భయపెడుతున్న ‘ప్లాష్ ఓవర్’.. స్విట్జర్లాండ్ ప్రమాదానికి కారణమిదే?
స్విట్జర్లాండ్ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం క్రాన్స్-మోంటానా స్కీ రిసార్ట్లోని ఓ లగ్జరీ బార్లో నూతన సంవత్సర వేడుకల సమయంలో జరిగిన భారీ పేలుడు గురించి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య 47కి చేరుకుంది. తొలుత ఉగ్రదాడి అయ్యి ఉండొచ్చనే ప్రచారం జరగ్గా.. అధికారులు ఆ కోణాన్ని తోసిపుచ్చారు. అయితే.. దర్యాప్తు అధికారులు ఇది ‘ఫ్లాష్ ఓవర్’ కారణంగా జరిగిన ప్రమాదం అయ్యి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లాష్ ఓవర్ అంటే ఏంటో అని ఆరా తీస్తున్నారు చాలా మంది. ఇక, ఇప్పటికే ఫ్లాష్ ఓవర్ కారణంగా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి.ప్లాష్ ఓవర్ అంటే.. అమెరికాకు చెందిన నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ (NFPA) ప్రకారం.. ఒక పరిమిత స్థలంలో వేడి వాయువులు గదిలో వ్యాప్తి చెంది.. వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఫ్లాష్ ఓవర్ సంభవిస్తుందని పేర్కొంది. ఈ కారణంగా ఆ గదిలో త్వరగా అంటుకునే స్వభావం ఉన్న వస్తువులు అన్నీ ఒకేసారి అగ్నిలో చిక్కుకుపోతాయి. ఆ ఫలితంగా.. మంటలు ఒక్కసారిగా వ్యాపించి ఎటూ తప్పించుకోవడానికి వీల్లేకుండా పోతుంది. అయితే.. ఫ్లాష్ఓవర్ అనేది అగ్ని ప్రమాదంలో అత్యంత ప్రమాదకరమైన దశ. కొన్ని సెకన్లలోనే మొత్తం గది మంటల్లో కూరుకుపోతుంది. ఇది సాధారణంగా 500–600°C వద్ద జరుగుతుంది. ఈ సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.ఈ ప్రక్రియలో మొదట ఒక వస్తువుకు మంటలు అంటుకుంటాయి. దాని వల్ల ఉత్పత్తి అయ్యే వేడి పొగ పైకప్పు దగ్గరకు చేరుతుంది. ఈ క్రమంలో పొర వేడెక్కి, గదిలోని ఇతర వస్తువులు ఆటో-ఇగ్నిషన్ ఉష్ణోగ్రతకు చేరుకుంటాయి. దీంతో, ఒక్కసారిగా మొత్తం గది మంటల్లో కూరుకుపోతుంది. సెకన్ల వ్యవధిలో మంటలు వ్యాపించి.. దహనం అయిపోతుంది. ఈ స్థితిలో అగ్నిమాపక శాఖ సిబ్బంది సైతం మంటలను అదుపు చేయలేరు.When this happened in America 23 yrs ago in Rhode Island, our National Institute of Standards and Technology (NIST) recreated the fire with the same polyurethane egg-crate foam and sparklers that ignited it.This is the video showing 1 minute to total flashover. Then, no escape. pic.twitter.com/T52qpPZf5g— Solvated Electron (@Solvatdelectron) January 1, 2026ఫ్లాష్ ఓవర్ గుర్తించే సంకేతాలుకాగా, ఫ్లాష్ ఓవర్ జరగబోయే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. అగ్నిమాపక సిబ్బంది వీటిని గుర్తించడం ద్వారా ప్రాణాపాయం తగ్గించుకోవచ్చు.పొగ రంగు: గాఢమైన నల్ల పొగ, వేగంగా కదిలే పొగ పొర.వేడి తీవ్రత: గదిలో వేడి ఒక్కసారిగా పెరగడం, నేలస్థాయిలో కూడా వేడి తీవ్రంగా అనిపించడం.పొగ పొర కదలిక: పైకప్పు దగ్గర పొగ పొర కిందికి దిగుతూ, వేగంగా కదలడం.ఫైర్ బిహేవియర్: వస్తువులు ఇంకా మంటలు అంటుకోకపోయినా, వేడి వల్ల వాటి ఉపరితలాలు కాంతివంతంగా కనిపించడం.రేడియంట్ హీట్: గదిలో నిలబడలేని స్థాయిలో వేడి ప్రవాహం (సుమారు 20 kW/m²).నివారణ చర్యలుఫ్లాష్ ఓవర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అగ్నిమాపక సిబ్బంది భవన రూపకర్తలు ఇలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.వెంటిలేషన్ నియంత్రణ: గదిలో ఆక్సిజన్ ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా మంటల విస్తరణను తగ్గించడం.కూలింగ్ వాటర్ స్ప్రే: పైకప్పు పొగ పొరపై నీటిని స్ప్రే చేయడం ద్వారా ఉష్ణోగ్రత తగ్గించడం.ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్: భవన నిర్మాణంలో అగ్ని నిరోధక పదార్థాలను ఉపయోగించడం.ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్: భవనంలో పొగ డిటెక్టర్లు, హీట్ సెన్సర్లు వాడటం.ఫైర్ఫైటర్ ట్రైనింగ్: ఫ్లాష్ఓవర్ సంకేతాలను గుర్తించే శిక్షణ ఇవ్వడం.ముఖ్యమైన గత ప్రమాదాలు ఇవే..1923: టోక్యో, జపాన్: భూకంపం తర్వాత మంటలు విస్తరించి నగరం మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.1964: తమిళనాడులోని మదురై స్కూల్ అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోయారు.1997: ఢిల్లీలోని ఉపహార్ సినిమా హాల్లో ఒక్కసారిగా మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదంలో 59 మంది మరణించారు.2004: తమిళనాడులోని కుంబకోణం పాఠశాలలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 90కి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.2024: గుజరాత్లోని రాజ్కోట్ టీఆర్పీ గేమింగ్ జోన్లో మంటలు విస్తరించి 33 మంది మరణించారు. వీరిలో 9 మంది చిన్నారులు.2025: ఢిల్లీలోని వివేక్ విహార్లోని న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు శిశువులు మరణించారు.2026: స్విట్జర్లాండ్లోని క్రాన్స్-మోంటానా బార్లో ప్రమాదం. 47 మంది మరణించారు.
తారా స్థాయికి చేరిన ‘Gen Z’ ఉద్యమం.. యుద్ధం తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి ప్రాణాల్ని అన్యాయంగా తీసుకుంటుంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. నిరసనకారులపై బలప్రయోగం చేయొద్దు. వారిని చంపితే ఇరాన్పై యుద్ధం చేస్తామంటూ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. ఇరాన్లో జెన్జీ (Gen Z) ఉద్యమం తారాస్థాయికి చేరింది. అక్కడి యువత ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రియాల్ కరెన్సీ పతనం కారణంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు గత వారం టెహ్రాన్లో ప్రారంభమై కొన్ని గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ క్రమంలో ఆందోళన కారుల్ని అరికట్టేందుకు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇరాన్ తీరుపై ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇరాన్ ప్రజలపై దాడులు కొనసాగితే, అమెరికా మౌనంగా ఉండదు. మేం సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్ అన్నారు. అంతేకాదు నిరసన కారులను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.2022 తర్వాత తొలిసారి ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుండడం, రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడం, అనైతిక చట్టాల అమలుతో పాటు పలు అంశాలపై ఇరాన్లోని టెహ్రాన్తో పాటు పలు ప్రోవిన్స్ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసన కారుల్ని అణిచి వేసేందుకు కాల్పులకు తెగబడుతోంది. ఫలితంగా ఐదురోజుల వ్యవధిలో సుమారు ఏడుగురికి పైగా ప్రాణాలు కోల్పోయారు. If Iran shots and violently kills peaceful protesters, which is their custom, the United States of America will come to their rescue. We are locked and loaded and ready to go. Thank you for your attention to this matter! President DONALD J.TRUMP(TS: 02 Jan 02:58 ET)…— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) January 2, 2026
టీమిండియా కోచ్ పదవి ఆఫర్.. సున్నితంగా తిరస్కరించిన పాక్ మాజీ కోచ్..!
టీమిండియా హెడ్ కోచ్ పదవి ఆఫర్పై పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జేసన్ గిల్లెస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్లో ఓ పాకిస్తాన్ సోషల్ మీడియా యూజర్ గిల్లెస్పీని టీమిండియా కోచ్గా వ్యవహరించమని అడిగాడు. ఏడాది వ్యవధిలో భారత జట్టు స్వదేశంలోనే రెండు సార్లు (టెస్ట్ల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో) వైట్ వాష్ అయ్యిందని.. ఈ పరిస్థితుల్లో టీమండియాకు నీ సేవలు అవసరమని సదరు యూజర్ గిల్లెస్పీకి వ్యంగ్యంగా ఆఫర్ చేశాడు. ఈ ఆఫర్ను గిల్లెస్పీ సున్నితంగా తిరస్కరించాడు. 'నో థ్యాంక్స్' అంటూ రెండు ముక్కల్లో తన అభిమతాన్ని బయటపెట్టాడు. పాకిస్తానీ ఎక్స్ యూజర్-గిల్లెస్పీ మధ్య ఈ సంభాషణ సోషల్మీడియాలో వైరలవుతుంది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐకి పాకిస్తాన్ కోచ్గా పని చేసిన వారికి టీమిండియా హెడ్ కోచ్ పదవి ఇచ్చేంత కర్మ పట్టలేదని అంటున్నారు. వాస్తవానికి గిల్లెస్పీకి టీమిండియా హెడ్ కోచ్ అయ్యేంత సీన్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదన చేసిన పాక్ ఎక్స్ యూజర్ను చెడుగుడు ఆడుకుంటున్నారు.ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై గత కొద్ది రోజులుగా సోషల్మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. గంభీర్ను భారత టెస్ట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తొలగించనున్నారని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేశారు. అయితే ఈ అంశంపై బీసీసీఐ స్పష్టమైన వివరణ ఇచ్చింది. గంభీర్ మూడు ఫార్మాట్లలో టీమిండియా హెడ్ కోచ్గా కొనసాగుతాడని స్పష్టం చేసింది.వాస్తవానికి గంభీర్పై దుష్ప్రచారాని కారణాలు లేకపోలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను టీమిండియాను విజయవంతంగా నడిపిస్తున్నా, టెస్ట్ల్లో మాత్రం తేలిపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలొ క్లీన్ స్వీప్తో (0-3)మొదలైన గంభీర్ టెస్ట్ ప్రస్తానం.. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ (0-2) వరకు సాగింది.ఈ మధ్యలో గంభీర్ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్ పర్యటనలో 1-3తో సిరీస్ కోల్పోయి, ఇంగ్లండ్ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది. ఇంత దారుణమైన ట్రాక్ ఉంటే సహజంగానే ఏ కోచ్పై అయినా వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం గంభీర్ కూడా ఇదే ఎదుర్కొంటున్నాడు. అయితే బీసీసీఐ నుంచి అతనికి కావాల్సినంత మద్దతు లభిస్తుంది.గిల్లెస్పీ విషయానికొస్తే.. ఈ ఆసీస్ మాజీ ఆటగాడు 2024 ఏప్రిల్లో పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు. ఆతర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయాల కారణంగా కొంతకాలంలోనే (2024 డిసెంబర్) ఆ పదవికి రాజీనామా చేశాడు. గిల్లెస్పీ జమానాలో పాక్ బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడింది. గిల్లెస్పీ తాజాగా పీసీబీ బాస్ మొహిసిన్ నఖ్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. నఖ్వీ తనను అవమానించాడని బాహాటంగా ప్రకటన చేశాడు.
ఆరోగ్యానికి అసలైనదే.. ఇక నకిలీ ఉత్పత్తులకు చెక్!
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియునిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
తారా స్థాయికి చేరిన ‘Gen Z’ ఉద్యమం.. యుద్ధం తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
దుబాయ్లో గ్రాండ్గా తల్లి బర్త్డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్
‘మాటలే కోటలు దాటుతున్నాయ్.. చేతలు మాత్రం ఇళ్లు దాటడం లేదు’
జల వివాదం పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ
ప్రభాస్ ది రాజాసాబ్.. ఎవరికెంత రెమ్యునరేషన్..!
"చెడగొడితే రిప్లై ఇలానే ఉంటుంది"
తిరుపతి: జల్లికట్టులో అపశ్రుతి..
కల్యాణి కంటే ముందు ఆ హీరోయిన్కు 'లోక' ఆఫర్!
ఆర్యా.ఏజీకి జీఈఎఫ్ క్యాపిటల్ నుంచి రూ.725 కోట్ల పెట్టుబడి
'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్
తవ్వకాల్లో 500 ఏళ్ల ఓడ.. బంగారం ఎంతుందంటే..!
ఎంతో బాధపెట్టా.. ఇకపై ఏ కష్టం రానివ్వనని మాటిస్తున్నా!
కట్టల కొద్దీ నగదు... సూట్కేస్ నిండా నగలు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుంటే.. ఇంకా ఏమీ చేయడం లేదని అంటారేంటయ్యా!
అమ్మనాన్న విడాకులు.. రాధికనే కారణమని తిట్టుకున్నా: వరలక్ష్మి
‘హ్యాపీ న్యూ ఇయర్’
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
ఈ రాశి వారికి వృత్తులు, వ్యాపారాలలో పురోగతి
వారి కలయికతో చిక్కుల్లో ఆర్మీ చీఫ్ మునీర్..!
అసలు మన పార్టీని గుర్తిస్తే కదా వివరాలు చెప్పడానికి..!
సంక్షేమ హాస్టళ్లలో 45 మంది విద్యార్ధుల మృతి
అసలు మనం ఇప్పటివరకూ తేడాలు లేకుండా జాబితానే తయారు చేయలేద్సార్!
యూట్యూబర్ అన్వేష్పై కేసు నమోదు
రెండు లక్షలమంది కొన్న కారు ఇది
బ్యాంక్కు కన్నమేసి భారీ చోరీ
రోడ్డునపడ్డ బతుకులు
2026: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్
ఎయిరిండియా పైలట్ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు
‘సైక్ సిద్ధార్థ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
తారా స్థాయికి చేరిన ‘Gen Z’ ఉద్యమం.. యుద్ధం తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
దుబాయ్లో గ్రాండ్గా తల్లి బర్త్డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్
‘మాటలే కోటలు దాటుతున్నాయ్.. చేతలు మాత్రం ఇళ్లు దాటడం లేదు’
జల వివాదం పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ
ప్రభాస్ ది రాజాసాబ్.. ఎవరికెంత రెమ్యునరేషన్..!
"చెడగొడితే రిప్లై ఇలానే ఉంటుంది"
తిరుపతి: జల్లికట్టులో అపశ్రుతి..
కల్యాణి కంటే ముందు ఆ హీరోయిన్కు 'లోక' ఆఫర్!
ఆర్యా.ఏజీకి జీఈఎఫ్ క్యాపిటల్ నుంచి రూ.725 కోట్ల పెట్టుబడి
'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్
తవ్వకాల్లో 500 ఏళ్ల ఓడ.. బంగారం ఎంతుందంటే..!
ఎంతో బాధపెట్టా.. ఇకపై ఏ కష్టం రానివ్వనని మాటిస్తున్నా!
కట్టల కొద్దీ నగదు... సూట్కేస్ నిండా నగలు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుంటే.. ఇంకా ఏమీ చేయడం లేదని అంటారేంటయ్యా!
అమ్మనాన్న విడాకులు.. రాధికనే కారణమని తిట్టుకున్నా: వరలక్ష్మి
‘హ్యాపీ న్యూ ఇయర్’
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
ఈ రాశి వారికి వృత్తులు, వ్యాపారాలలో పురోగతి
వారి కలయికతో చిక్కుల్లో ఆర్మీ చీఫ్ మునీర్..!
అసలు మన పార్టీని గుర్తిస్తే కదా వివరాలు చెప్పడానికి..!
సంక్షేమ హాస్టళ్లలో 45 మంది విద్యార్ధుల మృతి
అసలు మనం ఇప్పటివరకూ తేడాలు లేకుండా జాబితానే తయారు చేయలేద్సార్!
యూట్యూబర్ అన్వేష్పై కేసు నమోదు
రెండు లక్షలమంది కొన్న కారు ఇది
బ్యాంక్కు కన్నమేసి భారీ చోరీ
రోడ్డునపడ్డ బతుకులు
2026: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్
ఎయిరిండియా పైలట్ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు
‘సైక్ సిద్ధార్థ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఫొటోలు
నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)
కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)
హైదరాబాద్ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్
కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్ (ఫోటోలు)
కొత్త ఏడాది జోష్..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)
న్యూ ఇయర్ ఎఫెక్ట్: బిర్లా మందిర్కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)
కొత్త ఏడాది సెలబ్రేషన్స్లో మహేష్ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
బీచ్లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
సినిమా
'రంగస్థలం'లో ఆ పాట సుకుమార్కి నచ్చలేదు.. ఎవరూ ఏడవకపోవడంతో
'రంగస్థలం'.. రామ్ చరణ్ కెరీర్లో మైలురాయి లాంటి సినిమా. అప్పటివరకు ఉన్న ఇమేజీని ఒక్కసారిగా మార్చేసింది. ఎంత మంచి నటుడో అందరికీ తెలిసేలా చేసింది. ఈ మూవీలో క్లైమాక్స్ ముందొచ్చే 'ఒరయ్యో' అనే సాంగ్.. ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకునేలా చేసింది. అయితే ఈ పాట, దర్శకుడు సుకుమార్కి తొలుత అస్సలు నచ్చలేదట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రచయిత చంద్రబోస్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ గీతం వెనకున్న గమ్మత్తయిన సంఘటనల్ని బయటపెట్టారు.''రంగస్థలం' కోసం నాలుగు రోజుల్లో నాలుగు పాటలు సిద్ధం చేశాం. సుకుమార్ మరో పాట కూడా కావాలనేసరికి.. ఇంత వేగంగా వద్దులేండి. మళ్లీ దిష్టి తగులుతుందేమో అని ఆయనతో అన్నాను. లేదు రాయాల్సిందే అని చెప్పడంతో 'ఒరయ్యో..' పాట రాశాను. ఇది మొదట్లో సుకుమార్కి నచ్చలేదు. ఈ విషయాన్ని నాకు తెలియనివ్వలేదు. అప్పటికే షూటింగ్ దగ్గర పడింది. దీంతో పాటలో సీన్స్ తీస్తున్నప్పుడు విషాద వాతావరణం ఉండటం కోసం తమిళ, మలయాళ పాటల్ని ప్లే చేశారు. కానీ సెట్లో ఒక్కరు కూడా ఏడవలేదు. పైపెచ్చు నవ్వుకున్నారు. ఎంతకీ ఎమోషన్ రాకపోయేసరికి చివరగా 'ఒరయ్యో..' పాట పల్లవిని ప్లే చేశారు. దీంతో అందరికీ దుఖం పొంగుకొచ్చింది. సుకుమార్కి ఈ పాటలో విషయం ఉందనేది అర్థమైంది' అని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: పిల్లల్ని కనాలనే ఆలోచన నాకు లేదు: వరలక్ష్మి శరత్ కుమార్)'షూటింగ్ చేస్తున్నప్పుడు పల్లవితో మేనేజ్ చేశాం. అయితే పాటంతా రాయడం పూర్తి చేసిన తర్వాత దేవి, సుకుమార్కి వినిపించా. ఆ టైంలోనే దేవి తండ్రి, సుకుమార్ తండ్రి చనిపోయారు. దీంతో పాటలో పల్లవి, చరణాలు వినిపిస్తున్నప్పుడు ప్రతిఒక్కరం ఎమోషనల్ అయ్యాం. చివరగా దేవి.. ఈ పాట నన్నే పాడమని అన్నాడు. వద్దులేండి ఎవరైనా ప్రొఫెషనల్ సింగర్తో పాడించండి అని చెప్పా. లేదు మీ వాయిస్ బాగుంటుందని నాతో పాడించాడు. 45 నిమిషాల్లో ఈ పాట పాడేశాను. తర్వాత ఇంత తర్వగా పాడటం పూర్తి చేశానేంటి అని ఆశ్చర్యపోయాను' అని చంద్రబోస్ అప్పటి అనుభవాన్ని బయటపెట్టారు.పాట సందర్భం విషయానికొస్తే.. అప్పటివరకు చిట్టిబాబు(రామ్ చరణ్), కుమార్ బాబు(ఆది పినిశెట్టి) సరదాగా ఉంటారు. సడన్గా కుమార్ బాబు పాత్ర చనిపోతుంది. సరిగ్గా అప్పుడు ఈ గీతం వస్తుంది. 'ఈ సేతితోనే పాలు పట్టాను.. ఈ సేతితోనే బువ్వ పెట్టాను.. ఈ సేతితోనే తలకు పోశాను.. ఈ సేతితోనే కాళ్లు పిసికాను.. ఈ సేతితోనే పాడే మొయ్యాలా.. ఈ సేతితోనే కొరివి పెట్టాలా.. ఓరయ్యో.. నా అయ్యా..' అనే లిరిక్స్తో సాంగ్ ఉంటుంది. సినిమా హిట్ విషయంలో చరణ్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ ఎలాంటి పాత్ర పోషించాయో.. ఈ గీతం కూడా అంతే ప్లస్ అయిందని చెప్పొచ్చు. అలాంటి పాట సుకుమార్కి మొదట నచ్చలేదని చంద్రబోస్ చెప్పడం ఆసక్తికకరంగా అనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆది పినిశెట్టి' కొత్త సినిమా.. నెలలోనే స్ట్రీమింగ్)
మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు.. ఫ్యాన్స్కు బిగ్ అప్డేట్
మెగాస్టార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్తో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. మనశంకర వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈనెల 4న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అఫీషియల్గా వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ పోస్టర్ను పంచుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో హిట్ కోసం రెడీ అయిపోయారు. ఈ చిత్రంలో వెంకీమామ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి వస్తోన్న మనశంకర వరప్రసాద్లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది.The much-awaited announcement everyone has been waiting for is finally here💥#ManaShankaraVaraPrasadGaru TRAILER ON JANUARY 4th ❤️🔥#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.#MSGonJan12thMegastar @KChiruTweets Victory @VenkyMama @AnilRavipudi #Nayanthara… pic.twitter.com/5yW8TkN9ut— Shine Screens (@Shine_Screens) January 2, 2026
అందుకే ‘రాజాసాబ్’ ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు: మారుతి
ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’ మరో వారం రోజుల్లో(జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానని దర్శకుడు మారుతి ముందే హామీ ఇచ్చారు. తేడా వస్తే..ఇంటికొచ్చి అడగొచ్చు అంటూ అడ్రస్ కూడా చెప్పాడు. మారుతి(Director Maruthi) ఇలాంటి ప్రకటనలు చేయడం వెనక ఓ కారణం ఉంది. ఆయన ప్రభాస్తో సినిమా ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు మారుతి అలాంటి ప్రకటనలు చేశాడు. అయినా కూడా ఇండస్ట్రీలో కొంతమంది ది రాజాసాబ్(The Raja Saab) ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే విషయాన్ని మారుతి దగ్గర ప్రస్తావిస్తూ.. వాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మారుతి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కొంతమంది జెలసీతోనే అలా కోరుకుంటున్నారని.. వారికి తన సినిమాతోనే సరైన సమాధానం చెబుతానన్నారు.‘ఈర్ష్య, అసూయ మానవ నైజం. నాకు భారీ హిట్ పడితే.. ఎక్కడ బిజీ అయిపోతాడేమోననే భయంతో కొంతమంది అలా కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు చిన్న చిన్న సినిమాల ఈవెంట్స్కి కూడా వెళ్తున్నాను. రాజాసాబ్ హిట్ అయితే.. ఇలాంటి ఈవెంట్లకు రానేమో అని వాళ్లు భయపడుతున్నారు. నాకు ఫెయిల్యూర్ వస్తే.. వాళ్లకు అది ఫుడ్ పెట్టదు. కానీ జెలసీతో అలా కోరుకుంటున్నారు. ఈసారి కిందపడితే కొన్నాళ్ల పాటు కోలుకోలేడని వాళ్లు అనుకుంటున్నారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. హిట్ వచ్చినా..ఫ్లాప్ వచ్చిన మరో సినిమా తీస్తా. ప్రభాస్తో సినిమా తీశా కదా అని ఇకపై పెద్ద సినిమాలు మాత్రమే తీయాలనే కోరికలు నాకు లేదు. రాజాసాబ్ తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీసేస్తా. నా కథకి ఏ హీరో సెట్ అయితే ఆ హీరోతో వెళ్లిపోతా. బిజీగా ఉండాలని మాత్రమే కోరుకుంటా’ అని మారుతి చెప్పుకొచ్చాడు.
ప్రేయసిని పరిచయం చేసిన 'షణ్ముఖ్ జశ్వంత్'
షణ్ముఖ్ జశ్వంత్.. ఈ పేరు ఒకప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్. పలు వెబ్ సిరీస్లతో పాటు కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ ద్వారా బాగా క్లిక్కయ్యాడు. దీంతో టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్న సమయంలోనే బిగ్బాస్ ఆఫర్ వచ్చింది. అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న ఇతడు బిగ్బాస్లో మాత్రం సిరి హన్మంత్తో లవ్ ట్రాక్ నడిపాడు. దీంతో ఇతడిపై విపరీతమైన నెగెటివిటీ రావడంతో లవ్కు బ్రేకప్ చెప్పాడు. అయితే, ఇప్పుడు తన కొత్త ప్రేయసిని తన అభిమానులకు పరిచయం చేశాడు.బిగ్బాస్ తర్వాత కూడా షణ్ముఖ్ అనేక వివాదాలు చుట్టూ తిరిగాడు. అతనిపై ఏకంగా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. ఆపై యాక్సిడెంట్ వంటి వివాదంతో వార్తల్లో నిలిచాడు. అయినప్పటికీ మళ్లీ వెబ్ సిరీస్లు, సినిమాలపై దృష్టి పెట్టి తన కెరీర్ను గాడిలో పడిలే చేసుకున్నాడు. ఇక తాజాగా కొత్త ఏడాది సందర్భంగా షణ్ముఖ్ తన ప్రేయసిని పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియాలో తన ఫోటోలను పంచుకున్నాడు. కానీ, ఆమె ముఖం కనిపించకుండా తనతో దిగిన పలు ఫోటోలను షేర్ చేశాడు. 'Happy Birthday V… This is Gods plan' అంటూ ఒక అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఆ యువతి పేరు ‘V’ అనే అక్షరంతో ప్రారంభమవుతుందన్న క్లూ ఇచ్చాడు. అయితే, ఆమె ఎవరో అనేది మాత్రం ప్రస్తుతానికి వెళ్లడించలేదు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)
క్రీడలు
‘యాషెస్’ ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ ప్లేయింగ్ XII
యాషెస్ 2025-26 సిరీస్లో వరుస పరాజయాల తర్వాత బాక్సింగ్ డే టెస్టు గెలుపు రూపంలో ఇంగ్లండ్కు ఊరట దక్కింది. ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ కైవసం చేసుకున్నప్పటికీ.. నాలుగో టెస్టులో గెలవడం ద్వారా స్టోక్స్ బృందం వైట్వాష్ గండం నుంచి ముందుగానే గట్టెక్కింది.ఇక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జనవరి 4 నుంచి మొదలయ్యే ఐదో టెస్టులోనూ గెలిచి సిరీస్ను విజయంతో ముగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో యాషెస్ తాజా ఎడిషన్లో చివరి టెస్టుకు తమ ప్లేయింగ్ XIIను ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది.విల్ జాక్స్తో పోటీఈ జట్టులో ఎట్టకేలకు స్పిన్నర్ షోయబ్ బషీర్ (Shoaib Bashir) చోటు దక్కించుకున్నాడు. ఆల్రౌండర్ విల్ జాక్స్తో పోటీ నెలకొన్న తరుణంలో ప్రస్తుతానికి 12వ ఆటగాడిగా ఉన్న బషీర్.. తుదిజట్టులో ఉంటాడా? లేదా? అనేది మ్యాచ్ రోజు తేలనుంది. మరోవైపు.. ప్రధాన జట్టులో ఉన్నా ఇప్పటి వరకు ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన మాథ్యూ పాట్స్ (Matthew Potts)కు ఈసారి స్థానం దక్కింది.పాట్స్ రీఎంట్రీగాయం కారణంగా గస్ అట్కిన్సన్ దూరం కాగా.. అడిలైడ్లో జరిగిన మూడో టెస్టు తర్వాత జోఫ్రా ఆర్చర్ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. ఇక మార్క్వుడ్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఈ ముగ్గురి గైర్హాజరీ పాట్స్ పాలిట వరంగా మారింది. డిసెంబరు 2024లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడిన ఈ పేస్ బౌలర్ యాషెస్ చివరి టెస్టుతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గట్కిన్సన్ రీప్లేస్మెంట్గా అతడు తుదిజట్టులోకి వచ్చాడు.ఆస్ట్రేలియాతో యాషెస్ 2025-26 చివరి టెస్టు ఇంగ్లండ్ ప్లేయింగ్ XIIబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్.అదే జట్టుమరోవైపు.. సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్ చివరి టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టులో ఏ మార్పు చేయలేదు. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆసీస్ 3–1తో సొంతం చేసుకోగా... ఆఖరిదైన ఐదో టెస్టు ఆదివారం సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. దీని కోసం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.గత మ్యాచ్లో ఓడినప్పటికీ అదే జట్టును కొనసాగిస్తోంది. స్టీవ్ స్మిత్ జట్టుకు సారథ్యం వహించనుండగా... ఆసీస్ బృందం గురువారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. తొలి మూడు మ్యాచ్ల్లో సంపూర్ణ ఆధిపత్యంతో ఇంగ్లండ్ను చిత్తుచేసి సిరీస్ నిలబెట్టుకున్న ఆతిథ్య ఆసీస్... నాలుగో టెస్టులో పరాజయం పాలైంది. దీంతో ఇంగ్లండ్ జట్టు పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గింది. పూర్తిగా పేసర్లకు సహకరించిన మెల్బోర్న్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో... సిడ్నీలో ఐదో టెస్టుకు ఎలాంటి పిచ్ సిద్ధం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే
2026కు అదిరిపోయే ఆరంభం.. ఏడాది తొలి మ్యాచ్లోనే ఆసక్తికర ఫలితం
క్రికెట్కు సంబంధించి 2026 సంవత్సరానికి అదిరిపోయే ఆరంభం లభించింది. ఏడాది తొలి మ్యాచ్లోనే ఆసక్తికర ఫలితం వచ్చింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగి, సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. సూపర్ ఓవర్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ పైచేయి సాధించింది.ఈ మధ్యలో హైడ్రామా చోటు చేసుకుంది. జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆటగాడు డొనొవన్ ఫెరియెరా (డాన్) ఆల్రౌండ్ షోతో అదరగొట్టి, ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఆల్రౌండ్ షో అంటే బ్యాటింగ్, బౌలింగ్ మత్రమే కాదు వికెట్కీపింగ్ కూడా.తొలుత బ్యాటింగ్లో సుడిగాలి ఇన్నింగ్స్ (10 బంతుల్లో 33 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) ఆడిన డాన్.. ఆతర్వాత బౌలింగ్లో (4-0-24-1), ఆఖర్లో వికెట్ కీపింగ్లో (చివరి బంతికి ఒక పరుగు చేస్తే ప్రత్యర్ది గెలిచే సమయంలో అద్భుతమైన రనౌట్ చేశాడు) అదరగొట్టి ఓడిపోవాల్సిన మ్యాచ్ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లాడు. సూపర్ ఓవర్లో రిలీ రొస్సో అద్భుతంగా బ్యాటింగ్ చేసి సూపర్ కింగ్స్ను గెలిపించాడు.పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. డివిలియర్స్ (38), డుప్లెసిస్ (47), శుభమ్ రంజనే (50 నాటౌట్), డొనొవన్ ఫెరియెరా (33 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. డర్బన్ బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-12-3) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హార్మర్ (4-0-22-1) కూడా పర్వాలేదనిపించాడు.అనంతరం 206 పరుగుల లక్ష్య ఛేదనలో డర్బన్ జట్టు చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాడింది. చివరి బంతికి ఒక్క పరుగు చేస్తే గెలుస్తుందన్న తరుణంలో డాన్ మ్యాజిక్ రనౌట్ చేసి మ్యాచ్ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లాడు. ముల్దర్ బౌలింగ్లో బ్యాటింగ్ చేసిన హార్మర్ బంతిని కట్ చేసే క్రమంలో మిస్ అయ్యాడు. అయినా పరుగుకు ప్రయత్నించగా.. అప్పుడు వికెట్కీపింగ్ చేస్తున్న డాన్ అద్భుతమైన రీతిలో బాష్ను రనౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది.సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ వికెట్ కోల్పోయి 5 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్లీసన్ అద్బుతంగా బౌలింగ్ చేసి డర్బన్ బ్యాటర్లు జోస్ బట్లర్, ఆరోన్ జోన్స్ను కట్టడి చేశాడు. 6 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రిలీ రొస్సో 3 బంతుల్లో 2 బౌండరీలు బాది సూపర్ కింగ్స్ను గెలిపించాడు.
KKR: అతడొక ద్రోహి.. బీసీసీఐ స్పందన ఇదే
ప్రపంచంలోనే మేటి టీ20 లీగ్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొనసాగుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఈ టోర్నమెంట్ కారణంగా ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు.కేవలం భారత్కు చెందిన ఆటగాళ్లే కాకుండా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్ ద్వారా భారీ స్థాయిలో సంపాదించడంతో పాటు పేరు తెచ్చుకుంటున్నారు కూడా!ఐపీఎల్ ఆడకుండా నిషేధంఅయితే, ఆరంభంలో పాకిస్తాన్ ప్లేయర్లు సైతం క్యాష్ రిచ్ లీగ్లో ఆడేవారు. వసీం అక్రం, షోయబ్ అక్తర్, మిస్బా ఉల్ హక్, ఉమర్ గుల్, కమ్రాన్ అక్మల్, షోయబ్ మాలిక్, సొహైల్ తన్వీర్ వంటి వాళ్లు ఆరంభ సీజన్లో ఆడారు. అయితే, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2009 నుంచి పాక్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించింది బీసీసీఐ.తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్లకు సైతం ఇదే దుస్థితి కలిగే అవకాశం ఉంది. భారత్ నుంచి ఎల్లవేళలా మద్దతు, సాయం పొందిన బంగ్లాదేశ్ కొన్నాళ్లుగా విచిత్ర పోకడలకు పోతోంది. ఆ దేశంలోని కొంతమంది నేతలు భారత్ను విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లా ప్లేయర్లను నిషేధించాలనే డిమాండ్లుఈ క్రమంలో బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నలుగురు హిందువులు దారుణ హత్యకు గురైనట్లు వార్తలు వచ్చాయి.ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్లను నిషేధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కాగా ఐపీఎల్-2026 మినీ వేలంలో ఐదు నుంచి ఆరుగురు క్రికెటర్లు పేరు నమోదు చేసుకోగా.. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ మాత్రమే అమ్ముడుపోయాడు. షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్కతా నైట్ రైడర్స్ అతడిని రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.అతడొక ద్రోహి..ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేత సంగీత్ సింగ్ సోమ్ షారుఖ్ ఖాన్పై విమర్శలు గుప్పించారు. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశ్కు చెందిన ప్లేయర్ను కొన్న షారుఖ్ను ద్రోహిగా అభివర్ణించారు. ఈ క్రమంలో ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ ఆయనకు కొంతమంది మద్దతు తెలపగా..కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించారు.బీసీసీఐ స్పందన ఇదేఅంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రమాణాలకు అనుగుణంగా బీసీసీఐ ఈ లీగ్ను నిర్వహిస్తోందని.. ఇందులో రాజకీయ జోక్యం అనవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఈ పరిణామాలపై స్పందించారు. ఇన్సైడ్ స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ శత్రు దేశమేమీ కాదు. ఇప్పటికైతే బంగ్లాదేశ్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాల్సిన అవసరం కనబడటం లేదు’’ అని పేర్కొన్నారు. కాబట్టి ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఈ ఏడాది ఐపీఎల్ బరిలో దిగే అవకాశం ఉంది.ఎలాంటి ఆదేశాలు రాలేదుమరోవైపు బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా IANSతో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో మేము పెద్దగా స్పందించాలనుకోవడం లేదు. మా చేతుల్లో ఏమీ లేదు. అయితే, బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి నిషేధించే అంశమై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేము’’ అని పేర్కొన్నాయి. చదవండి: న్యూజిలాండ్తో వన్డేలకు భారత జట్టు ఇదే!.. వాళ్లిద్దరికి మొండిచేయి!
అర్జున్ టెండుల్కర్ గొప్ప బ్యాటర్.. అచ్చం సచిన్లాగే!
భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. చిన్ననాటి నుంచే తన కుమారుడికి కఠిన శిక్షణ ఇచ్చి మేటి క్రికెటర్గా తీర్చిదిద్దాదని చెప్పే యోగ్రాజ్.. తన స్వభావం వల్ల యువీ తల్లితో తాను ఎలా విడిపోయాడో కూడా పలు సందర్భాల్లో వెల్లడించాడు.తాజాగా.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) గురించి యోగ్రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అర్జున్ తండ్రి మాదిరే గొప్పగా బ్యాటింగ్ చేస్తాడని కితాబులిచ్చాడు. బౌలర్ కంటే బ్యాటర్గానే అర్జున్ ఉత్తమంగా రాణించగలడని పేర్కొన్నాడు.నిజానికి అతడొక బ్యాటర్‘‘అందరూ అర్జున్ టెండుల్కర్ బౌలింగ్ మీదే ఎందుకు దృష్టి పెడతారు?.. నిజానికి అతడొక బ్యాటర్. రంజీ ట్రోఫీకి ముందు సచిన్, యువరాజ్... అర్జున్కు శిక్షణ ఇవ్వమని నన్ను అభ్యర్థించారు. అపుడు 10-12 రోజుల పాటు అర్జున్కు కోచింగ్ ఇచ్చాను. అర్జున్ జాగ్రత్తగా చూసుకోమని సచిన్, యువీ చెప్పారు.కానీ ఓ రోజు అతడికి గట్టిగా దెబ్బ తగిలింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాము. తను కోలుకున్నాడు. ఈ క్రమంలో ఓరోజు నేను అర్జున్తో బ్యాటింగ్ చేయమని చెప్పాడు. కానీ అతడు అందుకు సుముఖంగా లేడు. అయితే, నేను మాత్రం ‘నీ బ్యాటింగ్ చూడాల్సిందే’ అని పట్టుబట్టాను.ఫోర్లు, సిక్సర్లు బాదాడుదీంతో అతడు బ్యాటింగ్ మొదలుపెట్టాడు. నెట్స్లో ఫోర్లు, సిక్సర్లు బాదాడు. అప్పుడు నేను అర్జున్ కోచ్తో మాట్లాడాను. ‘ఇంతబాగా బ్యాటింగ్ చేస్తున్నాడు? మరెందుకని అతడితో కేవలం బౌలింగే ప్రాక్టీస్ చేయిస్తున్నారు? బ్యాటర్గా అతడిలో మంచి నైపుణ్యం ఉంది. తండ్రి మాదిరే అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు’ అని అన్నాను.అర్జున్తో రోజూ కనీసం 2-3 గంటలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించమని చెప్పాను. అన్నట్లుగానే రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే అర్జున్ సెంచరీ బాదాడు’’ అని యోగ్రాజ్ సింగ్.. రవి బిస్త్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా యోగ్రాజ్ చెప్పినట్లుగా 2022-23 సీజన్లో రంజీల్లో అడుగుపెట్టిన అర్జున్.. ఏడో స్థానంలో వచ్చి 207 బంతుల్లో 120 పరుగులు సాధించాడు.ఓపెనర్గానూఅదే మ్యాచ్లో కొత్త బంతితో బౌలింగ్కు దిగిన అర్జున్.. మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే, ఆ తర్వాత క్రమంగా ముంబై జట్టులో చోటు కోల్పోయిన అతడు.. గోవాతో జట్టుకట్టాడు. ఇటీవల గోవా తరఫున ఓపెనర్గానూ అర్జున్ బరిలోకి దిగాడు. అయితే, ఇప్పటికి వరకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో 620 పరుగులు చేసి.. 48 వికెట్లు పడగొట్టిన అర్జున్.. లిస్ట్-ఎ, టీ20 క్రికెట్లో 25, 35 వికెట్లు పడగొట్టాడు.సచిన్తో పోలికా?.. మతి చెడిందా?కాగా లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన అర్జున్ నైపుణ్యం గల ఆటగాడే. అయితే, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్తో పోల్చడం ఎంతమాత్రం సరికాదని అభిమానులు యోగ్రాజ్ మాటలను ఖండిస్తున్నారు. యోగ్రాజ్కు మతి చెలించిందంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు, శతక శతకాలు సాధించిన సచిన్ చెక్కుచెదరని ఈ రెండు రికార్డులను తన ఖాతాలో కొనసాగిస్తూనే ఉన్నాడు.చదవండి: పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో అత్యంత అధ్వానంగా మారిన ‘108’ నెట్వర్క్ నిర్వహణ... అంబులెన్స్ సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న బాధితులు
2026కు ఘన స్వాగతం పలికిన విశ్వమానవాళి... ఆనందోత్సాహాల నడుమ న్యూ ఇయర్ వేడుకలు
ఆంధ్రప్రదేశ్లో ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని నీరుగార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో బాదుడే బాదుడు...ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం...
పార్కుల ముసుగులో చంద్రబాబు పందేరం.. ఆంధ్రప్రదేశ్లో దళితుల భూముల్లో ‘ప్రైవేట్’ దందా!
అభాగ్యులతో చంద్రబాబు సర్కారు చలగాటం... 19 నెలలుగా కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వని ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
బిజినెస్
యాప్ లేదు, ఛార్జ్ లేదు: ఫ్రీ కాల్స్..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. నూతన సంవత్సరం సందర్భంగా.. భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్లలో వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) లేదా వై-ఫై కాలింగ్ సర్వీస్ ప్రారంభించింది. మొబైల్ సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా BSNL కస్టమర్లు Wi-Fi కనెక్షన్ను ఉపయోగించి కాల్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా.. మొబైల్ నంబర్ను ఉపయోగించి నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. ఇది గ్రామీణ & మారుమూల ప్రాంతాలలోని వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. మొబైల్ నెట్వర్క్లలో రద్దీని తగ్గించడానికి కూడా ఈ సేవ సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు వై-ఫై కాలింగ్ కోసం అదనపు ఖర్చు చేయాల్సిన అవసరంలేదు . కంపెనీ తన నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు.. వినియోగదారులకు మెరుగైన అందించాలనే లక్ష్యంతో ఈ వై-ఫై కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది.VoWiFi అనేది IP మల్టీమీడియా సబ్సిస్టమ్ (IMS) ఆధారిత సేవ. ఇది Wi-Fi 7 మొబైల్ నెట్వర్క్ల మధ్య సజావుగా హ్యాండ్ఓవర్లకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనికోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. కాబట్టి ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.BSNL announces nationwide rollout of Voice over WiFi ( VoWifi) !!When mobile signal disappears, BSNL VoWiFi steps in. Make uninterrupted voice calls over Wi-Fi on your same BSNL number anytime, anywhere.Now live across India for all BSNL customers, Because conversations… pic.twitter.com/KPUs79Lj9w— BSNL India (@BSNLCorporate) January 1, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: రెండో రోజూ..
జనవరి 1న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు (జనవరి 2) అమాంతం దూసుకెళ్లాయి. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా 1140 రూపాయలు పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. వెండి రేటు కూడా అదే బాటలో అడుగులు వేస్తూ రూ. 4000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 2.60 లక్షలకు చేరింది.ఈ కథనంలో బంగారం, వెండి ధరలు హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
స్టాక్ మార్కెట్ అప్డేట్: లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 333.44 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 85,522.04 వద్ద, నిఫ్టీ 105.60 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 26,252.15 వద్ద కొనసాగుతున్నాయి.స్టార్టెక్ ఫైనాన్స్ లిమిటెడ్, సింటర్కామ్ ఇండియా, కేఎస్ఆర్ ఫుట్వేర్ లిమిటెడ్, లాసా సూపర్జెనరిక్స్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. వివిమెడ్ ల్యాబ్స్, ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఒసియా హైపర్ రిటైల్ లిమిటెడ్, నిరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్, కిరి ఇండస్ట్రీస్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
జోరుగా జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: నిత్యావసరాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 2025 డిసెంబర్ నెలకు రూ.1.74 లక్షల కోట్లు వసూలైంది. 2024 డిసెంబర్లో ఆదాయం రూ.1.64 లక్షల కోట్లు కంటే 6 శాతం పెరిగింది. గత ఏడాది సెపె్టంబర్ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గించడం తెలిసిందే. 12, 28 శాతం శ్లాబులు ఎత్తివేయడం ఫలితంగా వాటి రేట్లు దిగొచ్చాయి. అయినప్పటికీ జీఎస్టీ ఆదాయం మెరుగ్గా నమోదవుతుండడం గమనార్హం. దేశీ ఉత్పత్తులపై ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.1.22 లక్షల కోట్లుగా ఉంటే, దిగుమతి అయిన వస్తువులపై జీఎస్టీ రూపంలో ఆదాయం 19.7 శాతం పెరిగి రూ.51,977 కోట్లకు చేరింది. రిఫండ్లు సైతం 31 శాతం పెరిగి రూ.28,890 కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్ నెలకు నికర జీఎస్టీ ఆదాయం రూ.1.45 లక్షల కోట్లుగా నమోదైంది. 2024 డిసెంబర్ నెలకంటే 2.2 శాతం పెరిగింది. సెస్సు రూపంలో ఆదాయం రూ.4,238 కోట్లకు పరిమితమైంది. 2024 డిసెంబర్లో రూ.12,003 కోట్ల సెస్సు వసూలు కావడం గమనించొచ్చు. సెపె్టంబర్ 22 నుంచి సెస్సు అన్నది కేవలం పొగాకు, వాటి ఉత్పత్తులకే పరిమితం చేయగా, లగ్జరీ వస్తువులపై తొలగించడం తెలిసిందే.
ఫ్యామిలీ
అందరి ఆకాంక్ష అందరి ఆనందమే
‘నేను’... ‘నేను మాత్రమే’ అనే భావన వదిలిపెట్టాలి. ‘అందరం’.. ‘అందరి కోసం’ అనుకోవాలి. ఆనందం ఆత్మానందం కావాలి... ఒంటరి ఉమ్మడి కావాలి. ఇంటి నుంచి దేశాన్ని చూడాలి... సమాజం పట్ల కృతజ్ఞత ఉండాలి. సంతోషమయ జీవితానికి తాళం చెవులు మన వద్దే ఉన్నాయని తెలుసుకోవాలి. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ పెద్దలు ఇస్తున్న సందేశం ఇదే.ఇంటి నుంచి దేశం వరకూగతంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. కలిసి మెలిసి ఉండేవాళ్లు. అందులో లోటుపాట్లున్నా సుఖసంతోషాలు కూడా ఉండేవి. మేం సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్లో ఒకే కప్పు కింద 14 మందిమి ఉండేవాళ్లం. నవ్వుకునే వాళ్లం. గిల్లికజ్జాలు పెట్టుకునేవాళ్లం. అంతలోనే కలిసిపోయేవాళ్లం. పంచుకు తినడం అలవాటు చేసుకున్నవాళ్లం. ఇప్పుడు కూడా పంచుకుంటున్నారు... కాకపోతే ఉమ్మడి నుంచి విడిపోయి మైక్రో కుటుంబంగా... మళ్లీ అందులోనూ భార్యకు ఒక గది... భర్తకు ఒక గది... పిల్లలకు చెరో గది... మొన్నెక్కడో చదివాను... చైనాలో ‘వన్ ఆర్ నన్’ విధానం వల్ల తాత ఒక్కడే, తండ్రి ఒక్కడే, కొడుకు ఒక్కడేగా కొన్ని దశాబ్దాల పాటు సాగి వాళ్లకు మనుషుల మధ్య ఉద్వేగాలే అర్థం కాని స్థితి ఏర్పడిందని. మనుషులతో ఉంటేగా మనుషులు అర్థమయ్యేది. మనుషులకు దూరమయ్యే కొద్దీ మన నుంచి మనం కూడా దూరమవుతామని అర్థం చేసుకోవాలి. కొత్త సంవత్సరంలో మనం ఉమ్మడి కుటుంబాల వైపు వెళ్లాలని చెప్పనుగానీ అంతా మనది అన్న భావనైనా అలవర్చుకుంటే, అన్నీ మనవే అనుకుంటే, ఆ ధోరణి ఇంటి నుంచి బయలుదేరితే దేశం వరకూ పాకుతుంది. అప్పుడు అందరం ఒక కుటుంబం అవుతాం. ఆ తర్వాత అంతా వసుధైక కుటుంబకమే.– తనికెళ్ల భరణి, నటుడు–రచయితఆనందం నుంచి ఆత్మానందానికి...మన పుట్టుక ప్రకృతి చేతిలో ఉంది. మన బాల్యం పెద్దల చేతిలో ఉంది. యవ్వనం మాత్రం మన చేతిలోనే ఉంది. ‘బీదవాడిగా పుట్టటం నీ తప్పు కాదు. మరణించటం మాత్రం నీ తప్పు’ అన్నాడు బిల్ గేట్స్. ‘బీద తండ్రికి సంతానమవటం నీ చేతుల్లో లేదు. ధనవంతులైన పిల్లలకి తండ్రి అవటం మాత్రం నీ చేతుల్లో ఉంది’ అనేది అర్థం చేసుకోవాలి. ఇలా కొత్త సంవత్సరాన్ని సందర్భంగా తీసుకొని ఎదిగేందుకు సంకల్పించాలి. నెమలి అందంగా ఉంటుంది. చేప నీళ్లలో ఎంత సేపయినా ఈదుతుంది. కోతి అతి వేగంగా చెట్లు ఎక్కగలదు. జింక స్పీడ్గా పరిగెడుతుంది. స్థలాలు మారితే అన్నీ ఫెయిల్ అవుతాయి. కాబట్టి నువ్వు ఏ రంగంలో నిష్ణాతుడవో అదే రంగంలో అభివృద్ధి చెందటానికి ప్రయత్నం చెయ్యి. ఆ పనిని ఆనందించు. 2026లో ఇలాంటి నిర్ణయం కూడా తీసుకోవచ్చు.ఆనందం అంటే అనేక సంతోషాల మిశ్రమం. మొదటి రోజు సినిమా టికెట్ దొరికింది. సంతోషం. పిల్లలకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది సంతోషం. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది లేదా వ్యాపారంలో లాభం వచ్చింది. సంతోషం. కొత్తగా ఇల్లు కట్టడం జరిగింది. సంతోషం. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సంతోషం కలుగుతూ ఉంటేదాన్ని ‘ఆనందం’ అంటారు. ఎదుటివాడు ఇల్లు కట్టుకున్నా సంతోషంగా, ఎదురింటావిడ ఖరీదైన నెక్లెస్ కొనుక్కున్నా సంతోషంగా ఉండగలిగితే దాన్ని ‘ఆత్మానందం’ అంటారు. ఇలా ఈ సంవత్సరం ఆనందం నుంచి ఆత్మానందానికి ఎదగవచ్చు. ఇక నీ తాలూకు గెలుపు గానీ, ఎదుటివారి ఆనంద విషాదాలతో సంబంధం గానీ లేకుండా ప్రకృతితో లీనమై నిరంతరం ఆనందంతో ఉండగలిగితే దాన్ని ‘బ్రహ్మానందం’ అంటారు. ఈ స్థితికి చేరితే అంతకుమించి ఏమి కావాలి.– యండమూరి వీరేంద్రనాథ్, నవలా రచయితఆనందానికి తాళంచెవులుకొత్త సంవత్సరంలో అందరం ఆనందంగా ఉండాలనే కోరుకుంటాం. మరి ఆనందంగా ఉండటంలోని రహస్యాన్ని తెలుసుకున్నామా? చాలా సులభం. మనం రోజులో రెండు వంతులు గడిపేది కుటుంబ సభ్యులతోటే. కలిసి ఉన్నప్పుడు అభి్రపాయ భేదాలు సహజం. అవి కలతలకు దారి తీయకుండా చూసుకోగలిగితే మనం రోజులో రెండువంతులు సంతోషంగా గడపవచ్చు. మిగిలిన ఒక వంతు వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో గడుపుతాం. పనిని మనం ప్రేమిస్తే అది ఆనందాన్ని ఇస్తుంది. అయితే అందరికీ తాము ప్రేమించే పని చేసే అదృష్టం ఉండదు. కాని చేసే పనిని ప్రేమించడం అభ్యసిస్తే అప్పుడది మానసిక అలసట ఇవ్వదు. మనుషులతో పేచీలు మన ఆనందాన్ని హరిస్తాయి. అందరితో స్నేహంగా ఉంటే ఆనందమే. ఇక సోషల్ మీడియా. జపాన్ వారు పాటించే గోల్డెన్ రూల్ ఏమిటంటే బంధుమిత్రులతో సహా ఎవరితోనూ మతం, రాజకీయాల గురించి చర్చించకూడదు. అప్పుడు సోషల్ మీడియా కూడా ఆనందాన్నిస్తుంది. ఇక సంపాదన ఆనందాన్ని ఇచ్చేలా చూసుకోవాలి. నేరపూరితమైన సంపాదనకి దూరంగా ఉంటే మనశ్శాంతి. మనశ్శాంతే ఆనందం. ఆనందమే మనశ్శాంతి. ఇలా ఆనందానికి తాళం చెవులు చాలా ఉన్నాయి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఆనందాన్ని ఇస్తుంది. అన్నింటికంటే ముఖ్యం జీవించి ఉండటం ఆనందం. ఆరోగ్యమే ఆనందం. – మల్లాది వెంకట కృష్ణమూర్తి, నవలా రచయితసమాజంలో భాగం అవుతూ... శ్రేయస్సు ఆశిస్తూ‘వచ్చునపుడు కొత్తవే వత్సరాలు.... పాతబడిపోవు మన పాత పనుల వల్ల’ అని ఒక మహానుభావుడు అన్నాడు. సంవత్సరాలు కొత్తగానే వస్తాయి... మనం చేసే పాతపనుల వల్ల అవి పాతబడిపోతాయి. అలా కాకుండా కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు, కొత్త బాటలు ఎంచుకుని పయనిస్తే, ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటే కొత్త సంవత్సరం తప్పకుండా కొత్త ఫలితాలను ఇస్తుంది. కాలంతోపాటు మనం పయనిస్తాం సరే. కాని ఈ పయనంలో విజయం సాధించే విధంగా మన చర్యలు, పనులు ఉండాలి. అయితే విజయంతోపాటు విలువలు కూడా ఉండాలి. మోసాలతో, కల్లబొల్లి కబుర్లతో, ఎదుటివాణ్ణి అణిచేసి సాధిస్తే వచ్చేది తాత్కాలిక విజయం. అలాంటి విజయం చివరికి పాతాళంలో పడేస్తుంది. కాని నిజాయితీతో, నిర్మల హృదయంతో, ధర్మప్రవర్తనతో ప్రయత్నిస్తే వచ్చేది మాత్రం శాశ్వత విజయం. కాబట్టి ఏ విజయం వైపు వెళ్లాలనేది నిర్ణయం తీసుకోవాలి. ఇక మన ఉనికే సర్వస్వం అన్నట్టుగా లోకాన్ని చూడకూడదు. మనం ఈ సమాజంలో ఒక భాగం. మన ఆనందానికి మూలం సమాజంలోని వివిధ శ్రేణుల శ్రమ. కాబట్టి సమాజంలో అందరినీ ప్రేమించాలి. అప్పుడే పూర్తిస్థాయి ఆనందంతో ముందుకు వెళ్లగలం. సమాజం మనకు ఎంతో ఇస్తుంది... సమాజానికి ఇచ్చే సందర్భం వచ్చినప్పుడు ఇవ్వాలి. సమాజంలో చోటు చేసుకుంటున్న జాడ్యాలను చూసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని నా ఆకాంక్ష. అలాగే ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి. ఊరంతా ఆస్తిపాస్తులు ఉన్నా అవి ఊపిరితిత్తులు చేసే పని చేయలేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.– చంద్రబోస్, సినీ గేయకర్తప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకమే – శ్రీదేవి‘‘నా జీవితంలో 2025 ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరం. ‘కోర్ట్’ సినిమాతో నేను హీరోయిన్గా పరిచయమయ్యాను. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. ‘కోర్ట్’ నాకు కేవలం సినిమా మాత్రమే కాదు.. నా కలలకు మొదటి అడుగు. సినిమా విడుదల రోజు నుంచి ప్రేక్షకుల స్పందన వరకూ ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకమే. కుటుంబం గర్వంగా చూసిన క్షణాలు, ఇండస్ట్రీ నుంచి వచ్చిన అభినందనలు ఎప్పటికీ మరచి పోలేను’’ అన్నారు శ్రీదేవి. నూతన ఏడాదిని(2026) పురస్కరించుకుని ఆమె సాక్షితో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆ విశేషాలు... → ‘కోర్ట్’ మూవీతో నాకు మంచి క్రేజ్ వచ్చింది. బయటికి వెళ్లినప్పుడు జనాలు శ్రీదేవి అనీ, ‘జాబిలి’(కోర్ట్ సినిమాలో నేను చేసిన పాత్ర) అని కూడా పిలుస్తున్నారు. ‘జాబిలి’ అని పిలిచినప్పుడు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతోంది. ఆ పాత్రను ప్రేక్షకులు ఎంత ప్రేమించారో అర్థమవుతోంది. ఒక నటిగా మనం చేసిన పాత్రతో జనాలు మనల్ని పిలవడం కంటే మించిన ఆనందం ఏముంటుంది. నిజ జీవితం లో నేను చాలా సింపుల్గా ఉంటాను. జాబిలి పాత్ర నాలోని సున్నితమైన మనస్తత్వాన్ని బయటకు తీసుకొచ్చింది. ఆ పాత్ర చేసిన తర్వాత జీవితాన్ని మరింత బలంగా, ధైర్యంగా చూడడం నేర్చుకున్నాను.→ హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంలో జనాల్లో, నెటిజన్స్ నుంచి విమర్శలు వస్తుండటం నిజమే. అయితే ప్రతి ఒక్కరికీ అభి్రపాయాలు ఉంటాయి. పబ్లిక్లో ఉన్నవాళ్లుగా అందరి అభి్రపాయాలను గౌరవిస్తూ, పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లడమే ముఖ్యమని నేను భావిస్తున్నాను.→ 2025లో ఊహించినదానికంటే ఎక్కువ లక్ష్యాలను సాధించాను. ముఖ్యంగా ప్రేక్షకుల ప్రేమ, అభిమానం దక్కాయి. 2026లో మంచికథలు ఎంచుకోవడం, బలమైన పాత్రలు చేయడంతోపాటు నటిగా నన్ను నేను మెరుగుపర్చుకోవడమే లక్ష్యం. → ఒక బలమైన లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేయాలన్నది నా కల. అలాగే మంచి నటిగానే కాదు.. మంచి మనసున్న మనిషిగానూ ప్రేక్షకుల్లో గుర్తుండిపోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాను. వాటిలో తెలుగులో ‘బ్యాండ్మేళం’ ఒకటి. కోన ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళంలో ‘హైకూ’ అనే చిత్రంతో పాటు కేజేఆర్ ప్రొడక్షన్ బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాను. తెలుగుతోపాటు ఇతర భాషల నుంచి, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మంచి అవకాశాలు రావాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.ఆ మూడూ నా గోల్స్– మానసా చౌదరి ‘బబుల్ గమ్ మూవీ’తో తెలుగు తెరకు పరిచయమైన మానసా చౌదరి ‘లక్కీ భాస్కర్’, ‘ఆర్యన్’ వంటి సినిమాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సాక్షితోఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆ విశేషాలు... → 2026లో నా లక్ష్యం ఏంటంటే.. వీలైనంత వరకు ఎక్కువ సినిమాలు చేయడమే కాదు, వైవిధ్యమైన పాత్రలలో నటించడం కూడా!→ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి చాలా ట్రిప్పులకు వెళ్లాలి. ఈసారి ఇంటర్నేషనల్ ట్రిప్స్ ట్రై చేద్దామనుకుంటున్నాను. అలాగే ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత చక్కని షేప్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. మేజర్గా ఈ మూడు నా 2026 గోల్స్. అలాగే పని విషయంలో క్రమశిక్షణగా ఉండాలనుకుంటున్నాను. మీడియాలో యాక్టివ్గా ఉండటం. యాక్టింగ్ ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నా.. ఇవి కూడా 2026లో నా లక్ష్యంగా పెట్టుకున్నాను. → ‘లోక’ లాంటి ఓ అందమైన సినిమా చేయాలన్నది నా డ్రీమ్ రోల్. అలాగే ‘అమ్ము, తప్పడ్’ వంటి చిత్రాలు చేయాలనీ, ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో సాయిపల్లవిగారిలాంటి క్యారెక్టర్లో నటించాలి... ఇలా ఇవన్నీ నా డ్రీమ్ రోల్సే. త్రివిక్రమ్గారి సినిమాలో నటించాలన్నది కూడా నా కల. → ప్రస్తుతం ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్లో అన్ని విషయాలు అందుబాటులో ఉన్నాయి.. చాలా విషయాల సమాచారం ఉంటోంది. ఇప్పుడు కొత్తగా ఏఐ కూడా వచ్చింది. దీంతో ఏది నిజం, అబద్ధం అన్నది తెలియకుండా ఉంది. ఏ సమాచారాన్ని అయినా దుర్వినియోగం చేయకుండా మనకు కావాల్సిన దాన్ని మాత్రమే తీసుకోవాలని కోరుతున్నాను. → కోవిడ్ తర్వాత చాలా మంది హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. బాగా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా సడెన్గా గుండెపోటుకి గురవడం చూస్తున్నాం, వింటున్నాం. కరోనా తర్వాత శరీరంలో అక్కడక్కడా లంగ్స్ ఫామ్ అయిపోయి హార్ట్ ఎటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం చూస్తున్నాం. అందరూ హెల్దీగా లైఫ్స్టైల్ మెయింటైన్ చేసి, సమయానికి నిద్రపోవడం, తినడం, అలాగే సమయానికి బాడీ చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం అని నేను విన్నవిస్తున్నా. ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీన్ని తగ్గించుకోవడానికి యోగా చేయడం, కుటుంబంతో కలిసి సరదాగా గడపడం, స్నేహితులతో సమయాన్ని గడపడం వంటివి చేయాలని కోరుతున్నాను. → ప్రస్తుతానికి శ్రీవిష్ణు, తరుణ్ భాస్కర్గార్లు చేసిన ‘గాయపడ్డ సింహం’ అనే సినిమాలో చేశాను.. అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సందీప్ కిషన్గారు చేసిన ‘సూపర్ సుబ్బు’ అనే వెబ్ సిరీస్లో నటించాను. అది కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అంకిత్ కొయ్య హీరోగా గోపీనాథ్ రెడ్డిగారు దర్శకత్వం వహిస్తున్న ‘లవ్ జాతర’ అనే మూవీ చేస్తున్నాను. అదేవిధంగా తెలుగులో ఓ సినిమా, తమిళంలో మరో సినిమా ఒప్పుకున్నా.టైమ్ లైన్ పెట్టుకుంటాను– మనికా చిక్కాలఇటీవల విడుదలై, ప్రేక్షకాదరణ దక్కించుకున్న ‘దండోరా’ సినిమాలో సుజాత అనే ఓ ప్రధాన పాత్రలో నటించిన మనికా చిక్కాల ఈ న్యూ ఇయర్ సందర్భంగా పంచుకున్న సంగతులు...→ ఈ ఆధునిక యుగంలో ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతుండటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ సామాజిక సమస్య నిర్మూలనకు మా ‘దండోరా’ సినిమా కనీసం ప్రేక్షకుల్లో ఒక శాతంమందినైనా ఆలోచింపజేయగలిగినట్లయితే, మేం విజయం సాధించినట్లే.→ అమ్మాయిలు వారి నిజమైన ప్రేమ గురించి ఇంట్లో వ్యక్తపరచే స్వేచ్ఛ విషయంలో ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడిందనే చెప్పవచ్చు. పదేళ్ల క్రితం ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. లవ్మ్యారేజ్ల గురించి తల్లీదండ్రులు ఇప్పుడు కాస్త ఓపెన్ గానే చర్చిస్తున్నారు. చె΄్పాలంటే... మా తల్లిదండ్రులు కులం విషయంలో కాస్త కఠినంగానే ఉండేవారు. కానీ మా సిస్టర్ మా అమ్మానాన్నలను ఒప్పించి, ఓ క్రిస్టియన్ ను వివాహం చేసుకుంది. ఇది చూసి నేనూ హ్యాపీగా ఫీలయ్యాను. ఏ తల్లిదండ్రులైనా వారి కుమార్తె భద్రత గురించే గదా హై ప్రయారిటీ ఇచ్చేది!→ ఈ ఏడాది నాకు చాలా స్పెషల్. వృత్తిపరంగా మా ‘దండోరా’ సినిమా విడుదలై, మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. వ్యక్తిగతంగా నా సిస్టర్ ఓ బేబీకి జన్మనివ్వడం నన్ను ఇంకా సంతోషపరచే విషయం.→ ప్రతి ఏడాది డిసెంబరు 31న మా ఇంట్లో వాళ్లతో కలిసి కేక్ కట్ చేసి, న్యూ ఇయర్కి గ్రాండ్గా వెల్కమ్ చెబుతాం. సెలబ్రేషన్స్ చేస్తాం. ఇంట్లో కొన్ని గేమ్స్ కూడా ఆడతాం. ఇక న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ నిర్ణయించుకోను. అయితే ఫలానా పనిని, ఫలానా టైమ్ కల్లా సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలనే టైమ్లైన్ ను పెట్టుకుంటాను.ఇంటర్వ్యూలు: డేరంగుల జగన్ మోహన్ముసిమి శివాంజనేయులు
ఆ గ్రామంలో న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుగుతాయంటే..!
కొద్దిసేపటిలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ తరుణంలో నగరాలు, పట్టణాలు ఏ రేంజ్లో సందడిగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఎటు చూసిన ఆధునిక హంగులతో, డీజే మోతలతో అదరహో అనిపించే రేంజ్లో దద్దరిల్లిపోతాయి. అయితే ఈ గ్రామంలోని న్యూ ఇయర్ వేడుకలు నాటి కాలంలోకి, మరుపురాని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిపోయేలా అత్యంత సంప్రదాయబద్ధంగా జరుపుకుంటోంది. ఏఐ టెక్నాలజీతో దూసుకుపోతున్న ఈ కాలంలో ఇలా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడం అస్సలు చూసుండరు. ముఖ్యంగా పర్యాటకులను సైతం ఆకర్షించేలా న్యూ ఇయర్ వేడుకలుకు అత్యంత ముగ్ధమనోహరంగా సిద్ధమైంది ఆ గ్రామం.ఆ గ్రామమే మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా దేవ్గఢ్ గ్రామం ప్రత్యేక గ్రామీణ నేపథ్యంతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ మధ్యప్రదేశ్ పర్యాటక బోర్డు పర్యాటకుల్ని ఆకర్షించేలా ఇలా విన్నూతన మార్గంలో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. అక్కడ మూడురోజులు పాటు న్యూ ఇయర్ వేడుకలు అత్యంత సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా జరగనున్నాయిఆ మూడు రోజుల కార్యక్రమాల్లో గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా సంప్రదాయ భారతీయ ఆటలు, విందు వినోదాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నాటి అనుభవాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.ఎలా జరుగుతాయంటే..సందర్శకులు గాలిపటం ఎగరవేయడం, స్కిప్పింగ్(తాడాట), కర్రబిళ్ల, పిట్టు, గోళీలు, లట్టు, ఎద్దుల బండి సవారీలు, వంటి నాటి జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చేలా సాంస్కృతిక కార్యకలాపాలతో అలరించనుంది. అక్కడ సుందరమైన పరిసరాల మధ్య ఈ ఏర్పాట్లు చేశారు పర్యాటక నిర్వాహకులు. ముఖ్యంగా నారింజ తోటలలో టీ ఆస్వాదిస్తూ..ఈ ఆటపాటల్లో ఆడిపాడి సందడి చేయొచ్చు. అయితే ఈ ఆటల్లో పాల్గొనడం, ఎంజాయ్ చేయడం అన్ని ఉచితమేనట. ఇది కేవలం సందర్శకులకు గ్రామీణ జీవితాన్ని పరిచయం చేస్తూ..అందులో లీనమయ్యేలా చేయడమే లక్ష్యంగా ఈ న్యూ ఇయర్ని వేడుకలను ఇలా అసాధారణమైన రీతిలో జరుపుతోంది అక్కడి ప్రభుత్వం. దీన్ని అక్కడి పర్యాటక బోర్డు, జిల్లా పురావస్తు పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా సాంస్కృతిక ప్రదర్శనలు, స్థానిక క్రీడా పోటీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2026ని స్వాగతించడానికి అసాధారణమైన సాంస్కృతిక మార్గాన్ని ఎంచుకుని పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించనుంది.చరిత్రకు, ప్రకృతికి నెలవైన గ్రామందేవ్గఢ్ ఒకప్పుడు 18వ శతాబ్దంలో గోండ్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ పురాతన దేవాలయాలు, కోటలు, సుందరమైన బెత్వా నది ఉన్నాయ. ఇవి చారిత్రక సహజ సౌందర్యాన్ని అందిస్తాయి. పర్యాటకులకు సాంప్రదాయ ఆతిథ్యంతో స్వాగతం పలుకుతూ..దీనిని ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక విహార కేంద్రంగా మార్చే యోచనలో ఉండి అయక్కడ యంత్రాంగం. (చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్కి..)
అతిపెద్ద ఓపెన్-ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ చిత్ర సంతే 2026
భారతదేశంలోనే అతిపెద్ద ఓపెన్-ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ చిత్ర సంతే. ఈ ఫెస్టివల్ ఈ న్య ఇయర్లో జనవరి 4, 2026న ఆదివారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఫెస్టివల్లో సుమారు 22 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా కళాకారులు పాల్గొంటారు. అంతేగాదు ఏడు లక్షలకు పైగా సందర్శకులు ఆకర్షిస్తారనేది అంచనా. ఈ ఏడాది ఈ ఫెస్టివల్ థీమ్ పర్యావరణంపై దృష్టి సారించడం. ఇంతకీ ఏంటి చిత్ర సంతే అంటే..చిత్ర సంతే అంటే చిత్ర అంటే కన్నడలో పెయింటింగ్/డ్రాయింగ్, సంతే అంటే గ్రామ మార్కెట్. ప్రొఫెసనల్ కళాకారులు, విద్యార్థులు, అభిరుచి గలవారు తమ రచనలను ప్రదర్శించి, విక్రయించే వీధి కళా ఉత్సవం. ఈ రోజున బెంగళూరు వీధులు భారీ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీగా మారిపోతుంది. దీన్ని బెంగళూరులోని ఒక ప్రముఖ కళా సంస్థ కర్ణాటక చిత్రకళా పరిషత్ (CKP) దీన్ని నిర్వహిస్తోంది. (చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్కి..)
గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్కి..
ఈరోజుతో 2025కి గుడ్ బై చెప్పేసి..కొత్త ఏడాది 2026కి స్వాగతం పలకనున్నాం. ఈ తరుణంలో చాలామంది న్యూఇయర్ వేడుకలను మంచి సుందరమైన ప్రదేశాల్లో..సెలబ్రేట్ చేసకునేందుకు సన్నాహాలు, ప్లాన్లు వేస్తుంటారు. చాలామంది ఈపాటికి ఆయా ప్రదేశాలకు వెళ్లే హడావిడిలో ఉండి ఉంటారు కూడా. ఇక డిసెంబర్ 31 రాత్రి ఉండే సందడి, జోష్ ఓ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడూ చూసే పర్యాటక ప్రదేశాలు, బీచ్లు, పర్వత ప్రాంతాలు కాకుండా అడవుల్లో ప్రకృతి ఒడిలో చేసుకుంటే ఆ ఫీల్ వేరేలెవెల్. దీనికి మించి బ్యూటిఫుల్ స్పాట్ ఇంకొకటి ఉండదు కూడా. అందుకోసం గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్కి చెక్కేయాల్సిందే. ఈ పార్క్ విశేషాలు, అక్కడ ఉండే రిసార్టులు, ప్రత్యేకతలు గురించి సవివరంగా తెలుసుకుందామా.అటవీ సఫారీలకు ప్రసిద్ధి చెందిన రణతంబోర్ నేషనల్ పార్క్ న్యూఇయర్ వేడుకలకు బెస్ట్ ప్లేష్. ఇవక్క విలాసవంతమైన రిసార్ట్లలో వన్యప్రాణుల నడుమ ఆ సెలబ్రేషన్స్ మరింత జోష్ఫుల్గా ఉంటుంది. రాజస్థాన్లోని సవాయి మాధోపూర్లో ఉన్న రణతంబోర్ ప్రకృతి అందాలను మిళితం చేసేలా, అత్యంత ప్రైవేసిని అందించే హాలీడేస్ స్పాట్గా పేరొందింది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం గాంధీ కుటుంబం రణతంబోర్ నేషనల్ పార్క్ సమీపంలో సవాయి మాధోపూర్కు చేరుకుందని అధికారిక వర్గాల సమాచారం. ఈ కుటుంబం పులుల అభయారణ్యం సమీపంలోని ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్లో బస చేస్తోంది. జనవరి 2 వరకు ఈ ప్రాంతంలోనే గడపనున్నారనేది సన్నిహిత వర్గాల సమాచారం. అదీగాక ప్రియాంక గాంధీ- రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా తన ఏడేళ్ల స్నేహితురాలు, ఢిల్లీకి చెందిన అవివా బేగ్తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది న్యూయర్ వేడుకలు మరింత స్పెషల్ ప్రియాంక గాంధీ కుటుంబానికి. ప్రత్యేకతలు..పెద్దపులులకు నిలయం ఈ పార్క్. ఇక గాంధీ కుటుంబం ఈ పార్క్ సమీపంలోని ప్రత్యేకమైన లగ్జరీ సఫారీ క్యాంపులలో ఒకటైన సుజాన్ షేర్ బాగ్లో బస చేస్తోంది. అభయారణ్యం అంచున ఉన్న ఈ ప్రదేశం పాతకాలపు వన్య ప్రాణులకు గమ్యస్థానం. అలాగే ఇది 1920ల నాటి వలసవాద శైలి జంగిల్ క్యాంప్ లాగా ఉంటుంది. ఇక్కడ చేతితో తయారు చేసిన పది లగ్జరీ టెంట్లు, విల్లాలు కూడా ఉంటాయి. అక్కడ వ్యక్తిగత ఏకాంతానికి, విహారయాత్రకు అత్యంత అనువైనది కూడా. ప్రతి సూట్లో అత్యాధునిక సౌకర్యాలు, పూర్వకాలపు డిజైన్ల ఆకర్షణతో కట్టిపడేస్తోంది. ఇక్కడ పూర్తి ఎయిర్ కండిషనింగ్, వైఫై, వాలెట్ సేవలు, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్క రాత్రికి బస దాదాపు రూ. 2 లక్షలు పైనే ఖర్చవుతుంది. రణతంబోర్లోని అత్యంత ప్రీమియం న్యూ ఇయర్ బసలలో ఒకటి ఇది. కాగా న్యూఇయర్ వేడుకలకు మంచి గమ్యస్థానమైనీ రణతంబోర్ ఉద్యానవనంని రాహుల్ సందర్శించడం రెండోసారి కాగా, ప్రియాంక-వాద్రాలకు ఇది మూడోసారి.(చదవండి: ఒకప్పుడు భిక్షాటన..ఇవాళ బిలియనీర్గా ఏకంగా రూ. 40 కోట్ల..!)
అంతర్జాతీయం
పాముకు చేత్తో ఆహారం పెట్టాడు.. డాక్టర్లు వేలిని కత్తిరించారు?
పాముల్లో ఉండే గుణం.. కాటు వేయడం. అన్ని పాముల్లో విషం లేకపోయినా, విషపూరిత పాములతోనే అత్యంత ప్రమాదం. అది మనం పెంచుకునే విషపూరిత పాము అయినప్పటికీ దానితో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే మన ప్రాణం మీదకు తెచ్చుకోవాలి. అదే జరిగింది ఇక్కడ. ఓ వ్యక్తి విషపూరిత పామును ముచ్చటగా పెంచుకుంటున్నాడు. కానీ ఆ పాము కాటుతో తన చేతి వేలిని కోల్పోయాడు సదరు వ్యక్తి. చైనా దేశంలోని బీజింగ్లో జరిగిన ఈ ఘటన వైరల్గా మారింది. అతనికి చిన్నప్పటినుండి పాములంటే ఆసక్తి. ఆ క్రమంలోనే ఓ విషపూరిత పామును పెంచుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాముకు జబ్బు చేసి ఆహారం తినలేకపోతోంది. దానికి బలవంతంగా చేతితో ఆహారాన్ని పెడుతూ వస్తున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ పాము కోరల్లో అతని చేయి ఇరుక్కుంది. దాంతో పాము కాటుకు బారిన పడ్డ ఆ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి కరిచిన వేలిని తీసేయాలన్నారు. వేలిలో విషం ఉందని, అది తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో చేసేదిలేక వేలిని తీయించుకున్నాడు. ఇది ఆ వ్యక్తికి నేర్పిన జీవిత పాఠంగా గుర్తిండిపోవడం ఖాయం. విషపూరితమైన వాటికి దూరంగా ఉండటం ఎంత మంచిదో ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది.అదొక ఫైవ్ స్టెప్ స్నేక్చైనీస్ కథల్లో ఈ పామును "ఫైవ్ స్టెప్ స్నేక్" అని పిలుస్తారు. ఇది అంతటి విషపూరితమైందని నమ్మకం ఉంది, ఒకవేళ ఇది ఎవరినైనా కరిస్తే వారు ఐదు అడుగులు కూడా వేయకముందే మరణిస్తారని చెబుతారు. ఇటీవలి సంవత్సరాల్లో చైనాలో విచిత్రమైన మరియు తరచుగా ప్రమాదకరమైన జంతువులను పెంపుడు జంతువులుగా పెట్టుకునే ధోరణి పెరుగుతోంది.ఈ పాము విషం.. అత్యంత వేగంగా ప్రభావం‘ఫైవ్ స్టెప్ స్నేక్"అనేది అత్యంత విషపూరిత పాముకు సంబంధించినది.ఈ పాము కాటు వేస్తే, విషం చాలా వేగంగా ప్రభావం చూపుతుంది.ప్రజల్లో ఒక నమ్మకం ఉంది: కాటు పడిన వ్యక్తి ఐదు అడుగులు కూడా వేయలేడు, వెంటనే కుప్పకూలిపోతాడు.అందుకే దీనిని "ఫైవ్ స్టెప్ స్నేక్" అని పిలుస్తారు.శాస్త్రీయ పేరు- రస్సెల్ వైపర్శరీరంపై గోధుమ రంగు, పెద్ద పెద్ద వృత్తాకార మచ్చలు ఉంటాయి. పొడవు సాధారణంగా 1–1.5 మీటర్లు.రాత్రివేళ ఎక్కువగా చురుకుగా ఉంటుంది.విష ప్రభావంరక్తం గడ్డకట్టే విధానాన్ని (blood clotting) దెబ్బతీస్తుంది.తీవ్రమైన నొప్పి, వాపు, అంతర్గత రక్తస్రావం కలుగుతుంది.తక్షణ వైద్య సహాయం లేకపోతే ప్రాణాపాయం.
న్యూ ఇయర్లో విషాదం : అగ్నికీలల్లో చారిత్రాత్మక వోండెల్కెర్క్ చర్చి
నూతన సంవత్సర వేడుకల సమయంలో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లోని చారిత్రక చర్చి భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించడంతో చర్చి భవనానికి తీవ్ర నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు.19వ శతాబ్దపు ఈ చర్చికి సంబంధించి 50 మీటర్ల (164 అడుగుల) టవర్ కూలిపోయింది. పైకప్పు తీవ్రంగా దెబ్బతింది గురువారం తెల్లవారుజామున చారిత్రాత్మక వోండెల్కెర్క్ (వోండెల్ చర్చి)లో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఉవ్వెత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. కొన్ని గంటల్లోనే, 154 సంవత్సరాల పురాతన స్మారక చిహ్నంలో భాగమైన చర్చి టవర్ పూర్తిగా కూలిపోవడం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. మొత్తం నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అగ్నిమాపక సిబ్బందికి మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. న్యూ ఇయర్ సంబరాల్లో మునిగితేలుతున్న నగరం అంతటా తీవ్ర గందర గోళం ఏర్పడింది. అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేదు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేదిఇంకా తెలియరాలేదు.వోండెల్కెర్క్ చర్చిని ఎపుడు నిర్మించారు?1872లో వోండెల్కెర్క్ చర్చ్ నిర్మితమైంది. దీనిని ప్రసిద్ధ డచ్ ఆర్కిటెక్ట్ పియరీ క్యూపర్స్ రూపొందించారు. 1970లలో పునరుద్ధరించారు. 1977 వరకు రోమన్ కాథలిక్ చర్చిగా పనిచేసింది. De 150 jaar oude monumentale #Vondelkerk vormde het hart van de door Cuypers, architect van oa het Rijksmuseum, ontworpen Vondelbuurt. 😥 pic.twitter.com/z8KmitkUji— MaaikeDx 🖌 (@RembrandtsRoom) January 1, 2026
మరో హిందువుపై దాడి
ఢాకా: బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూరేలా మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా మరో హిందూ వ్యక్తిపై దాడి జరిగింది. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న ఒక వర్గానికి చెందిన కొందర వ్యక్తులు కలిసి.. ఖోకాన్ దాస్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఖోకాన్ దాస్కు నిప్పంటించి హత్య చేసే యత్నం చేశారు. 50 ఏళ్లకు పైగా ఉన్న ఖోకాన్ దాస్.. ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. షరియత్ పూర్ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన జరిగిన ఈ ఘటన మరొకసారి బంగ్లాదేశ్లో ఉంటున్న మైనార్టీ హిందువుల భవితవ్యంపై సవాల్ విసురుతోంది. బంగ్లాదేశ్లో ఇటీవల హింసాత్మక ఆందోళనలు మొదలైన తర్వాత హిందువులపై దాడి జరగడం ఇది నాల్గోసారి. డిసెంబర్ 24వ తేదీన కాలీమోహన్ ఏరియాలో అమృత్ మోండ్(29) అనే హిందూ యువకుడిపై దాడి జరగ్గా, డిసెంబర్ 18వ తేదీన దీపూ చంద్రదాస్ అనే 25 ఏళ్ల హిందూ యవకుడిని దారుణంగా హత్యచేశాయి అల్లరిమూకలు. డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు మెమిన్సింగ్ జిల్లాలోని మెహ్రాబారీ ప్రాంతంలోని సుల్తానా స్వెట్టర్స్ లిమిటెడ్ వస్త్ర పరిశ్రమ వద్ద సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్ హత్యకు గురయ్యారు. తోటి సెక్యూరిటీ గార్డ్ అయిన 29 ఏళ్ల నోమన్ మియా తన సర్విస్ షాట్గన్తో కాలచ్చింపాడు.
రష్యా డ్రోన్ దాడిలో.. 24 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్లోని ఖేర్సన్ రీజియన్లో ఉన్న ఓ కేఫ్ అండ్ హోటల్పై భారీ డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 24 మంది చనిపోయారు. కొత్త సంవత్సర వేడుకల్లో పౌరులు ఉండగా ఈ దాడి చోటుచేసుకున్నట్లు ఖేర్సన్ గవర్నర్ తెలిపారు.ఖోర్లీ గ్రామంలో ఉన్న ఆ హోటల్పై మూడు డ్రోన్లతో దాడి జరిగింది. ఘటనలో 24 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారని అధికారులు టెలిగ్రామ్ చానెల్ ద్వారా వెల్లడించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అంటున్నారు.ఒకవైపు ట్రంప్ తన మధ్యవర్తిత్వంతో ఈ యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుతిన్తో ఓసారి.. జెలెన్స్కీతో మూడుసార్లు భేటీ అయ్యారు. తాజాగా 90 శాతం శాంతి ప్రణాళిక ఖరారైనట్లేనని, ఏక్షణమైనా యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు కూడా. అయితే.. శాంతి చర్చల వేళ ఇరు దేశాలు మాత్రం డ్రోన్లతో పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి.. తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరగ్గా.. సైన్యం దానిని తిప్పి కొట్టింది. ఇది ఉక్రెయిన్ పనేనని మాస్కో ఆరోపిస్తుండగా.. కీవ్ మాత్రం అవి ఆరోపణలేనని తోసిపుచ్చింది. ఈ క్రమంలో.. ఆధారాలంటూ కొన్ని వీడియోలను బయటపెట్టింది రష్యా.
జాతీయం
పనికిరాని వీడియోలకు వ్యూస్
ప్రపంచంలో అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లో విలువ లేని, పనికి రాని వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా బిలియన్ల కొద్దీ మొబైల్ స్క్రీన్పై దర్శనమిస్తున్నాయి. నూతన యూజర్ల స్క్రీన్పై వచ్చే షార్ట్స్లో ఏఐతో తయారైన బ్రెయిన్ రాట్ వీడియోలు అయిదింట ఒక వంతు కైవసం చేసుకున్నాయి. వీటితో వీక్షకులకు సమయం వృథా తప్ప ఎటువంటి ప్రయోజనంచేకూర్చకపోవడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్క్యాప్వింగ్ నివేదిక ప్రకారం... క్లౌడ్ ఆధారిత ఆన్లైన్ వీడియో ఎడిటర్ క్యాప్వింగ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన 15,000 యూట్యూబ్ చానెళ్లను కంపెనీ అధ్యయనం చేసింది. ప్రతి దేశం నుంచి టాప్–100 చానెళ్లు వీటిలో ఉన్నాయి. 278 చానెళ్లు పూర్తిగా ఏఐ స్లాప్ కంటెంట్ను మాత్రమే ప్రసారం చేస్తున్నాయి. ఏఐ స్లాప్ చానెళ్లు 2025 అక్టోబర్ నాటికి 6,300 కోట్లకుపైగా వ్యూస్, 22.1 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ను సంపాదించాయి. ఏటా ఇవి సుమారు రూ.1,050 కోట్లు ఆర్జిస్తున్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఏఐ స్లాప్ యూట్యూబ్ చానెళ్లలో మన దేశానికి చెందిన ‘బందర్ అప్నా దోస్త్’అత్యధిక వ్యూస్తో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ విభాగంలో ఏటా రూ.38 కోట్లకుపైగా ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్లో నిలిచింది. నివేదిక హైలైట్స్.. ⇒ 207 కోట్లకుపైగా వ్యూస్తో భారత్కు చెందిన ‘బందర్ అప్నా దోస్త్’ఏఐ స్లాప్ చానెల్ అంతర్జాతీయంగా టాప్లో నిలిచింది. ⇒ ప్రపంచంలో అత్యధికంగా స్పెయిన్కు చెందిన ట్రెండింగ్ ఏఐ స్లాప్ చానెల్స్కు 2 కోట్ల మందికిపైగా సబ్స్రై్కబర్స్ ఉన్నారు. ⇒ దక్షిణ కొరియాలో ప్రముఖ ఏఐ స్లాప్ చానెల్స్ 845 కోట్ల పైచిలుకు వ్యూస్ నమోదు చేశాయి. ⇒ యూఎస్లోని స్లాప్ చానెల్ క్యూంటోస్ ఫాసినాంటెస్ (సిక్) 59.5 లక్షల మంది సబ్స్రై్కబర్స్ కలిగి ఉంది. ⇒ కొత్త యూజర్లకు వచ్చే ఫీడ్లో తొలి 500 యూట్యూబ్ షార్ట్స్లో బ్రెయిన్రాట్ వీడియోలు దాదాపు 33% ఉన్నాయి. ⇒ నూతన యూజర్ల స్క్రీన్పై వచ్చే మొదటి 500 షార్ట్స్లో ఏఐ స్లాప్ వీడియోలు 21% కైవసం చేసుకున్నాయి.ఏఐ స్లాప్ తగినంత శ్రద్ధ, కచ్చితత్వం, ఆలోచన లేకుండా సబ్స్క్రిప్షన్స్, వ్యూస్ కోసమే ఆటోమేటిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉపయోగించి రూపొందించి, పంపిణీ చేసిన విలువ లేని, పనికిరాని ఏఐ వీడియోలు. కంటెంట్లో లోపాలకుతోడు ప్రతికూల ప్రభావాలకు ఇవి దారితీస్తాయి.బ్రెయిన్రాట్నియంత్రణ, అర్థం లేని, తక్కువ నాణ్యత గల ఏఐ, ఏఐ రహిత వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు వీక్షకుడి మానసిక, మేధోస్థితిని క్షీణింపజేసే ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
మధ్య, దక్షిణ భారతావనిలో వర్షాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విభిన్నమైన అంచనాలను వెలువరించింది. ఈ మూడు నెలల్లో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య భారతంలో వర్షాలు పడతా యని తెలిపింది. పంజాబ్, హరియాణాల్లో మాత్రం చెదురుమదురుగా జల్లులు పడతాయంది. రబీ పంటలపై ఇవి ప్రభావం చూపించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర గురువారం మీడియా సమా వేశంలో ఈ వివరాలను వెల్లడించారు. బిహార్, విదర్భ ప్రాంతాల్లో మాత్రం ఈ సమయంలో అదనంగా మరో మూడు రోజులపాటు చలి వాతావరణం కొనసాగ నుండగా రాజస్తాన్లో మాత్రం చలి ప్రభా వం తగ్గుతుందని పేర్కొన్నారు. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలు న్నాయన్నారు. ఇదే సమయంలో, ఈశాన్య, వాయవ్య, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణానికి మించి ఉష్ణోగ్రతలుంటాయని చెప్పారు.
పర్యాటకంతో కొత్త ఏడాదికి స్వాగతం
న్యూఢిల్లీ: కొంగొత్త ఆశలను మోసుకొచ్చే నూతన ఏడాదికి భారతీయులు తమదైన శైలికి స్వాగతం పలికారు. పలు రకాల సాంస్కృతిక, విభిన్న కార్యక్రమాలతో సర్వాంగ సుందరంగా సిద్ధమైన రిసార్ట్లు, మాల్స్లో నృత్యాలు చేసి లక్షలాది మంది స్వాగతం పలికితే కోట్లాది మంది తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించేందుకు ఆలయాల వద్ద బారులుతీరారు. కొత్త ప్రదేశంలో సరికొత్తగా న్యూఇయర్కు స్వాగతం పలికాలనే ఉద్దేశంతో చాలా మంది పర్యాటక ప్రదేశాలకు పొలోమంటూ వెళ్లారు. దీంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలన్నీ కిక్కిరిసిపోయాయి. నేతల శుభాకాంక్షలు..కొత్త ఏడాదిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి ఒక్కరికీ 2026 ఏడాది అ ద్భుతంగా గడవాలి. అందరికీ మంచి ఆయు రారోగ్యాలు ప్రాప్తించాలి. లక్ష్యాల సాధనకు మీరు చేసే కృషి ఫలించాలి. సమాజంలో శాంతి సంతోషాలు వెల్లివిరియాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘ ఆనందాల నూతన సంవత్సరంలో అందరికీ నా హృదయపూర్వక కొత్త ఏడాది శుభాకాంక్షలు. దేశ,విదేశాల్లోని భారతీయులందరికీ ఈ ఏడాది శుభం కలగాలి’’ అని రాష్ట్రపతి ముర్ము ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘‘కొత్త ఏడాది వేళ జనులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గౌరవప్రదంగా జీవించేందుకు, పనిచేసేందుకు, ఓటేసేందుకు అనువైన సమాజం కోసం ఉద్యమించాల్సిన తరుణమిది’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో ట్వీట్చేశారు.వేడుకల్లోనూ రాజధానేదేశరాజధానిగానే కాదు వేడుకలకూ ఢిల్లీ గురువారం రాజధానిగా మారింది. నగరంలోని ప్రతి ఒక్క పర్యాటక ప్రాంతంలో జనం లెక్కలుమిక్కిలి చేరుకుని సరదాగా గడిపారు. వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఢిల్లీ మెట్రోను ఆశ్రయించారు. దీంతో మెట్రో స్టేషన్ల లోపల నుంచి బయటి దాకా చాలా దూరం వరకు క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. ఇండియా గేట్, సమీప ప్రాంతాలను చుట్టేసేందుకు వచ్చిన జనంతో సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లో ఇసకేస్తే రాలనంత జనం పోగయ్యారు. గోవాలో గోలగోలసాధారణంగానే పర్యాటకానికి చిరునామాగా నిలిచే గోవా ఈసారి సైతం నూతన సంవత్సర సంబరాలకు సరికొత్తగా ముస్తాబైంది. దీంతో పలు రాష్ట్రాల జనం జనం పెద్దసంఖ్యలో గోవాకు చేరుకుని ఆనందంగా గడిపారు. బీచ్లు, రెస్టారెంట్లు, పబ్లు, బార్లు, నైట్క్లబ్లు, రోడ్డ మీద ఎక్కడ చూసినా జనమే కన్పించారు. మ్యూజిక్నైట్ పార్టీలు, బాణసంచా వెలుగులు, సంగీత విభావరులు, డ్యాన్స్ కార్యక్రమాలతో ఉత్తర గోవా హోరెత్తిపోయింది. అన్ని రాష్ట్రాల్లో అందటా సందడే..క్రైస్తవులు అత్యధికంగా ఉండే మిజోరంలో ప్రజలు చర్చిల్లో ప్రార్థనలతో నూతన ఏడాదికి స్వాగతం పలికారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూఇయర్ వేడుకలను ఈ రాష్ట్రంలో రెండ్రోజులపాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం ఉదయం వర్షం ముంబై వాసులకు కొత్త ఏడాదిలోకి వెల్కమ్ చెప్పింది. ఉత్తరప్రదేశ్లో ఆలయాల్లో భక్తుల రద్దీ మునుపెన్నడూ లేనంతగా కన్పించింది. ప్రయాగ్రాజ్లో భక్తులు తెల్లవారుజామునే గజగజ వణికించే చలిలోనూ త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానాలు చేసి ఆలయాలను దర్శించుకున్నారు. అయోధ్యలోని బాలరా మాలయం భక్తులతో కిటకిటలాడింది. వీఐపీ దర్శన పాస్లు హాట్కేకులుగా మారాయి. అనూహ్య రద్దీతో ఆలయ కమిటీ స్థానిక భక్తులను మరోరోజు దర్శనానికి రావాలని బ్రతిమాలింది. సుదూరాల నుంచి వచ్చిన భిన్న రాష్ట్రాల భక్తులకు దర్శనభాగ్యం దక్కే అవకాశం ఇవ్వాలని కోరింది. ఒడిశాలో పూరీ జగన్నాథస్వామి ఆలయంలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. బిహార్, రాజస్థాన్లోనూ ఇవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. బెంగాల్లో భిన్నంగా..బెంగాల్లో పర్యాటక ప్రదేశాలు సందర్శకులతో నిండిపోయాయి. అలిపోర్ జూ, ఎకో పార్క్, ఇక్కో పార్క్, విక్టోరియా మెమోరియల్ సహా కోల్కతాలోని ప్రతి ప్రాంతంలో జనం గుమిగూడి కొత్త సంవత్సరాన్ని వేడుకలా ఆరంభించారు.
అణు వసతులు.. ఖైదీల జాబితా
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం మొదటి రోజైన గురువారం భారత్, పాకిస్తాన్లు తమ అణు వసతులు, ఖైదీల వివరాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నాయి. 35 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని ఇరు దేశాలు కొనసాగిస్తున్నాయి. భారత్–పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ అణు వసతులపై పరస్పరం దాడులకు పాల్పడరాదన్న ఒప్పందం 1988లో కుదిరింది. 1991 జనవరి 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచి్చంది. దీని ప్రకారం మొదటిసారిగా 1992 జనవరి ఒకటో తేదీన అణు వసతులు వివరాలు మార్చుకున్నాయి. ఇస్లామాబాద్లోని భారత దౌత్యాధికారికి పాక్, ఢిల్లీలోని పాక్ దౌత్యాధికారికి భారత్ ఈ మేరకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అలా, వరుసగా 35వ సారి గురువారం ఈ మేరకు వివరాలను అందజేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఈ ఏడాది మేలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తెల్సిందే. ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా క్షీణించినప్పటికీ రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని ఏళ్ల తరబడి నిరాటంకంగా కొనసాగించడం విశేషం. వారికి వెంటనే విముక్తి కల్పించాలి: భారత్ భారత్–పాక్లు గురువారం తమ దేశాల్లో ఉంటున్న ఖైదీల జాబితాను మార్పిండి చేసుకున్నాయి. పాక్ జైళ్లలో శిక్షాకాలాన్ని ముగించుకున్న 167 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా భారత్ కోరింది. అదే విధంగా, పాక్ కస్టడీలో ఉన్న 35 పౌర ఖైదీలు, మత్స్యకారులను కాన్సులేట్ అధికారులు కలుసుకునేలా వెసులుబాటు కలి్పంచాలని అడిగింది. ప్రస్తుతం భారత్ జైళ్లలో పాక్ పౌరులు 391 మంది, మత్స్యకారులు 33 మంది ఉండగా, పాక్ జైళ్లలో 58 మంది భారత పౌరులు, 199 మంది మత్స్యకారులు మగ్గుతున్నారు.
ఎన్ఆర్ఐ
మేరీల్యాండ్లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
అమెరికాలో మన తెలుగు వారు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా మేరీల్యాండ్లో తెలుగు బాలికలు టెక్నాలజీతో ఓ సమస్య పరిష్కారం కనిపెట్టి.. ఫస్ట్ లెగో లీగ్ ఛాలెంజ్లో క్వాలిఫయర్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారు. టెక్నాలజీ రంగంలో విశేష ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్( స్టెమ్)లో విద్యార్ధుల మేధాశక్తిని, సాంకేతిక ప్రతిభను, సామాజిక బాధ్యతను గుర్తించేలా నిర్వహించే ఫస్ట్ లెగో లీగ్ ఛాలెంజ్'లో పాల్గొన్న ఆరుగురు తెలుగు బాలికల బృందం, క్వాలిఫయర్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. హృతిక, సియోన, ప్రజ్ఞ, జాసు, ధృతి, లాస్య అనే ఆరుగురు తెలుగు విద్యార్ధినులు టెక్నోటియారాస్ పేరుతో జట్టుగా ఏర్పడ్డారు. గత నాలుగు నెలలుగా నిరంతర శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం, టీమ్ వర్క్ను జోడించి తమ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. కేవలం రోబోలను తయారు చేయడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే ఒక వినూత్న పరిష్కారాన్ని వీరు కనుగొన్నారు.ప్రాణాపాయం లేని ఆస్బెస్టాస్ తొలగింపు!పాత భవనాల్లో ఉండే 'ఆస్బెస్టాస్' వల్ల కార్మికులకు కలిగే ఆరోగ్య ప్రమాదాలను ఈ బృందం గుర్తించింది. దానికి పరిష్కారంగా ఒక అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థను ప్రతిపాదించింది. నిపుణుల సలహాలు తీసుకుంటూ, క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి వీరు రూపొందించిన ఈ 'ఇన్నోవేషన్ ప్రాజెక్ట్' అందరి ప్రశంసలు అందుకుంది.మెక్డొనో స్కూల్ క్వాలిఫైయర్ పోటీల్లో పాల్గొన్న టెక్నో టియారాస్ తెలుగు విద్యార్ధుల అద్భుత ప్రదర్శనకు ప్రశంసలు, పురస్కాలు లభించాయి. సామాజిక సమస్యకు పరిష్కారం చూపినందుకు అత్యున్నత 'క్వాలిఫైయర్ ఛాంపియన్షిప్' అవార్డును కైవసం చేసుకున్నారు.రోబోట్ డిజైన్ దాని పనితీరులో రెండో స్థానాన్ని సాధించి తమ సాంకేతిక సత్తాను చాటారు. తెలుగు బాలికల మధ్య ఉన్న సమన్వయం, నాయకత్వ లక్షణాలు, వారిలో ఉన్న ఉత్సాహాన్ని చూసి జడ్జీలు సైతం ఆశ్చర్యపోయారు. తెలుగు విద్యార్ధినులు సాధించిన ఈ విజయాల వెనుక కోచ్లు ఆలోక్, అభిజిత్ల మార్గదర్శకత్వం చాలా ఉపకరించింది. అలాగే వారి కుటుంబ సభ్యులు, నాట్స్ మేరీల్యాండ్ చాప్టర్ ప్రతినిధులు ఈ చిన్నారులను నిరంతరం ప్రోత్సహించారు. తెలుగు వారందరికి గర్వకారణంగా నిలిచిన ఈ బాలికలు ఇప్పుడు మేరీల్యాండ్ స్టేట్ కాంపిటీషన్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ యువ టెక్నాలజిస్ట్ల బృందం మరో మూడు నెలల్లో జరగనున్న ప్రతిష్టాత్మక స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి అర్హత సాధించింది. క్వాలిఫయర్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న బాలికల బృందానికి నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నాట్స్ మేరీల్యాండ్ నాయకులు, సభ్యులు అభినందించారు. స్టేట్ లెవెల్ పోటీల్లోనూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్ఆర్ఐ పోస్ట్)
కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి
కెనడా టోరంటోలో మరో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో భారత్ విద్యార్థి ఒకరు మరణించారు. ఈ ఘటనపై భారత కాన్సులేట్ తాజాగా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ఇది జాత్యంహకార హత్య.. మరేదైనా కారణమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.శివాంక అవస్థీ(20) స్థానిక యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరో క్యాంపస్ స్టూడెంట్. అయితే క్యాంపస్ ఆవరణలో మంగళవారం కాల్పలు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకునేలోపే నిందితులు పారిపోయారు. సంఘటన హైలాండ్ క్రీక్ ట్రైల్-ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో జరిగిందని.. బుల్లెట్ గాయాలతో శివాంక అక్కడికక్కడే మృతి చెందాడని స్థానిక అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్లు వెల్లడించారు. టోరంటోలో ఈ ఏడాది జరిగిన 41వ హత్య ఇది. ఈ ఘటనపై యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ మూడో ఏడాది చదువుతున్న శివాంక్ అవస్థీని పట్టపగలే కాల్చి చంపారని.. ఇది దర్మార్గమని ఒక ప్రకటన విడుదల చేశారు. క్యాంపస్లో భద్రతా లోపాలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో నిత్యం విద్యార్థుల సంచారం ఉంటుందని.. ఇకనైనా భద్రత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. శివాంక్ అవస్థీ యూనివర్సిటీ చెర్లీడింగ్ టీమ్ సభ్యుడు కూడా. ఆయన మరణంపై జట్టు ఇన్స్టాగ్రామ్లో నివాళి అర్పించింది. View this post on Instagram A post shared by UTSC Cheer (@utsccheerleading)భారత కాన్సులేట్ జనరల్ (టొరంటో) ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, అవస్థీ కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది. అయితే ఈ కుర్రాడి నేపథ్యం.. ఇతర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.టోరంటోలో తాజాగా హిమాంశి ఖురానా(30) అనే భారతీయ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో అబ్దుల్ ఘఫూరి అనే వ్యక్తిని పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఇది ‘‘ఇంటిమేట్ పార్టనర్ వైలెన్స్’’ కేసు అని అధికారులు పేర్కొన్నారు. అటు హిమాంశి కుటుంబానికి కూడా భారత కాన్సులేట్ సహాయం అందిస్తోంది. టొరంటోలో వరుస హింసాత్మక ఘటనలు భారతీయ కమ్యూనిటీలో ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఇదీ చదవండి: భారతీయులకు ఆ దేశాల్లో భద్రతే లేదా?..
సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం ! వైరల్గా ఎన్ఆర్ఐ పోస్ట్
సంపాదన కంటే ప్రశాంతమైన జీవితం మంచిది అనే సూక్తులు వినడానికే బాగుంటాయి. నిజజీవితంలో కాస్త కష్టమే అంత ఈజీ కూడా కాదు. పోనీ అలాంటి సాహసం చేస్తే..సమాజంలో, బంధువుల్లో మన స్థాయి తక్కువుగా ఉంటే మనం తట్టుకున్నా.. మన కుటుంబసభ్యలు అందుకు సిద్ధంగా ఉంటారా అంటే సమాధానం దొరకడం చాలా కష్టం. కానీ నార్వేలో నివశిస్తున్న భారత యువకుడు అదే మంచిదంటూ తాను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వడమే కాదు..అందర్నీ విపరీతంగా ఆకర్షించింది.అందులోనూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంతో విసిగివేశారిన వారికి ఈ పోస్ట్ ఓ మంచి ఎనర్జిటిక్గా కనిపించింది. పైగా ఆయన ఏం చెబుతున్నాడో అంటూ ఆ వీడియోని అంతా ఆస్తక్తిగా చూసేశారు కూడా. ఇంతకీ ఈ నార్వే యుకుడు ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్లో ఏం చెప్పాడంటే..తన పేరు సచిన్ అని తాను నార్వేలో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను దాదాపు 35 దేశాలకు పైగా పర్యటించాక ఓ విషయాన్ని గ్రహించానానని అంటూ చెప్పుకుంటూ రావడం వీడియోలో చూడొచ్చు. జీవితానికి ఎల్లప్పుడూ డబ్బు అవసరం లేదని, జీవించడానికి కేవలం సమయమే కావలని అన్నాడు. ఇక్కడ నార్వేలో ఉద్యోగం మనిషి విలువను ప్రతిబింబించదని, కేవలం వాళ్లు మనుషులుగా చూడటం అత్యంత ప్రశంసించదగ్గ విషయమని అన్నాడు. అక్కడ జీతం, హోదా, జెండర్, ఎక్కడ నుంచి వచ్చారు వంటి వాటికి పెద్దగా విలువ ఇవ్వరని అన్నాడు. అక్కడ కుటుంబం, ఆరోగ్యం, అభిరుచులు, పర్యటనలు, మానసిక ప్రశాంతత తదితరాలే ముఖ్యమనే విషయం ఇక్కడకు వచ్చాక తప్పక గుర్తిస్తారని అన్నాడు. కేవలం జీవన నాణ్యత, భద్రత, శాంతి అనేవి ఎంత ముఖ్యమో కచ్చితంగా తెలుస్తుందంటున్నాడు. అలాగని నార్వే ఏదో గొప్పదని చెప్పుకురావడం తన ఉద్దేశ్యం మాత్రం కాదని, కేవలం నిజంగా మనం కోసం మనం జీవించే జీవితాన్ని ఎంచుకోవడానికి మించిన ప్రశాంతత మరొకటి ఉండదని తెలియజేసేందకేనని పోస్ట్లో పేర్కొన్నాడు. అంతేగాదు నార్వేలో పని అనేది జీవితంలో ఒక భాగమేనని, అక్కడ ప్రజలు కుటుంబం, పర్యటనలు, అభిరుచులపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పాడు. అంతేగాదు ఇక్కడ ప్రజలు మనుగడ కోసం జీవించరని, పూర్తి స్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తారని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు సచిన్. అయితే నెటిజన్లు ఈ పోస్ట్ని చూసి బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు అని కొందరు, అలాంటి మంచి భారతీయ కమ్యూనిటీ ఉంటే కచ్చితంగా మేము అక్కడకి వచ్చేస్తాం అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sachin | Life in Norway 🇳🇴 | Ship to Shore 🚢 (@sachinoffshore) (చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గర్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..)
మెల్బోర్న్లో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆస్ట్రేలియాలోని వైఎస్సార్సీపీ మెల్బోర్న్ (ఎన్ఆర్ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జూమ్ మీటింగులో పలువురు సీనియర్ పార్టీ నాయకులు సాకే శైలజానాథ్,ఆరే శ్యామల, చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. గత కొన్ని ఏళ్లుగా వైఎస్సార్సీపీ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైయస్సార్సీపీ ఎన్నారై లకి పార్టీ సీనియర్ నాయకులు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే ప్రోగ్రామ్లో సీనియర్ నాయకులని ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని అన్నారు నాయకులు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ జగన్ గారు తన పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని తమలో చాలామంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకుని వచ్చి విదేశాల్లో స్థిరపడ్డామని వారి రుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ మద్దతిచ్చి తీర్చుకుంటామని తెలియజేశారు. సాకే శైలజానాథ్, ఆరే శ్యామల, చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ..మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పార్టీకి ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలాగా భరోసా ఉంటుందని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసీపీ నాయకులు నాగార్జున యలగాల, అనీల్ పెదగాడ, హరి చెన్నుపల్లి, శరత్ కుమార్ రెడ్డి తోట్లీ, విష్ణు వర్ధన్ రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు.(చదవండి: అక్లాండ్లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్డే సెలబ్రేషన్స్)
క్రైమ్
నూతన సంవత్సర సంబరాల్లో విషాదం
అనంతపురం సెంట్రల్, సఖినేటిపల్లి, పుట్టపర్తి అర్బన్: నూతన సంవత్సర సంబరాలు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. రాష్ట్రంలో పలుచోట్ల అపశ్రుతులు చోటు చేసుకోవడంతో కొందరు ప్రాణాలు విడిచారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సాగర సంగమం వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ నుంచి నిమ్మకాయల శ్రీధర్(35), నందమూరి వెంకట సాయినాథ్ గోపీకృష్ణ, బొండాడ సూర్యకిరణ్ అంతర్వేదికి బుధవారం రాత్రి చేరుకున్నారు. బీచ్కు సమీపంలో రూమ్ తీసుకున్నారు.అర్ధరాత్రి దాటాక రూంలో సూర్యకిరణ్ ఉండిపోగా, శ్రీధర్, గోపీకృష్ణ కారులో బయలుదేరి బీచ్ వెంబడి డ్రైవ్ చేస్తూ సాగరసంగమం వైపుకు వెళ్లారు. లైట్హౌస్ సమీపానికి వెళ్లే సరికి అక్కడున్న ఒడుపును వారు గుర్తించలేకపోయారు. అదే సమయంలో కారు అదుపు తప్పడంతో సంగమం వద్ద వేగంగా నీళ్లలోకి దూసుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన గోపీకృష్ణ కారులోంచి దూకేయడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. డ్రైవర్ సీటులో ఉన్న శ్రీధర్ కారుతో సహా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం శ్రీధర్ మృతదేహం లభ్యమైంది. సెల్ఫీ తీసుకుంటూ.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో సెల్ఫీ తీసుకుంటూ మిద్దెపై నుంచి కింద పడి యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కాడాల తరుణ్కుమార్ రెడ్డి(17) మిత్రుడితో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి 12 గంటల అనంతరం మిద్దెపైకి వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా తరుణ్కుమార్ రెడ్డి కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన అతన్ని పుట్టపర్తిలోని సత్యసాయి జనరల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. తరుణ్కుమార్ రెడ్డి ఇంటర్ పూర్తి చేశాడు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.బీరు సీసాలతో దాడులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అనంతపురంలో మద్యం మత్తులో యువకులు చెలరేగి బీరు సీసాలతో దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులోని ముత్యాలమ్మ గుడి వద్ద నివాసముంటున్న దినేష్, కళ్యాణ్.. అక్కడికి సమీపంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో వీరిపై గుర్తు తెలియని యువకులు మద్యం మత్తులో బీరు సీసాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు సంయుక్తంగా కేసును విచారిస్తున్నారు.
న్యూ ఇయర్లో విషాదం : అగ్నికీలల్లో చారిత్రాత్మక వోండెల్కెర్క్ చర్చి
నూతన సంవత్సర వేడుకల సమయంలో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లోని చారిత్రక చర్చి భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించడంతో చర్చి భవనానికి తీవ్ర నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు.19వ శతాబ్దపు ఈ చర్చికి సంబంధించి 50 మీటర్ల (164 అడుగుల) టవర్ కూలిపోయింది. పైకప్పు తీవ్రంగా దెబ్బతింది గురువారం తెల్లవారుజామున చారిత్రాత్మక వోండెల్కెర్క్ (వోండెల్ చర్చి)లో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఉవ్వెత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. కొన్ని గంటల్లోనే, 154 సంవత్సరాల పురాతన స్మారక చిహ్నంలో భాగమైన చర్చి టవర్ పూర్తిగా కూలిపోవడం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. మొత్తం నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అగ్నిమాపక సిబ్బందికి మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. న్యూ ఇయర్ సంబరాల్లో మునిగితేలుతున్న నగరం అంతటా తీవ్ర గందర గోళం ఏర్పడింది. అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేదు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేదిఇంకా తెలియరాలేదు.వోండెల్కెర్క్ చర్చిని ఎపుడు నిర్మించారు?1872లో వోండెల్కెర్క్ చర్చ్ నిర్మితమైంది. దీనిని ప్రసిద్ధ డచ్ ఆర్కిటెక్ట్ పియరీ క్యూపర్స్ రూపొందించారు. 1970లలో పునరుద్ధరించారు. 1977 వరకు రోమన్ కాథలిక్ చర్చిగా పనిచేసింది. De 150 jaar oude monumentale #Vondelkerk vormde het hart van de door Cuypers, architect van oa het Rijksmuseum, ontworpen Vondelbuurt. 😥 pic.twitter.com/z8KmitkUji— MaaikeDx 🖌 (@RembrandtsRoom) January 1, 2026
'గ్రీటింగ్'.. 'చీటింగ్'
శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది మారుతోంది. డిసెంబర్ 31 మొదలుకుని జనవరి 1 వరకు లెక్కలేనన్ని మెసేజీలు సెల్ను తాకుతాయి. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరిట ఎస్ఎంఎస్లు, వాట్సాప్ల ద్వారా సందేశాలు వస్తా యి. వీటితోనే ప్రమాదం పొంచి ఉంది తెలియని సైట్లపై ఏమరపాటుగా క్లిక్ చేసినా మన అకౌంట్లలో నగదు క్షణాల్లో మాయమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చీటింగ్ ఇలా..న్యూ ఇయర్ సందర్భంగా మొబైల్లో వచ్చే రకరకాల చిత్రాలు, సందేశాల పేర్లతో సహా తయారుచేసుకుని మెజేస్ పంపుతారు. మీకు నచ్చేవిధంగా మీ పేరుతో గ్రీటింగ్స్, సందేశాలను పంపుకోవచ్చని, ఫలానా లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని అంటారు. మన మొబైల్లో టెలిగ్రామ్, వాట్సాప్లను ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ రూపంలో మె సేజ్లను పంపిస్తారు. పొరపాటున ఆ లింక్ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. మన ఫోన్లో సమాచారమంతా వారికి పోతుంది. కాంటాక్ట్ నంబర్లు, ఫొటో లు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలే కాక డాక్యుమెంట్ ఫైళ్లు సైతం వీరికి చేరిపోతాయి. వెరిఫై చేసుకోవాలి.. రకరకాల గిఫ్ట్ ఓచర్లు, గ్రీటింగ్స్, ట్రావెల్, గాడ్జెట్స్, ఫ్యాషన్లపై ఇచ్చే డిస్కౌంట్లను ఒకటికి రెండుసార్లు నమ్మదగినవా కాదా అన్నది వెరిఫై చేసుకోవాలి. వాటి రివ్యూస్ చూస్తూ వెరిఫైడ్, అథెంటిక్ వెబ్సైట్లోకి వెళ్లి ఆఫర్లను తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి. కొత్త బృందాలు ఏర్పాటుశ్రీకాకుళం జిల్లాలో 2025లో వైట్ కాలర్ నేరాలు 171 నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో బాధితులకు అందించే రికవరీ సొమ్ము రాబట్టుకునేలా ఇక కృషి చేస్తాం. ఆన్లైన్ నేరాలను ఛేదించేందుకు ఇప్పటికే కొత్త బృందాలను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, సైబర్ క్రైమ్ సెల్తో సమన్వయం చేసుకుని 1930హెల్ప్లైన్ ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తాం. విద్యాసంస్థల్లో, గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. – శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి జాగ్రత్తలు తప్పనిసరి.. » అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయరాదు. » ఫోన్లోని సెట్టింగ్లో ఇన్స్టాల్ ఫ్రం అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ను డిసేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు తెలియకుండా యాప్స్ ఇన్స్టాల్ కావు. » మొబైల్ సెట్టింగ్లో ఫోన్ నంబర్లను యాక్సిస్ చేసే అనుమతి ఇవ్వరాదు. » తెలియని ఏపీకే ఫైల్స్, మాల్వేర్స్ ఇన్స్టాల్ అయితే ఫోన్ను రీసెట్ చేయాలి. » ఈ–మెయిల్స్, టెక్ట్స్æ, ఇతర సోషల్ మీడియా యాప్ల ద్వారా నకిలీ లింక్స్ను గుర్తించాలి. వాటిని క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. » గివ్ అవేస్ పోటీల ద్వారా వినియోగదారులను ట్రాప్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. మన వివరాలను సేకరించి డార్క్వెబ్కు అమ్మేస్తారు. » మన మొబైల్, ల్యాప్టాప్ (కంప్యూటర్)లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీ వైరస్ ప్రోగ్రామ్, అధికారిక యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.
ఊపిరి తీసిన సెల్ఫోన్
వినుకొండ: సెల్ ఫోన్ ధ్యాస ఓ విద్యార్థి ఊపిరి తీసింది. ఫోన్ చూసుకుంటూ వుండిపోవడంతో దిగాల్సిన స్టాప్ దాటిపోవడంతో కంగారులో కదులుతున్న బస్సు నుంచి దూకిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి సమీపంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన కన్న వారికి పుత్ర శోకం మిగిల్చింది.వివరాలు... ప్రకాశం జిల్లా పుల్లల చెరువుమండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి(16) గుంటూరు జిల్లా వినుకొండ దరి విష్ణుకుండినగర్లో బంధువుల ఇంటి వద్ద ఉండి స్థానిక బాలాజీ ఐటీఐ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. రోజూలాగానే కళాశాలకు వెళ్లేందుకు బుధవారం బస్సు ఎక్కిన లక్ష్మీరెడ్డి సెల్ఫోన్లో లీనమయ్యాడు. దిగాల్సిన బస్టాప్ వచ్చిన విషయాన్ని గమనించలేకపోయాడు. స్టాప్ దాటి బస్సు వెళ్తుండగా తేరుకుని డ్రైవర్ను బస్సు ఆపాలని కోరాడు. డ్రైవర్ బస్సు ఆపే ప్రయత్నం చేస్తుండగానే లక్ష్మీరెడ్డి బస్సులో నుంచి కిందకు దూకేశాడు. దీంతో నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోవడంతో నడుము, వెన్నెముక భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మీరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. కొంతసేపటికి విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రయాణ సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, పెద్దలు సూచిస్తున్నారు.
వీడియోలు
బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి
Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే
చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు
ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ
AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు
Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష
నెల్లూరు జిల్లా ఉదయగిరి MLA కాకర్లపై TDP మహిళా నేత సంచలన వ్యాఖ్యలు
Social Media Activist: జగనన్నపై అభిమానంతో పోస్టులు పెడితే అక్రమ కేసు పెట్టి
క్యాబినెట్ మీటింగ్ కు డుమ్మా కొట్టి లోకేష్ హాంకాంగ్ వెళ్లారు: కారుమూరి
Ballari: గాలి జనార్దన్రెడ్డి, శ్రీరాములు సహా 10 మందిపై కేసు నమోదు

