డాబాపై నుంచి తోసేసి.. యాసిడ్ బాడీలోకి ఎక్కించి
సాక్షి, నిజామాబాద్: మోపాల్ మండలం న్యాలకల్లో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా భార్య హతమార్చింది. గత నెల 30న భర్త ప్రశాంత్ను ఎలాగైనా అంతమెుందించాలని డాబాపై నుంచి భార్య సంధ్య తోసేసింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారి బంధువులు వెంటనే ఆసుపత్రిలో చేర్చించారు.అయితే తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న భర్తను ఎలాగైనా కడతేర్చాలని భావించిన భార్య మరో పన్నాగం పన్నింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టాయిలెట్ క్లీనర్ను తన శరీరంలోకి ఎక్కించింది. దీంతో అతని పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పోలీసులు ప్రశాంత్ భార్య సంధ్యతో అతని ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
మీ స్నేహం మరిచిపోం.. భారత్పై ఇరాన్ భావోద్వేగ పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు భారత్ ప్రతినిధులు హాజరవడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్ భావోద్వేగ పోస్ట్ చేసింది. భారత సమాజానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఈ కష్టకాలంలో భారత్ చూపిన స్నేహం, సానుభూతి, హృదయపూర్వక గౌరవాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ (ఇరాన్) ఎప్పటికీ మరచిపోదని ఎక్స్ వేదికగా పేర్కొంది.ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియ వేడుకలకు భారత ప్రభుత్వం తరపున బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటాతో బృందం హాజరయి నివాళులర్పించింది. అదే విధంగా వ్యక్తిగతంగా కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీలతో పాటు భారతదేశానికి చెందిన సిక్కు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు కూడా ఇరాన్ దివంగత నేతకు అంజలి ఘటించారు.అయితే దీనిపై భారత్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది.."భారత స్నేహపూర్వక ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు, ముఖ్యంగా భారత్ తరపున హాజరైన అధికారిక ప్రతినిధి బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇరాన్ అమరవీరుడు, హిస్ ఎమినెన్స్ అయాతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొని నివాళులర్పించినందుకు ధన్యవాదాలు." అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది."ఈ జాతీయ శోక సమయంలో ఇరాన్ ప్రజలతో భారత్ చూపిన హృదయపూర్వక సంఘీభావం, పరస్పర గౌరవానికి ఇది ఒక బలమైన నిదర్శనం. ఇరాన్ ప్రజలు ఈ స్నేహపూర్వక, సానుభూతితో కూడిన గౌరవపూర్వకమైన సంజ్ఞను ఎప్పటికీ మరచిపోలేరు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య ఉన్న దీర్ఘకాలిక బంధానికి ఇదొక విలువైన నిదర్శనంగా వారు భావిస్తారు. అలాగే ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక విలువైన పునాదిగా నిలుస్తుంది." అని పోస్ట్ చేసిందిఅలీ ఖమేనీ అంత్యక్రియలుఇరాన్ ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ 'ప్రెస్ టీవీ' నివేదిక ప్రకారం.. అలీ ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపు సోమవారం ఉదయం టెహ్రాన్లో ప్రారంభమైంది. ఈ ఊరేగింపు దాదాపు 10 నుండి 12 గంటల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఆ దేశ ఆధునిక చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద ప్రజా ప్రదర్శన (సమీకరణ) కానుంది. A tribute that amazed the whole world.. The Iranian Ummah paints a historical picture at the funeral of the martyred Imam Leader Khamenei.PS: NOT AI #Iran pic.twitter.com/3MJLyTayGX— Zeinab Al Saffar | زينـــب الصفّـــار (@ZeinabSaffar) July 6, 2026
కోట్లాది మంది ఉద్యోగులకు బంపర్ ఆఫర్
దేశంలోని సుమారు 8 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నిల్వలపై 8.25 శాతం వడ్డీ రేటును అధికారికంగా ఖరారు చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వడ్డీ మొత్తాన్ని తక్షణమే చందాదారుల ఖాతాల్లోకి జమ చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని క్షేత్రస్థాయి ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడంతో ఈపీఎఫ్ఓ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.కేంద్ర ప్రభుత్వం ఆమోదంఈపీఎఫ్ పథకం-1952లోని పేరా 60(1) ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీని ప్రతి సభ్యుని ఖాతాలో జమ చేయడానికి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అనుమతి లభించిందని ఈపీఎఫ్ఓ తన తాజా సర్క్యులర్లో స్పష్టం చేసింది. ‘కేంద్ర ప్రభుత్వ తుది అనుమతి లభించిన నేపథ్యంలో సభ్యుల ఖాతాల్లోకి సకాలంలో వడ్డీని బదిలీ చేసేందుకు వీలుగా సంబంధిత విభాగాలన్నీ తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నాం’ అని ఈపీఎఫ్ఓ సర్క్యులర్లో పేర్కొన్నారు.ఈసారి ఆలస్యం లేదు.. సరికొత్త సాఫ్ట్వేర్!గతంలో వడ్డీ డబ్బులు ఖాతాల్లో పడటానికి కనీసం ఒకటి రెండు నెలల సమయం పట్టేది. సాంకేతిక లోపాలు, అస్తవ్యస్తమైన ప్రక్రియల వల్ల చందాదారులు ఇబ్బందులు పడేవారు. అయితే, ఈసారి ఉద్యోగులకు ఆ తిప్పలు తప్పనున్నాయి. గత వారమే ఈపీఎఫ్ఓ తన ప్రధాన డేటాబేస్ కన్సాలిడేషన్తో పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. దీనివల్ల ఈసారి వడ్డీ క్రెడిట్ ప్రక్రియ వేగంగా, అవాంతరాలు లేకుండా సాగనుంది. కేవలం కొద్ది రోజుల్లోనే లబ్ధిదారులందరి ఖాతాల్లోనూ వడ్డీ సొమ్ము నేరుగా జమ కానుంది.వరుసగా మూడో ఏడాది అదే జోరుఈ ఏడాది మార్చిలోనే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ 8.25% వడ్డీ రేటును ప్రతిపాదించింది. అనంతరం జూన్ నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈపీఎఫ్ఓ వరుసగా మూడో ఏడాది కూడా 8.25 శాతం గరిష్ట వడ్డీ రేటును కొనసాగించడం గమనార్హం. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఉద్యోగుల పదవీ విరమణ నిధికి భద్రతతో పాటు ఉత్తమ రాబడిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఇదీ చదవండి: వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు
పాములనే నమిలి తిన్న తాగుబోతు.. ఏమైందంటే?
రాంచీ: జార్ఖండ్లో ఓ వ్యక్తి మద్యం మత్తులో విచిత్రంగా ప్రవర్తించాడు. పూటుగా తాగాడు.. అనంతరం అక్కడికి ప్రాకుతూ వచ్చిన పామును తిన్నాడు.. అంతటితో ఆగకుండా అక్కడే చంపి ఉన్న మరో పామును కొరికి మింగాడు.. దీంతో పరిస్తితి విషమించడంతో అతని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఏం జరిగిందంటే?స్థానికుల కథనం ప్రకారం... (శనివారం )కుందా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్వాదిహ్ తోలా గ్రామంలో బుధన్ భారతి అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ, పేకాట ఆడుతున్నాడు. ఆ సమయంలో సమీపంలోని పొలం నుండి ఒక పాము అతని వైపునకు పాకుతూ వచ్చి, కరవడానికి ప్రయత్నించింది.దీంతో అక్కడున్న వారంతా పరారయ్యారు. అయితే బుధన్ భారతి మాత్రం అక్కడున్న వారు ఎంత వారించినా వినకుండా, ఆ పామును చేతులతో పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఆ పామును ప్రాణంతో ఉండగానే కొరికి తినేశాడు.అక్కడితో అతని కిక్కు దిగలేదు.. మొదటి పామును తిన్న తర్వాత, బుధన్ పక్కనే ఉన్న పొలానికి పరిగెత్తాడు. అక్కడ గ్రామస్థులు అంతకుముందే కొట్టి చంపిన మరో పామును కూడా తీసుకెళ్లి తినేసాడు. ఇంతటితో ఆగకుండా రెండు పాములను తిన్న తర్వాత కూడా బుధన్ మళ్లీ మద్యం తాగుతూనే ఉన్నాడు. అంతలో అక్కడికి మరో మూడో పాము రాగా, దాన్ని కూడా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అతని కుటుంబ సభ్యులు అతడిని ఎలాగోలా అడ్డుకున్నారు.ఈ వింత ఘటన జరిగిన కొద్దిసేపటికే బుధన్ ఆరోగ్యం క్షీణించింది. అతని శరీరం తెల్లగామారడం ప్రారంభమైంది. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ప్రతాప్పూర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి తరలించారు. ప్రస్తుతం అతనికి అక్కడ చికిత్స అందుతోంది. అయితే అతడు తిన్న పాములు ఏవి అనేవి తెలియలేదు.
ఎట్టకేలకు ఆల్మట్టికి వరద
దుప్పటి కప్పి.. పెన్ క్యాప్ మింగించి..
జపాన్తో కాలానుగుణ ఒప్పందాలు
యూఏఈలో కొత్త రూల్.. కంపెనీలకు కఠిన హెచ్చరిక
నల్గొండ నైట్స్పై హైదరాబాద్ ఇ-చాంప్స్ విజయం
సినిమా విడుదల కాకముందే రివ్యూలు ఇచ్చారు: అభిషేక్ నామా
మీ స్నేహం మరిచిపోం.. భారత్పై ఇరాన్ భావోద్వేగ పోస్ట్
ప్రియుడిని పెళ్లాడిన బోనీ కపూర్ కూతురు
పదేళ్ల క్రితమే భారత్ను దెబ్బకొట్టిన ఎర్లింగ్ హాలండ్
మైక్రోసాఫ్ట్లో 4,800 మంది ఉద్యోగుల తొలగింపు!
ఓటు లేకున్నా పర్వాలేదట కానీ... మనకు అయితే వేయరట!
అవార్డులకు ఎన్నో దారులు.. చిరు వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్
వైభవ్ తప్పు చేశాడు.. అస్సలు ఊహించలేదు: సునీల్ గవాస్కర్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్కి తమిళ నేత వార్నింగ్
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మనం కూడా ఇరాన్ చేతిలో ఓడిపోతున్నామేమోననిపిస్తుంది సార్!
మూసీపై హెరిటేజ్ ఫుడ్స్ పడగ
శ్రీలంక గడ్డపై ద్రవిడ్ కుమారుడి విశ్వరూపం!
ఉక్రెయిన్ చేతిలో ఓడిపోతున్న రష్యా..!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
రుతుపవనాలు ఉధృతం.. పలు నగరాలు అతలాకుతలం!
భారత్పై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వాఖ్యలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో వృద్ధి.. ఉద్యోగాలలో అనుకూలత
డాన్స్ వివాదం.. నా కూతురిని ఆపే హక్కు నీకు లేదు
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
బోనీ కపూర్ కూతురి పెళ్లి.. పంజాబీ సంప్రదాయంలో వేడుకలు
బంగారం, వెండి ధరలు ఇలా..
అది నాకు కొత్త కాదు.. సహజీవనం చేస్తుంటా: సత్యదేవ్
బంగారం అంత పెరగదులే!
రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ
ఎట్టకేలకు ఆల్మట్టికి వరద
దుప్పటి కప్పి.. పెన్ క్యాప్ మింగించి..
జపాన్తో కాలానుగుణ ఒప్పందాలు
యూఏఈలో కొత్త రూల్.. కంపెనీలకు కఠిన హెచ్చరిక
నల్గొండ నైట్స్పై హైదరాబాద్ ఇ-చాంప్స్ విజయం
సినిమా విడుదల కాకముందే రివ్యూలు ఇచ్చారు: అభిషేక్ నామా
మీ స్నేహం మరిచిపోం.. భారత్పై ఇరాన్ భావోద్వేగ పోస్ట్
ప్రియుడిని పెళ్లాడిన బోనీ కపూర్ కూతురు
పదేళ్ల క్రితమే భారత్ను దెబ్బకొట్టిన ఎర్లింగ్ హాలండ్
మైక్రోసాఫ్ట్లో 4,800 మంది ఉద్యోగుల తొలగింపు!
ఓటు లేకున్నా పర్వాలేదట కానీ... మనకు అయితే వేయరట!
అవార్డులకు ఎన్నో దారులు.. చిరు వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్
వైభవ్ తప్పు చేశాడు.. అస్సలు ఊహించలేదు: సునీల్ గవాస్కర్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్కి తమిళ నేత వార్నింగ్
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మనం కూడా ఇరాన్ చేతిలో ఓడిపోతున్నామేమోననిపిస్తుంది సార్!
మూసీపై హెరిటేజ్ ఫుడ్స్ పడగ
శ్రీలంక గడ్డపై ద్రవిడ్ కుమారుడి విశ్వరూపం!
ఉక్రెయిన్ చేతిలో ఓడిపోతున్న రష్యా..!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
రుతుపవనాలు ఉధృతం.. పలు నగరాలు అతలాకుతలం!
భారత్పై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వాఖ్యలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో వృద్ధి.. ఉద్యోగాలలో అనుకూలత
డాన్స్ వివాదం.. నా కూతురిని ఆపే హక్కు నీకు లేదు
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
బోనీ కపూర్ కూతురి పెళ్లి.. పంజాబీ సంప్రదాయంలో వేడుకలు
బంగారం, వెండి ధరలు ఇలా..
అది నాకు కొత్త కాదు.. సహజీవనం చేస్తుంటా: సత్యదేవ్
బంగారం అంత పెరగదులే!
రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ
ఫొటోలు
సంయుక్త నీ అందం వేరే! (ఫొటోలు)
నిన్ను మిస్సవుతున్నా: బర్త్డే వేడుకలపై పీవీ సింధు పోస్ట్
తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు)
మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు)
ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ (ఫొటోలు)
బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
30ల్లో ఫ్రెండ్షిప్ ఇలా.. ఈ హీరోయిన్ గుర్తుందా? (ఫొటోలు)
సినిమా
‘చెన్నై లవ్స్టోరీ’రిలీజ్పై ఓటీటీ ఒత్తిడి లేదు : నిర్మాత ఎస్కేఎన్
సినిమాల రిలీజ్ డేట్ని ఓటీటీ సంస్థలు ఫిక్స్ చేస్తున్నాయి అనేది వాస్తవమే. అయితే వాళ్లు కొన్ని నెలల ముందే ప్రొడ్యూసర్ కు చెబుతారు. ఈ విషయంలో నాకు ఒత్తిడి ఎదురుకాలేదు. కానీ కొందరు ప్రొడ్యూసర్స్ మాత్రం తాము ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు. మా ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ ఓటీటీ డీల్ కంప్లీట్ అయ్యింది. ఆ సంస్థనే ఆ విషయాన్ని ప్రకటిస్తుంది’ అన్నారు నిర్మాత ఎస్కేఎన్. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించగా అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మించిన చిత్రం చెన్నై లవ్స్టోరీ. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ చెన్నైలో నివస్తున్న తెలుగు జంట స్టోరీ ఇది. అందుకే చెన్నై లవ్ స్టోరీ అని సినిమా టైటిల్ పెట్టాం. బేబి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మేకర్స్ గా మాపై అంచనాలు పెరిగాయి. అందుకే ఒక మంచి మూవీతోనే ఆడియెన్స్ ముందుకు రావాలని ఏడాది సమయం తీసుకున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ చెప్పిన ఈ కథ, కథనం బాగా నచ్చాయి. మా కాంబినేషన్ లోనే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం.→ ప్రస్తుతం మా సినిమా తెలుగు రిలీజ్ వర్క్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. తమిళ్ రిలీజ్ అదే వారం చేయాలా, ఒకట్రెండు వారాలు ఆగి చేయాలా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే తమిళంలో కొన్ని పెద్ద మూవీస్ రిలీజ్ కు వస్తున్నాయి.→ మేము అనుకున్న కథకు కిరణ్ అబ్బవరం వందశాతం న్యాయం చేశారు. ఆయన ఇప్పటిదాకా బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. మాస్ క్యారెక్టర్స్ లో నటించారు. కిరణ్ నటనలోని ఒక మెచ్యూరిటీని ఈ సినిమాలో చూస్తారు. ఈ ఏడాది అన్ని అవార్డ్స్ లో కిరణ్ నామినేషన్స్ లో ఉంటుందని మాత్రం గట్టిగా చెప్పగలను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా పేరు తెచ్చుకుని ప్రొడ్యూసర్ గా కొత్త వాళ్లను పరిచయం చేస్తూ అవకాశాలు ఇస్తున్నారు కిరణ్. ఆయన ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ ను ఈ సినిమా టైమ్ లో చూశాను.→ సాయి రాజేష్ కథల్లో హీరోయిన్స్ కు మంచి ప్రాధాన్యత ఉంటుందని మీకు తెలుసు. ఈ సినిమా కథ అనుకున్నాక, ఇంత బలమైన పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది, ఆ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారని డిస్కషన్స్ చేశాం. సినిమా ప్రారంభమే హీరోయిన్ సీన్ తో మొదలవుతుంది. మేము తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నాం. శ్రీ గౌరి ప్రియను సెలెక్ట్ చేసుకున్నాం. ఆమె ఈ పాత్రకు వందశాతం న్యాయం చేసింది. ఈ సినిమాలోని ఎమోషన్స్ చాలా రోజులు మనకు గుర్తుంటాయి.→ తొలిప్రేమ అయినా మలిప్రేమ అయినా మన జీవితంలో భాగమే. తొలి ప్రేమ దక్కని వారిలో మళ్లీ ప్రేమ పుట్టదని చెప్పలేం. ఏదైనా జీవితం ముందుకు సాగాల్సిందే. బేబి సినిమాను తొలి ప్రేమ నేపథ్యంగా నిర్మించాం. ఈ సినిమాలో మలి ప్రేమ కూడా గొప్పదే అని చెబుతున్నాం. మూవీలో విషాదకరంగా ఉండదు. బేబి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్ల సమయం తీసుకుని మేము ఈ చిత్రాన్ని నిర్మించామంటే మాదైన ఒక మార్క్ ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు.→ కథను నమ్మి ఆ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలి అనేది ప్రొడ్యూసర్ నిర్ణయం. ఇది ఎమోషన్స్ తో ఆకట్టుకోవాల్సిన కథ. ఆ ఎమోషన్స్ కోసం విజువల్ బ్యూటీ అవసరం. అందుకోసం నేచురల్ గా ఆ విజువల్స్ వచ్చేవరకు ఆగి షూటింగ్ చేశాం. వర్షం, సూర్యోదయం నేపథ్యంగా సాగే సీన్స్ కోసం సహజంగా వచ్చేలా వెయిట్ చేసి చేశాం. చెన్నై, పాండిచ్చేరి, వైజాగ్, చీరాల..ఇలా పలు లొకేషన్స్ లో షూటింగ్ జరిపాం. అందుకే షూటింగ్ డేస్ పెరిగాయి. సినిమాకు కావాల్సినంత రైట్ ఎమోషన్స్ వచ్చేలా ఔట్ పుట్ తీసుకున్నాం. ఇంకా కొన్ని తక్కువ డేస్ లో కూడా ఇదే క్వాలిటీతో సినిమా చేయొచ్చు. అదొక ఆర్ట్. ఆ ఆర్ట్ ను నేను ఇంకా నేర్చుకునే క్రమంలో ఉన్నాను.→ బేబి సినిమాకు కల్ట్ లవ్ స్టోరీ అని పేరొచ్చింది. ఈ సినిమాకు క్లాసిక్ లవ్ స్టోరీ అనే పేరొస్తుంది. ఈ కథ విన్న వెంటనే మణిశర్మ మా మూవీ చేస్తానని ఒప్పుకున్నారు. ఆయన చేసిన పాటలు ఎంత బాగుంటాయో మనకు తెలుసు. ట్యూన్ ఆకట్టుకుంటూనే లిరిక్స్ అర్థమవుతాయి. ఈ సినిమాలో అనంత శ్రీరామ్ సింగిల్ కార్డ్ రాశారు. ప్రతి లిరిక్ అర్థమయ్యేలా పాటను ఎంజాయ్ చేయొచ్చు. కథలోని భావోద్వేగాలు తెలిసేలా మెచ్యూర్డ్ గా మ్యూజిక్ చేయడంలో తనకు తానే సాటి అని మణిశర్మ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.→ డైరెక్టర్ రవి నంబూరి మాకు సోదరుడి లాంటి వారు. ఆయన మాతో ఎప్పటినుంచో ట్రావెల్ చేస్తున్నారు. మాకు వెబ్ సిరీస్ స్టోరీ ఇచ్చారు. బేబి మూవీకి వర్క్ చేశారు. ఆయనతో ఈ సినిమా నిర్మించడం హ్యాపీగా ఉంది. రవి టాలెంటెడ్ టెక్నీషియన్, డైలాగ్స్ బాగా రాస్తాడు. డైరెక్టర్ సాయి రాజేష్ , రవి నంబూరి కలిసి ట్రావెల్ చేస్తున్నారు, ఐడియాస్ షేర్ చేసుకుంటారు. సాయి రాజేష్ అందరికీ ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించుకుంటారు. అందుకే ఆయనకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.→ సినిమాను రాజీ లేకుండా నిర్మించడమే మా చేతుల్లో ఉంది. ఆ సినిమాకు ప్రేక్షకులు ఎంత కలెక్షన్స్ ఇస్తారు అనేది తెలియదు. ఇప్పుడు ఇంత కలెక్ట్ చేస్తుందని నేను చెబితే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. మా సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుంది. అందరి ప్రసంశలు పొందుతుంది. బేబి లాగే మాకు మంచి పేరు తీసుకొస్తుంది. మేకర్స్ గా మాకు ఒక మార్క్ క్రియేట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాం.→ ఈ సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం లేదు. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ మా సినిమాకు టార్గెట్. వాళ్లంతా వచ్చి మా సినిమాను చూడాలి. టికెట్ రేట్స్ పెంచి వచ్చే కలెక్షన్స్ కన్నా, ఎక్కువమంది ఆడియెన్స్ మా సినిమాను చూస్తున్నారనేది సంతోషాన్నిస్తుంది. ప్రస్తుతం కొన్నిఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. వాటిని త్వరలో అనౌన్స్ చేస్తాను.
మా దుస్తులపై కూడా వాళ్లదే నిర్ణయం..: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఆదిపురుష్ భామ కృతి సనన్ ఈ ఏడాది ప్రారంభంలో కాక్టెయిల్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీలో షాహిద్ కపూర్ సరసన మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కృతి సనన్.. సినీ ఇండస్ట్రీలో పురుషాధిక్యతపై మాట్లాడింది. ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేసింది.సినీ పరిశ్రమలో లింగ వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతుందని కృతి సనన్ అన్నారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉంటే స్టార్డమ్ చాలా ప్రత్యేకమన్నారు. హీరోయిన్ల విషయానికి వస్తే ఎలాంటి గుర్తింపు ఉండదని తెలిపారు. సెట్లో పురుషులకు అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. తెరపై రాసే పాత్రల విషయంతో పాటు సెట్లో పురుష, మహిళా నటీనటులను వేర్వేరుగా చూసే విధానంలో కూడా సినీ పరిశ్రమ పురుషులకే అనుకూలంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటివీ ఎక్కువగా చూశానని తెలిపారు. ఒక మహిళా నటి ఎక్కువ ప్రశ్నలు అడిగినప్పుడు సెట్లో వ్యతిరేకత పెరిగిపోతుందని కృతి సనన్ పంచుకుంది. కృతి సనన్ మాట్లాడుతూ..' సెట్లో దర్శకుడిని ప్రశ్నలు అడగడం నాకు అలవాటు. నాకు ఆసక్తి ఎక్కువ. ఎప్పటినుంచో అంతే. అలానే నేను ఎదిగాను. నేను నటనలో ఎప్పుడూ శిక్షణ తీసుకోలేదు. ఏమీ తెలియనట్టు ఉండటం కన్నా ప్రశ్నలు అడగడమే మేలు అనుకుంటా. నేను ఏదైనా సలహా ఇస్తే.. నువ్వు దీన్ని అనవసరంగా విశ్లేషిస్తున్నావ్ అంటారు. సెట్స్పై ఉండే మేనేజ్మెంట్కు హీరోల టైమింగ్స్ అంటే ఒక రకమైన భయం, గౌరవం. అందుకే వాళ్లను షాట్ పెట్టాక పిలుస్తారు. కానీ హీరోయిన్లను మాత్రం ముందే పిలిచి సెట్స్లో కూర్చోబెడతారని' ఆమె తెలిపింది.కృతి సనన్ ఇంకా మాట్లాడుతూ.. 'చాలాసార్లు హీరోయిన్లకు దక్కాల్సిన ఆత్మగౌరవం, సమానత్వం దక్కదు. చెప్పింది చెయ్ అంటూ అవమానిస్తారు. ఇక హీరోయిన్లు ఏ ఏ ప్రమోషన్లలో పాల్గొనాలి.. ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారు. చివరకు మేం వేసుకునే దుస్తులు కూడా వాళ్లే చెబుతారు. అందుకే హీరోయిన్లకు ప్రాధాన్యత లేని పాత్రలు చేయడానికి తాను ఇష్టపడట్లేదని' చెప్పుకొచ్చింది.
బోనీ కపూర్ కూతురి పెళ్లి.. పంజాబీ సంప్రదాయంలో వేడుకలు
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూతురు త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఆయన మొదటి భార్య కూతురైన అన్షులా కపూర్ పెళ్లి వేడుకలు ఇటీవలే మొదలయ్యాయి. గతేడాది ప్రియుడు రోహన్ థక్కర్తో నిశ్చితార్థం చేసుకున్న అన్షులా ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది.పెళ్లి వేడుకల్లో భాగంగా పంజాబీ సంప్రదాయంలో చుడా వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో అన్షులా కపూర్ బ్రదర్ అర్జున్ కపూర్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. తన సిస్టర్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది అన్షులా కపూర్. అతను ఇంత నిబద్ధతతో ఉండటం తాను ఎప్పుడూ చూడలేదని అన్షులా సరదాగా వ్యాఖ్యానించింది. ఈ వేడుకలో ఖుషీ కపూర్, ఓరీతో పాటు కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు. పంజాబీ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక సమయంలో కలీరా ఎవరి తలపైనైనా పడితే.. నెక్ట్స్ ఆ వ్యక్తి వివాహం చేసుకోబోతున్నారని నమ్ముతారు.కాగా.. అన్షులా కపూర్, రోహన్ థక్కర్ల నిశ్చితార్థం జూలై 2025లో జరిగింది. 2022లో ఆన్లైన్ డేటింగ్ ప్లాట్ఫామ్ ద్వారా మొదటిసారి కలుసుకున్నామని అన్షులా వెల్లడించింది. కాగా.. నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య పేరు మోనా శౌరీ కపూర్. ఈవిడ కూడా నిర్మాతే! వీరిద్దరూ 1983లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ సంతానం. 1996లో బోనీ.. భార్య మోనాకు విడాకులిచ్చాడు. అదే ఏడాది హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ సంతానం. కాగా మోనా శౌరీ.. 2012లో కన్నుమూయగా, శ్రీదేవి 2018లో మరణించింది. జాన్వీ, ఖుషి సవతి తల్లి కూతుర్లయినప్పటికీ అర్జున్, అన్షులా.. వారితో అన్యోన్యంగా ఉంటారు. ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor)
'ఓటీటీలో డైరెక్ట్గా మూవీ రిలీజ్.. మాకు అనుమతి లేదు'
పంజాబ్కి చెందిన మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'పంజాబ్ 95'. ఈ మూవీకి హనీ టెహ్రాన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ హీరోగా చేశారు. ఈ సినిమాని మూడేళ్ల క్రితమే తీసినప్పటికీ సెన్సార్ బోర్డ్.. తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. ఏకంగా 127 కట్స్ సూచించింది. మూవీ టీమ్ కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఫలితం లేకపోవడంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయలేదు. ఇటీవల 'సత్లుజ్'గా టైటిల్ మార్చి నేరుగా జీ5లో రెండు రోజుల క్రితమే స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు.కానీ ఓటీటీలో రిలీజైన రెండు రోజులకే ఈ మూవీని తొలగించారు. ఈ మూవీపై వివాదం తలెత్తడంతో ఓటీటీ సంస్థ తొలగించింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై దిల్జీత్ దోసాంజ్ స్పందించారు. ఈ చిత్రం రిలీజ్కు నిర్మాతలు ఏళ్ల తరబడి అడ్డంకులను ఎదుర్కొన్నారని ఆయన వెల్లడించారు. ఈ మూవీ రిలీజ్ అయ్యేవరకు మాట్లాడటానికి మాకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి అనే కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మూవీ ఓటీటీలో ప్రీమియర్ అయ్యే వరకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించారు.దిల్జీత్ మాట్లాడుతూ.. "నిన్నటి వరకు ఈ సినిమా గురించి ఎవరితోనూ మాట్లాడటానికి నాకు అనుమతి లేదు. ఎలాంటి ప్రచారం లేకుండా సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? చిత్ర బృందం మొత్తం ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. తాను మాట్లాడాలనుకున్న విషయాలు చాలా ఉన్నాయి. ప్రేక్షకుల మద్దతుకు ధన్యవాదాలు. అభిమానులు సోషల్ మీడియాలో సినిమా గురించి పంచుకుంటున్న వీడియోలు, పోస్ట్లను తాను చూశా. ఈ మూవీ సంఘటన 1995లో జరిగింది. అప్పట్లో దాని గురించి మాట్లాడటానికి ప్రజలను అనుమతించేవారు కాదు. అదే పరిస్థితి నేటికీ కొనసాగుతోంది. ఇది చాలా బాధాకరం' అని చెప్పారు. 2026లో కూడా పెద్దగా మార్పు రాలేదనే విషయం తనను నిరాశకు గురిచేసిందని ఆయన అన్నారు.ఈ ప్రాజెక్ట్ ఆలస్యానికి చాలా కారణాల ఉన్నాయని దిల్జీత్ గుర్తుచేసుకున్నారు. ఈ మూవీ షూటింగ్ 10-15 ఏళ్ల పాటు నిలిచిపోయిందన్నారు. నిర్మాణం ప్రారంభించడానికి మరో ఏడాదిన్నర పట్టిందని.. ఎడిటింగ్ తర్వాత ప్రాజెక్ట్ నాలుగేళ్లపాటు నిలిచిపోయిందని ఆయన చెప్పారు. తనకు ఈ చిత్రంతో రెండేళ్లపాటు అనుబంధం కలిగి ఉండగా, దర్శకుడు హనీ ట్రెహాన్ దీనికి ప్రాణం పోయడానికి ఆరేళ్లు వెచ్చించారని దిల్జిత్ తెలిపారు.సత్లుజ్ మూవీ కథేంటంటే...హనీ ట్రెహన్ దర్శకత్వం వహించిన సత్లుజ్ మూవీని 1984 నుంచి 1994 మధ్య పంజాబ్లో వేలాది గుర్తుతెలియని మృతదేహాలను దహనం చేశారనే రియల్ స్టోరీ అధారంగా తెరకెక్కించారు. మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా రూపొందించారు. పంజాబ్లో 25,000 మందిని అన్యాయంగా పోలీసులు చంపిన సంగతి.. తన పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చిన జస్వంత్ సింగ్.. 1995లో హత్యకు గురయ్యారు. ఈయన్ని పోలీసులే చంపారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ చిత్రానికి 2022లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ లభించలేదు. సెన్సార్ బోర్డ్ ఏకంగా 127 కట్స్ కోరారని చిత్రనిర్మాతలు ఆరోపించారు. ఇది 2023లో టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడాల్సి ఉండగా.. భారత అధికారులు అభ్యంతరాలు లేవనెత్తడంతో ప్రదర్శన రద్దు చేశారు.దీంతో చివరకు జూలై 3న ఎలాంటి ప్రకటన లేకుండా నేరుగా జీ5లో ప్రదర్శించారు. రెండు రోజుల తర్వాతే ముందస్తు నోటీసు లేకుండా దానిని ప్లాట్ఫారమ్ నుంచి తొలగించారు. ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్తో పాటు అర్జున్ రాంపాల్, కన్వల్జిత్ సింగ్, సువీందర్ విక్కీ, గీతిక విద్యా ఓహ్లియన్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
క్రీడలు
టీమిండియాలోకి విధ్వంసకర వీరుడు.. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ
ముంబై స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే దాదాపు రెండేళ్ల తర్వాత భారత వన్డే జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు గాయం కారణంగా దూరమైన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ధానాన్ని దూబేతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. టీ20 జట్టులో కీలక సభ్యునిగా ఉన్న దూబే.. వన్డేల్లో మాత్రం భారత్ తరపున 2024 ఆగస్టులో ఆడాడు. అప్పటి నుంచి కేవలం వన్డేలకు మాత్రమే దూబే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు నితీశ్కు గాయం కావడంతో ఈ సీఎస్కే విధ్వంసకర వీరుడికి వన్డేల్లో పునరాగనమం చేసే అవకాశం లభించింది. నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నాడు. దీంతో అతడు ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో పాటు జూలై 23 నుంచి ప్రారంభం కాబోయే జింబాబ్వే టీ20 సిరీస్కు కూడా దూరమయ్యాడు.ఇంగ్లండ్తో వన్డేలకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, శివమ్ దూబే.సంజూపై వేటుకాగా జింబాబ్వేతో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్పై సెలక్టర్లు వేటు వేశారు. అతడి స్ధానంలో పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ను ఎంపిక చేశారు. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీని కూడా కొనసాగించారు. ఇంగ్లండ్ సిరీస్లో ఆడుతున్న అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలకు విశ్రాంతినిచ్చారు. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్లు జట్టులోకి రాగా, ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.జింబాబ్వేతో టీ20కు భారత జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.
బంగ్లాదేశ్పై జింబాబ్వే సంచలన విజయం
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్కు ఊహించని షాక్ ఎదురైంది. సొంతగడ్డపై పాకిస్తాన్, ఆస్ట్రేలియాలను చిత్తు చేసిన బంగ్లాదేశ్ జింబాబ్వే పర్యటనలో మరో ఓటమిని చవిచూసింది. ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో దారుణ పరాజయం మూటగట్టుకున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్ను కూడా ఓటమితోనే ప్రారంభించింది. సోమవారం హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్పై 25 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయాన్ని సాధించింది. 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 33.1 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో నురుల్ హసన్ (31), తౌహిద్ హృదోయ్ (25), మెహదీ హసన్ (10) మినహా మిగతావారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ రిచర్డ్ నగరవా, బ్రాడ్ ఎవన్స్ చెరో మూడు వికెట్లు తీయగా, బ్లెసింగ్ ముజరబానీ, న్యూమన్ నైమూరి రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 36.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. న్యూమన్ నైమూరి (33) టాప్ స్కోరర్గా నిలవగా, కెప్టెన్ రిచర్డ్ నగరవా (27), ఇన్నోసెంట్ కైయా (26) పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రానా 6 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కెప్టెన్ నగరవా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జింబాబ్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జూలై 9న జరగనుంది.Read: సంజూపై వేటు.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
ఆసీస్కు రూ.22 కోట్లు.. మరి టీమిండియాకు ఎంతంటే?
మహిళల క్రికెట్లో తమకు తిరుగు లేదని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించుకుంది. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్-2026 విజేతగా ఆసీస్ నిలిచింది. ఆదివారం లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన తుది పోరులో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. రికార్డు స్ధాయిలో ఏడోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది.ఇంతకుముందు 2010, 2012, 2014, 2018, 2020, 2023 పొట్టి వరల్డ్కప్ టోర్నీల్లో కంగారులు ఛాంపియన్స్ నిలిచారు. కాగా ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత ఇంగ్లండ్ను 150 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. అనంతరం బ్యాటింగ్లో ఈ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. మరోసారి సీనియర్ బ్యాటర్ బెత్ మూనీ(64) ఫైనల్ పోరులో సత్తాచాటింది. మూనీకే ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’...‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు దక్కాయి.ఇక ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, రన్నరప్ ఇంగ్లండ్కు ఎంత ప్రైజ్మనీ దక్కిందో ఓసారి తెలుసుకుందాం. ఆస్ట్రేలియాకు 23 లక్షల 40 వేల డాలర్లు (రూ. 22 కోట్ల 34 లక్షలు)... రన్నరప్ ఇంగ్లండ్కు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 17 లక్షలు) నగదు బహుమతి లభించింది. సెమీఫైనలిస్ట్లు సౌతాఫ్రికా, వెస్టిండీస్లకు రూ. 6.4 కోట్లు ప్రైజ్మనీ అందింది.భారత్కు ఎంతంటే?ఇక గ్రూపు స్టేజ్లోనే ఇంటిముఖం పట్టిన భారత మహిళల జట్టుకు కూడా ప్రైజ్మనీ లభించింది. టోర్నమెంట్లో పాల్గొన్నందుకు గానూ ప్రతి జట్టుకు ఐసీసీ రూ. 2.35 కనీస మొత్తాన్నిఅందజేసింది. అంతేకాకుండా గ్రూప్ స్టేజ్లో భారత జట్టు 3 మ్యాచ్లలో విజయం సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్కు సుమారు రూ. 29.6 లక్షలు) బోనస్గా లభిస్తుంది. మూడు విజయాలకు గానూ భారత్కు లభించిన రూ. 89 లక్షలు దక్కింది. మొత్తంగా హర్మన్ సేనకు రూ. 3.24 కోట్లు ప్రైజ్మనీగా అందుకుంది.
సంజూపై వేటు.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం టీమిండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టులో ఓపెనర్ సంజూ శాంసన్కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున సంచలన ప్రదర్శన కనబరిచిన ఓపెనర్ ప్రబ్సిమ్రన్ సింగ్ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నాడు.ఇక 2026 టీ20 ప్రపంచకప్ను టీమిండియా గెలవడంలో సంజూ శాంసన్ది కీలకపాత్ర. టోర్నీలో టాప్ స్కోరర్గా నిలిచిన సంజూ శాంసన్ ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20లతో పాటు ఇంగ్లండ్తో తొలి టీ20 మ్యాచ్లో ఆడినప్పటికీ విఫలమయ్యాడు. దీంతో రెండో టీ20కి శాంసన్ను తప్పించి వైభవ్కు అవకాశమిచ్చారు. ఇక జింబాబ్వేతో టీ20 సిరీస్కు సంజూ శాంసన్ను పూర్తిగా పక్కనబెట్టారు. చిన్న జట్టుతో సిరీస్ కావడంతో శాంసన్కు రెస్ట్ ఇచ్చి ఉంటారని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. ఇక జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికైన ప్రబ్సిమ్రన్ ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున 168.87 స్ట్రైక్రేట్తో 510 పరుగులు సాధించాడు. ఇతర మార్పుల విషయానికొస్తే రింకూ సింగ్, మయాంక్ యాదవ్ తిరిగి రీఎంట్రీ ఇవ్వగా.. హర్ష్దూబే, యష్ ఠాకూర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ అశోక్ శర్మకు పిలుపొచ్చింది.జింబాబ్వే పర్యటనకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రబ్సిమ్రన్ (వికెట్ కీపర్).జింబాబ్వే పర్యటనలో టీమిండియా షెడ్యూల్:తొలి టీ20: జూలై 23, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)రెండో టీ20: జూలై 25, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)మూడో టీ20: జూలై 26, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)Read: టీమిండియాతో మూడో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన
న్యూస్ పాడ్కాస్ట్
ప్రశ్నించే గొంతును నొక్కడానికి అత్యంత ప్రమాదకర ధోరణి వైపు పోలీసు వ్యవస్థను నడిపిస్తున్నారు... ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం
ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించాం. పౌరులపై ఆర్థిక భారాన్ని చాలావరకు తగ్గించాం. ప్రధాని మోదీ వెల్లడి
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కడప ఉక్కు పరిశ్రమ మైలురాయి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
రాజధానిలో ఒకే నెలలో జరిగిన రెండు మరణాల వెనుక పెద్ద కుట్ర...
చంద్రబాబు సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
రగిలిన రైతన్నలు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు దగాపై దద్ధరిల్లిన విజయవాడ ధర్నాచౌక్
తెలంగాణలో వానల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతన్నలు. పలు జిల్లాల్లో లోటు వర్షపాతం
విత్తనం నుంచి బీమా వరకు అన్నింటా సమస్యలే... ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
ఏపీ రాజధానిలో గూండారాజ్... రైతుల ఆహ్వానం మేరకు భూములను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో తెలుగుదేశం మూకల దాడి
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ ‘అప్పుల క్యాలెండర్’ విడుదల... నెలకు 7 వేల 266 కోట్ల రూపాయల చొప్పున అప్పు చేయబోతున్న ప్రభుత్వం
బిజినెస్
కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి!
భారతదేశంలో ఈ ఏడాది మే (2026) నెలలో దేశవ్యాప్త తేయాకు ఉత్పత్తిలో గణనీయమైన క్షీణత నమోదైంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న తీవ్ర వాతావరణ పరిస్థితులు, రుతుపవనాల ముందు కురవాల్సిన వేసవి వర్షాల్లో భారీ లోటు దేశీయ టీ ఉత్పత్తిని దెబ్బతీశాయి. టీ బోర్డు విడుదల చేసిన తాజా అధికారిక గణాంకాల ప్రకారం.. మే 2026లో దేశవ్యాప్త తేయాకు ఉత్పత్తి 3.54 శాతం తగ్గి 131.60 మిలియన్ కిలోలకు పరిమితమైంది.25 శాతం పతనమైన ఉత్పత్తిఈ సీజన్లో ఉత్తర భారత దేశం ఎంతోకొంత నిలదొక్కుకున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు మాత్రం వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయాయి. మే నెలలో దక్షిణాదిలో తేయాకు ఉత్పత్తి ఏకంగా 25 శాతం పడిపోయి 19.88 మిలియన్ కిలోలకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇక్కడ 26.57 మిలియన్ కిలోల ఉత్పత్తి రావడం గమనార్హం.రాష్ట్రాల వారీగా దక్షిణాది పరిస్థితిదక్షిణాదిలోనే అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే తమిళనాడులో ఈసారి పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది మే నెలలో 19.04 మిలియన్ కిలోలుగా ఉన్న ఉత్పత్తి ఈ ఏడాది 28 శాతం క్షీణించి 13.63 మిలియన్ కిలోలకు పడిపోయింది.కేరళలో కూడా లోటు వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఉత్పత్తి 16 శాతం తగ్గి 5.86 మిలియన్ కిలోలకు (గతంలో 7.03 మిలియన్ కిలోలు) చేరింది.కర్ణాటకలో సైతం ఉత్పత్తి 0.50 మిలియన్ కిలోల నుంచి 0.39 మిలియన్ కిలోలకు పడిపోయింది.ఉత్తరాదిలో స్వల్ప ఊరటదక్షిణాదితో పోలిస్తే ఉత్తర భారతదేశంలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గత ఏడాది మే నెలలో నమోదైన 109.86 మిలియన్ కిలోలతో పోలిస్తే, ఈసారి ఉత్తరాది ఉత్పత్తి స్వల్పంగా పెరిగి 111.72 మిలియన్ కిలోలకు చేరింది. దేశంలోనే అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే అస్సాంలో మే నెల ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 64.70 మిలియన్ కిలోలుగా (మే 2025లో 65.04 మిలియన్ కిలోలు) నమోదైంది. ఇందులో అస్సాం లోయ ప్రాంతంలో ఉత్పత్తి 61.83 మిలియన్ కిలోలకు తగ్గగా, కాచర్ ప్రాంతంలో మాత్రం స్వల్పంగా పెరిగి 2.87 మిలియన్ కిలోలకు చేరింది. పశ్చిమ బెంగాల్లో ఇక్కడ టీ ఉత్పత్తి 5 శాతం పెరిగి 42.69 మిలియన్ కిలోలకు (గతంలో 40.68 మిలియన్ కిలోలు) చేరింది. డూయర్స్, తెరాయ్ ప్రాంతాలు మంచి వృద్ధిని కనబరిచినప్పటికీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన డార్జిలింగ్ ప్రాంతంలో మాత్రం ఉత్పత్తి స్వల్పంగామే 2026 గణాంకాలు ఇలా..ప్రాంతంమే 2025 ఉత్పత్తి (మి.కిలోల్లో)మే 2026 ఉత్పత్తి (మి.కిలోల్లో)మార్పుభారతదేశం (మొత్తం)136.42131.60-3.54%ఉత్తర భారతదేశం109.86111.72+1.69%దక్షిణ భారతదేశం26.5719.88-25.17%తమిళనాడు19.0413.63-28.41%కేరళ7.035.86-16.64%
‘షార్ట్ సెల్లింగ్’ను సులభతరం చేయడంపై సెబీ దృష్టి!
భారతీయ స్టాక్ మార్కెట్లో లిక్విడిటీని పెంచడంతో పాటు ఇన్వెస్టర్లకు మరింత సానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ కీలక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. మార్కెట్లో ‘షార్ట్ సెల్లింగ్’ ప్రక్రియను సులభతరం చేసేలా.. సెక్యూరిటీల లెండింగ్స్ అండ్ బారోయింగ్స్(ఎస్ఎల్బీ) పరిధిలోకి వచ్చే అర్హత కలిగిన స్టాక్స్ సంఖ్యను దాదాపు రెట్టింపు చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నమ్మకమైన వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. అర్హత కలిగిన షేర్ల సంఖ్యను పెంచడంతో పాటు ‘కొలేటరల్’ (హామీ) అవసరాలను కూడా గణనీయంగా తగ్గించేందుకు సెబీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.డెరివేటివ్స్ జోరుకు బ్రేక్.. క్యాష్ మార్కెట్కు బూస్ట్!ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డెరివేటివ్స్ ట్రేడింగ్ అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. అయితే, ఈ విభాగంలో ట్రేడింగ్ చేసే రిటైల్ పెట్టుబడిదారులలో దాదాపు 90% మంది భారీగా నష్టపోతున్నారని సెబీ ఇటీవలే వెల్లడించింది. డెరివేటివ్స్ మార్కెట్ పరిమాణం ప్రస్తుతం క్యాష్ మార్కెట్ కంటే దాదాపు 500 రెట్లు పెద్దదిగా ఉండటం గమనార్హం. ఇది ప్రపంచంలోని ప్రధాన మార్కెట్ల కంటే చాలా ఎక్కువ.డెరివేటివ్స్లో లెవరేజ్ ఎక్కువగా ఉండటం వల్ల సిద్ధాంతపరంగా నష్టాలకు పరిమితి ఉండదు. అదే క్యాష్ మార్కెట్లో అయితే రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ట్రేడింగ్ వాస్తవ షేర్లు, కొలేటరల్ ఆధారంగా జరుగుతుంది. అందుకే, రిటైల్ ఇన్వెస్టర్లను ఈ ప్రమాదకర డెరివేటివ్స్ మార్కెట్ నుంచి దూరంగా ఉంచి సురక్షితమైన క్యాష్ ఈక్విటీ మార్కెట్ వైపు మళ్లించడమే ఈ కొత్త మార్పుల ప్రధాన ఉద్దేశం.కఠిన నిబంధనల నుంచి సడలింపుల వైపు..గతంలో జరిగిన కొన్ని స్టాక్ కుంభకోణాల నేపథ్యంలో భారతదేశం తన నగదు ఈక్విటీ మార్కెట్ భద్రత కోసం అత్యంత కఠినమైన నిబంధనలను రూపొందించింది. మొదట 2000వ దశకంలో, ఆ తర్వాత మళ్లీ 2017 - 2020 కాలంలో ఈ నియమాలను మరింత కఠినతరం చేశారు.ప్రస్తుత పరిస్థితి ఇలా..భారత క్యాష్ ఈక్విటీ మార్కెట్లో దాదాపు 95% వాటాను కలిగి ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సుమారు 2,600 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. కానీ, వీటిలో కేవలం 176 కంపెనీల షేర్లు మాత్రమే ప్రస్తుతం అప్పు ఇవ్వడానికి, తీసుకోవడానికి (ఎస్ఎల్బీ) అర్హత కలిగి ఉన్నాయి. ఈ సంఖ్యను దాదాపు రెట్టింపు చేయడం ద్వారా మార్కెట్లోని మెజారిటీ లిక్విడ్ షేర్లను ఈ పరిధిలోకి తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఖరారయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!
ఒక్క ప్రశ్నతో ఉద్యోగం పోయింది!
జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్లే అభ్యర్థులు సాధారణంగా అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు సిద్ధం చేసుకుంటారు. కానీ ఇంటర్వ్యూ ముగిసే సమయంలో ''మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?'' అని అడిగితే ఎలా స్పందించాలి? అనే విషయంపై చాలామంది పెద్దగా దృష్టి పెట్టరు. ఇలాంటి సంఘటనే ఒక ఇండియన్ ప్రొడక్ట్ మేనేజర్కు ఎదురైంది. దీంతో అతడు ఉద్యోగం సైతం కోల్పోవాల్సి వచ్చింది.కెనడాలో పనిచేస్తున్న ఇండియన్ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్ గోగ్నా ఇటీవల తనకు ఎదురైనా ఒక అనుభవాన్ని లింక్డ్ఇన్లో షేర్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కరణ్ గోగ్నా ఓ యూజ్డ్ కార్ల స్టార్టప్ కంపెనీలో ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూలోని అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేశారు. హెచ్ఆర్ ఆయన డాక్యుమెంట్లను తీసుకోవడంతో.. ఉద్యోగం దాదాపు ఖాయమైందని భావించారు. అయితే.. ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ముందు కంపెనీ సీఈఓతో ఒక చివరి సమావేశం ఏర్పాటు చేశారు.సీఈఓతో సమావేశం బాగా జరిగిందని, ఉద్యోగం వస్తుందని నమ్మకం కలిగిందని కరణ్ తెలిపారు. చివర్లో సీఈఓ ''మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?'' అని అడిగారు. దానికి కరణ్, ''మీ కంపెనీ భవిష్యత్తులో టూ-వీలర్ మార్కెట్లోకి కూడా ప్రవేశించాలని ఆలోచిస్తోందా?'' అని ప్రశ్నించారు.అయితే.. సీఈఓ దానికి నేరుగా సమాధానం చెప్పకుండా, ''మీ అభిప్రాయం ఏమిటి? మేం ఆ మార్కెట్లోకి వెళ్లాలా?'' అని తిరిగి ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్న ఒకటి ఎదురవుతుందని ఊహించని కరణ్ ''కంపెనీ వ్యాపారం గురించి పూర్తిగా అధ్యయనం చేశానని, కానీ టూ-వీలర్ మార్కెట్ గురించి ఎలాంటి అభిప్రాయం లేదని తెలిపారు''. దీంతో ఆ సమయంలో తడబడి స్పష్టతలేని సమాధానం ఇచ్చానని అంగీకరించారు.మరుసటి రోజు హెచ్ఆర్ నుంచి ఫోన్ వచ్చి, కంపెనీ మరో అభ్యర్థిని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ కరణ్ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ''ఇంటర్వ్యూకు వెళ్లేవారు సమాధానాల కోసం ఎంత సిద్ధమవుతారో, చివర్లో అడిగే ప్రశ్నల కోసం కూడా అంతే సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు''.ఎందుకంటే అభ్యర్థి అడిగే చివరి ప్రశ్న, అతని ఆలోచనా విధానం, వ్యాపార అవగాహన, విశ్లేషణ సామర్థ్యాన్ని ఇంటర్వ్యూవర్కు తెలియజేసే చివరి అవకాశం అవుతుందని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందించారు. చాలామంది తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు.
E20తో మైలేజీ తగ్గొచ్చు.. కానీ..!
భారత్లో E20 పెట్రోల్పై పెద్ద చర్చ జరుగుతున్న తరుణంలో.. మహీంద్రా కంపెనీ కీలక ప్రకటన చేసింది. తమ వాహనాల్లో E20 వినియోగంపై కీలక స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.కంపెనీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలో, తమ వాహనాల్లోని ఇంజిన్లు ప్రస్తుత పెట్రోల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, అన్ని వాహనాలు E20తో పనిచేస్తాయని పేర్కొంది. అయితే.. 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన కొత్త మోడళ్లు ప్రత్యేకంగా E20 కోసం ట్యూన్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో మెరుగైన యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యం ఉండేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది.2025 ఏప్రిల్కు ముందు తయారైన వాహనాలు కూడా E20 పెట్రోల్తో సురక్షితంగానే నడుస్తాయని మహీంద్రా స్పష్టం చేసింది. అయితే డ్రైవింగ్, రోడ్డు పరిస్థితులపై ఆధారపడి మైలేజీలో లేదా పికప్లో చిన్న మార్పులు కనిపించవచ్చని పేర్కొంది.ఈ20 పెట్రోల్ ఇంజిన్కు హాని చేయదు, కేవలం ఇంధనంలో ఎనర్జీ కంటెంట్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం మాత్రమే ఉంటుందని మహీంద్రా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో E20పై అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కంపెనీ ఈ వ్యాఖ్యలు చేసింది.ఇతర కంపెనీల స్పందనE20 పెట్రోల్ విడుదలను సమర్థిస్తూ టయోటా, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, హ్యుందాయ్ ప్రతినిధులు పాల్గొన్న ప్రభుత్వ పత్రికా సమావేశం జరిగిన కొద్దిసేపటికే మహీంద్రా ఈ వివరణ ఇచ్చింది.అయితే కొంతమంది వాహన వినియోగదారులు మైలేజీ తగ్గిందని చెబుతున్నారని కూడా వారు అంగీకరించారు.
ఫ్యామిలీ
గోధుమ రంగు గుట్ట కాదు.. బంగారు గుట్ట అని పిలుస్తాం!
తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే దారిలో ఒక గుట్టపైన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పాదం ఉంది. స్వామివారు నారాయణవనంలో పద్మావతిని పెళ్ళాడి స్థిర నివాసం కోసం బయలుదేరాడు. దారిలో పుత్తూరు పట్టణం పక్కనున్న గుట్టమీద కాలు పెట్టాడని, అది స్వామిని మోయలేక కదిలిందని చెబుతారు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకుంటాడు స్వామి. మరికొన్ని చోట్ల కూడా పాదం మోపి చివరిగా శేషాచలం కొండలపైన కొలువైనాడని భక్తుల నమ్మకం.ఆ గుట్ట మీదున్న స్వామిపాదాన్ని చూద్దామని తమిళనాడుకు చెందిన కొందరు యువతీ యువకులు జట్టుగా బయలుదేరారు. ఆ బృందానికి ఒక నాయకుడిని ఎంపిక చేసుకున్నారు. గుట్టపైకి వెళ్ళే దారి చూపడానికి ఒక స్థానికుడిని మాట్లాడుకున్నారు. నామం పెట్టుకుని, చేతిలో కర్ర, తలకి టోపీ, చలువ కళ్ళద్దాలు తొడిగి చెప్పులు లేకుండా ఆ బృందం బయలుదేరింది. గుట్ట ఎక్కుతున్న వారిని చూసి అక్కడి గ్రామాల ప్రజలు ‘ఈ పిల్లోళ్ళకి ఎంత భక్తి, ఎంత భక్తి’ అని పొగడ్తల వర్షం కురిపించారు.కొద్దిదూరం నడిచాక గుట్ట మీద ఉన్న గడ్డిని చూసి ఒక మెడికో అమ్మాయి ‘‘ఇక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకున్నాము, కానీ ఇక్కడేమిటి, అంతా గోధుమ రంగులో ఉంది’’ అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె చూసింది పూరికప్పు వేసుకోవడానికి ఉపయోగించే బోద గడ్డి అది. ఎండకి బాగా ఎండి అది గోధుమ రంగులోకి మారి ఉంది.దారి చూపే స్థానికుడు ఆమె మాటలకు చిన్న నవ్వు నవ్వాడు. ‘‘మేము దీన్ని గోధుమ రంగు గుట్ట అని పిలవం, బంగారు గుట్ట అని పిలుస్తాం’’ అని చెప్పాడు. పక్కనే ఉన్న బృందనాయకుడు మనం ఈ గుట్టమీదున్న గడ్డిని చూసి గోధుమ రంగు గుట్ట అనుకుంటున్నాము, దాన్నే భక్తి భావంతో, ఆశావాద దృక్పథంతో ఉన్న ఇక్కడి వారు బంగారు గుట్టగా భావిస్తున్నారు. మన దృక్పథాన్ని పునః పరిశీలించుకోవాల్సి ఉందని వివరించాడు.మాటల్లోనే గుట్ట మీదకు చేరుకున్నారు. అక్కడున్న ఏనుగు పాదాలు, గుర్రపు పాదాల అడుగులు చూసి ఆశ్చర్యపోయారు. స్వామి పాదం పక్కనే ఉన్న దొనలో కాళ్ళు చేతులు కడుక్కుని పూజలు చేసి గోవిందలు పలుకుతూ వెనుదిరిగారు.దిగుతూ ఉంటే భక్తి పారవశ్యంతో ఉన్న ఆ మెడికో అమ్మాయికి గుట్ట మీదున్న గడ్డి అందంగా, బంగారు రంగులో కనిపించింది. ఏదైనా చూసే మనసును బట్టి ఉంటుంది ఈ ప్రపంచం అని తెలుసుకుంది ఆ అమ్మాయి. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు
అలనాటి అస్త్రాలు...
మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఉపయోగించారు అనే విషయాలను గురించి రెండు వారాలుగా తెలుసుకుంటూ వస్తున్నాం కదా... ఈ వారం ఆ అస్త్రాలలో మరికొన్ని ప్రధానమైన వాటి గురించి తెలుసుకుని అలనాటి అస్త్రాలు శీర్షికకు ముగింపు పలుకుదాం...సుదర్శన చక్రం...మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని ఆయుధం సుదర్శన చక్రం. 108 రంపపు పళ్ల ఆకారంలో కొనలు పదునుదేరి, లక్ష్య భేదితమైన సుదర్శన చక్రం పని పూర్తికాగానే, ఎవరైతే ప్రయోగించారో వారివద్దకే చేరుతుంది. మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు తన సుదర్శనచక్రంతో శిశు పాలుని సంహరించాడు.నారాయణాస్త్రం...ఈ అస్త్రం విష్ణుమూర్తికి చెందినది. దీనిని ప్రయోగించడం శ్రీకృష్ణుడు, ద్రోణాచార్యుడు,అశ్వత్థామలకు మాత్రమే తెలుసు. కొన్ని పదుల క్షిపణులు ఒకేసారి ప్రయోగిస్తే ఎంత శక్తిమంతంగా ఉంటుందో నారాయణాస్త్రం కూడా అంత శక్తిమంతంగా ఉంటుంది. దీని బారినుంచి ఎవరూ తప్పించుకోలేరు... ప్రతిఘటించలేరు. ఈ అస్త్రం ప్రయోగించిన సమయంలో ఎవరి వద్ద ఆయుధాలు ఉన్నా వాటిని త్యజించి నారాయణాస్త్రానికి లొంగిపోవాలి. లేకుంటే తన లక్ష్యసాధనను ఈ అస్త్రం నెరవేర్చి తీరుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అందరు యోధులు ఆయుధాలు త్యజించి లొంగిపోగా ఒక్క భీముడు మాత్రమే ఎదురు తిరిగాడు. అయితే జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణపరమాత్మ సూచన మేరకు భీముడు కూడా లొంగిపోయి నారాయణాస్త్రానికి నమస్కరించడంతో కథ సుఖాంతమైంది.వజ్రాయుధం...దేవతల రాజయిన ఇంద్రుని ఆయుధం. దీనిని దధీచి మహర్షి వెన్నెముక నుండి తయారు చేసారు. దీనిని ఇంద్రుడు తన కుమారుడైన అర్జునునికి ఇచ్చాడు. ఈ ఆయుధం విశ్వంలో ఉన్న కాంతిని సేకరించుకొని మెరుపులతో దాడి చేసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దీనిని వృత్తాసురుని సంహరించేందుకు అర్జునుడు ఉపయోగిస్తాడు. ఎందుకంటే వృత్తాసురుడు మహా శక్తిసంపన్నుడు.ఎంతో తపస్సు చేసి తనను ఎటువంటి లోహంతో తయారు చేసిన ఆయుధంతో సంహరించినా మరణం లేకుండా వరం పొందాడు. ఈ విషయంపై దేవతలు శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకోగా, ఎంతో తపఃశక్తి కలిగిన భృగుమహర్షి కుమారుడైన దధీచి మహర్షి ప్రాణత్యాగం చేయడంతో ఆయన వెన్నెముకతో వజ్రాయుధాన్ని తయారు చేశారు.వాసవీ శక్తి లేదా శక్త్యాయుధంఇది ఇంద్రుని ఆయుధం. కర్ణుని కవచ కుండలాలను దానం అడిగిన ఇంద్రుడు, కర్ణుని దానగుణానికి ఆశ్చర్యపోయి కర్ణునికి ప్రతిఫలంగా తనవద్ద వద్ద ఉన్న ఎంతో శక్తిమంతమైన వాసవీ శక్తి అస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఇది లక్ష్య సాధన కలిగింది. మహాభారత యుద్ధం లో ఈ అస్త్రాన్ని అర్జునునిపై ప్రయోగించేందుకు కర్ణుడు ప్రత్యేకంగా దాచాడు. అయితే 14వ రోజు యుద్ధంలో ఘటోత్కచుడు తన మాయో పాయం తో యుద్ధం చేస్తుంటే అతన్ని సంహరించడానికి వాసవీశక్తిని ప్రయోగించమని దుర్యోధనుడు కోరడంతో కర్ణుడు శక్త్యాయుధాన్ని ఘటోత్కచునిపై ప్రయోగించగా అతడు మహావృక్షం లా నేలకూలాడు. గాండీవంఖాండవవనాన్ని అర్జునుడు అగ్నిదేవునికి ఆహుతి ఇవ్వడంతో అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి గాండీవాన్ని ప్రసాదించాడు. స్వర్గ లోకంలో ఉన్న గాండీవ వృక్షం ద్వారా గాండీవం రూపొందించబడటంతో ఇది ఎంతో శక్తిమంతమైనది. బ్రహ్మదేవునివద్ద 1000 ఏళ్ళు, ప్రజాపతి వద్ద 503, చంద్రుని వద్ద 500, వరుణుడి వద్ద వందేళ్లు, ఇంద్రుని వద్ద 85 ఏళ్లూ ఈ గాండీవం ఉందని పురాణాల ప్రకారం తెలుస్తోంది. గాండీవానికి అక్షయ తూణీరం ఉంది. అంటే అంటే ఎన్ని బాణాలు వేస్తున్నా... అమ్ముల పొది ఖాళీ అవదు. ఇవే కాకుండా మరెన్నో శక్తిమంతమైన అస్త్రాలను మహాభారత యుద్ధంలో వినియోగించారు.పాశుపతాస్త్రంఇది పరమేశ్వరుని దివ్య అస్త్రం. ఈ అస్త్రం కోసం అర్జునుడు పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు ఆచరించాడు. ఇది ఎంతో విధ్వంసకరమైనది. దీనిప్రయోగం పరశురామ, అర్జున, కర్ణులకి మాత్రమే తెలుసు. అలనాటి రామాయణంలో రావణకుమారుడైన ఇంద్రజిత్కు తెలుసు. కానీ మహాభారత యుద్ధంలో గురుశాపం వల్ల కర్ణుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించలేకపోతాడు.– సి.ఎన్.మూర్తిసీనియర్ జర్నలిస్ట్
బిడ్డకు సరైన రీతిలో పాలు పట్టడం ఎలాగంటే..!
ఇంట్లోకి కొత్త అతిథిగా ఓ చిన్నారి రావడం ఒక సంతోషకరమైన విషయం. ఈ సంతోషంతో పాటు చాలా రకాల సందేహాలూ వస్తుంటాయి. మరీ ముఖ్యంగా కొత్తగా తల్లి అయిన మహిళను అనేక సందేహలు వెంటాడుతుంటాయి. బిడ్డకు తాను సరిగానే పాలు పడుతున్నానా, అవి బిడ్డ ఒంటికి పడుతున్నాయా... బిడ్డ ఆరోగ్యకరంగా బరువు పెరుగుతుందా లేదా అనే డౌట్స్ చాలా సహజం. కొత్త తల్లి బిడ్డకు సరిగా పాలు పడుతోందా లేదా అనే సందేహాలతో పాటు బిడ్డకు సరైన రీతిలో రొమ్ముపాలు పట్టడం ఎలాగో తెలుసుకోండి. మనదేశంలో చిన్నారులు పుట్టినప్పుడు 2.5 కిలోల నుంచి 3 కిలోల వరకు బరువుంటారు. అప్పుడే పుట్టిన బిడ్డ బరువు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదా... పేరెంట్స్ జీన్స్, తల్లి ఆహారపు అలవాట్లు, గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు వచ్చిన ఆరోగ్య సమస్యలు, తల్లి బరువు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పిల్లలు పుట్టాక మొదటి వారంలో– పుట్టినప్పుడు ఉన్న బరువు కంటే కాస్తంత తగ్గుతారు. అంటే మొదటి వారం పదిరోజుల్లో 5 శాతం నుంచి 10 శాతం బరువు తగ్గుతారు. ఆ తర్వాత నుంచి (రెండో వారం నుంచి) మళ్లీ క్రమేణా బరువు పెరగడం మొదలవుతుంది. మొదటి మూడు నెలల్లో దాదాపు రోజుకు 20 నుంచి 30 గ్రాములూ, నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు రోజుకు 10 నుంచి 15 గ్రాముల వరకు పిల్లలు బరువు పెరుగుతారు. చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. పాపలు పుట్టిన నాటితో పోలిస్తే మొదటి ఆరు నెలలలో రెట్టింపు బరువు (డబుల్), ఏడాది నాటికి మూడు రెట్లు (ట్రిపుల్) తప్పనిసరిగా పెరగాలని లేదు. అలా పెరగడానికి, పెరగకపోవడానికి అనేక అంశాలు కారణమవుతాయి.చిన్నారులు తగినంత బరువు పెరగడం లేదంటే... పిల్లలు బరువు పెరగకుండా క్రమంగా తగ్గుతూ పోతుంటే లోపం ఎక్కడుందనేని జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రధానంగా తల్లి పాలు సరిపోకపోవడమో లేదా బిడ్డ సరిగా తాగకపోవడమో లేదా చిన్నారి పూర్తిగా పాలు తాగకుండా కొద్దిగా తాగి పడుకుంటూ ఉండటమో కారణం కావచ్చు. బిడ్డ పాలు తాగేప్పుడు రెండు రకాల పాలు వస్తాయి. మొదటిది తొలిగా వచ్చే పాలు. వీటిని ఫోర్ మిల్క్ అంటారు. రెండోది మలిసారి పాలు... వీటిని హైండ్ మిల్క్ అంటారు. పాప కాసిన్ని పాలు తాగక వచ్చేవే హైండ్ మిల్క్. వాస్తవానికి ఫోర్ మిల్క్ కంటే... హైండ్ మిల్క్ చాలా బలవర్ధకమైనవి. ఇందులోని క్యాలరీలు బరువు పెరగడానికి దోహదపడతాయి. ఈ ఫోర్ మిల్క్ను ప్రసవం కాగానే స్రవించే ముర్రుపాలతో పొరబాటు పడవద్దు. ముర్రుపాలు వేరు, ఫోర్ మిల్క్ వేరు. పుట్టగానే స్రవించే ముర్రుపాలు బిడ్డకు చాలా మంచి చేస్తాయి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి. ఫోర్ మిల్క్ అంటే... ప్రతిసారీ పాలు తాగడం మొదలు పెట్టగానే మొదట స్రవించేవి. ఓ పది–పదిహేను గుటకల తర్వాత స్రవించేవి హైండ్ మిల్క్.చిన్నారి ఆరోగ్యంగా బరువు పెరగడానికి అవసరమైన జాగ్రత్తల్లో కొన్ని... పాపకు ప్రతి రెండు–మూడు గంటలకు ఓమారు పాలు తాగించడం ఓ రొమ్ము పట్టించినప్పుడు పాప ఆ రొమ్ము నుంచి పాలు పూర్తిగా తాగిందో లేదో నిర్ధారణ చేసుకోవడం. అంటే ఒక రొమ్ము నుంచి పాలు తాగాక పాపకు అదే రొమ్ము అందిస్తే ముఖం తిప్పుకోవడం, రొమ్ము అందుకోకపోవడం చేస్తుంది) ఓ రొమ్ములోని పాలు పూర్తిగా పట్టించాకే రెండో రొమ్ము కూడా అందించడం రెండు రొమ్ముల్లోని పాలు ఇవ్వాలంటూ ఒక రొమ్ములోని ΄పాలు కాసిన్ని, మరో రొమ్ములోని పాలు మరికాసిన్ని ఇవ్వవద్దుపడుకునే సమయంలో తప్పనిసరిగా పాప పక్కనే పడుకోవడం. (పాప పక్కనే ఉండటం వల్ల ప్రోలాక్టిన్ హార్మోన్ స్రవించడం పెరిగి పాలు ఎక్కువగా వస్తాయి) బిడ్డ స్పర్శ ఎప్పుడూ తల్లికి తగిలేలా (స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండేలా) చూసుకోవడం మీ పాపకు పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోడానికి పాప రోజులో ఎన్నిసార్లు పక్క తడుపుతోంది అన్న విషయమూ ఓ పరోక్ష సూచనే. బిడ్డ పగలు కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు పక్కతడుపుతుంటే తనకు పాలు సరిపోతున్నాయని అనుకోడానికి ఓ సూచనగా తీసుకోవచ్చు.డా. శివనారాయణ రెడ్డి వెన్నపూస, సీనియర్ నియోనేటాలజిస్ట్ – పీడియాట్రీషియన్ (చదవండి: వైద్యవృత్తిని చేపట్టిన సాఫ్ట్వేర్ ఇంజనీర్..!)
లగ్జరీ కారు యజమాని పెద్దమనసు..! ఆ ఆటో డ్రైవర్ కోసం..
లగ్జరీ కారులు నడిపే వాళ్లు ఏ రేంజ్లో ఉంటారో తెలిసిందే. అంత సులభంగా ఓ సాదాసీదా వ్యక్తులతో మాటలు కలపడం అత్యంత అరుదు. అలాంటిది సరదాగా వాళ్ల వస్తువులను ఒక్కసారి ట్రై చేస్తాం అని అడగడం అంత సులభం కానే కాదు. ఒక వేళ అడిగినా.. ఇస్తారని గ్యారంటీ లేదు. కానీ ఈ లంబోర్ఘిని యజమాని తన గొప్ప మనసును చాటుకుని..నెట్టింట నెటిజన్లను ఫిదా చేశాడు. అసలేం జరిగిందంటే..రాకేష్ కుమార్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని పంచుకున్నారు. ఆ వీడియోలో అతను లంబోర్ఘినిని నడుపుతుండగా రోడ్డుపై ఒక ఆటోరిక్షాను గమనిస్తాడు. సాధారణంగా మొదలైన పరిచయం తర్వాత..ఆ డ్రైవర్ నెమ్మదిగా తన మనసులోని మాటను బయటపెడతాడు. వెంటనే యజమాని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సమ్మతి తెలపడమే కాకుండా ఇరువురు వాళ్ల వాహనాల తాళాలను మార్చుకుంటారు. ఆ డ్రైవర్ చక్కగా లంబోర్ఘిని నడుపుతూ తన కోరికని తీర్చుకుంటాడు. ఇక సదరు యజమాని ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆ ఆటో రిక్షాను డ్రైవ్ చేస్తాడు కూడా. అక్కడితో వీడియో ముగుస్తుంది. ఇక కుమార్ ఈ వీడియోని షేర్ చేస్తూ..ఈ మరపురాని క్షణం కోసం నేను నా లంబోర్ఘినిని పణంగా పెట్టాను! నిజం చెప్పాలంటే, అతని ఆటో నడపడం నన్ను బాగా కదిలించింది. ఆటో మీటర్ డబ్బులు కట్టడమే ఒక సవాలుగా ఉన్న నా కష్టాల రోజుల్లోకి ఇది నన్ను తీసుకువెళ్ళింది అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. ఈ క్లిప్పై విశేషమైన స్పందన వచ్చింది. ఆ ఆటో డ్రైవర్ ముఖం నవ్వుతో వికసించగా, ..ఈ యజమాని గొప్ప మనసు దయకు మాటల్లేవ్ అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by RAKESH KUMAR (@rakesh_knv) (చదవండి: Aamir Khan And Gauri Spratt : అలా మొదలైంది వారి ప్రేమ కథ..! 25 ఏళ్ల క్రితమే..)
అంతర్జాతీయం
ఎప్పటికీ అగ్రస్థానంలోనే..
వాషింగ్టన్: అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆనందకరమైన, అద్భుతమైన మైలురాళ్లలో ఒకటిగా అభివర్ణించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాజధాని వాషింగ్టన్లోని నేషనల్ మాల్లో ‘సెల్యూట్ అమెరికా’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న యోధులతోపాటు పలువురు ప్రముఖులను సత్కరించారు. వియత్నాం యుద్ధరంగంలో ప్రత్యేక దళాలకు నాయకత్వం వహించిన తొలి నల్లజాతి అధికారిని సన్మానించారు.తనదైన శైలిలో ప్రసంగిస్తూ జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కమ్యూనిజంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మనం ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటామని అమెరికన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికాను ఎట్టిపరిస్థితుల్లోనూ పతనం కానివ్వబోమని తేల్చిచెప్పారు. తాము ఎల్లప్పుడూ అత్యుత్తమంగానే ఉంటామన్నారు. ‘సేవ్ అమెరికా చట్టాన్ని’ ఆమోదించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.‘‘రోజు మన దేశం మళ్లీ విజయం సాధిస్తోంది. మునుపెన్నడూ లేనంత గొప్పగా పునరాగమనం చేసింది. మనం అమెరికాను గొప్పగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తాం. దీని ప్రకారం ఓటర్లందరూ తమ ఓటరు గుర్తింపు కార్డును చూపించాలి. అలాగే పౌరసత్వానికి సంబంధించిన రుజువును తప్పనిసరిగా సమర్పించాలి’’ అని ట్రంప్ తేల్చిచెప్పారు. ఇది నాకు ‘మూడో పర్యాయం’మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతానని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. తన హయాంలో అమెరికా సైన్యం ఎన్నో విజయాలు సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. దేశ సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నానని వివరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. తన ప్రస్తుత అధ్యక్ష పదవీకాలాన్ని ‘రెండో పర్యాయం’ అని కాకుండా ‘మూడో పర్యాయం’ అని పిలిచి ఉండాల్సిందని చెప్పారు. 2020 నాటి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందుకే బైడెన్ గెలిచారని ట్రంప్ పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.వాస్తవానికి ఆ ఎన్నికల్లో విజయం తనదేనని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన, శక్తివంతమైన దేశంగా అమెరికా ఎదగడం చరిత్రలో యాదృచి్ఛకంగా జరిగిన పరిణామం కాదని ట్రంప్ తేల్చిచెప్పారు. అధ్యక్షుడిగా తన మొదటి పదవీ కాలంలో సైన్యాన్ని గొప్పగా పునరి్నరి్మంచామని అన్నారు. వాస్తవానికి సైన్యాన్ని మూడో పదవీకాలంలో ఉపయోగిస్తామని చెప్పాలని వెల్లడించారు. కానీ, అలా చెప్పే ఉద్దేశం లేదన్నారు. వివాదానికి ఆస్కారం కల్పించడం తనకు ఇష్టం లేదన్నారు. స్వర్ణయుగానికి ఆరంభం మాత్రమేఎంతోమంది వీరుల త్యాగంతో అమెరికా జెండా ఎల్లప్పుడూ స్వేచ్ఛ, న్యాయాలకు చిహ్నంగా నిలుస్తోందని ట్రంప్ అన్నారు. చరిత్రకు సాక్షిగా నిలిచిన పలు అమెరికా జాతీయ జెండాలను నేషనల్ మాల్లో ప్రదర్శించారు. అమెరికా తొలినాటి జెండా కూడా ఇందులో ఉంది. 1777 నాటి జెండాను ట్రంప్ చూపించారు. అప్పట్లో 13 రాష్ట్రాలకు ప్రతీకగా 13 నక్షత్రాలు, 13 పట్టీలు ఉన్న జెండా అని చెప్పారు. యార్క్టౌన్ యుద్ధ సమయంలో విజయగర్వంతో రెపరెపలాడిన నక్షత్రాలు, పట్టీల జెండాను గుర్తుచేసుకున్నారు.నిరంకుశత్వంపై స్వేచ్ఛ సాధించిన విజయాన్ని, అణచివేతపై స్వాతంత్య్రం పొందిన ఆధిక్యతను 1776 జూలై 4 నుంచి 2026 జూలై 4 వరకు అమెరికన్ స్ఫూర్తి సాధించిన చిరస్థాయి విజయాన్ని నేడు గొప్ప వేడుకగా నిర్వహించుకుంటున్నామని వివరించారు. అమెరికాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఇది అమెరికా స్వర్ణయుగానికి ఆరంభం మాత్రమే. రెండున్నర శతాబ్దాల క్రితం నాటి తరహాలోనే ఒక విషయాన్ని ప్రకటిస్తున్నాం. మా దేశం, మా పిల్లల కోసం, స్వేచ్ఛా ఆశయం కోసం మా దేశాన్ని ఎవరూ చేరుకోని సరికొత్త శిఖరాలకు చేరుస్తాం.దేశాన్ని మరింత గొప్పగా, మెరుగ్గా, శక్తివంతంగా తీర్చిదిద్దుతాం. అమెరికాను మరింతగా ప్రేమిస్తాం’’ అని ట్రంప్ స్పష్టంచేశారు. అనారోగ్యం, వైకల్యం, సైనిక విధి నిర్వహణ లేదా ప్రయాణం వంటి అనివార్య కారణాలు ఉంటే తప్ప ఇకపై పోస్ట్ ద్వారా ఓటు వేసే విధానం ఉండదని చెప్పారు. దాంతో ఎన్నికల్లో మోసాలకు అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇందులో అర్థం కాని విషయం ఏదీ లేదన్నారు.కమ్యూనిజాన్ని ట్రంప్ మళ్లీ తప్పుపట్టారు. ‘‘కమ్యూనిస్ట్ వ్యవస్థ అమెరికన్ వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది. కమ్యూనిస్ట్ వ్యవస్థ ఎప్పుడూ విజయవంతం కాలేదు. ఆ ప్రమాదకరమైన వ్యవస్థ తిరిగి అమెరికాలో తన వికృత రూపాన్ని చూపిస్తామంటే ఇక్కడ ఎవరూ ఒప్పుకోరు. అమెరికా ఎప్పటికీ కమ్యూనిస్ట్ దేశం కాదు’’ అని ట్రంప్ పునరుద్ఘాటించారు.
పాక్ ఎయిర్ఫోర్స్ కెప్టెన్ అసీమ్ తారిక్ను కాల్చి చంపిన దుండగులు
ఇస్లామాబాద్లో ఓ మహిళను అపహరించేందుకు దుండగులు ప్రయత్నించగా, ఆమెను కాపాడే క్రమంలో జోక్యం చేసుకున్న పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ను వారు కాల్చిచంపినట్టు పాకిస్థాన్ సమా టీవీ తెలిపింది.ఈ ఘటన మార్గల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ చౌక్ వద్ద జరిగింది. మృతుడిని గ్రూప్ కెప్టెన్ అసీమ్ తారిక్గా గుర్తించారు. ఆయన నైన్త్ అవెన్యూ మీదుగా వెళ్తుండగా ఓ వ్యక్తి మోటార్సైకిల్పై ఓ మహిళను బలవంతంగా ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్టు గమనించినట్టు సమాచారం.సమా టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రూప్ కెప్టెన్ తారిక్ జోక్యం చేసుకుని దాడిని అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ రోడ్డుకు అవతలి వైపునకు పారిపోయింది. ఈ సమయంలో అనుమానితుడు సాద్ అధికారి పట్ల దుర్భాషలాడి, ఆ తర్వాత కాల్పులు జరిపినట్టు తెలిపింది. ఈ కాల్పుల్లో అధికారి తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే మృతి చెందగా, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆధారాలు సేకరిస్తున్నారు. మహిళ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ సమా టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఆమె సహోద్యోగి. ఉద్యోగానికి తీసుకెళ్తానని చెప్పి మార్గం మళ్లించి మరో చోటుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని తెలిపింది. ఆమె ప్రతిఘటించడంతో పరిస్థితి మరింత విషమించేలోపు అధికారి జోక్యం చేసుకున్నారు.అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ ఈ ఘటనపై ఇస్లామాబాద్ పోలీస్ చీఫ్ నుంచి అత్యవసర నివేదిక కోరారు. నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉక్రెయిన్ చేతిలో ఓడిపోతున్న రష్యా..!!
నాలుగేళ్ల క్రితం.. 2022 ఫిబ్రవరి 24న మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక సంచలన మలుపు తిరిగింది. ఒకప్పుడు ఉక్రెయిన్ను కేవలం మూడు రోజుల్లో లొంగదీసుకుంటామని భావించిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు, ఇప్పుడు 2026లో కోలుకోలేని షాక్ తగిలిందా? ఐదో ఏట అడుగుపెట్టిన ఈ యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తోందా? రష్యా సైనిక వ్యవస్థతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే స్థితికి చేరుకుందా?రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ వేసినట్లు 2026 చివరి నాటికి డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు పుతిన్ ముందు రెండే దారులు ఉన్నాయి. ఆ దారులు ఏంటి? ఉక్రెయిన్ భారీ గ్రౌండ్ అటాక్స్కు బదులుగా ఏ కొత్త యుద్ధ వ్యూహాన్ని అమలు చేస్తోంది? ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థలో ఏ ప్రధాన రంగం ఎక్కువగా దెబ్బతింది? మొదటగా రష్యా సాధించిన పురోగతిని ఒక్కసారి గమనిస్తే.. 2014లో మొదటి విడతగా రష్యా కేవలం 7 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత 2022లో పూర్తిస్థాయి దండయాత్ర మొదలుపెట్టినప్పుడు.. గరిష్టంగా 27 శాతం భూభాగాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. కానీ, ఉక్రెయిన్ ఎదురుదాడితో అది 18 శాతానికి పడిపోయింది. అయితే, గత మూడున్నరేళ్లుగా రష్యా సాధించింది ఏంటో తెలుసా? కేవలం ఒకటిన్నర శాతం (1.5%) అదనపు భూభాగం మాత్రమే! వినడానికి ఇది చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఈ చిన్న ముక్క కోసం రష్యా చెల్లించిన మూల్యం ఎంతో తెలిస్తే మీ గుండె గుభేల్ మంటుంది. గత మూడున్నరేళ్లలో ఈ 1.5 శాతం భూమిని గెలవడానికి దాదాపు 5 లక్షల మంది మరణించినట్లు.. మరో 7 లక్షల మంది తీవ్రంగా లేదా పాక్షికంగా గాయాలపాలైనట్లు అంతర్జాతీయ నిఘా వర్గాల విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 10 లక్షలకు పైనే ఉంటుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ కంటే చిన్నదైన ఈ భూభాగం కోసం రష్యా ఇంతటి రక్తపాతాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంటే రష్యాలోని మొత్తం పోరాడే వయసున్న యువకుల్లో 3 శాతం మంది ఈ యుద్ధంలో తుడిచిపెట్టుకుపోయారు. 21వ శతాబ్దంలో ఇంతటి ఘోరమైన గణాంకాలు బహుశా ఏ దేశానికీ లేవు.అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే.. రష్యా సైనికుల మరణాల రేటు 2026లో విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం రష్యా నెలకు సగటున 35 వేల మంది సైనికులను నష్టపోతోంది. రష్యా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల యువకులకు సాధారణ జీతం కంటే 7 నుంచి 8 రెట్లు ఎక్కువ డబ్బులు, ఉచిత భూములు, రుణాల మాఫీ ఆశ చూపి సైన్యంలో చేర్చుకున్నప్పటికీ.. ఇప్పుడు చనిపోతున్న వారి సంఖ్యతో పోలిస్తే కొత్తగా చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంటే, రష్యాకు ఇప్పుడు 'మ్యాన్పవర్' కొరత స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా దాదాపు 6 లక్షల మంది సైనికులను కోల్పోయింది. జనాభా పరంగా చూస్తే ఉక్రెయిన్కు ఇది 7 శాతం నష్టం. అందుకే ఉక్రెయిన్ తన పాత వ్యూహాన్ని మార్చింది. రష్యా ఆక్రమించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సైనికులను పంపే భారీ గ్రౌండ్ అటాక్స్ పద్ధతిని పక్కన పెట్టి.. 'అసిమెట్రిక్ వార్ఫేర్' అంటే డ్రోన్ల ద్వారా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది.అవును, ఉక్రెయిన్ ఇప్పుడు సరిహద్దుల పొడవునా వందల కిలోమీటర్ల మేర ఒక 'డ్రోన్ గోడ' నిర్మించింది. దాదాపు 150కి పైగా స్థానిక కంపెనీలతో మిలియన్ల కొద్దీ FPV డ్రోన్లను తయారు చేయిస్తోంది. ఈ డ్రోన్ల నిఘా వల్ల రష్యా సైన్యం కదలడమే కష్టంగా మారింది. గాయపడిన సైనికులను కాపాడటానికి హెలికాప్టర్లు కూడా రాలేకపోతున్నాయి. ఫలితంగా ఒకప్పుడు రష్యా వైపు గాయపడిన 10 మందిలో ఒకరు చనిపోతే, ఇప్పుడు ప్రతీ నలుగురిలో ఒకరు చనిపోతున్నారు. అంతేకాదు, ఉక్రెయిన్ ఏకంగా 1,750 కిలోమీటర్ల దూరం ప్రయాణించే లాంగ్-రేంజ్ డ్రోన్లతో రష్యా లోపలికి చొచ్చుకుపోతోంది. రష్యాకు ప్రధాన ఆదాయ వనరైన ఆయిల్, గ్యాస్ రిఫైనరీలపై ఉక్రెయిన్ 'కైనెటిక్ శాంక్షన్స్' పేరిట విరుచుకుపడుతోంది. మొన్న ఏప్రిల్, మే నెలల్లోనే దాదాపు 20 రష్యన్ ఆయిల్ రిఫైనరీలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం రష్యా ఆయిల్ ఎగుమతులు రోజుకు 3 లక్షల బారెళ్లకు పడిపోయాయి. 2009 తర్వాత రష్యాలో ఇంత తక్కువ ఆయిల్ ఉత్పత్తి జరగడం ఇదే మొదటిసారి.రష్యాకు తగులుతున్న షాక్లు ఇక్కడితో అయిపోలేదు. అంతరిక్షంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా వాడుతున్న స్టార్లింక్ ఇంటర్నెట్ టెర్మినల్స్ను స్పేస్ ఎక్స్ సంస్థ బ్లాక్ చేసింది. దీనివల్ల రష్యా సైనిక కమ్యూనికేషన్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. అలాగే రష్యా ప్రభుత్వం దేశంలో టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేయడం వల్ల వారి సొంత కమ్యూనికేషన్స్ కూడా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా చూస్తే రష్యా పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. రష్యా తన ద్రవ్యోల్బణం కేవలం 5 శాతమే అని చెబుతున్నా, స్వీడన్ నిఘా వర్గాల ప్రకారం అది నిజానికి 15 శాతానికి పైనే ఉంది. రష్యా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఏకంగా 21 శాతానికి పెంచడమే దీనికి నిదర్శనం. యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండటంతో రష్యా ప్రజల్లో పుతిన్ పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఒకప్పుడు 77 శాతం ఉన్న పుతిన్ అప్రూవల్ రేటింగ్ ఇప్పుడు 65 శాతానికి పడిపోయింది. బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి రష్యా తలప్రాణం తోకకు వస్తోంది. కానీ ఉక్రెయిన్ కథ వేరు. ఐరోపా సమాఖ్య నుంచి ఉక్రెయిన్కు 90 బిలియన్ యూరోల వడ్డీ లేని భారీ రుణం మంజూరైంది. విశేషం ఏంటంటే.. ఈ అప్పును రష్యా చెల్లించాల్సిన యుద్ధ నష్టపరిహారం నుంచే వసూలు చేయాలని ఐరోపా సమాఖ్య భావిస్తోంది. జర్మనీ, బ్రిటన్, డెన్మార్క్ వంటి దేశాలు నేరుగా ఉక్రెయిన్తో కలిసి డ్రోన్లు, రాకెట్ ఇంధనాన్ని తయారు చేస్తున్నాయి.ఇవన్నీ గమనిస్తుంటే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ వేసినట్లు 2026 చివరి నాటికి డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు పుతిన్ ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి.. అవమానాన్ని భరిస్తూనే యుద్ధాన్ని ఆపేసి సీజ్ఫైర్ (Ceasefire) ప్రకటించడం. రెండు.. మరో 2 లక్షల మందిని బలవంతంగా సైన్యంలోకి చేర్చుకుంటూ రెండో విడత జనరల్ మొబిలైజేషన్ ప్రకటించడం. కానీ రెండో దారి ఎంచుకుంటే రష్యా ప్రజల నుండి తీవ్ర తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా, 2026 సంవత్సరం ఉక్రెయిన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మరి రష్యా ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుంది? పుతిన్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. :: హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు
ట్రంప్నకు ఝలక్.. మాజీ అధ్యక్షుల సందేశంపై కొత్త చర్చ!
వాష్టింగన్: అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తైన సందర్భంలో విడుదలైన ఒక రాజకీయ సందేశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, అలాగే డెమోక్రటిక్ నేత, న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా వలస విధానాలు మరియు ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలపై వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందేశం సాధారణంగా దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంలో వెలువడటంతో, దీనికి మరింత రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. జాతీయ స్థాయిలో వేడుకల వాతావరణం కొనసాగుతుండగా, ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో ఉన్న విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.వలస విధానాలపై తీవ్ర విమర్శలుమాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ మరియు ఒబామా తమ సందేశంలో అమెరికా వలస విధానాలు గతంతో పోలిస్తే మరింత కఠినతరంగా మారాయని పేర్కొన్నారు. వారి అభిప్రాయం ప్రకారం, అమెరికా స్థాపించిన విలువలలో ఒకటైన అవకాశాల సమానత్వం ప్రస్తుతం ప్రమాదంలో పడుతోందని వారు హెచ్చరించారు. వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాజిక వైవిధ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అమెరికా చరిత్రలో వలసదారుల పాత్ర కీలకమని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని సూచించారు.ఇరాన్ ఉద్రిక్తతలపై ఆందోళనవిదేశాంగ విధానాల అంశంలో ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని మాజీ అధ్యక్షులు హెచ్చరించారు. దౌత్యపరమైన చర్చలకు బదులు సైనిక ధోరణి పెరుగుతుందన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా.. ప్రపంచ శాంతి మరియు స్థిరత్వంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, ఆ లక్ష్యానికి దౌత్య మార్గాలే ప్రధానంగా ఉండాలని వారు సూచించారు.మమ్దానీ ఫైర్.. మరోవైపు.. న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కూడా ఈ సందేశంలో పాల్గొని, ప్రస్తుత విధానాలు సామాన్య ప్రజల అవసరాలను పక్కన పెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం, వలసలు, ఆర్థిక అసమానతలు వంటి అంశాల్లో ప్రభుత్వం మరింత మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సాధారణంగా జాతీయ ఐక్యత, గర్వానికి ప్రతీకగా నిలుస్తుంది. అయితే ఈసారి విడుదలైన ఈ రాజకీయ సందేశం, వేడుకల వాతావరణాన్ని కొంతవరకు రాజకీయ చర్చల వైపు మళ్లించింది. ఒకవైపు దేశ చరిత్రను స్మరించుకుంటూ వేడుకలు జరుగుతుండగా, మరోవైపు విధానాలపై విమర్శలు అమెరికా రాజకీయ వ్యవస్థలో ఉన్న విభేదాలను ప్రతిబింబిస్తున్నాయి.
జాతీయం
పార్టీకి పిలిచి, మూకుమ్మడి అత్యాచారయత్నం
బెంగుళూరు: రాజధానిలో ఘోరం జరిగింది. ఒక యువతిపై సామూహిక అత్యాచారయత్నం జరిగిన సంఘటన తలఘట్టపుర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది, ఈ ఘటనలో ప్రధాన నిందితులు సోమశేఖర్, అంబరీష్లతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేసే సోమశేఖర్ వద్దకు కలబుర్గి నుంచి నలుగురు స్నేహితులు వచ్చారు. దేవనహళ్లిలో ఉంటున్న తన స్నేహితురాలికి కాల్ చేసిన సోమశేఖర్, స్నేహితులు వచ్చారని, పార్టీకి రావాలని కోరాడు. సదరు యువతి వచ్చింది. అందరూ మద్యం తాగి విందు చేసుకున్నారు. ఈ సమయంలో అంబరీష్ యువతిపై అత్యాచారయత్నం చేశాడు. మిగతావారు అందుకు సహకరించారు. అదృష్టవశాత్తు ఆమె వారి నుంచి తప్పించుకుని 112 హెల్ప్లైన్కి కాల్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
జమ్ముకశ్మీర్లో కుండపోత వర్షాలు.. అంతటా హై అలర్ట్!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్, దోడా జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా హఠాత్తుగా వరదలు రావడానికి తోడు కొండచరియలు విరిగిపడ్డాయి. కిష్త్వార్లోని 540 మెగావాట్ల క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సమీపంలో సోమవారం ఉదయం ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో అక్కడి రహదారిపై వెళ్తున్న, నిలిపి ఉంచిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి, వాహనాలను వెలికితీసేందుకు చర్యలు చేపడుతున్నారు.మరోవైపు దోడా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పౌరజీవనం అస్తవ్యస్తమైంది. దోడా జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో దోడా-కిష్త్వార్ రహదారిని సోమవారం ఉదయం అధికారులు పూర్తిగా మూసివేశారు. రహదారిపై భారీ బండరాళ్లు, బురద పేరుకుపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికుల రాకపోకలతో పాటు అత్యవసర వస్తువుల రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. సంబంధిత శాఖల యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రహదారిని పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమైంది.కొండ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడం, నీరు నిలిచిపోవడం లాంటి సమస్యలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు తెలియరాలేదు. పరిపాలనా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, రోడ్ల మరమ్మతులు పూర్తయ్యే వరకూ అనవసర ప్రయాణాలు చేయవద్దని, తాజా వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు స్థానికులకు, ప్రయాణికులకు సూచించారు.ఇది కూడా చదవండి: ముంబైలో వర్ష బీభత్సం: ఆరుగురు మృతి
ఒక్క క్షణికావేశం.. జీవితంలో 37 ఏళ్లు నాశనమయ్యాయి!
బెంగళూరు: స్రత్పవర్తన ఆధారంగా రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి శనివారం 24 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో తొమ్మిది మంది బెంగళూరు నగరంలోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. తొందరపాటు నిర్ణయంతో నేరాలకు పాల్పడిన వీరు 14 ఏళ్లపాటు జైలు గోడల మధ్య గడిపారు. స్రత్పవర్తన ఆధారంగా జైలు నుంచి విడుదలయ్యారు. తెలిసో తెలియక నేరాలు చేసి జైలు జీవితం గడిపామని, క్షణికావేశంలో ఎవరూ నేరాలు చేయరాదని విడుదలైన పలువురు ఖైదీలు పేర్కొన్నారు. చిక్కమగళూరు వాసి మణికంఠ మాట్లాడుతూ హత్య కేసులో జైలు పాలై 15 ఏళ్ల పాటు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాన్నారు. క్షణికావేశంలో ఎవరూ నేరపూరిత చర్యలలో పాల్గొనకూడదన్నారు. మూడు హత్య కేసుల్లో 37 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన జీవర్గికి చెందిన సైబన్న లింగప్ప నట్టికర్ అనే వృద్ధుడు కూడా జైలు నుంచి విడుదలయ్యాడు. ఇన్నాళ్లూ జైలు గొడల మధ్య గడిపిన వారు కారాగారం నుంచి బయటకు వచ్చిన తర్వాత సంతోషం వ్యక్తం చేశారు. జైలు వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్నారు.
ప్రేయసితో కలిసి భార్యను కాల్చి చంపి, నేపాల్ చెక్కేశాడు!
పూణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యోదంతం ప్రకంపనలు కొనసాగుతుండగానే మరో దారుణమైన ఘటన హర్యానాలోని గురుగ్రామ్లో వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన కేవలం మూడు నెలలకే ఒక 25 ఏళ్ల అంకిత్ తన ప్రేయసి సహాయంతో భార్యను కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఆ తరువాత ఏమీ తెలియనట్టు నేపాల్కు పారిపోయారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలి తల్లి మనేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన 22 ఏళ్ల కుమార్తెకు ఫిబ్రవరిలో మనేసర్ నివాసి అంకిత్తో వివాహం జరిగిందని ఆమె పోలీసులకు తెలిపారు. మృతురాలు గత మే 21న అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికి, అత్తమామలను సంప్రదించినప్పటికీ సరైన సమాధానం లభించలేదు. దీంతో తమ కుమార్తె భర్త,అతని కుటుంబ సభ్యులపై అనుమానం రావడంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించారు.దర్యాప్తులో భాగంగా, పోలీసులు మే 22న మనేసర్లోని ఒక గదిలో ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను కాల్చి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితులైన భర్త ఏళ్ల అంకిత్, అతని ప్రేయసి, హర్యానాలోని ఝజ్జర్ జిల్లా నివాసి, 38 ఏళ్ల రజనీ దేవిలను అరెస్టు చేశారు. దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం, అంకిత్ మనేసర్లో పొగాకు దుకాణం నడుపుతుండగా, రజనీ అదే ప్రాంతంలోని ఒక బ్యూటీ పార్లర్లో పనిచేసేది.మూడేళ్ల ప్రేమాయణం , హత్య అంకిత్ ,రజనీ గత మూడేళ్లుగా రిలేషన్లో న్నట్టు పోలీసులు గుర్తించారు. భార్యను అడ్డు తొలగించేందుకు అంకిత్, తన భార్యను ఆ గదికి తీసుకెళ్లాడని, అక్కడ నిందితులిద్దరూ కలిసి ఆమెను కాల్చి చంపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యలో ఉపయోగించిన ఆయుధాన్ని ఘటనకు సుమారు రెండు నెలల ముందే ఉత్తరప్రదేశ్లో కొనుగోలు చేశారట.. కేవలం ఈ హత్యను చేసేందుకే ఆ ఆయుధాన్ని కొనుగోలు చేసి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.గుట్టు చప్పుడు కాకుండా నేపాల్కు పోలీసుల సమాచారం ప్రకారం, హత్య జరిగిన తర్వాత అంకిత్ , రజని హరిద్వార్కు పారిపోయి, ఆ తర్వాత నేపాల్ వెళ్లిపోయారు.జూన్ 30న తిరిగి భారతదేశానికి వచ్చే వరకు నిందితులు పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మనేసర్లో క్రైమ్ బ్రాంచ్ బృందం వారిని అరెస్టు చేసింది. ప్రస్తుతం కోర్టు వీరిద్దరికీ 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. నిందితులను విచారిస్తున్నామని, హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అదనపు ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి : కేతన్ హత్య : కోడ్వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’
ఎన్ఆర్ఐ
ఉత్తర అమెరికాలో తెలుగు భాషాభివృద్ధిలో మరో మైలురాయి
ఉత్తర అమెరికాలో తెలుగు భాషా బోధనకు అంకితభావంతో పనిచేస్తున్న సిలికానాంధ్ర మనబడి, మరోసారి తన విద్యా ప్రస్థానంలో విశిష్ట విజయాన్ని నమోదు చేసింది. గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లుగానే, ఈ సంవత్సరం కూడా జూనియర్ సర్టిఫికేట్, సీనియర్ సర్టిఫికేట్ స్థాయులలో నిర్వహించిన వార్షిక తెలుగు విద్యా పరీక్షలకు మొత్తం 3,037 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలను భారతదేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పర్యవేక్షించింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులలో 98.74% శాతం మంది ఉత్తీర్ణత సాధించడం, ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాల పిల్లల్లో తెలుగు భాషా పరిరక్షణ, ప్రచారం కోసం సిలికానాంధ్ర మనబడి చేస్తున్న కృషికి గొప్ప గుర్తింపుగా నిలిచింది. పరీక్షల నిర్వహణ కోసం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.మునిరత్నం నాయుడు, పరీక్షల నియంత్రణాధికారి డా.ముసుగు శ్రీనివాసరావు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. 56 కేంద్రాల్లో పరీక్షలు అమెరికా, కెనడా వ్యాప్తంగా ఉన్న 56 కేంద్రాల్లో ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. విదేశాల్లో జన్మించి పెరుగుతున్న తెలుగు పిల్లలు తమ మాతృభాషను నిబద్ధతతో నేర్చుకోవడం ఎంతో ఆనందదాయకమని మునిరత్నం నాయుడు అన్నారు. 3,037 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవడం, వారిలో దాదాపు 99 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని, తెలుగు భాష పట్ల ఉన్న అభిమానం, అలాగే సిలికానాంధ్ర మనబడి నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాల నాణ్యతకు ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు. మాతృభాషను తరతరాలకు అందించే ఈ యజ్ఞంలో భాగస్వాములైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులను అభినందించారు. పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులను సత్కరిస్తూ, అమెరికా, కెనడాలోని 17 ప్రాంతాల్లో స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, టెక్సాస్లోని డల్లాస్, మిచిగన్, వర్జీనియా ప్రాంతాల్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమాలకు డా. మునిరత్నం నాయుడు అధ్యక్షత వహించారు. ఏరియా యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి డా. మృణాళిని చుండూరి, లాస్ ఏంజెలెస్, సిలికాన్ వ్యాలీలలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి డీన్, ప్రెసిడెంట్ చమర్తి రాజు మాట్లాడుతూ ‘‘మనబడి ప్రారంభమైన నాటి నుంచి ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలకు మాతృభాషను చేరువ చేయడమే మా లక్ష్యం. ఈ సంవత్సరం సాధించిన 98.74 శాతం ఉత్తీర్ణత, విద్యార్థుల కృషికి, తల్లిదండ్రుల అంకితభావానికి, మా స్వచ్ఛంద ఉపాధ్యాయుల సేవాభావానికి ప్రతిఫలం. తెలుగు భాషను కేవలం నేర్పడం మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి, విలువలు, వారసత్వాన్ని తదుపరి తరాలకు అందించాలనే సంకల్పంతో మనబడి ముందుకు సాగుతోంది’’ అని తెలిపారు.
అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం
మరో తెలుగు విద్యార్థి డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల (26) ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యంతో ఆకస్మికంగా కన్నుమూశాడు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.మహబూబ్నగర్కు చెందిన అరుణ్ సాయిరెడ్డి (జననం: ఆగష్టు 21, 1999) వెంకట్ రెడ్డి, సరళా దంపతుల ఏకైక కుమారుడు. అరుణ్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఫ్లోరిడాలోని టెంపా నగరంలో ఉంటూ, స్టెమ్ ఓపీటీ (STEM OPT)లో భాగంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్నాడు. అంతలోనే అతని అకాల మరణం కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. అతని పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు గాను నిధుల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు.
అద్భుతం.. అదిత్రి అరంగేట్రం
హైదరాబాద్: అమెరికాలో పుట్టి పెరిగిన అదిత్రి వైష్ణవి చేపూర్ కూచిపూడి అరంగేట్రం నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. బేగంపేటలోని సెస్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ప్రముఖులతో పాటు ఆమె రెండు తరాల కుటుంబసభ్యుల మధ్య అరంగేట్రం చేసి తన కలను సాకారం చేసుకుంది. గురువు రేవతి కొమండూరి వద్ద నృత్యం నేర్చుకున్న ఆమె వేదికపై అద్భుతమైన హావభావాలు పలికించి అబ్బురపరిచారు. అన్నమాచార్య కీర్తనతో సాగిన అరంగేట్ర నృత్య ప్రయాణం శివుని స్తుతిస్తూ తాండవేశ్వర..చివరగా థిల్లానాతో ముగిసింది. అదిత్రి వెష్ణవి తల్లిదండ్రులు భానుచందర్, సరితలు అమెరికన్ సిటిజన్స్ కాగా..వారి కూతురు అదిత్రి లా అండ్ సైకాలజీ శాస్త్రంలో విద్యనభ్యసిస్తున్నారు. తన ఏడేళ్ల ప్రాయం నుంచి కూచిపూడి నృత్య శిక్షణ తీసుకుంటూ వచ్చారు. నగరంలో ఉండే తాతయ్యలు, అమ్మమ్మ, నాన్నమ్మలు ముందు తన అరంగేట్రం జరగాలన్న ఆమె కోరికను నెరవేర్చుకున్నారు. మనవరాలి కూచిపూడి అరంగేట్రం తిలకించిన నాన్నమ్మ, తాతయ్య దేవి, జనార్దన్రావు, అమ్మమ్మ, తాతయ్య మంజులత, శ్యాంసుందర్లు ఆనందం వ్యక్తం చేశారు.
గల్ఫ్లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత
హైదరాబాద్: గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల ఓటు హక్కుల పరిరక్షణపై మంత్రి పొన్నం ప్రభాకర్తో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ప్రతినిధులు ఆదివారం చర్చించారు. తెలంగాణ రాష్ట్ర 'గల్ఫ్ కాంగ్రెస్' ప్రతినిధి సుతారి సత్యనారాయణ పటేల్, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఆదివారం హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం వేళ.. విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై పొన్నం ప్రభాకర్ తో వారు చర్చించారు.ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటరు నమోదును కొనసాగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆన్లైన్ జూమ్ సమావేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ ప్రతిపాదనలను మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్వీకరించినట్లు వారు తెలిపారు. అలాగే తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు, గల్ఫ్ కార్మికులతో ప్రత్యక్షంగా మమేకమయ్యేందుకు గల్ఫ్ దేశాల్లో పర్యటించాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. స్వయంగా గల్ఫ్ దేశాల్లో పర్యటించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సుముఖత వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర ఎంతో కీలకమని, వారి సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
క్రైమ్
చిట్టీల వ్యాపారం.. రూ.3 కోట్లతో పరార్!
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని విజయపురికాలనీకి చెందిన ఓ వ్యాపారి వారంరోజులుగా కనిపించడం లేదు. విజయపురిరోడ్డులో 30 ఏ ళ్లుగా కిరాణషాపుతోపాటు చిట్టీల వ్యాపా రం చేస్తున్న సదరు వ్యాపారి దాదాపు 60 నుంచి 70 మంది వద్ద అధిక వడ్డీ ఆశ చూపి అప్పుగా తీసుకున్నాడు. కొంతకాలంగా చిట్లీ వేసినవారు.. అప్పు ఇచ్చిన వారు డబ్బులు కావాలని నిలదీస్తుండటంతో వారం క్రితం పరారయినట్లు తెలుస్తోంది. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అప్పు ఇచ్చినవారు ఇల్లు గురించి వాకబు చేయగా.. వేరే వ్యక్తికి రిజిస్టర్ చేసిన ట్లు తెలుసుకుని అవాక్కయ్యారు. సదరు వ్యాపారి ఆన్లైన్లో పెట్టుబడి పెట్టినట్లు స మాచారం. ఇటీవల ఆన్లైన్ యాప్లన్నీ మూతపడటంతో పలువురు బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొంతమంది పరారవుతున్నారు.
నంబర్ ఒకటే.. బండ్లు మూడు
హైదరాబాద్: ట్రాఫిక్ చలానాలు, ఫైనాన్స్ కంపెనీల జప్తుల నుంచి తప్పించుకోవడానికి ఒకే నంబర్ ప్లేట్ను మూడు వేర్వేరు ద్విచక్ర వాహనాలకు వాడుతూ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలను బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు నిందితులను చారి్మనార్ జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పార్సిగుట్ట కమలా నెహ్రూ నగర్కు చెందిన నాకోటి మల్లికార్జున్, భీమ్ అజయ్ రెడ్డి, సంజీవపురానికి చెందిన కొప్పుల ధనరాజ్ స్నేహితులు. మల్లికార్జున్కు సాయి రామ్ అనే వ్యక్తి రుణ బకాయి కింద ఫైనాన్స్ చేసిన, ఇంకా రిజిస్ట్రేషన్ కాని హోండా యాక్టివా వాహనాన్ని ఇచ్చాడు. ఈ వాహనంపై ఇండస్ ఇండ్ బ్యాంక్కు రూ. 36,000 బకాయి ఉండటంతో సీజ్ చేస్తారని మల్లికార్జున్ పథకం రచించాడు. తన అసలైన యాక్టివా వాహనం నంబర్ (టీఎస్ 09 ఎఫ్ఈ 4997)తో నకిలీ నంబర్ ప్లేట్ను తయారు చేయించి ఫైనాన్స్ ఉన్న వాహనానికి తగిలించి అజయ్ రెడ్డికి ఇచ్చాడు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి స్నేహితుడు కొప్పుల ధనరాజ్కు ఈ నంబర్ ప్లేట్నే వాడాల్సిందిగా మల్లికార్జున్ సూచించాడు. ఒకే నంబర్ ప్లేట్ను మూడు వాహనాలకు ఉపయోగిస్తూ వీరు రోడ్లపై తిరుగుతున్నారు. చార్మినార్ జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు వారాసిగూడలో తనిఖీలు చేయగా అజయ్ రెడ్డి పట్టుబడ్డాడు. అతనితో పాటు ఉన్న మిగిలిన ఇద్దరినీ విచారించి, అధికారిక డేటాబేస్ ద్వారా వాహన ఇంజిన్, చాసిస్ నంబర్లను పరిశీలించగా ఈ ఘరానా మోసం బయటపడటంతో నిందితులపై కేసు నమోదు చేశారు.
పెళ్లైన 2 నెలలకే.. నవవధువు అనుమానాస్పద మృతి!
న్యూఢిల్లీ: కొత్త పెళ్లి ముచ్చట్లు తీరకముందే.. ఎనిమిదేళ్ల ప్రేమ బంధం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఆఫీసులో సహోద్యోగులతో కలిసి నవ్వుతూ పార్టీ చేసుకున్న కొన్ని గంటల్లోనే, ఆ నూతన వధువు రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఢిల్లీలో కలకలం రేపిన ఆకృతి సుతార్ అనుమానాస్పద మృతి వెనుక.. రూ. 20 లక్షల అదనపు కట్న వేధింపులు ఉన్నాయంటూ ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారుపెళ్లైన రెండు నెలలకే ఆకృతి సుతార్ (28) అనే వివాహిత ఢిల్లీలోని ఒక నివాస సముదాయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు.. ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ కట్నం కోసం చేసిన హత్యేనని తీవ్రంగా ఆరోపిస్తున్నారు.ఛతర్పూర్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఆకృతి, శనివారం ఉదయమే సెలవు ముగించుకుని తిరిగి విధుల్లో చేరింది. ఆఫీసులో తోటి ఉద్యోగులకు ఆమె ఒక చిన్న పార్టీ కూడా ఇచ్చింది. సాయంత్రం 6 గంటల సమయంలో తన తల్లితో ఫోన్లో మాట్లాడిన ఆకృతి.. ఆఫీస్ పార్టీ ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్నట్లు చెప్పింది.అయితే, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆకృతి భర్త అరస్తు సిక్కా ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఆకృతి కనిపించడం లేదని తెలిపాడు. ఆ తర్వాత సుమారు గంటన్నరకే, లోధి కాలనీలోని పాలికా కుంజ్ నివాస సముదాయంలో ఒక మహిళ మృతదేహం పడి ఉందని పోలీసులు సమాచారం ఇచ్చారు. బిల్డింగ్ పైనుంచి కింద పడటం వల్లే ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.ఎనిమిదేళ్ల ప్రేమ తర్వాత గత ఏప్రిల్ 24న ఆకృతి..నిరుద్యోగి అరస్తు సిక్కాను వివాహం చేసుకుంది. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామలు రూ.20 లక్షల అదనపు కట్నం కోసం ఆమెను తీవ్రంగా వేధించేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అరస్తు గతంలో పలుమార్లు ఆమెను చంపేస్తానని బెదిరించాడని, మరణానికి రెండు రోజుల ముందు కూడా వారి మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని ఆమె సోదరుడు అమయ్ సుతార్ తెలిపాడు. ఆకృతి మానసికంగా చాలా ధైర్యంగా ఉందని, ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కట్నం వేధింపులు, హత్య కోణాలతో పాటు అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగిని దారుణ హత్య
భీమవరం అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని కొత్తపల్లి అనంతవాణి (32) దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతవాణి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం ఆమె తాడేరులో ఉంటోంది. మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ శ్యాంబాబుతో ఆమెకు ఐదేళ్ల క్రితం పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారి వారిమధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. శ్యాంబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటోంది. కాగా.. ఆరు నెలలుగా శ్యాంబాబును అనంతవాణి దూరం పెడుతూ వస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న శ్యాంబాబు ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తాడేరులోని ఆమె ఇంటికి వెళ్లి కత్తితో అనంతవాణిపై దాడి చేశాడు. ఛాతీ, కడుపుపై పొడిచి పరారయ్యాడు. తండ్రి వెంకటేశ్వరరావు స్థానికుల సాయంతో అనంతవాణిని భీమవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
వీడియోలు
రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు
అసలు టార్గెట్ రావణేనా..? రావణ్పై ఎవరి గేమ్..?
ఒక్కటే అడుగుతున్న.. నీ తల్లి దండ్రులతో ఉన్న ఒకేఒక్క ఫోటో చూపించు..
అంతా నా ఇష్టం
నిజామాబాద్ లో దారుణం.. భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి
ఎవరో సైకోలు , పిచ్చోళ్లో తెలియదా..? జగన్ పై మాటలు జాగ్రత్త..!
ఎవడడిగాడు నిన్ను ఫ్రీ బస్సు... దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా
చంద్రబాబుకు నేను చెప్పేది ఇదే చాలా ప్రమాదకరం...
రౌడీలను పెంచి పోషించేది కూటమి.. వాటాల రాజ్యం పోతేనే..
లై డిటెక్టర్ టెస్ట్ లో సియా ఏం చెప్పిందంటే..? అందరూ షాక్!


