్పుడు తీస్తారు?
అమెరికా షాకింగ్ డెసిషన్: భారత డ్రైవర్లపై భారీ వేటు!
‘రాజీనామా చేయ్.. బీఆర్ నాయుడు’
Assam: అభ్యర్థుల భవితవ్యం వాళ్ల చేతుల్లోనే!
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : నెటిజన్లు రియాక్షన్
కొంప ముంచిన బాదం పాలు
టీమిండియాకు శుభవార్త: నితీశ్ రెడ్డిపై గావస్కర్ ప్రశంసలు
యుద్దానికి సిద్ధమవుతున్న భారత్!..అజిత్ దోవల్ రెడ్ఫైల్లో ఏముంది?
పెళ్లయిన నెలకే 'ముగ్గురమయ్యాం' అంటూ రష్మిక పోస్ట్.. ప్రెగ్నెంట్?
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా..
కేరళలో ఎస్పీ బాలు విగ్రహం.. చరణ్ భావోద్వేగం
గ్యాస్ లేకుండా వంట ఎలా చేయాలో చెప్పమంటున్నారు సార్!!
‘కమ్మరావతి’.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ
టీమిండియాలోకి వచ్చేస్తాడు.. భయంగా ఉంది: పాక్ మాజీ క్రికెటర్
ఏటా 2 ఉచిత సిలిండర్లు - కేరళ బీజేపీ మేనిఫెస్టో
జియో హిట్ ప్లాన్: అన్లిమిటెడ్ బెనిఫిట్స్!
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!
హైదరాబాద్లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
అక్కడున్న ప్రతి క్షణం ద్వేషమే: జేమ్స్ ఆండర్సన్
ఒక్క అక్షరమే కదా సార్! మార్చేద్దాం..!
‘4 గంటలకే అన్నీ ఆఫీసులు మూసేయండి’
ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన
గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గిందోచ్!!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
ఫొటోలు
బేబీ బంప్తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)
సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)
‘బైకర్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
నేపాల్ ట్రిప్లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)
డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్గా హీరోయిన్ (ఫొటోలు)
'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)
నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)
ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)
ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)
సినిమా
రామాయణతో ఓటీటీ బిగ్ డీల్.. నో చెప్పిన నిర్మాత!
రామాయణ మూవీ నుంచి రాముడి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియోను షేర్ చేసింది. దీంతో సినిమాపై బజ్ పెరిగిపోయింది. ఓటీటీ నుంచి కూడా భారీ ఢీల్ వచ్చినట్లు సమాచారం. ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్ ఆహార్యం ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. అయోధ్యలోకి ఆయన ఎంట్రీ సీన్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. ఇందులో సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్-1 ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా, కన్నడ నటుడు యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలు కలిపి సుమారు రూ. 4వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుందని సమాచారం.రెండు భాగాలుగా విడుదల కానున్న ‘రామాయణ’ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఏకంగా రూ. 1000 కోట్ల వరకు ఓటీటీ హక్కుల కోసం చెల్లించేందుకు ముందుకు వచ్చారట. అయితే ఈ భారీ ఆఫర్ను నిర్మాత నమిత్ మల్హోత్రా తిరస్కరించి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి దీర్ఘకాలిక విలువ, ప్రపంచవ్యాప్త సామర్థ్యంపై మల్హోత్రాకు గట్టి నమ్మకం ఉన్నందువల్లే ఆయన ఈ ఒప్పందాన్ని తిరస్కరించారని తెలుస్తోంది. రామాయణ సినిమాతో వెంటనే లభించే ఆర్థిక లాభం కోసం కాకుండా, ఈ ప్రాజెక్ట్ ఫ్రాంచైజీని ప్రపంచవ్యాప్త చలనచిత్ర దృశ్యంగా తీర్చిదిద్దడంపై ఆయన దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు. దీంతో అనేక దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి మరింత లాభాన్ని పొందవచ్చు అనేది నిర్మాతల వ్యూహమని అంటున్నారు. వెయ్యి కోట్ల ఓటీటీ ఆఫర్ను కాదనడంతో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచినప్పటికీ, ఈ ప్రాజెక్ట్పై చిత్ర నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ఇంతటి భారీ అంచనాలు ఉండటం వల్లనే రామాయణ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.
ఐశ్వర్య ఇంటికే పరిమితం..నేనలాంటి వ్యక్తిని కాదు: అభిషేక్
హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తనకు భార్య అవడానికి ముందు మంచి స్నేహితురాలు అంటున్నాడు హీరో అభిషేక్ బచ్చన్. పెళ్లయ్యాక తను పని చేయకూడదని ఎన్నడూ కోరుకోలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అమ్మానాన్న పెళ్లి చేసుకునే సమయానికి నాన్న కంటే అమ్మనే పెద్ద స్టార్. అయినా వాళ్లు చక్కగా కలిసున్నారు. అందులో అసహజంగా ఏదీ కనిపించలేదు. వారి దాంపత్యాన్ని కళ్లారా చూశాను. కెరీర్ ప్రారంభంలోనే..ఆడవారి కన్నా మగవారే ఎక్కువ డామినెంట్గా ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలోనే ఐశ్వర్యతో పరిచయం ఏర్పడింది. నా రెండో సినిమా తనతో కలిసే చేశాను. నాతో కలిసి ఎక్కువసార్లు నటించిన హీరోయిన్ కూడా తనే! ఆ సమయంలో మేము ప్రేమలో లేము. మంచి ఫ్రెండ్స్లా కలిసున్నాం. ఆ తర్వాత ప్రేమలో పడ్డాం, పెళ్లి చేసుకున్నాం. అలాంటి వ్యక్తిని కానునా భార్య తన పనిని వదులుకుంటేనే నేను సురక్షితంగా ఫీల్ అయ్యే వ్యక్తిని కాదు. అలాంటి అభద్రతాభావం మామధ్య లేదు. 'నేను సంపాదిస్తాను, నువ్వు ఇంటిని చూసుకో'వంటి చర్చ మా మధ్య ఎప్పుడూ రాలేదు. అలాగే నా ఎదుగుదల కోసం ఎవరినీ వాడుకోను. ఇండస్ట్రీలో నటుడిగా నన్ను మా నాన్న లాంచ్ చేయలేదు, నాకోసం ఒక్క సినిమా కూడా తీయలేదు. పైగా నేనే నిర్మాతగా మారి ఆయన సినిమా చేశాను, అందుకు నేను చాలా సంతోషిస్తాను. పెళ్లిఈరోజు నేను సాధించిన విజయాలన్నీ నా కష్టం, ప్రయత్నం ద్వారా అందుకున్నవే! అని చెప్పుకొచ్చాడు. కాగా అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. అయితే అభిషేక్- ఐశ్వర్య చాలా అరుదుగా జంటగా కనిపిస్తారు. దీంతో చాలాసార్లు వీళ్లు విడిపోయారంటూ ప్రచారం జరగడం, దాన్ని దంపతులు కొట్టిపారేయడం పరిపాటిగా మారింది.చదవండి: నాలో సీమ ఫీలింగ్ ఉంది: విజయ్ దేవరకొండ
ఈ బ్యానర్లో నాకు నాలుగో హిట్: శర్వానంద్
‘‘బైకర్’ ద్వారా నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఇండియా గర్వించే సినిమా తీస్తామని చెప్పాం... తీశాం. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే చిత్రం ‘బైకర్’. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని గర్వంగా చెబుతాను’’ అని హీరో శర్వానంద్ తెలిపారు. శర్వానంద్, మాళవికా నాయర్ జోడీగా నటించిన చిత్రం ‘బైకర్’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ప్రభాస్ అన్నకి థాంక్స్అదే రోజు సాయంత్రం నిర్వహించిన బంపర్ బ్లాక్ బస్టర్ మీట్లో శర్వానంద్ మాట్లాడుతూ–‘‘బైకర్’ని సపోర్ట్ చేసిన ప్రభాస్ అన్నకి థాంక్స్. ఈ చిత్రకథని నా వద్దకు పంపిన నిర్మాత వంశీ అన్నకి థ్యాంక్స్. యూవీ క్రియేషన్స్లో ఇది నాకు నాలుగో హిట్. ‘రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు, బైకర్’. ఈ సినిమాను అద్భుతంగా నిర్మించిన వంశీ అన్నకి ధన్యవాదాలు. బైకర్ క్యారెక్టర్ కోసం 22 కిలోలు బరువు తగ్గాను. ‘బైకర్’ని యూత్ చూస్తున్నారు. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్. పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. ‘బైకర్’కి బ్లాక్బస్టర్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.రెండేళ్ల కష్టం‘‘బైకర్’కి వస్తున్న స్పందన చూసి చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఇది రెండేళ్ల కష్టం’’ అన్నారు మాళవిక. ‘‘ఈ సినిమాలో బైక్ రేసింగ్తో పాటు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుందని చెప్పాను. ఆడియన్స్ ఆ ఎమోషన్కు కనెక్ట్ అయ్యారు’’ అని అభిలాష్ రెడ్డి పేర్కొన్నారు. నటుడు రాజశేఖర్, నటి జీవిత, డైరెక్టర్ సంపత్ నంది, కెమెరామెన్ యువరాజ్, నటుడు నిరూప్ నందకుమార్, ఎడిటర్ అనిల్ మాట్లాడారు.
వాటిని అధిగమిస్తూ ఛాన్స్లు తెచ్చుకుంటున్నపూజా
సినిమాల్లో లక్కు అవకాశాలను అందించినా, నిలబెట్టేది మాత్రం ప్రతిభనే. అదే శాశ్వత స్థానాన్ని కల్పిస్తుంది. లక్కు, ప్రతిభలో మధ్య ఊగిసలాడుతున్న నటీమణుల్లో పూజాహెగ్డే ఒకరు. పుష్కరం కాలం పాటు కథానాయకిగా కొనసాగుతున్నారు. తెలుగులో అల్లుఅర్జున్ సరసన నటించిన అలవైకుంఠపురంలో, మహేష్బాబుకు జతగా నటించ్చిన మహర్షి వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించడంతో పూజాహెగ్డేకి ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చింది. అయితే ఆ తర్వాత నటించిన కొన్ని భారీ చిత్రాలు నిరాశపరచడంతో ఈమెకి అవకాశాలు కరువయ్యాయి. అదే సమయంలో ఈమె నటించిన బీస్ట్ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్యూటీని హిందీ చిత్రాలు ఆదుకున్నాయి. అయితే అక్కడ కూడా సరైన విజయం లిభించలేదు. ఈమధ్య సూర్యతో నటించిన రెట్రో చిత్ర విజయం పూజాహెగ్డేకు మళ్లీ ఆశలను చిగురింపజేసింది. కూలీ చిత్రంలో ఐటెం సాంగ్లో నటించి అలరించారు. ఇలాంటి తరుణంలో మరోసారి విజయ్తో జననాయకన్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అయితే ఈ చిత్రం సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ చిత్ర పరిశ్రమలో జయాపజయాలు సరి సమానం అని పేర్కొన్నారు. తాను నటిస్తూ బిజీగానే ఉన్నానని, ఎవరి ఊహాత్మక ప్రశ్నలకు బదులు చెప్పదలుచుకోలేదన్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో ఒక్క చిత్రంలో నటిస్తున్న పూజాహెగ్డే తమిళంలో ధనుష్తో జత కట్టడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.
క్రీడలు
‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’
గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్.. రాజస్తాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే దశాబ్దంలో వైభవ్ ప్రపంచ క్రికెట్ను శాసించే అవకాశముందని జోస్యం చెప్పాడు. 15 ఏళ్ల సూర్యవంశీ ఆటతీరుకు తాను ముగ్దుడినయ్యానని బట్లర్ పేర్కొన్నాడు. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బట్లర్ సూర్యవంశీతో సరదాగా సంభాషించిన వీడియోను రాజస్తాన్ యాజమాన్యం షేక్ చేసుకుంది. వీడియోలో బట్లర్ మాట్లాడుతూ.. ‘నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో వైభవ్ ఒకడు. వైభవ్కు 21 లేదా 25 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచం అతని పాదాల చెంత ఉంటుంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో మీరు మా ఇంగ్లండ్ జట్టు హృదయాన్ని ముక్కలు చేశారు. హరారే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో నువ్వు ఆడిన 175 పరుగుల ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్ ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆరోజు నువ్వు చాలా బాగా ఆడావు. నీ ఆట చాలా బాగుంది. ఇదే స్వేచ్ఛతో కష్టపడి ఆడే తత్వాన్ని కొనసాగించు. భవిష్యత్తులో నువ్వు గొప్ప క్రికెటర్ అవుతావు. అందులో ఎలాంటి సందేహం లేదు.’ వైభవ్ను పొగడ్తల్లో ముంచడంతో పాటు విలువైన సూచనలు కూడా ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బట్లర్ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 33 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 122 మ్యాచ్లు ఆడిన బట్లర్, దాదాపు 40 సగటుతో, 149 స్ట్రైక్ రేట్తో 4,158 పరుగులు చేశాడు. బట్లర్ ఫామ్పై విమర్శలు వస్తున్న వేళ ఒక్క ఇన్నింగ్స్తో వాటికి సమాధానం చెబుతాడేమో చూడాలి.Two generations of the Royals 💗🥹 pic.twitter.com/d8y76RbGaT— Rajasthan Royals (@rajasthanroyals) April 3, 2026చదవండి: పంజాబ్ సిక్సర్ల మోత వెనుక రహస్యమిదే!
BCCI: రోహిత్, కోహ్లికి ముఖం మీదే చెప్పేయండి: యువీ
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఉద్దేశించి లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2027లో ఆడించే విషయంలో యాజమాన్యం (బీసీసీఐ) వీరిద్దరికి ఇప్పుడే స్పష్టతనిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగాకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రో-కో (Rohit Sharma- Virat Kohli) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో గతేడాది రోజుల వ్యవధిలోనే వీరిద్దరు టెస్టులకూ గుడ్బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న రోహిత్- కోహ్లి ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.అయితే, రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన క్రమంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రో-కో భవితవ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరు వరల్డ్కప్ ఆడేందుకు కట్టుబడి ఉన్నారో లేదో తమకు తెలియదన్నాడు. అయితే, రో-కో మాత్రం ఇందుకు భిన్నంగా సూపర్ ఫామ్తో ముందుకు సాగుతూ తమ లక్ష్యం ఏమిటో ఆటతోనే చెప్పకనే చెబుతున్నారు.తుది నిర్ణయం సెలక్టర్లదేఈ పరిణామాల గురించి యువరాజ్ సింగ్ తాజాగా స్పందించాడు. స్పోర్ట్స్ తక్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్- కోహ్లి ఆలోచన ఏమిటో నాకైతే తెలియదు. అయితే, ఈ ఇద్దరూ కూడా వరల్డ్కప్ ఆడేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, వారిని ఆడించాలా? లేదా? అన్న నిర్ణయం మాత్రం సెలక్టర్లదే.నిజం నిష్ఠూరంగా ఉన్నా.. వీరిద్దరి భవితవ్యాన్ని నిర్ణయించేంది సెలక్టర్లే. నా అభిప్రాయం ప్రకారం వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. అయితే, వరల్డ్ ఆడించే విషయంలో మేనేజ్మెంట్ వారికి స్పష్టతనిస్తే మంచిది. ఇలాంటి విషయాల గురించి ఆటగాళ్లతో మనస్ఫూర్తిగా చర్చించాలి.ముఖ్యంగా ఇద్దరూ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. కాబట్టి వారి విషయంలో నిజం నిష్ఠూరంగా ఉన్నా.. ముందుగానే ముఖం మీద చెప్పేస్తే బాగుంటుంది. కాకపోతే భారత క్రికెట్లో ఇలా జరగడం లేదు’’ అని యువీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.ఎక్కడి నుంచో వచ్చి ధోనీ కెప్టెన్ అయ్యాడు ఇక టీమిండియా యాజమాన్య వైఖరిని ఈ సందర్భంగా యువీ గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్ ఎంపిక అంచనాలకు అందకుండా సాగుతుందని పేర్కొన్నాడు. తాను టీమిండియాకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ... అనూహ్యంగా ధోనీని భారత జట్టు కెప్టెన్గా ఎంపిక చేసిన విషయాన్ని యువీ గుర్తు చేసుకున్నాడు.తాజాగా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్... ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్కు అప్పగించిన నేపథ్యంలో యువీ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఈ నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. దీన్ని ఒక ఆటగాడి కోణం నుంచి చూస్తే... ఉదాహరణకు ఒక ఆటగాడు ప్రపంచకప్నకు ముందు చక్కటి ఫామ్తో తన రాష్ట్ర జట్టు తరఫున సత్తా చాటి వరల్డ్కప్నకు ఎంపికయ్యాడు.అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనతో జట్టుకు వరల్డ్కప్ అందించాడు. అలాంటి ప్లేయర్ను ఫ్రాంచైజీ కెప్టెన్గా ఎంపిక చేసింది. మరోవైపు ఏడేళ్లుగా ఒక ప్లేయర్ ఆ ఫ్రాంచైజీ కోసం ప్రాణం పెట్టి అద్భుతంగా ఆడుతున్నాడు. ఇలాంటి అనుభవం నాకు కూడా జరిగిందిఅయినప్పటికీ అతడికి జట్టు కెప్టెన్ పదవి కాకుండా వైస్కెప్టెన్ పదవి దక్కింది. మైదానంలో అడుగు పెట్టినప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఇలాంటి అనుభవం నాకు కూడా జరిగింది.నేను భారత జట్టుకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో హర్భజన్, సెహ్వాగ్ వంటి సీనియర్లు జట్టులో ఉన్నా... ఎక్కడి నుంచో వచ్చి ధోని కెపె్టన్ అయ్యాడు. కారణాలు ఏవైనా మీరు భారత కెప్టెన్గా ఉంటారా లేదా అనేది ఫ్రాంచైజీ క్రికెట్ నిర్ణయించదు. కానీ ఆటగాడి కోణం నుంచి చూస్తే ఇది నిరాశ కలిగించే అంశం’ అని యువరాజ్ అన్నాడు. 2007లో జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ధోనీకి అనూహ్యంగా జట్టు పగ్గాలు అప్పజెప్పడంపై యువీ ఈ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్!
పంజాబ్ సిక్సర్ల మోత వెనుక రహస్యమిదే!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ దూకుడు మీద ఉంది. బలమైన బ్యాటింగ్ శక్తితో లీగ్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లోనూ అదే జోరును ప్రదర్శిస్తోంది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసిన పంజాబ్ శుక్రవారం చెన్నై సూపర్కింగ్స్ను మట్టికరిపించింది. రెండు మ్యాచ్లు కలిపి పంజాబ్ మొత్తం 23 సిక్సర్లు బాదింది. ఇందులో గుజరాత్పై 14, చెన్నైపై 9 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు అన్ని సీజన్లు కలిపి 1,686 సిక్సర్లు బాదింది. దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్లను భయపెడుతున్న పంజాబ్ ఇంత బలంగా తయారవ్వడం వెనుక దాగున్న రహస్యాన్ని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బయటపెట్టాడు. పంజాబ్ వరుస విజయాల్లో జట్టు హెడ్కోచ్ రికీ పాంటింగ్కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనన్నాడు. పవర్ హిట్టింగ్ కోసం పాంటింగ్ ఉపయోగించిన స్క్వాష్ బాల్ టెక్నిక్ ఇప్పుడు పంజాబ్ బ్యాటర్లకు వరంగా మారిందని తెలిపాడు. పాంటింగ్ కోచ్గా వచ్చిన తర్వాత పంజాబ్ బ్యాటింగ్లో బలం పెరిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రబ్సిమ్రన్ సింగ్లు సిక్సర్లు కొట్టడంలో మరింత రాటుదేలారు. ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘పాంటింగ్తో ఉన్న అనుబంధం గురించి ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. నేను ముంబై ఇండియన్స్కు ఆడినప్పుడు అతడు మా కోచ్గా ఉన్నాడు. నా హిట్టింగ్ స్పీడ్ను పెంచేందుకు పాంటింగ్ కొత్త పద్దతిని ఉపయోగించాడు. ప్రాక్టీస్ సమయంలో పాంటింగ్ నా చేతి గ్లోవ్స్ మధ్యలో స్క్వాష్బాల్ను ఉంచేవాడు. దీనివల్ల చేతి కింది భాగంలో బ్యాట్ను గట్టిగా పట్టుకోవడానికి ఆస్కారముండదు. దీంతో మన హిట్టింగ్లో స్పీడ్ పెరుగుతుంది. ఈ టెక్నిక్ వల్లే అప్పట్లో నేను చాలా మ్యాచ్ల్లో సులువుగా సిక్సర్లు కొట్టేవాడిని. తాజాగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఈజీగా సిక్సర్లు కొట్టడం నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే అక్కడ పాంటింగ్ హెడ్కోచ్గా ఉన్నాడు. వాస్తవానికి ఎవరైనా సిక్సర్లు కొడతారు. కానీ స్వ్కాష్బాల్ టెక్నిక్ వల్ల బ్యాట్ స్పీడ్ పెరిగి బంతి ఎంత వేగంగా వచ్చినా సులువుగా సిక్సర్లు బాదేందుకు ఇది ఉపయోగపడుతుంది.’ అని చెప్పుకొచ్చాడు.ఏమిటీ స్క్వాష్బాల్ టెక్నిక్?పాంటింగ్ ఉపయోగించే స్క్వాష్బాల్ టెక్నిక్లో స్వ్కాష్ బంతిని బ్యాటర్ చేతి గ్లోవ్స్ మధ్య ఉంచుతారు. దీనివల్ల చేతి కింది బాగంలో ఖాళీ ఏర్పడి బ్యాట్ గట్టిగా పట్టుకోలేము. దీనివల్ల బ్యాట్కు గ్రిప్ రావడంతో పాటు హిట్టింగ్ స్పీడ్ పెరుగుతుంది. 2007 వన్డే ప్రపంచకప్ సమయంలో అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ సహా ఓపెనర్ ఆడమ్ గిల్క్రిస్ట్లు వారి కోచ్ బాబ్ మ్యూల్మన్ సలహా మేరకు ఇలాంటి టెక్నిక్ను ఉపయోగించే అలవోకగా సిక్సర్లు బాదడం నేర్చుకున్నారు. ఇప్పుడదే టెక్నిక్ను పాంటింగ్ పంజాబ్ బ్యాటర్లపై ప్రయోగించి విజయవంతమయ్యాడు.చదవండి: ‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచ రికార్డు
పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనత సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధికసార్లు 200 పరుగులకు పైగా స్కోరు ఛేదించిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పంజాబ్ తానే బద్దలు కొట్టింది.ఐపీఎల్-2026 టోర్నీలో తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన పంజాబ్ కింగ్స్.. రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.209 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. ఆయుశ్ మాత్రే (73), శివం దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.పంజాబ్ బ్యాటర్ల ధనాధన్ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 18.4 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. తద్వారా ఐదు వికెట్లతేడాతో జయకేతనం ఎగురవేసింది. ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39), ప్రభ్సిమ్రన్ సింగ్ (43), కూపర్ కన్నోలి (36), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50) మెరుపు ఇన్నింగ్స్తో అలరించారు.ప్రపంచంలోనే తొలి జట్టుగా పంజాబ్పంజాబ్ కింగ్స్ 200కు పైగా పరుగుల స్కోరును ఛేదించడం ఇది తొమ్మిదోసారి. పొట్టి క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా పంజాబ్ నిలిచింది. టీ20 క్రికెట్లో అత్యధికసార్లు 200కు పైగా పరుగుల స్కోరు ఛేదించిన జట్లు ఇవే🏏పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్)-తొమ్మిది సార్లు🏏ఆస్ట్రేలియా- ఏడుసార్లు🏏ముంబై ఇండియిన్స్ (ఐపీఎల్)- ఆరు సార్లు🏏టీమిండియా- ఆరు సార్లు🏏రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఐపీఎల్)- ఆరు సార్లు🏏సౌతాఫ్రికా- ఆరుసార్లు చదవండి: IPL 2026: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్!🔙 to 🔙 victories ✌️@PunjabKingsIPL complete the chase in an authoritative fashion ❤️A win by 5⃣ wickets in Chennai 🥳Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/S9EEawsaZk— IndianPremierLeague (@IPL) April 3, 2026
న్యూస్ పాడ్కాస్ట్
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ... రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసిన ఇరాన్
వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్లో సర్వత్రా చర్చ...
అవినీతి కోసమే అమరావతి... కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం..
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా...మొత్తం 10 బిల్లులకు ఆమోదం
ఆంధప్రదేశ్లో ప్రభుత్వ ‘రియల్’ దందా.. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ పందేరం
ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ డ్రామా.. రాజధాని, ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికే కూటమి సర్కారు పన్నాగం...
మనమంతా ‘టీమ్ ఇండియా’గా కలిసి పనిచేద్దాం... ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
పశ్చిమాసియాలో ఇక భీకర యుద్ధమే.. చర్చలపై అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిష్టంభన... హార్మూజ్పై పట్టు బిగించిన ఇరాన్
ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీని తామే తెచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
బిజినెస్
వైద్యరంగానికి ‘సహకారి’ కరవు
వైద్యం అంటే కేవలం డాక్టర్లు, మందులు మాత్రమే కాదు; తెర వెనుక ఉండి ప్రాణాలను కాపాడే ‘అలైడ్ హెల్త్కేర్’ నిపుణుల పాత్ర కీలకం. ఆధునిక వైద్య రంగంలో ఒక రోగికి వ్యాధి నిర్ధారణ జరగాలన్నా, క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం కావాలన్నా లేదా డయాలసిస్ వంటి ప్రాణరక్షక ప్రక్రియలు కొనసాగాలన్నా డాక్టర్లతో పాటు సమానంగా శ్రమించే వారు ‘అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషనల్స్’ (ఏహెచ్పీ). ల్యాబ్ టెక్నీషియన్లు, ఇమేజింగ్ స్పెషలిస్టులు, ఫిజియోథెరపిస్టులు, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది.. ఇలా సుమారు 50కి పైగా విభాగాల్లో పనిచేసే ఈ నిపుణులు ఆరోగ్య వ్యవస్థలో 60 శాతం మేర వాటాను కలిగి ఉన్నారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, వైద్యులు చికిత్సను నిర్ణయిస్తే.. అలైడ్ నిపుణులు ఆ చికిత్సను సహకారం అందిస్తారు.భారీగా మానవ వనరుల కొరతప్రస్తుతం భారతదేశ ఆరోగ్య రంగం తీవ్రమైన నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. గణాంకాల ప్రకారం.. అవసరమైన నిపుణులు 1.09 కోట్లు. అందుబాటులో ఉన్నవారు 27.5 లక్షలు. లోటు 80 లక్షలకు పైగా. ఏటా సుమారు 10 లక్షల మంది అలైడ్ నిపుణుల అవసరం ఉండగా కేవలం 2 లక్షల మంది మాత్రమే విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నారు. ఈ వ్యత్యాసం వల్ల రోగ నిర్ధారణలో జాప్యం, శస్త్రచికిత్సలు వాయిదాపడి అంతిమంగా రోగి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.విద్య - ఉపాధిఅలైడ్ హెల్త్కేర్ కోర్సులు పూర్తి చేయడానికి విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడటంతోపాటు భారీగా ఆర్థిక పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అయితే, కెరీర్ ప్రారంభంలో లభించే వేతనాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. గ్రామీణ, మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఒక ప్రతిబంధకంగా మారుతోంది. తక్కువ శిక్షణతో ఎక్కువ ఆదాయం వచ్చే ఇతర రంగాల వైపు యువత మొగ్గు చూపడం వల్ల ఈ విభాగంలో నిపుణుల కొరత పెరుగుతోంది.సంస్కరణల దిశగా అడుగులుఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ (ఎన్సీఏహెచ్పీ) చట్టాన్ని’ తీసుకువచ్చింది. కేంద్ర బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించి రాబోయే ఐదేళ్లలో లక్ష మంది కొత్త నిపుణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఒకే రకమైన కాంపెటెన్సీ బేస్డ్ సిలబస్ను అమలు చేయనున్నారు.అమలులో ఎదురవుతున్న సవాళ్లుచట్టం తీసుకురావడం ఒక ఎత్తయితే దానిని ఆచరణలోకి తెచ్చే క్రమంలో కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం..చట్టం అమలులోకి వచ్చే లోపు కోర్సుల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తుపై స్పష్టత అవసరం. పాత పద్ధతిలో చదివిన వారిని కూడా రిజిస్ట్రేషన్కు అనుమతించే విధానం కావాలి.కొత్త నిబంధనల ప్రకారం విద్యా సంస్థల గుర్తింపు పొందే ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలి. లేదంటే అడ్మిషన్లు ఆగిపోయి నిపుణుల కొరత మరింత తీవ్రమవుతుంది.అవయవ మార్పిడి, అణు వైద్యం (న్యూక్లియర్ మెడిసిన్) వంటి స్పెషలైజ్డ్ విభాగాల్లో శిక్షణ కేవలం మెట్రో నగరాల్లోని పెద్ద ఆసుపత్రుల్లోనే సాధ్యం. చిన్న పట్టణాల్లోని విద్యాసంస్థలకు స్టాండ్-అలోన్ ల్యాబ్లు, డయాలసిస్ సెంటర్లతో అనుసంధానం అయ్యే వెసులుబాటు కల్పించాలి.అలైడ్ కోర్సులను బోధించడానికి డాక్టర్లను అనుమతించకూడదనే నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం మాస్టర్స్ లేదా పీహెచ్డీ చేసిన అలైడ్ నిపుణులు తక్కువగా ఉన్నందున ప్రారంభ దశలో నిబంధనల్లో కొంత సడలింపు అవసరం.వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం అత్యాధునిక ఆసుపత్రులు ఉంటే సరిపోదు. వాటిని నడిపించే నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలి. రెగ్యులేటరీ వ్యవస్థ అనేది అడ్డంకిగా మారకుండా సామర్థ్యాన్ని పెంచే ఒక ఉత్ప్రేరకంగా పనిచేయాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో ఆరోగ్య వ్యవస్థ బలోపేతమై ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందుతుంది.ఇదీ చదవండి: ఇంధన పొదుపునకు బంగ్లాదేశ్ కఠిన నిర్ణయాలు
ఎలక్ట్రిక్ 2వీలర్స్ స్పీడ్
ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారిగా స్పీడందుకున్నాయి. ఇందుకు ద్విచక్ర వాహన దిగ్గజాలకుతోడు ఏథర్ ఎనర్జీ తదితర కంపెనీలు ఈవీ 2వీలర్స్ ఉత్పత్తిలోకి ప్రవేశించడం దోహదపడుతోంది. వెరసి రెండు రోజులు తక్కువగా 2025–26లో ద్విచక్ర ఈవీ అమ్మకాలు 17 శాతంపైగా జంప్ చేశాయి. 13.5 లక్షల యూనిట్లను అధిగమించాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కొద్ది రోజులుగా డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు దేశీ ద్విచక్ర వాహన రంగ దిగ్గజాలు బజాజ్ ఆటో, టీవీఎస్, హీరో మోటోలకు తోడు ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ తదితర కంపెనీలు జత కలవడం పరిశ్రమకు జోష్ నిస్తున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండుకుతోడు పోటీ తీవ్రత నేపథ్యంలో 2వీలర్ కంపెనీలు సైతం మరిన్ని సౌకర్యాలు, సాంకేతికతలతో విభిన్న మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వెరసి గతేడాది (2025 ఏప్రిల్ 1–2026 మార్చి 29) ద్విచక్ర ఈవీ కంపెనీలు ఉమ్మడిగా 13.5 లక్షల యూనిట్లను విక్రయించాయి. ఇది అంతక్రితం ఏడాది (2024–25)తో పోలిస్తే 17.3% వృద్ధికాగా.. 15 లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని అందుకునే వీలున్నట్లు ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది 11 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. రేసుకు సై.. ద్విచక్ర ఈవీలలో టీవీఎస్ మోటార్ 3.3 లక్షల వాహన అమ్మకాలతో టాప్ చెయిర్ను అందుకుంది. తద్వారా 3 లక్షల వాహన అమ్మకాలను అధిగమించిన రెండో దిగ్గజంగా నిల్చింది. ఇప్పటికే ఈ రికార్డును సాధించిన ఓలా ఎలక్ట్రిక్ రేసులో వెనుకబడటం గమనార్హం! స్కూటర్ల నుంచి మోటార్ సైకిళ్ల దిగ్గజంగా ఆవిర్భవించిన బజాజ్ ఆటో.. ‘చేతక్’ బ్రాండుతో ఈవీ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా రేసులో ముందుకొస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ రిటైల్గా 2.76 లక్షల వాహనాలను విక్రయించి రెండో ర్యాంకును అందుకుంది. ఇక పూర్తి ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ సైతం పటిష్ట మోడళ్లతో పోటీ పడుతోంది.ఫుల్ ఛార్జింగ్..ఐక్యూబ్ మోడల్ ద్వారా ఎలక్ట్రిక్ 2వీలర్ అమ్మకాలలో టాప్లో నిలిచిన టీవీఎస్ మోటార్ వార్షికంగా 39 శాతం పురోగతిని సాధించింది. తద్వారా 3 లక్షల వాహన విక్రయాల మార్క్ను అందుకుంది. ఇక హీరో మోటో.. ‘విడా’ బ్రాండ్ అమ్మకాలు ఏకంగా 184 శాతం జంప్చేశాయి. రిట్జా బ్రాండ్తో ఏథర్ ఎనర్జీ సైతం 75 శాతం వృద్ధిని అందుకుంది. మొత్తం ఈవీ 2వీలర్ అమ్మకాలలో ఐక్యూబ్, చేతక్, రిట్జా ఉమ్మడిగా దాదాపు 70 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. వీటితో హీరో మోటోను సైతం కలుపుకుంటే వినియోగదారులు పంపిణీ, సరఫరా నెట్వర్క్, సరీ్వసింగ్ సౌకర్యాలు, బ్రాండ్ తదితరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రధాన కంపెనీలతో పోటీ, ఇతర సవాళ్ల కారణంగా మరోపక్క వోలా ఎలక్ట్రిక్ విక్రయాలు 53 శాతం పడిపోయాయి. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ(యాంపియర్), హోండా, రివర్ మొబిలిటీ, బిగౌస్ తదితర కంపెనీలు సైతం అమ్మకాలు వేగంగా పెంచుకుంటుండటం గమనార్హం. కాగా.. రేటింగ్స్ దిగ్గజం క్రిసిల్ అంచనాల ప్రకారం ఈవీ 2వీలర్ అమ్మకాల పరిమాణం కొత్త ఏడాది(2026–27)లోనూ 20 శాతంపైగా పుంజుకోనుంది. మొత్తం అమ్మకాలు 18 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశంఉంది.– సాక్షి, బిజినెస్ డెస్క్
పెట్రోలే కాదు.. తాగే నీటిపైనా యుద్ధం ఎఫెక్ట్!
రష్యా-ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కేవలం ఇంధన ధరలనే కాదు, సామాన్యుడు తాగే నీటిని కూడా ఖరీదైనవిగా మారుస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు అంతరాయం కలగడంతో ముడి చమురు ధరలు బ్యారెల్కు 119 డాలర్లకు చేరడం భారత్లో బాటిల్ వాటర్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది.ప్యాకేజింగ్ భారంనీటి ధర పెరగడానికి కారణం నీరు కాదు, ఆ నీటిని నింపే ప్లాస్టిక్ బాటిల్. ప్లాస్టిక్ తయారీకి వాడే PET (పాలిథిలిన్ టెరెఫ్తాలేట్) రెసిన్ గుళికలు ముడి చమురు నుండి తయారవుతాయి. చమురు ధరలు పెరగడంతో, ఈ ముడిపదార్థాల ధరలు గత పక్షం రోజుల్లోనే భారీగా పెరిగాయి.ధరల పెంపుమార్కెట్ లీడర్ బిస్లేరి ఇప్పటికే వాటర్ బాటిళ్ల ధరలను 11 శాతం పెంచింది. 12 లీటర్ బాటిళ్ల బాక్స్ ధర ఏకంగా రూ. 24 పెరిగింది. ప్యాకేజింగ్ ఖర్చులు 70 శాతం పెరగడంతో లీటర్ బాటిల్ ధర రూ. 20కి చేరుకుందని బిస్లేరి సీఈఓ ఏంజెలో జార్జ్ తెలిపారు. PET ప్రిఫార్మ్స్ ధర కిలోకు రూ. 115 నుండి రూ. 180కి పెరగడమే కాకుండా, సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడిందని మహారాష్ట్ర బాటిల్డ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది.పరిశ్రమలపై 'చైన్ రియాక్షన్'కెమ్కో ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వైభవ్ సరోగి అభిప్రాయం ప్రకారం, ఈ ప్యాకేజింగ్ సెగ కేవలం తాగునీటికే పరిమితం కాదు. PET ప్యాకేజింగ్ను ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్ డ్రింక్స్, ఫుడ్ డెలివరీ, ఫార్మాస్యూటికల్స్, కాస్మెటిక్స్ రంగాలు కూడా ప్రభావితం కానున్నాయి.సామాన్యుడిపై నీటి భారంభారతదేశంలో స్వచ్ఛమైన నీటి లభ్యత ఇప్పటికే సవాలుగా మారింది. దేశంలో దాదాపు 70 శాతం భూగర్భ జలాలు కలుషితమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం గృహాలు తమ ప్రాథమిక దాహం తీర్చుకోవడానికి బాటిల్ వాటర్ పైనే ఆధారపడుతున్నాయి.కర్మాగారాల మూసివేతపెరిగిన ఖర్చులను భరించలేక మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దాదాపు 20 శాతం తయారీ ప్లాంట్లు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేశాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో బాటిల్ వాటర్ ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒరాకిల్ బాస్కు షాక్.. రూ.16 లక్షల కోట్లు లాస్!
టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లారీ ఎల్లిసన్ సంపద ఊహించని రీతిలో ఆవిరైపోయింది. గడిచిన ఆరు నెలల కాలంలోనే ఆయన నికర విలువ ఏకంగా 193 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16.10 లక్షల కోట్లు) మేర క్షీణించింది. ఒరాకిల్ షేర్లు మార్కెట్లో భారీగా పతనమవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.కుబేరుల జాబితాలో వెనక్కి..బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 22, 2025 నాటికి ఎల్లిసన్ నికర విలువ 388 బిలియన్ డాలర్లుగా ఉండేది. అప్పట్లో ఆయన ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఏప్రిల్ 3, 2026 నాటికి అది 195 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల ర్యాంకింగ్స్లో ఆయన రెండో స్థానం నుండి ఆరో స్థానానికి పడిపోయారు.షేర్ల పతనమే కొంపముంచింది..ఒరాకిల్ సంస్థలో ఎల్లిసన్కు దాదాపు 41% వాటా ఉంది. కంపెనీ షేర్ల విలువ తగ్గితే ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ కూడా నేరుగా ప్రభావితమవుతుంది. సెప్టెంబర్ 2025లో 345.72 డాలర్ల వద్ద ఉన్న ఒరాకిల్ షేర్ ధర, ఏప్రిల్ 2, 2026 నాటికి 146.38 డాలర్లకి పడిపోయింది. అంటే దాదాపు 58% మేర పతనం నమోదైంది.భారీగా ఉద్యోగుల తొలగింపు ఒకవైపు సంపద క్షీణిస్తుండగా, మరోవైపు ఒరాకిల్ సంస్థ ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా భారీగా ఉద్యోగ కోతలకు పాల్పడింది. మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 18%) తొలగించినట్లు సమాచారం.భారత్పై తీవ్ర ప్రభావంమీడియా నివేదికల ప్రకారం, ఈ తొలగింపుల ప్రభావం భారత్పై తీవ్రంగా ఉంది. దేశంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది ఉద్యోగులను కంపెనీ సాగనంపినట్లు తెలుస్తోంది."ప్రస్తుత వ్యాపార అవసరాలు, సంస్థాగత మార్పులను దృష్టిలో ఉంచుకుని మీ పాత్రను తొలగించాలని నిర్ణయించాం," అంటూ తెల్లవారుజామునే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.వ్యాపార ఒత్తిళ్లు, మార్కెట్ అస్థిరత నేపథ్యంలో ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు అటు ఇన్వెస్టర్లను, ఇటు ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఫ్యామిలీ
అవధులు లేని దేవుని ప్రేమ
ఒక నీతిమంతుని మరణం నశించిపోయే మానవ జాతికి శుభం చేకూర్చింది. మరణానికి వారసులైన నరజాతికి యేసుక్రీస్తు రూపంలో గొప్ప విమోచకుడ్ని అందించింది. పాపపరిహారార్థ బలిగా, సజీవ యాగంగా దేవాదిదేవుడే సిలువపై తన విలువైన పరిశుద్ధ రక్తాన్ని ధారవోశాడు. మానవుల పట్ల తన అపార ప్రేమను తన బలి అర్పణ ద్వారా చాటుకున్నాడు.ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తికి చివరికి రెండు తేదీలే మిగిలి పోతాయి. ఒకటి పుట్టుక రెండవది మరణ తేదీ. పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. అందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. ప్రపంచ అధినేత అయినా సరే, మారుమూల గ్రామంలో పుట్టిన సామాన్యుడైనా చావు ముందు తల వంచాల్సిందే. మరణం ముందు ఓడి పోవాల్సిందే. అందుకే మనిషికి చావంటే చచ్చేంత భయం. కొంతమంది బతకడానికి కావలసినంత ధైర్యం లేక చావును ఆశ్రయిస్తారు. అదీ శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే మనకథ మరణంతో ఆగి పోదు. మనం చేసిన పాపాలకు ఆ తర్వాత రెండో మరణం కాచుకోని ఉంటుంది. మరణాన్ని తలపించే నిత్య నరకం. ఆ నరకం నుంచి తప్పించేందుకు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి మన పాపాలకు విమోచన క్రయధనముగా అర్పించాడు.పాపపరిహారార్థ బలిగా క్రీస్తు తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుని చేత సృజించబడ్డ ఆదిమానవుడైన ఆదాము, అతని భార్యకు తమ ఇష్టం చొప్పున బతికే అవకాశం ఇచ్చాడు. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ లోక అధిపతిగా పిలవబడ్డ దుష్టుడైన సాతాను వారిద్దరినీ మోసం చేసి దేవుని ఆజ్ఞను మీరేలా చేశాడు. పాపం చేసిన వారిద్దరూ పాపం ద్వారా వచ్చే జీతం మరణాన్ని కొని తెచ్చుకున్నారు. వారిలో ఉన్న ఆ పాపపు బీజం ఆ తర్వాత ప్రతి మనిషిలో కొనసాగుతూ వచ్చింది. ఆ పాపాన్ని తీసివేసుకోడానికి మనిషి చేయని ప్రయత్నం లేదు. ప్రధానంగా జంతువుల రక్తం బలి ఇవ్వడం ద్వారా దేవుని ప్రసన్నం చేసుకోవాలని చూసాడు. అయినా నరునిలో వున్న పాపబీజం అతని వెంటాడుతూనే ఉంది. పలు బలి అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు పాపము నుండి మానవులను వేరుచేయవని గ్రహించిన దేవుడు తన కుమారుని ఈ భూమిపైకి పంపి అతని బలి అర్పణ ద్వారా, పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా సమస్త మానవులకు ఆ పాపపు శాపాన్ని విడిపించి తిరిగి దేవునితో మొదటి మానవుడి ద్వారా విడిపోయిన ఆ సంబంధాన్ని పునరుద్ధరింప జేశాడు. అందుకు నీతిమంతుడైన యేసు అప్పటి రోమా పాలకులు, తన స్వజనమైన యూదా ప్రజల ద్వారా ఘోరమైన శ్రమలు సిలువ ద్వారా అనుభవించాల్సివచ్చింది. మానవుల పాపం కోసం పాపంగా చేయబడ్డాడు. సమస్త మానవ కోటి పాపభారాన్ని, శాపాన్ని తనపై మోశాడు. శిలువపై తన పవిత్ర రక్తాన్ని చిందించాడు.క్రీస్తు ప్రశస్తమైన మాటలుశిలువ మరణానికి ముందు క్రీస్తు యేసు భూమ్మీద పలికిన ప్రతి మాట జీవపు ఊటై అప్పుడు ఇప్పుడూ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తూనే ఉంది. భూమి గతించినా నా మాటలు మాత్రం నిత్యం నిలిచి ఉంటాయని క్రీస్తు చె΄్పాడు. క్రీస్తు మరణ సమయంలో సిలువ మీద పలికిన 7 మాటలు ఈ శుభ శుక్రవారం ప్రపంచంలోని క్రైస్తవ విశ్వాసులందరూ ధ్యానిస్తారు. వాటిలో ముఖ్యంగా తనను క్రూరంగా హింసిస్తున్న సైనికులను, హేళన చేస్తున్న యూదా మతాధికారులు, ప్రజలను చూసి తండ్రీ వీరేమీ చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని కోరాడు. మానవుల పట్ల మితిలేని ప్రేమగల దేవుడు కాబట్టే ఇట్టి క్షమాపణగుణం కనబరిచాడు. కుడిచేతి వైపు సిలువ వేయబడిన దొంగ యేసును గమనిస్తూ ఆయన నిజమైన పాపుల రక్షకుడు, దేవుడని గ్రహించి యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొనవా అని అర్థించినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని అభయం ఇచ్చాడు. నిజంగా ఒకడు పరలోకం చేరాలంటే దేవుని నమ్మి రక్షణ పొంది బాప్తీస్మం తీసుకోవాలి. కానీ ఇదేమీ లేకుండా ఒక బందిపోటు దొంగకు అతని విశ్వాసం చొప్పున నేరుగా పరలోకం అనుగ్రహించాడు. రోదిస్తున్న తల్లిని చూచి తన ప్రియమైన శిష్యుడికి అమ్మ బాధ్యతలు అప్పగించాడు. సిలువ యాగం ద్వారా తాను భూలోకానికి వచ్చిన రక్షణ కార్యం పూర్తయిందని గ్రహించి తండ్రికి తన ఆత్మను అప్పగించి చివరకు సమాప్తమైనదని చెప్పి యేసు ప్రాణం విడిచాడు. యేసు చనిపోయాడో లేదో నిర్ధారించుకోడానికి ఒక సైనికుడు పక్కటెముకల్లో బల్లెంతో ΄÷డిచాడు. ఇదంతా గమనిస్తున్న కఠినమైన రోమా శతాధిపతి హృదయం కరిగిపోయింది. ఈయన నిజముగా దేవుని కుమారుడే అంటూ ప్రకటించాడు. యేసు చనిపోయిన వెంటనే కొన్ని అద్భుతాలు జరిగాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పేర్కొంది. ప్రసిద్ధ యెరూషలేము దేవాలయపు గర్భగుడిలో ఉండే పెద్ద తెర పైనుంచి క్రిందికి రెండుగా చీలిపోయిందని, ఆ ప్రాంతంలో భూమి కంపించిందని, బండలు బద్దలవడం, సమాధులు తెరవబడి మృతులైన పరిశుద్ధులు పట్టణములో ప్రవేశించి అనేకులకు కనపడ్డారని పేర్కొంది. క్రీస్తు కథ సిలువ మరణంతో ఆగిపోలేదు. చరిత్ర పుటల్లో మరణాన్ని జయించి మూడవ దినమున పునరుత్థానుడైన ఒకే వ్యక్తిగా పేర్కొనడం జరిగింది. అందుకే ఇప్పటికీ క్రీస్తు ఖాళీ సమాధి యెరూషలేములో మనకు దర్శనమిస్తుంది. సజీవుడైన క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిపోయింది. అందుకే అగస్టిన్ అనే భక్తుడు ’సిలువ దేవుని ప్రేమను ప్రకటించిన గొప్ప వేదిక’ అంటాడు.– స్టెర్జి రాజన్ బందెల, సీనియర్ జర్నలిస్ట్
ఆఖరి మజిలీకి ఆమె చేయూత!
చావులకు వెళ్లాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు. కొందరైతే చావుకు వెళ్లినా అంత దూరాన ఉండి అంత్యక్రియలు ఎప్పుడు పూర్తవుతాయోనని ఎదురు చూస్తుంటారు. అలాంటిది కొందరు మహిళలు వారసత్వంగా వచ్చిన పాడె కట్టడం, చితి పేర్చడం, బొంద తవ్వడం వంటి వృత్తులు నిర్వహిçస్తూ, ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా అలాంటి పనులు మగవారే చేస్తుంటారు. కానీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళలే అన్నీ తామై పాడె కట్టడం నుంచి చితిని పేర్చి శవం కాలి బూడిదయ్యేదాకా అన్నీ తామై వారసత్వంగా వస్తున్న ఆ వృత్తిలో ఆఖరి మజిలీ వరకు చేయూతనిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో ఎవరైనా చనిపోయినట్లు సమాచారం అందగానే అంత్యక్రియలకు అవసరమైన కుండతో పాటు పాడె కట్టడానికి అవసరమైన కట్టెలు తీసుకుని వెళతారు. చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లి డప్పుల చప్పుడు మధ్యన పాడె కడతారు. శవాన్ని పాడె మీద పడుకోబెట్టగానే బట్ట కప్పేసి శవం పడిపోకుండా తాడుతో కట్టేస్తారు. మరో బృందం చితికి అవసరమైన కట్టెలు తీసుకువచ్చి శ్మశానవాటికలో పేర్చి, శవాన్ని చితిపై పడుకోబెట్టగానే కట్టెలతో నింపేస్తారు. కుటుంబ సభ్యులు చితికి నిప్పంటించగానే, దహనమయేదాకా అక్కడే ఉంటారు. కొన్ని కుటుంబాల వాళ్లు శవాలను ఖననం చేస్తుంటారు. అలాంటి పనుల్లో శవాన్ని ఖననం చేయడానికి గుంత తవ్విన తరువాత శవాన్ని అందులో పూడ్చేసే కార్యక్రమం పూర్తయ్యేదాకా ఉంటారు. కామారెడ్డి పట్టణానికి చెందిన వారంతా పట్టణంతో పాటు దేవునిపల్లి, క్యాసంపల్లి, సరంపల్లి గ్రామాల్లో చనిపోయిన వారి ఆఖరి మజిలీలో తమ పాత్ర పోషిస్తున్నారు. కరోనా అప్పుడు కూడా పనిచేసినంనేను నలభై ఏండ్ల సంది పాడె కడుతున్న. ఎవరు చనిపోయినా వచ్చి మాట్లాడుకుని వెళతారు. చావుకు అవసరమైన కుండ, పాడె కట్టెలు కొనుక్కుని వెళతాం. ఇంటిముందర కుండలో అన్నం వండి ఇవ్వడం నుంచి పాడె కట్టడం, శవాన్ని పాడెమీద పడుకోబెట్టి తీసుకువెళ్లేదాకా అన్ని పనులు చూసుకుంటాం. ఇంటి వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని జీవనం సాగిస్తుంటాం. అయితే మేము చేసేది పుణ్యకార్యంగానే భావిస్తాం. కరోనా సావులు కూడా చేసినం.– బైరం సిద్దవ్వఇరవై ఏండ్ల సంది చేస్తున్న...నేను ఇరవై ఏండ్ల సంది వృత్తిలో ఉన్న. మా కుటుంబ వారసత్వంగా వచ్చిన దానిని అలాగే కొనసాగిస్తున్నం. పెద్ద ఊరు కావడం వల్ల ఒక్కోసారి ఒకేరోజు మూడు, నాలుగు సావులు కూడా చేయాల్సి ఉంటది. ఆ రోజు తినడానికి కూడా టైం సరిపోదు. అన్ని సావుల కాడికి వెళ్లాలి. పాడె కట్టాలి. జీవితం ఉన్నన్ని రోజులు చేయాల్సిందే. ఇబ్బందే అయినా బతకుదెరువుకు చేయాల్సిందే. – బైరం హేమలత– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
అతనే.. భామ
ఆమె నృత్యం చేస్తున్నంతసేపూ అపురూప అందాల రాశి అనుకుంటూ కనురెప్పలు కొట్టడమే మానేసి కళ్ళప్పగించి చూస్తాం! ప్రదర్శన పూర్తయ్యాక కరతాళ ధ్వనుల మధ్య ఆమె ఆమె కాదు, అతను... పేరు సంజయ్ వడపల్లి అని వ్యాఖ్యాత ప్రకటించగానే హాలు అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది! అవును అతను సంజయ్ వడపల్లి! ఆంధ్రనాట్యంలో అద్భుత నర్తకిగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. భరత కళాప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత, అభినవ సత్యభామ డాక్టర్ కళాçకృష్ణ ఆయన గురువులు. ప్రస్తుతం హెచ్.ఎస్.బి.సి హాంగ్ కాంగ్ బ్రాంచ్లో అసోసియేట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ శనివారం హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయంలో ఎన్టీఆర్ ఆడిటోరియంలో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడానికి విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.తన 8వ ఏట డాక్టర్ నటరాజ రామకృష్ణ దగ్గర లాస్య, తాండవ నృత్య సాధనతో ఆరంభించి నృత్యం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. డాక్టర్ కళాçకృష్ణ దగ్గర ప్రబంధ సాంప్రదాయ నవ జనార్ధన పారిజాతం నేర్చుకున్నారు. తొలిసారి సత్యభామ వేషం ధరించి నాట్యం చేసినప్పుడు లభించిన ప్రశంసలతో నాట్య రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సంజయ్ తెలిపారు. తాను సత్యభామగా నర్తించినప్పుడు వేదికపై చూసిన వారు, ఆ తరువాత మేకప్ తొలగించుకుని పలకరిస్తే ఆశ్చర్య పోయేవారని, తానే సత్యభామ అంటే నమ్మే వారు కాదంటూ తొలినాటి ప్రదర్శనల అనుభూతులను గుర్తు చేసుకున్నారు. సంజయ్ వడపల్లి సత్యభామగా నవ జనార్దన పారిజాతంతో1985 నుంచి దేశంలోని వివిధ నృత్యోత్సవాల్లో, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. యునెస్కో, హాంగ్ కాంగ్ ఇన్–క్రెడిబుల్ ఫెస్టివల్, అమెరికాలో జరిగిన నటరాజ రామకృష్ణ జయంతి ఉత్సవాలు తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు.డాక్టర్ నటరాజ రామకృష్ణ నృత్య రత్న పురస్కారంఆంధ్రనాట్యం, పేరిణి నాట్య సృష్టికర్త డాక్టర్ నటరాజ రామకృష్ణ పేరిట తమ డ్యాన్సింగ్ బెల్స్ సంస్థ నుంచి జాతీయస్థాయిలో నృత్య రత్న అవార్డును ప్రవేశ పెడుతున్నట్లు వివరించారు. ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యాల్లో విశేష కృషి చేస్తూ విశ్వవ్యాప్తం చేసే గురువులకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పురస్కారం కింద 20 వేల రూపాయల నగదు, శాలువా, జ్ఞాపికతో ప్రతి యేటా గురువులను సత్కరిస్తామని, యువ నర్తకులకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు సంజయ్ తెలిపారు. ఆంధ్రనాట్య సోలో ప్రదర్శనలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంజయ్ ప్రతిష్టాత్మక సత్రాజితి అవార్డుతో పాటు ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ అవార్డు, ఆంధ్రనాట్య కళాశౌర్య అవార్డు, సింగిడి తెలంగాణ పురస్కారం, నృత్యకౌముది, ముంబయి వారి జాతీయ సమైక్యతా నృత్య పురస్కారం లాంటి పలు అవార్డులు అందుకున్నారు. బాలనటుడైన సంజయ్ వడపల్లి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శృతి లయలు సినిమాలోనూ నటించారు. ప్రబంధ సాంప్రదాయ నవజనార్ధన పారిజాతం ప్రదర్శన విశ్వవ్యాప్తం చేయడంతోపాటు నాట్యాచార్య డాక్టర్ నటరాజ రామకృష్ణ, డాక్టర్ కళాకృష్ణ తెలుగు జాతికి అందించిన నృత్యాంశాలను భావి తరాలకు అందించే ప్రయత్నమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ‘అభినవ అంతర్జాతీయ సత్యభామ’ సంజయ్ వడపల్లి తెలిపారు. ఈనెల 4న నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే తన ప్రదర్శనకు ఉచిత ప్రవేశం అని, కళాప్రియులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి, సాక్షి, బంజారాహిల్స్, హైదరాబాద్
పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఒక వివాహ వేడుక రసాభాసగా మారిపోయింది. స్వల్ప వివాదానికే అతిథులు రెచ్చిపోయారు. ఇది కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడి సమయంలో నిందితులు ఇంట్లోని వస్తువులను, నగదును కూడా ఎత్తుకుపోవడం కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటాయ్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానిక నివాసి మహేష్ జాతవ్ వివాహం జరుగుతుండగా, వేడుకలో తమకు మద్యం సరఫరా చేయాలని అతిథులు గొడవకు దిగారు. దీంతో వివాదం చెలరేగింది. మందు పోస్తావా, డబ్బులు ఇస్తావా అంటూ నానా యాగీ చేశారు. దీనికి వరుడు నిరాకరించడంతో వివాదం మరింత ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. మద్యం ఇవ్వలేదని ఆగ్రహించిన అతిథుల బృందం, వధూవరులతో పాటు, కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసి నట్లు నగర పోలీస్ సూపరింటెండెంట్ మనీష్ యాదవ్ విలేకరులకు తెలిపారు. ఈ ఘర్షణలో వరుడి కుటుంబానికి చెందిన కొందరు సభ్యులు గాయపడ్డారు. ఈ సమయంలో కొన్ని విలువైన వస్తువులు, నగలు దొంగిలించిన ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు.STORY | Guests attack bride, groom after not being served liquor at wedding in MP villageUpset at not being served liquor, a group of guests at a wedding in Madhya Pradesh's Gwalior district allegedly assaulted the bride, groom and their family members, police said.READ |… pic.twitter.com/PnRKy5cfnm— Press Trust of India (@PTI_News) April 2, 2026ఇదీ చదవండి : ఇపుడా పని..క్యాబ్ బుక్ చేసినంత ఈజీ : ఆనంద్ మహీంద్ర ట్వీట్ వరుడి తల్లి ఆరోపణలుపెళ్లింటికి తమ వధువు చేరుకున్న తర్వాత కొన్ని ఆచారాలు జరుగుతుండగా, కొందరు పొరుగువారు అక్కడికి వచ్చి మద్యం కోసం తన కుమారుడిని డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారని వరుడి తల్లి షీలా విలేకరులకు తెలిపారు. మద్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆ పొరుగువారు వరుడితో సహా తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. తాము జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, తనపై, తన భర్తపై , వధువుపై కూడా దాడి చేశారని జాతవ్ తల్లి ఆరోపించారు.ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
అంతర్జాతీయం
పాక్కు షాక్.. ఇస్లామాబాద్ వచ్చేది లేదు: ఇరాన్
ఇరాన్ యుద్ధం ముగింపు కోసం పాకిస్థాన్ చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. అమెరికా పెట్టిన డిమాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ఇరాన్ తేల్చిచెప్పింది. దీంతో ఇస్లామాబాద్లో జరిగే చర్చలకు తమ దేశ ప్రతినిధులను పంపేప్రసక్తే లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది.పశ్చిమాసియా యుద్దం మెుదలై నెలరోజులు గడుస్తోన్నా పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగడం లేదు కదా మరింత దురుతున్నాయి. ఇంతకాలం పాటు చర్చలు జరుగుతన్నాయని ప్రచారం జరిగినా వాటిపైనా ఎవరికీ పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అసలు చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదంటూ ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. యుద్ధ విరమణకు ట్రంప్ పెట్టిన నిబంధనలు ఏ మాత్రం అంగీకారం లేవని ఇరాన్ పేర్కొన్నట్లు తెలిపింది. దీంతో సీజ్ ఫైర్ ఒప్పందం కోసం ఇస్లామాబాద్లో నిర్వహిస్తున్న చర్చలకు ఎట్టిపరిస్థితుల్లో తమ దేశ ప్రతినిధులను పంపేది లేదని తెలిపింది. ఈ ప్రకటనతో యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది.కాగా ఇరాన్ తన ఆధీనంలోని హార్ముాజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే యుద్ధ విరమణకు అంగీకరిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. .. "హార్ముాజ్ జలసంధిని పూర్తిగా స్వేచ్ఛగా తెరిచే వరకు ఇరాన్ను రాతి యుగం నాటి పరిస్థితికి వెళ్లేలా బాంబులతో ధ్వంసం చేస్తూనే ఉంటాం" అని సోషల్ మీడియాలో ఇరాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైతం వెనక్కి తగ్గట్లేదుకాగా పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇప్పుడు టర్కీ మరియు ఈజిప్ట్ దేశాలు ఈ చర్చల కోసం మరో వేదికల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
F-15 జెట్ ధ్వంసం .. ఇరాన్ చేతిలో అమెరికా ఫైలట్?
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన అత్యాధునిక F-15E యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చి వేసింది. దీంతో దీనికి చెందిన ఇద్దరు ఫైలట్లు ఇరాన్ భూభాగంలో దూకారు. వారిలో ఒకరి క్షేమ సమాచారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఆందోళనకరంగా మారింది.నైరుతి ఇరాన్ ప్రాంతంలో (IRGC) జరిపిన దాడిలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం దెబ్బతింది. దీంతో విమానం కూలిపోయే ముందే ఈ జెట్లో ఉండే ఇద్దరు సిబ్బంది పారాచూట్ ద్వారా ఇరాన్ భూభాగంలో దూకారు. దీంతో వీరి క్షేమ సమచారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య హాట్టాఫిక్గా మారింది. వీరిలో ఒకరిని అమెరికా రక్షించి తరలించిందని కథనాలు పేర్కొన్నాయి. కాగా మరోకరి క్షేమంపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది.అమెరికా వాదన ఈ ఇద్దరిలో ఒకరిని అమెరికా ప్రత్యేక దళాలు విజయవంతంగా రక్షించి, ఇరాన్ భూభాగం నుండి తరలించాయి.రెండో వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నాయని వెస్ట్రన్ మీడియా పేర్కొంది. మరోకరి కోసం తీవ్ర గాలింపులు జరుగుతన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితి వివరాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సైతం తెలిపినట్లు వైట్హౌస్ కథనాలు పేర్కొన్నాయి.ఇరాన్ వాదన అయితే జెట్ కూల్చివేతతో ఇరాన్లో దూకిన సిబ్బంది ఒకరు ఇరాన్ అదుపులో ఉన్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరికొన్ని కథనాల ప్రకారం ఆ దేశ ప్రజలకు ఆ ఫైలట్ను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయనను పట్టుకున్న వారికి మంచి బహుమతులు ఇస్తామని ప్రకటించినట్లు తెలిపింది.కాగా ఇప్పుడు ఆ అమెరికన్ ఫైలట్ అంశం ఇరు దేశాల మధ్య ఛాలెంజ్గా మారింది. అతన్ని క్షేమంగా పట్టుకుంటామని అమెరికా ప్రకటిస్తుండగా టెహ్రాన్ సైతం అతని కోసం తీవ్రంగానే గాలింపులు చేపడుతుంది ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
‘4 గంటలకే అన్నీ ఆఫీసులు మూసేయండి’
ఢాకా: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. తాజాగా, బంగ్లాదేశ్లో ఇంధన సంక్షోభం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.ఈ మేరకు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకు మూసివేయాలని ఆదేశించింది. కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. బ్యాంకులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగ్లాదేశ్లో ఇంధన సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైంది. దేశం 95 శాతం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుండటంతో ధరలు పెరగడం, సరఫరా అస్థిరత పెరగడం వల్ల ప్రభుత్వం కఠినమైన ఖర్చు నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని కేబినెట్ 180 రోజుల మితవ్యయ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, కొత్త వాహనాలు లేదా కంప్యూటర్లు కొనుగోలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అధికారుల విదేశీ ప్రయాణాలను 50 శాతం తగ్గించడం, సమావేశాలు, సదస్సుల ఖర్చులను పరిమితం చేయడం, వివాహాలు మరియు ఇతర కార్యక్రమాల్లో అలంకార లైటింగ్ నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో భారతదేశం ఇప్పటికే 5,000 టన్నుల డీజిల్ను బంగ్లాదేశ్కు సరఫరా చేసింది. మరిన్ని సరఫరాల కోసం చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. దుకాణాలు, మాల్స్ ముందుగానే మూసివేయడం వల్ల వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకింగ్ లావాదేవీలు కూడా తగ్గిన సమయానికి పరిమితం కావడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించనున్నాయి.మొత్తం మీద, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కఠినమైన మితవ్యయ చర్యలు చేపట్టింది. ఈ చర్యలు తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, దీర్ఘకాలంలో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయని అధికారులు విశ్వసిస్తున్నారు.
‘ఫ్రాడ్ జార్’ గా జేడీ వాన్స్..!
అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏది చేసినా వివాదాస్పద నిర్ణయాలతో అమెరికా ప్రజల ఆగ్రహానికి గురౌవుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్షుడైన జేడీ వాన్స్ను ఫ్రాడ్ జార్గా నియమించారు. అమెరికా ప్రభుత్వంలో పెద్దగా యాక్టివ్గా లేని జేడీ వాన్స్కు కావాలనే ఈ పదవి కట్టబెట్టారా? అనే చర్చ నడుస్తుంది.అయితే సాధారణంగా అమెరికాలో ఉపాధ్యక్షుడు, మంత్రి వర్గంలో సభ్యునిగా ఉన్న వ్యక్తికి ఈ పదవిని ఇస్తూ ఉంటారు. విశ్వసనీయ రాజకీయ నాయకుడిగా ఉన్న వారికి కూడా ఈ పదవిని అప్పగిస్తారు. ఫెడరల్ స్థాయిలో మోసాలపై దర్యాప్తు, పర్యవేక్షణ, చర్యలు తీసుకునే అధికారం ఫ్రాడ్ జార్కే ఉంటాయి. ఇవి ప్రత్యేక బాధ్యతలుగా చెబుతూ ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ జేడీ వాన్స్ను ఈ పదవిలో ప్రకటించడం వెనుక ఆంతర్యం రాజకీయపరమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అమెరికాలో మోసపూర్వక లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రధానంగా డెమోక్రాటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడమేనని చర్చ నడుస్తోంది.ఈ పదవిని వాన్స్కు ఇవ్వడం ద్వారా డెమోక్రాటిక్ రాష్ట్రాల్లో అవినీతి, మోసాలు ఎక్కువగా ఉన్నాయనే సందేశం పంపడమే కాకుండా, ఇది ఆయన మద్దతు దారులకు కూడా తాము అవినీతిని అరికడతామనే సంకేతాలు కూడా పంపినట్లయ్యింది.ఇది వాన్స్కు జాతీయ స్థాయి గుర్తింపు తెస్తుంది, కానీ పార్టీ ఆధారిత లక్ష్యాలు ఉన్నాయనే విమర్శలు రావచ్చు.ట్రంప్ ప్రభుత్వానికి ఇది అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నామని బలమైన సంకేతం ఇవ్వొచ్చు కానీ రాజకీయ ఆయుధంగా కూడా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. డెమోక్రాటిక్ రాష్ట్రాలు ఇది ఫెడరల్ జోక్యంగా భావించి, చట్టపరమైన–రాజకీయ పోరాటాలు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.
జాతీయం
సువేందుకు అనుకూలం.. ఆయనను తొలగించండి: టీఎంసీ
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి(ఆర్వో)ను వెంటనే తొలగించాలని అధికార టీఎంసీ డిమాండ్ చేసింది. ఇదే నియోజకవర్గం నుంచి టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండటం తెల్సిందే. ఇక్కడి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఆర్వో సురాజిత్ రాయ్ సన్నిహితుడంటూ ఆరోపించింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్కు శుక్రవారం ఒక వినతిపత్రం సమర్పించింది.ప్రస్తుత ఆర్వో రాయ్ గతంలో నందిగ్రామ్ నియోజకవర్గంలో బ్లాక్ అభివృద్ధి అధికారిగా ఉన్నప్పుడే సువేందుకు అనుకూలంగా బహిరంగంగానే వ్యవహరించినట్లు పేర్కొంది. అలాంటి అధికారిని సరిగ్గా ఎన్నికల వేళ ఆర్వోగా నియమించడం అనుమానాలకు తావిస్తోందని టీఎంసీ పేర్కొంది. ఈ నియామకం తటస్థ వైఖరికి భంగకరంగా ఉంటుందని పేర్కొంది. ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉందని తెలిపింది.
ఎన్నికల బరిలో లాటరీ కింగ్ ఫ్యామిలీ.. వారి ఆస్తులు ఎంతంటే?
చెన్నై/పుదుచ్చేరి: లాటరీ కింగ్గా గుర్తింపు పొందిన శాంటియాగో మార్టిన్ కుటుంబంలోని ముగ్గురు తమిళనాడు, పుదుచ్చేరిల్లో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా...? వీరు వేర్వేరు పార్టీల తరఫున బరిలోకి దిగడమే అసలైన కిటుకు. మార్టిన్ భార్య లీమా రోజ్(59) ఇటీవలే అన్నాడీఎంకేలో చేరి లాల్గుడి నియోజకవర్గంలో పోటీకి దిగారు.మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్(38) సొంతంగా లక్ష్య జననాయక కట్చి(ఎల్జేకే)అనే పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. పుదుచ్చేరిలో బీజేపీ, ఏఐఎన్నార్సీల ఎన్డీయేలో ఈ పార్టీ కూడా ఉంది. చార్లెస్ మార్టిన్ కామరాజ్ నగర్ స్థానానికి పోటీ పడుతున్నారు.మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున(43), విజయ్ సారథ్యంలోని టీవీకే తరఫున చెన్నైలోని విల్లివాక్కమ్లో పోటీకి దిగారు. ఈ ముగ్గురూ ఏప్రిల్ 9, 13వ తేదీల్లో జరిగే పోలింగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, మార్టిన్ గ్రూప్ కంపెనీ ఎండీగా ఉన్న జోస్ చార్లెస్ తనకు రూ.597 కోట్ల ఆస్తులు, అర్జున రూ.197 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించుకున్నారు.
365 రోజులున్నా ఫలితం శూన్యం
గజోల్: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో 15 రోజులుపాటు ఉంటానంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. ‘అమిత్ షా అన్నా, బీజేపీ అన్నా బెంగాల్ ప్రజలకు గిట్టదు. అందుకే అమిత్ షా ఇక్కడ 15 రోజులు కాదు..ఏకంగా 365 రోజులపాటు మకాం వేసినా ఎలాంటి ఫలితమూ ఉండదు’అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం మాల్దా జిల్లా గజోల్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మాల్దాలో సర్ దరఖాస్తుల పరిశీలనకు వెళ్లిన న్యాయాధికారులను 8 గంటలపాటు నిర్బంధంలో ఉంచిన ఘటనపై మమత స్పందిస్తూ.. బీజేపీ హైదరాబాద్ కోకిల ఈ కుట్రకు పథకం వేసిందంటూ పరోక్షంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇటీవల టీఎంసీ నుంచి వేరుపడి ఆమ్ జనతా ఉన్నయన్ పేరుతో పార్టీ పెట్టిన హుమాయూన్ కబీర్కు మద్దతు ప్రకటించిన ఎంఐఎం చీఫ్ ముస్లింల ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎంఐఎం, ఐఎస్ఎఫ్ కార్యకర్తలకు మాల్దా ఘటనలో ప్రమేయం ఉందన్నారు. ఇందులో కాంగ్రెస్ హస్తం కూడా ఉందని చెప్పారు. ‘మాల్దా ఘటన బెంగాల్ పరువును మంటగలిపింది. ఈ ఘటనకు కారణం స్థానికులు కారు. వాళ్లకు ఇబ్బందులు ఉండే ఉండొచ్చు. బయటి వ్యక్తులే వారిని ఈ ఉచ్చులోకి లాగారు. హైదరాబాద్ నుంచి తమ మతానికి చెందిన కొందరిని వెంటేసుకు వచ్చిన ఒక బీజేపీ కోయిల దీని వెనుక ఉంది. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎయిర్పోర్టులో మా సీఐడీ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది’అని మమత తెలిపారు. ‘బెంగాల్ అంటే ఢిల్లీ మాదిరిగా కాదు. వివిధ ప్రభుత్వ సంస్థలను వాడుకుంటూ, ఓటర్లకు డబ్బు ఎరవేసి ఏదైనా చేయొచ్చని అనుకుంటే కుదరదు’అని స్పష్టం చేశారు. బీజేపీ ఓటమి ఖాయమని తనకు తెలుసునన్నారు. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం ఇప్పటికీ తన నియంత్రణలోనే ఉందని, ఎన్నికల కమిషన్ అధీనంలోకి వెళ్లలేదని చెప్పారు.
గిరిజనుల అభివృద్ధికి రోడ్ మ్యాప్
గువాహటి: అస్సాంలోని గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్ధం చేసి ఉంచారని, ముచ్చటగా మూడోసారి బీజేపీ గెలుపుతో అమలు చేయడం తథ్యమని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. గోల్పారా, కామ్రూప్ జిల్లాల్లో శుక్రవారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మంత్రి ప్రసంగించారు. ఆదివాసీ మహిళను దేశ రాష్ట్రపతిగా అన్నేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేకపోయిందని విమర్శించారు. ద్రౌపదీ ముర్మును దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. పలాశ్బరిలో ఐఐఎం ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కాంగ్రెస్ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.‘మీరు ఎంతగా అడ్డుకున్నా, ఐఐఎం ఏర్పాటును ఏమాత్రం ఆపలేరు’ అంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మినీ అస్సాంగా పేరున్న గోల్పారా జిల్లాలోని పలు గిరిజన తెగల అభివృద్ధికి పాటుపడేది బీజేపీ మాత్రమేనని అమిత్ షా నొక్కి చెప్పారు. అదే సమయంలో, గిరిజనులు మెజారిటీగా ఉన్న జిల్లాలు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు పరిధిలోకి రావని వివరించారు. ప్రతి గిరిజన కుటుంబానికీ ఒక ఆవు, ఒక గేదెను పంపిణీ చేస్తామని సహకార శాఖ మంత్రిగా ఇది తన హామీ అంటూ ఆయన ప్రకటించారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా ధుబ్రి జిల్లా గోలక్గంజ్లో ఆయన పాల్గొనాల్సిన ఎన్నికల ర్యాలీ రద్దయింది.
ఎన్ఆర్ఐ
న్యూయార్క్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.
సింగపూర్లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు.
అమెరికాలో ఘనంగా మహిళా దినోత్సవం
అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. శివరాత్రితో పాటు మహిళా దినోత్సవం రెండు వేడుకలను కలిపి నైటా సంబరాలను అద్వితీయంగా జరిపారు. న్యూయర్క్, న్యూజెర్సీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారందరూ పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ కన్సర్ట్ అందరినీ అలరించింది. భక్త కన్నప్ప స్కిట్, టీ&టీ సిస్టర్స్ నృత్య ప్రదర్శన, ఘర్షణ బ్యాండ్, అంజనా సౌమ్య, సృష్టి చిల్లాల ఫెర్మార్మెన్స్లు ఆహుతులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు, వివిధ స్కిట్లు ఆహా అనిపించాయి. నైటా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల సమాహారంతో రూపొందించిన ప్రత్యేక నైటా సంబరాల సావనీర్-2026ను ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, వితరణశీలి డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా న్యూయార్క్ వేదికగా నైటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ప్రత్యేక సందేశాలు పంపారు. అమెరికాలో స్థిరపడినా పుట్టినప్రాంత పండగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కొనసాగిస్తున్నామని, వేడుకల విజయాన్ని ఆకాంక్షిస్తూ సహకరించిన అందరికీ నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ హరిచరణ బొబ్బిలి, సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ సౌమ్య శ్రీ, ఇతర కార్యకవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.(చదవండి: లండన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
చాయ్వాలాగా ఐటీ ఉద్యోగి..!
ఐఐటీ విద్యార్థి చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. అతడే చాయ్వాలా లేదా చాయ్గుయ్గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్. బిహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లేఆఫ్లు నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో చాయ్స్టాల్ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న అతడి కథ నెట్టింట వైరల్ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. ఎక్కడో బిహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బిహార్లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్ కూడా. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్కి. భోపాల్లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. ఐఐటీ అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగాన్నిపొందాను, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు. దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్. అయితే కార్పొరేట్ జాబ్లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..)
క్రైమ్
మేమేం పాపం చేశాం నాన్న..
కరీంనగర్ రూరల్: ఆడపిల్లలుగా పుట్టడమే ఆ చిన్నారుల పాలిట శాపంగా మారింది. కన్నతండ్రే కాలయముడుగా మారి కవల పిల్లలకు గడ్డిమందు తాగించి చంపి వ్యవసాయబావిలో పడేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కరీంనగర్ మండలం జూబ్లీనగర్కు చెందిన కచ్చు శ్రీశైలంకు మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనికతో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి కవల ఆడపిల్లలు గీతాన్శ్రీ, గీతాన్విక (4) ఉన్నారు. శ్రీశైలం ప్రస్తుతం సమీపంలోని ప్రతిమ ఆస్పత్రిలో పనిచేస్తుండగా మౌనిక వ్యవసాయ పనులకు వెళ్తోంది. కవల ఆడపిల్లలు పుట్టారని శ్రీశైలం భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. కుటుంబసభ్యులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి, భార్యాభర్తలకు సర్ది చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భార్యతో గొడవ పడిన శ్రీశైలం ఇద్దరు పిల్లలను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి గడ్డిమందు తాగించి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశాడు. పిల్లల గురించి మౌనిక ప్రశ్నించడంతో ఇద్దర్ని చంపి బావిలో పడేశానని శ్రీశైలం చెప్పడంతో స్థానికులతో కలిసి బావి వద్దకు వెళ్లింది. సమాచారం అందుకున్న రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీఐ నిరంజన్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బావిలో దిగి గాలించగా పెద్ద పాప గీతాన్శ్రీ మృతదేహం లభించింది. పిల్లల్ని చంపారనే కోపంతో శ్రీశైలంపై స్థానికులు దాడి చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. గజ ఈతగాళ్ల సాయంతో బావిలో గాలించగా రాత్రి 8.30 గంటలకు గీతాన్విక మృతదేహం దొరికింది.
బీరు తాగించించి మహిళపై లైంగిక దాడికి ప్రయత్నం..!
హైదరాబాద్: మహిళా చెఫ్పై హెడ్ చెఫ్ లైంగిక దాడికి యత్నంచిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో చెఫ్గా పని చేస్తున్న మహిళ అనారోగ్యం కారణంగా ఇటీవల విధులకు వెళ్లడం లేదు. ఇదే హోటల్లో హెడ్ చెఫ్గా పని చేస్తున్న శ్యాం.. డ్యూటీకి సంబంధించిన మీటింగ్ ఉందని తన ఇంటికి రమ్మన్నాడు. గురువారం సాయంత్రం ఫిలిం నగర్లోని బీజేఆర్ నగర్లో ఉంటున్న శ్యాం ఇంటికి ఆమె వెళ్లింది. ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన అతను.. బీరు, బ్రాందీ సీసాలు పట్టుకు వచ్చాడు. బీరు తాగాలని ఆమెను బలవంతం చేశాడు. తాగనంటూ ఆమె నిరాకరించినా.. బలవంతంగా తాగించి లైంగిక దాడికి యత్నించాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు యత్నంచగా.. ఆమెను తీవ్రంగా కొట్టాడు. పొత్తి కడుపుపై కాలితో తన్నాడు. ఆమెను నిర్బంధించి కొన్ని అసభ్యకరమైన వీడియోలు చూపించాడు. ఎట్టకేలకు తప్పించుకున్న బాధితురాలు నేరుగా వెళ్లి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Hyderabad: ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడి యత్నం..!
హైదరాబాద్: ఇంట్లోకి చొరబడిన భార్యభర్తలు ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. అంతే కాకుండా సదరు వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు .. గంగపుత్ర కాలనీకి చెందిన ఓ మహిళ(29) భర్తతో కలిసి నివాసముంటోంది. భర్త రాంనగర్కు చెందిన రాజు అనే వ్యక్తితో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. ఇటీవల బాధిత మహిళ తల్లి రాజుకు ఫోన్ చేసి మందలించింది. దీంతో రాజు, అతని భార్య సింధు కలిసి గురువారం మధ్యాహ్నం బాధితురాలి ఇంటికి వెళ్లి దాడిచేశారు. అంతేకాక రాజు లైంగికదాడికి యత్నించాడు. ఇందుకు అతని భార్య కూడా ప్రోత్సహించింది. దీంతో బాధితురాలు బయటకు పరుగులు తీయడంతో దంపతులిద్దరూ పరారయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి బాధితురాలు వారాసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా భార్యాభర్తలిద్దరూ బాధితురాలిపై కూడా ఫిర్యాదు చేశారని, కులం పేరుతో దూషించిందని అట్రాసిటీ కేసు పెట్టారని ఎస్ఐ రామచంద్రారెడ్డి తెలిపారు.
బైక్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
యలమంచిలి రూరల్: అనకాపల్లి జిల్లా లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. యలమంచిలి మండలం పోతురెడ్డిపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిపై బైక్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని (24), ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవిందు (25), పోతిరెడ్డిపాలేనికి చెందిన బంగారు దుర్గాప్రసాద్ (16) మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. పురుషోత్తపురంలో గురువారం రాత్రి గొల్లమారెమ్మ తల్లి పండగ జరిగింది. స్నేహితులైన ఇల్లపు గోవింద్, బంగారు నాని, బంగారు దుర్గాప్రసాద్ పండగకు వెళ్లారు. అనంతరం దుర్గాప్రసాద్ను పోతురెడ్డిపాలెంలో డ్రాప్ చేసి రావడానికి ముగ్గురూ కలిసి ఒకే బైకుపై పురుషోత్తపురం నుంచి బయలుదేరారు. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డులోకి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్ను విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. రోడ్డు దాటే క్రమంలో లారీని గమనించిన యువకులు బస్సును గమనించలేదు. కేవలం రెండు సెకన్లలో రోడ్డు దాటతారనగా.. బస్సు బైకు వెనుక భాగాన్ని ఢీకొంది. బంగారు నాని ఇటీవల ఉగాది పండగకు కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అమ్మవారి పండగలో ఆనందంగా గడిపి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురి కావడం, ముగ్గురు యువకులూ ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాద విషయం తెలిసిన గ్రామస్తులు ప్రమాద స్థలంలో బస్సు అద్దాలను కర్రలు, రాళ్లతో ధ్వంసం చేశారు. దీంతో బస్సులో ప్రయాణికులు భయాందోళనతో సమీపంలో పొలాల్లోకి పరుగులు తీశారు. యలమంచిలి సీఐ ధనుంజయరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు యువకుల మృతితో పురుషోత్తపురం, పోతురెడ్డిపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
వీడియోలు
చావుదెబ్బ కొట్టిన ఇరాన్.. రగిలిపోతున్న ట్రంప్!
హోమ్ గ్రౌండ్ లో 200 కూడా కాపాడలేకపోయిన రుతురాజ్!
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్
BR నాయుడును చూసి అబ్బా, కొడుకులు వణికిపోతున్నారు.. RK రోజా స్ట్రాంగ్ వార్నింగ్
BR నాయుడు రాజీనామా చేయడం లేదా..? చంద్రబాబు చెప్పడం లేదా..
రామాయణం బడ్జెట్ చూస్తే షాక్! ఆదిపురుష్, వారణాసితో పోల్చితే
లక్షల కోట్లు అప్పు.. డెవలప్ చేస్తున్నావా.. ముంచుతున్నావా?
అధికారమదంతో స్పీకర్ బరితెగింపు.. అయ్యన్నపాత్రుడిపై శివశంకర్ ఆగ్రహం
కామ నాయుడును కాపాడుతున్న చంద్రబాబు నాయుడు, BR నాయుడుని తొలగించాలని YSRCP పూజలు
దేవతల రాజధాని అమరావతిని చూడాలంటే 200 సంవత్సరాలు పడుతుంది


