ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
సాక్షి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్టు మంత్రి పొన్న ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు, పోలీసులు గుర్తిస్తున్నారు. బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్లో చదువుకుంటున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో ముగ్గురు సొంతూరుకు వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం కారణంగా మృతి చెందారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పోస్టుమార్టం అనంతరం తనూష, సాయి ప్రియా, నందిని మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి,. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో పది మంది మహిళలు, ఒక చిన్నారి, ఎనిమిది మంది పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా పలువురి మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. 1.దస్తగిరి బాబా, డ్రైవర్; 2.తారిబాయ్ (45), దన్నారమ్ తండా; 3.కల్పన(45), బోరబండ; 4.బచ్చన్ నాగమణి(55); భానూరు; 5.ఏమావత్ తాలీబామ్, ధన్నారం తాండ; 6.మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్ మండలం;7.గుర్రాల అభిత (21) యాలాల్; 8.గోగుల గుణమ్మ,బోరబండ;9.షేక్ ఖాలీద్ హుస్సేన్, తాండూరు;10.తబస్సుమ్ జహాన్, తాండూరు.11. తనూషా, సాయిప్రియ, నందిని(ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెల్లు)12. అఖిల(తాండూరు).13. ఏనుగుల కల్పన14. నాగమణి, 15. జహంగీర్. క్షతగాత్రులు వీరే..వెంకటయ్యబుచ్చిబాబు-దన్నారమ్ తండాఅబ్దుల్ రజాక్-హైదరాబాద్వెన్నెలసుజాతఅశోక్రవిశ్రీను- తాండూరునందిని- తాండూరుబస్వరాజ్-కోకట్ (కర్ణాటక)ప్రేరణ- వికారాబాద్సాయిఅక్రమ్-తాండూరుఅస్లామ్-తాండూరు
చేవెళ్ల ఘటన అత్యంత విషాదకరం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తెలంగాణలోని చేవెళ్ల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ప్రమాదంపై వైఎస్ జగన్ స్పందించారు. రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరం, బాధాకరమని.. తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అక్టోబర్ బాక్సాఫీస్ వసూళ్లు.. వంద కోట్లకు దూరంగా టాలీవుడ్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతికి ఉన్న క్రేజే వేరు. ఈ పండుగకు మూవీ రిలీజ్ చేసేందుకు ఏడాది ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. ఈ పండుగకు ఉన్న మార్కెట్ అలాంటిది. ఆ తర్వాత సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే పండుగలు దసరా, దీపావళి. ఈ రెండు ఫెస్టివల్స్కు సైతం పెద్దఎత్తున చిత్రాలు రిలీజ్కు సిద్ధమైపోతాయి. అలాగే ఈ ఏడాది కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ పండుగల బాక్సాఫీస్ బరిలో హిట్గా నిలిచిందెవరు? అభిమానులను నిరాశపరిచిందెవరు? మీరు ఓ లుక్కేయండి.ఈ ఏడాది అక్టోబర్లో టాలీవుడ్ నుంచి దసరాకు పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. దీనికి కారణం బాక్సాఫీస్ బరిలో కాంతార చాప్టర్-1 నిలవడమే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రావడంతో తెలుగు చిత్రాలు రిలీజ్ చేసే సాహసం చేయలేదు. ఆ తర్వాత శశివదనే, మిత్రమండలి, ఎర్రచీర, కానిస్టేబుల్ లాంటి చిన్న సినిమాలు అలా వచ్చి.. ఇలా వెళ్లాయి. వీటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో వారంలోపే బాక్సాఫీస్ వద్ద కనుమరుగయ్యాయి.ఇక రెండో వారంలో 'అరి', 'కానిస్టేబుల్', 'మటన్ షాప్ వంటి కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కానిస్టేబుల్, మటన్ షాప్ అసలు ఊసే లేదు. కొద్దొ గొప్పో 'అరి' మూవీ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. కేవలం మౌత్ టాక్తోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అరిషడ్వర్గాలుఅనే ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దివాళీ విషయానికొస్తే వరుసగా మూడు తెలుగు చిత్రాలు రిలీజ్ చేశారు. అందులో కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటితో పాటు కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ కూడా పోటీపడింది. వీటిలో కె-ర్యాంప్ ఫర్వాలేదనిపించగా.. తెలుసు కదా మూవీతో సిద్ధు మరోసారి నిరాశపరిచాడు. ఈ రెండు తెలుగు సినిమాలు దీవాళీ బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయాయి. ఇక డ్రాగన్ హీరో డ్యూడ్ కూడా దీపావళికి వందకోట్ల మార్క్ అందుకుంది.ఈ అక్టోబర్ నెల చివర్లో రాజమౌళి బాహుహలి ది ఎపిక్, రవితేజ మాస్ జాతర బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. రెండు భాగాలను కలిపి దర్శకధీరుడు ప్రేక్షకులను సరికొత్త థ్రిల్ అందించారు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న మాస్ మహారాజా ఫ్యాన్స్కు మాత్రం మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. మాస్ హీరోగా పేరున్న రవితేజ అదే పంథాలో రావడం.. కొత్తదనం లేకపోవడంతో మరో డిజాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఓవరాల్గా చూస్తే ఈ దసరా, దీపావళి తెలుగు సినిమాలకు కలిసి రాలేదనే చెప్పాలి. డబ్బింగ్ సినిమాలైనా కాంతార చాప్టర్-1, డ్యూడ్ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటగా.. టాలీవుడ్ చిత్రాలు మాత్రం వందకోట్ల మార్క్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఈ లెక్కన అక్టోబర్ మన తెలుగు సినిమాలకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక టాలీవుడ్ సినీ ప్రియుల ఆశలన్నీ వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ సినిమాలపైనే. పొంగల్ బాక్సాఫీస్ మూవీస్ మనశంకరవరప్రసాద్గారు, ది రాజాసాబ్, అనగనగ ఒక రాజు వంద కోట్ల మార్క్ చేరుకుంటాయోమో వేచి చూడాల్సిందే.
స్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాలు
భారతదేశంతో పాటు.. చాలా దేశాలలో బంగారానికి భారీ డిమాండ్ ఉంది. అయితే ప్రపంచంలో స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశాల సంఖ్య చాలా తక్కువే. ఈ కథనంలో ఆ దేశాల గురించి తెలుసుకుందాం.చైనాప్రపంచంలో ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన చైనా.. స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశాల జాబితాలో కూడా ఒకటి. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా.. 99.9 శాతం ప్యూర్ గోల్డ్ తయారు చేస్తుంది. బంగారాన్ని బయటకు తీసిన దగ్గర నుంచి.. శుద్దీకరణ వరకు అనేక దశలలో ఎలెక్ట్రోలిటిక్ రిఫైనింగ్ అనే పద్దతులను ఉపయోగిస్తుంది. తద్వారా శుద్ధమైన బంగారం తయారు చేస్తుంది.స్విట్జర్లాండ్స్విట్జర్లాండ్ కేవలం అందమైన దేశం మాత్రమే కాదు.. అత్యంత స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశం కూడా. ఈ దేశంలో తవ్వకం ద్వారా లభించే గోల్డ్ చాలా తక్కువ. అయితే.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి బంగారాన్ని.. ఇక్కడున్న శుద్ధి కర్మాగారాల సాయంతో 99.9 శాతం స్వచ్ఛమైనదిగా తయారు చేస్తారు. గోల్డ్ బార్లను ప్రాసెస్ చేసి తిరిగి ఎగుమతి చేస్తుంది.ఆస్ట్రేలియాస్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో.. ఆస్ట్రేలియా కూడా ఒకటి. ఇక్కడ తవ్వకాల ద్వారా అధిక బంగారం లభ్యమవుతుంది. గనుల నుంచి ముడి పదార్థంగా లభించిన బంగారాన్ని ప్రాసెస్ చేసి.. 99.9 శాతం స్వచ్ఛమైన గోల్డ్ రూపంలోకి మారుస్తారు. ప్యూర్ గోల్డ్ తయారు చేయడానికి కావలసిన టెక్నాలజీ ఈ దేశంలో అందుబాటులో ఉంది.యునైటెడ్ స్టేట్స్అమెరికాలోని నెవాడా, అలాస్కా, క్యాలిఫోర్నియా, కొలరాడో వంటి ప్రాంతాల్లో బంగారం విరివిగా లభిస్తుంది. ఇక్కడ ముడి పదార్థంగా లభించే బంగారాన్ని.. వివిధ దశల్లో రసాయన పద్దతులను ఉపయోగించి శుద్ధి చేస్తారు. తరువాత నాణేలు, కడ్డీల రూపంలోకి మార్చి ఎగుమతులు చేయడం జరుగుతుంది. యూఎస్ బంగారు ఉత్పత్తులు స్థిరమైన స్వచ్ఛత & కఠినమైన పరీక్షకు ప్రసిద్ధి చెందాయి.కెనడాకెనడా పశ్చిమ ప్రాంతాలలోని బంగారు గనుల నుంచి ముడి పదార్థాలను తవ్వి తీస్తారు. సయనైడ్ లీచింగ్ పద్దతి తరువాత బంగారం వెలుపలికి తీసి.. ఎలెక్ట్రోలిటిక్ రిఫైనింగ్ పద్దతుల ద్వారా శుద్ధి చేస్తారు. ఇక్కడ తయారైన బంగారానికి ప్రపంచంలోని చాలా దేశాల్లో డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో ఊహించని మార్పులురష్యాస్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన రష్యా.. ప్రస్తుతం ఎక్కువ బంగారం ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. రష్యాలో బంగారాన్ని వెలికితీసేందుకు ప్రధానంగా సయనైడ్ లీచింగ్, గ్రావిటీ సెపరేషన్ పద్ధతులను ఉపయోగిస్తారు. బంగారం ఉన్న రాయిని బాగా పొడిచేసి, సోడియం సయనైడ్ ద్రావణంతో కలిపి సయనైడ్ లీచింగ్ ద్వారా ద్రవ రూపంలో వెలికితీస్తారు. తరువాత కార్బన్ పుల్ లేదా జింక్ ప్రిసిపిటేషన్ పద్ధతులు ద్వారా బంగారం తిరిగి ఘనరూపంలో మారుస్తారు. ఇలా అనేక పద్దతుల ద్వారా 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం తయారు చేస్తారు.
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
రహదారుల మృత్యువేగం
ఆట.. అంతకుమించి...
50 ఏళ్ల శ్రమ ఫలం
విడాకుల రూమర్స్.. ఐశ్వర్య రాయ్ షాకింగ్ కామెంట్స్
గుమ్మడి నర్సయ్య పోస్టర్.. ప్రభాస్ పెద్దమ్మ ప్రశంసలు!
విష్ణు విశాల్ ఆర్యన్.. అర్థం లేని క్లైమాక్స్.. దెబ్బకు కట్!
సంగారెడ్డి జిల్లాలో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! అక్కడ డబుల్ సెంచరీతో
ప్రభాస్తో రష్మిక సినిమా.. నా చావుకు కారణం అదేనన్న నెటిజన్!
'బంగారం ధరల్లో ఊహించని మార్పులు'
బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్న 'ప్రభాస్'..!
బంగారం ధరలు మళ్లీ రివర్స్.. ఒక్క గ్రాము..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పాపం సౌతాఫ్రికా.. ఓడినా మనసులు గెలుచుకుంది..!
అలా చేస్తే మరి ఇలా ఎండనకా,వాననకా తిరగడం ఎందుకు సార్! ఇంట్లో కూర్చుంటే పోలా!
ఈ రాశి వారికి ఉద్యోగయోగం.. వ్యాపార వృద్ధి
కొరియోగ్రాఫర్ జానీకి అవకాశాలు.. సింగర్ చిన్మయి సంచలన ట్వీట్!
ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి
బిగ్బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
బంగారం, వెండి రేట్లు తగ్గుతాయా.. ప్రభుత్వ చర్య ఏంటి?
ఇంకా చురుగ్గా పని చేయించడానికట!
తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్తో మాధురి కంటతడి
క్రికెట్ నేపథ్యంలో...
ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ
బిగ్బాస్లో పిక్నిక్ పూర్తి.. దువ్వాడ కోసమే బయటకు! ఏమన్న ప్లానా?
నా పిల్లలకైనా చెప్పాలిగా.. లవ్స్టోరీ బయటపెట్టిన అల్లు శిరీష్
రూ.600 కోట్ల కలెక్షన్స్.. ఆ తర్వాత చేతిలో ఒక్క సినిమా లేని దర్శకుడు!
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
WC 2025: కళ్లు చెదిరే ప్రైజ్మనీ!.. బీసీసీఐ బంపరాఫర్
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
రహదారుల మృత్యువేగం
ఆట.. అంతకుమించి...
50 ఏళ్ల శ్రమ ఫలం
విడాకుల రూమర్స్.. ఐశ్వర్య రాయ్ షాకింగ్ కామెంట్స్
గుమ్మడి నర్సయ్య పోస్టర్.. ప్రభాస్ పెద్దమ్మ ప్రశంసలు!
విష్ణు విశాల్ ఆర్యన్.. అర్థం లేని క్లైమాక్స్.. దెబ్బకు కట్!
సంగారెడ్డి జిల్లాలో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! అక్కడ డబుల్ సెంచరీతో
ప్రభాస్తో రష్మిక సినిమా.. నా చావుకు కారణం అదేనన్న నెటిజన్!
'బంగారం ధరల్లో ఊహించని మార్పులు'
బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్న 'ప్రభాస్'..!
బంగారం ధరలు మళ్లీ రివర్స్.. ఒక్క గ్రాము..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పాపం సౌతాఫ్రికా.. ఓడినా మనసులు గెలుచుకుంది..!
అలా చేస్తే మరి ఇలా ఎండనకా,వాననకా తిరగడం ఎందుకు సార్! ఇంట్లో కూర్చుంటే పోలా!
ఈ రాశి వారికి ఉద్యోగయోగం.. వ్యాపార వృద్ధి
కొరియోగ్రాఫర్ జానీకి అవకాశాలు.. సింగర్ చిన్మయి సంచలన ట్వీట్!
ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి
బిగ్బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
బంగారం, వెండి రేట్లు తగ్గుతాయా.. ప్రభుత్వ చర్య ఏంటి?
ఇంకా చురుగ్గా పని చేయించడానికట!
తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్తో మాధురి కంటతడి
క్రికెట్ నేపథ్యంలో...
ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ
బిగ్బాస్లో పిక్నిక్ పూర్తి.. దువ్వాడ కోసమే బయటకు! ఏమన్న ప్లానా?
నా పిల్లలకైనా చెప్పాలిగా.. లవ్స్టోరీ బయటపెట్టిన అల్లు శిరీష్
రూ.600 కోట్ల కలెక్షన్స్.. ఆ తర్వాత చేతిలో ఒక్క సినిమా లేని దర్శకుడు!
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
WC 2025: కళ్లు చెదిరే ప్రైజ్మనీ!.. బీసీసీఐ బంపరాఫర్
సినిమా
నిశ్చితార్థం కోసం అల్లు స్నేహా.. ఐలాండ్లో తమన్నా
మరిది నిశ్చితార్థం కోసం ఇలా ముస్తాబైన అల్లు స్నేహామలేషియాలోని ఓ ఐలాండ్లో తమన్నా ఫొటోషూట్దిక్కులు చూస్తూ రుక్మిణి వసంత్ ఫన్నీ పోస్ట్సిల్క్ చీరలో అందమే అసూయపడేలా రష్మిక'బైసన్' షూటింగ్.. సైకిల్ తొక్కుతూ అనుపమగ్రౌండెడ్ అంటూ నేలపై కూర్చుని అదితీ స్టిల్స్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna)
'ఎంతోమంది అమ్మాయిలతో రిలేషన్స్'.. బిగ్బాస్ కంటెస్టెంట్పై సంచలన ఆరోపణలు!
బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ ప్రస్తుతం ఆడియన్స్ను అలరిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ షో నడుస్తోంది. బుల్లితెర ప్రియుల్లో అత్యంత ఆదరణ ఈ షో పలువురు నటీనటులు కంటెస్టెంట్స్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది హిందీలో బిగ్బాస్-19వ సీజన్కు చేరుకుంది. ఇందులో ప్రముఖ బుల్లితెర నటుడు అభిషేక్ బజాజ్ కూడా కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టారు.అయితే బిగ్బాస్లో ఉన్న బుల్లితెర నటుడిపై ఆయన మాజీ భార్య ఆకాంక్ష జిందాల్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. అతని వ్యక్తిగత జీవితంపై సంచలన కామెంట్స్ చేసింది. వైవాహిక జీవితంలో అభిషేక్ తనను మోసం చేశాడని ఆరోపించింది. వాస్తవాలను దాచిపెట్టి.. నటించడంలో అతన్ని మించినవారు లేరని ఆకాంక్ష ఆరోపించింది.అభిషేక్ బజాజ్ తన వయస్సు, వైవాహిక జీవితం గురించి అబద్ధాలు ఆకాంక్ష జిందాల్ చెబుతున్నాడని తెలిపింది. అంతేకాకుండా అతనికి చాలా మంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయని సంచలన కామెంట్స్ చేసింది. తాము విడాకులు తీసుకోవడానికి అదే కారణమని.. తనతో పాటు ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆకాంక్ష జిందాల్ మాట్లాడుతూ.. “సల్మాన్ సార్ ముందు కూడా అబద్ధం చెప్పడానికి అస్సలు వెనుకాడడు. అతని వయస్సు, వైవాహిక స్థితి గురించి అబద్ధం చెప్పడం ఎప్పుడు అలవాటే. ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో 21 ఏళ్ల వ్యక్తిగా తన చరిత్రను రిపీట్ చేస్తున్నాడు. అతని డిక్షనరీలో సిగ్గు అనే పదానికి చోటు లేదు. ఈ విషయాన్ని నేను ప్రతీకారం కోసం చెప్పడం లేదు. మీరందరూ ఇతర పోటీదారుల గురించి మాట్లాడే విధంగానే నిజం బయటకు రావాలని కోరుకుంటున్నా" అని తెలిపింది.
'బాహుబలి' లేకపోతే ఆ సినిమాలు తీసేవాడిని కాదు: మణిరత్నం
పదేళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'బాహుబలి'ని ఇప్పుడు రీరిలీజ్ చేశారు. రెండు భాగాల్ని కలిపి ఒక్కటిగా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వీకెండ్ అయ్యేసరికి ఏకంగా రూ.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. ఇది నిజమైతే మాత్రం రికార్డే. ఎందుకంటే రీ రిలీజ్ మూవీస్కి ఈ రేంజు వసూళ్లు ఎప్పుడూ రాలేదు. మరోవైపు ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. 'బాహుబలి' లేకపోతే తాను ఆ సినిమాల్ని తీసేవాడిని కాదని చెబుతున్నా ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'వార్ 2' ఫ్లాప్ దెబ్బకు నిర్మాత షాకింగ్ నిర్ణయం)ఏంటి విషయం?'బాహుబలి' సినిమా మన దేశంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. తెలుగు మూవీకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేయడంతో పాటు ఓ కథని రెండు భాగాలుగా కూడా చెప్పొచ్చనే దారిని దర్శకులకు చూపించింది. గతంలో అంటే 2022లో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ పేరుతో ఓ సదస్సు జరిగింది. ఇందులో మాట్లాడిన డైరెక్టర్ మణిరత్నం.. 'బాహుబలి' లేకపోయింటే తాను 'పొన్నియిన్ సెల్వన్' తీసేవాడిని కాదని అన్నారు.''బాహుబలి' లేకపోతే 'పొన్నియిన్ సెల్వన్' లేదు. రాజమౌళి తన సినిమాను రెండు భాగాలుగా తీయకపోతే నేను ఈ చిత్రాన్ని తీసేవాడిని కాదు. ఇదే విషయాన్ని నేను రాజమౌళిని కలిసినప్పుడు చెప్పాను. రాజమౌళి మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా చేశారు. ఆయన అలా చేయడం వల్లే మేము కూడా ఒక సినిమాను రెండు భాగాలుగా తీయగలిగాం' అని మణిరత్నం చెప్పారు. పాత వీడియోనే అయినప్పటికీ అది ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?)If Rajamouli hadn’t made #Baahubali, I wouldn’t have made #PonniyinSelvan. He showed that Indian movies can be made on a big scale and still win hearts. Thank you, #Rajamouli, for the inspiration.:– Director Mani Ratnampic.twitter.com/hJ4CKQvtbo— Milagro Movies (@MilagroMovies) November 3, 2025
సచిన్, లక్ష్మణ్, రోహిత్ వచ్చారు.. మీరెక్కడా సార్?.. నటి ఫైర్!
భారత మహిళల క్రికెట్ చిరకాల స్వప్నం నెరవేరింది. మూడోసారి ఫైనల్ చేరిన మన వనితలు కప్ను ఒడిసి పట్టుకున్నారు. కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎట్టకేలకు విశ్వ విజేతగా నిలిచారు. భారత మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ సాధించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు మన మహిళలను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా మహిళల టీమ్ను సైతం కొనియాడారు.అయితే తమ టీమ్ రన్నరప్గా నిలవడంతో ప్రముఖ దక్షిణాఫ్రికా నటి స్పందించింది. సౌత్ఆఫ్రికాకు చెందిన ప్రముఖ నటి, రచయిత్రి తంజా వుర్ విన్నర్గా నిలిచిన భారత మహిళల టీమ్పై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో సొంత దేశంలోని పురుష క్రికెటర్లతో పాటు ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయులు చూపించిన ప్రేమ, మద్దతు.. మన మహిళా క్రికెట్ జట్టుకు సౌతాఫ్రికన్స్ సపోర్ట్ ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది. భారతీయులు క్రీడల పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతు మనవాళ్లకు ఎందుకు రాదని ప్రశ్నించింది.వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మాజీ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్ మహిళా క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చారని కొనియాడింది. మరి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్స్ ఎక్కడ? అని నిలదీసింది. ఎందుకంటే మీకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోవచ్చంటూ సౌతాఫ్రికా పురుష క్రికెటర్లను ఉద్దేశించి ఘాటుగా విమర్శించింది. సౌతాఫ్రికా క్రీడా మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. మహిళల క్రీడల పట్ల తన దేశ వైఖరిని సోషల్ మీడియా వేదికగా ఎండగట్టింది.స్మృతి మంధానతో పాటు భారత మహిళ క్రికెటర్స్ చాలా బాగా ఆడారని తంజా వుర్ ప్రశంసలు కురిపించింది. భారతీయ అభిమానుల నమ్మకాన్ని ఆమె కొనియాడింది. ఇలాంటి మద్దతు టీమ్ ఇండియాకు బాాగా కలిసొచ్చిందని తంజా వుర్ తెలిపింది. ఏది ఏమైనా ఈ రోజు మీరు ఈ ప్రపంచ కప్ విజేతలు.. మీరు దానికి అర్హులు అంటూ టీమిండియాను ప్రశంసంచింది. కాగా.. ఈ ప్రతిష్టాత్మ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్స్ జాక్వస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్, గ్రేమ్ స్మిత్ లాంటి వాళ్లెవరూ కూడా స్టేడియంలో కనిపించలేదు. దీంతో నటికి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేసింది. View this post on Instagram A post shared by Thanja Vuur 🔥 (@cape_town_cricket_queen)
న్యూస్ పాడ్కాస్ట్
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో భారీ కోత... ఈ ఏడాది 13 శాతానికిపైగా తగ్గిన పనుల కల్పన
ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా
తెలంగాణలో విధ్వంసం సృష్టించిన ‘మోంథా’... ఉమ్మడి వరంగల్పై తీవ్ర ప్రభావం
ఏపీలో తీరం దాటిన మోంథా తుఫాను
కోస్తాకు ‘మోంథా’ తుపాను గండం..
కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు!
క్రీడలు
కడప నుంచి వరల్డ్ కప్ దాకా.. శెభాష్ శ్రీచరణి
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఛాంపియన్గా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించినన భారత జట్టు.. తమ 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే ఈ చారిత్రత్మక విజయంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణిది కీలక పాత్ర. టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచి భారత్కు తొలి వన్డే వరల్డ్కప్ను అందించింది. ఈ 50 ఓవర్ల ప్రపంచకప్లో 9 మ్యాచ్లు ఆడిన శ్రీ చరణి 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీసింది. దీప్తీ శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో చరణి నిలిచింది. దీంతో ఈ కడప అమ్మాయిపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.పల్లెటూర్ నుంచి వరల్డ్ ఛాంపియన్గా..ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా క్రీడా రంగంలో పెద్దగా పేరున్న ప్రాంతం కాదు. కానీ ఈ జిల్లాలోని వీరపునాయిని మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన నల్లపురెడ్డి శ్రీ చరణి.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పురుషుల లేదా మహిళల క్రికెట్లో ప్రపంచ కప్లో ఆడిన మొట్టమొదటి క్రీడాకారిణిగా నిలిచింది. కానీ, ఆమె ప్రయాణం అనేక కష్ట నష్టాల మధ్య సాగింది.21 ఏళ్ల ఈ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చిన్నతనంలో ఆమె బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్లో ప్రతిభ చూపింది. అయితే 16 ఏళ్ల వయస్సులో మాత్రమే ఆమె క్రికెట్ను సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి ఆమె మావయ్య కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన కారణం.ఆమె క్రికెట్ను ఎంచుకోకపోవడానికి ప్రధాన అడ్డంకులు ఆర్థిక సమస్యలు, కుటుంబం నుంచి మొదట్లో వచ్చిన వ్యతిరేకత. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. క్రికెట్ జట్టు ఎక్కువగా పురుషుల క్రీడ కావడంతో ఆమె తండ్రి మొదట్లో చరణి నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు.తండ్రిని ఒప్పించడానికి ఆమెకు ఏడాది కాలం పట్టింది. చరణి చెప్పిన ప్రకారం.. ఆమె క్రీడా జీవితాన్ని ప్రారంభించే సమయంలో తన కుటుంబం అప్పులతో బాధపడేది. అయినప్పటికీ ఆ కష్టాలు తన ఆటపై ప్రభావం చూపకుండా ఆమె తల్లిదండ్రులు సహకరించారు.క్రీడా జీవితం ప్రారంభంలో శ్రీ చరణి మొదట ఫాస్ట్ బౌలర్గా శిక్షణ పొందింది. ఫాస్ట్ బౌలింగ్లో వికెట్లు లభించకపోవడంతో స్పిన్ బౌలింగ్ను ప్రయత్నించగా బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్గా మారింది. కడప లాంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడింది. అంతర్జాతీయ క్రికెట్కు ఎంపిక కావడం ఆమె అచంచలమైన పట్టుదలకు, కష్టపడే తత్వానికి నిదర్శనం. ఆర్థిక కష్టాలు ఆమె ఆశయాన్ని ఆపలేకపోయాయి.
చెల్లి కోసం అన్న త్యాగం.. ఇప్పుడు ఏకంగా వరల్డ్కప్నే
భారత మహిళల జట్టు ప్రపంచాన్ని జయించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన తుది పోరులో 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసిన హర్మన్ సేన.. సరికొత్త వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది. మన అమ్మాయిలు తమ అద్బుత పోరాటంతో విశ్వవేదికపై భారత జెండాను రెపరెపాలడించారు. ఒకే ఒక్క విజయంతో 140 కోట్ల మంది భారతీయులను తలెత్తుకునేలా చేశారు. కాగా ఈ చారిత్రత్మక విజయంలో స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్లో రేణుకా వికెట్లు పడగొట్టనప్పటికి.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. పవర్ ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ ప్రోటీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన రేణుకా.. డెత్ ఓవర్లలోనూ తన పేస్ బౌలింగ్తో సత్తాచాటింది.మొత్తంగా టోర్నీలో రేణుకా మూడు వికెట్లు పడగొట్టింది. అయితే రేణుకా సక్సెస్ వెనక ఆమె తల్లి సునీత కష్టం దాగి ఉంది. రేణుకా చిన్నతనంలోనే తన తండ్రి మరణించినప్పటికి.. తల్లి సునీత అన్ని తానే అయ్యి బిడ్డలను ఈ స్ధాయికి చేర్చింది.తండ్రి కలను నేరవేర్చిన రేణుకా.."మా ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పిల్లల్లో ఎవరో ఒకరిని కబడ్డీ ప్లేయర్గా లేదా క్రికెటర్గా చూడాలని కలలు కన్నారు. కేహర్ సింగ్ ఇప్పుడు మాతో లేనప్పటికీ, మా అమ్మాయి తన కలను నెరవేర్చింది. చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు రావడం లేదు. రేణుకకు చిన్న తనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ.తన స్కూల్డేస్లో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. చెక్క బ్యాట్, వస్త్రాలతో చేసిన బాల్తో రోడ్డుపక్కన ఆడుతుండేది. ఫైనల్ మ్యాచ్కు ముందు ఆమెతో నేను మాట్లాడాను. ఈ రోజు(ఫైనల్లో) నీ కోసం కాదు.. దేశం కోసం ఆడు. ప్రపంచ కప్ గెలుచుకురా అని చెప్పాను. మా అమ్మాయి ఈ రోజు ఈ స్థాయికి చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మాయిలందరూ ఈ విధంగానే ముందుకు సాగాలి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని.. నేను ఆ దేవుణ్ని ప్రార్ధిస్తున్నానని రేణుకా తల్లి సునీత" ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.చెల్లి కోసం అన్న త్యాగం..కాగా రేణుక తండ్రి కెహర్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అండ్ ప్రజా ఆరోగ్య శాఖలో పనిచేసేవారు. అయితే రేణుకకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే కెహర్ సింగ్ ఠాకూర్ మరణించారు. అయితే కెహర్కు కూడా క్రికెట్ అంటే పిచ్చి. అందుకే భారత స్టార్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పేరు వచ్చేలా తన కుమారుడికి వినోద్ ఠాకూర్ అని పేరు కెహర్ పెట్టాడు.అయితే వినోద్ ఠాకూర్ కూడా క్రికెటర్ కావాలని కలలు కానేవాడంట. కానీ తన చెల్లి కోసం వినోద్ తన కలను వదులుకున్నాడు. ఆర్ధిక కష్టాలు ఉండడంతో తనకు బదులుగా రేణుకాను క్రికెట్ ఆకాడమీలో జాయిన్ చేయాలని తల్లిని వినోద్ ఠాకూర్ సూచించాడు. అయితే రేణుకాలో టాలెంట్ను గుర్తించింది మాత్రం ఆమె మామయ్య భూపిందర్ ఠాకూర్.ఆయన రేణుకాకు అన్ని విధాలగా మద్దతుగా నిలిచాడని ఆమె తల్లి సునీత స్పష్టం చేసింది. ధర్మశాల క్రికెట్ అకాడమీలో రేణుకాను భూపిందర్ చేర్చాడు. అక్కడ నుంచే ఆమె క్రికెట్ కెరీర్ ప్రారంభమైంది.చదవండి: Amanjot Kaur: మ్యాచ్ను మలుపు తిప్పిన క్యాచ్..! అమన్ వెనుక కన్నీటి గాథ
Women's World Cup: అమన్ కన్నీటి గాథ
భారత మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్ ఎట్టకేలకు మన అమ్మాయిల సొంతమైంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టు.. తొలిసారి వరల్డ్కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.2005, 2017లో ఫైనల్స్లో ఓటమిని చవిచూసిన టీమిండియా.. మూడో ప్రయత్నంతో విశ్వవిజేతగా నిలిచింది. కాగా హర్మన్ సారథ్యంలోని భారత జట్టు తొలి వరల్డ్కప్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ది కీలక పాత్ర. ఫైనల్లో అమన్జోత్ అద్బుతమైన క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పింది. సెంచరీతో కదం తొక్కి భారత బౌలర్లకు కొరకరాని కోయ్యిగా మారిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ను సంచలన క్యాచ్తో ఆమె పెవిలియన్కు పంపింది. ఈ ఒక్క క్యాచ్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అయితే తన క్యాచ్తో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన అమన్జోత్ కౌర్ వెనక ఆమె కుటుంబం చేసిన త్యాగం కూడా ఉంది. ప్రపంచకప్ వంటి వేదికలో తన బిడ్డ సత్తాచాటాలని ఆమె కుటుంబం ఎంతో బాధను దిగమింగారు.ఏమి జరిగిందంటే?ప్రపంచకప్ ప్రారంభమైన తర్వాత అమన్జోత్ కౌర్ వాళ్ల నానమ్మ భగవంతి(75) గుండెపోటుకు గురయ్యారు. అయితే అమన్జోత్ తన ఆటపై ఏకాగ్రత కోల్పోకూడదని ఆమె తండ్రి భూపిందర్ సింగ్తో సహా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచారు. ఈ విషయాన్ని తాజాగా భూపిందర్ సింగ్ వెల్లడించారు. భారత్ విజయం సాధించిన వెంటనే అమన్జోత్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యాడు. తన కుటుంబంతో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.అమన్జోత్ ఈ స్దాయికి చేరుకుకోవడంలో మా అమ్మ భగవంతిది కీలక పాత్ర. అమన్ క్రికెట్ ఆడటం ప్రారంభించిన రోజు నుంచి మా అమ్మ ఆమెకు ఎంతో సపోర్ట్గా ఉండేది. అమన్ చిన్నతనంలో క్రికెట్ ఆడటానికి ఎక్కడికి వెళ్లినా మా అమ్మ తన వెనుక వెళ్లేది. అయితే గత నెలలో ఆమెకు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని మేము అమన్జోత్కు తెలియజేయలేదు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఇటువంటి కఠిన సమయంలో ప్రపంచ కప్ విజయం మాకు కాస్త ఉపశమనం కలిగించింది. ఈ విజయం గురుంచి మా అమ్మకు తెలియజేశాము. ఆమె వెంటనే కళ్లు తెరిచి చూసింది అని అని భూపిందర్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.ప్రస్తుతం అమన్ వాళ్ల నానమ్మ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. కాగా ఈ టోర్నమెంట్లో 7 మ్యాచ్లు ఆడిన అమన్జోత్.. 146 పరుగులు చేసి, 6 వికెట్లు పడగొట్టింది. ఫైనల్లో లారా వోల్వార్ట్ క్యాచ్తో అద్బుతమైన రనౌట్తో కూడా అమన్ మెరిసింది.చదవండి: ఆస్ట్రేలియా సెలెక్టర్ల కీలక నిర్ణయంAfter India’s World Cup triumph, cricketer Amanjot Kaur’s father grew emotional, expressing immense pride and joy over his daughter’s remarkable achievement.#WomensWorldCup2025 #WomenInBlue pic.twitter.com/Q1azAudoIj— Karan Verma (@Mekaranverma) November 2, 2025
ఊడ్చేసిన ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేను (Afghanistan vs Zimbabwe) వారి సొంత గడ్డపై ఊడ్చేసింది. 3 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (నవంబర్ 2) జరిగిన నామమాత్రపు మూడో మ్యాచ్లో 9 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (92), ఇబ్రహీం జద్రాన్ (60) చెలరేగారు. ఆఖర్లో సెదిఖుల్లా అటల్ (35 నాటౌట్) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో ఈవాన్స్ 2, నగరవ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే సైతం అద్భుతంగా పోరాడింది. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 201 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (51), బ్రియాన్ బెన్నెట్ (47), ర్యాన్ బర్ల్ (37), ముసేకివా (28) పోరాడారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అహ్మద్జాయ్ 3, ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్ తలో 2, ముజీబ్, నబీ చెరో వికెట్ తీశారు.ఈ సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో జింబాబ్వే ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: ఆస్ట్రేలియా సెలెక్టర్ల కీలక నిర్ణయం
బిజినెస్
ఎయిర్బ్యాగ్ ఇష్యూ.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం!
పోర్స్చే (Porsche) కంపెనీ భారతదేశంలోని పనామెరా కార్లకు రీకాల్ ప్రకటించింది. సంస్థ ఈ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, రీకాల్ ప్రభావం ఎన్ని కారుపై ప్రభావం చూపుతుంది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.పనామెరా కారును పోర్స్చే స్వచ్ఛందంగా రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావం 158 యూనిట్లపై ప్రభావం చూపుతుంది. SIAM వెబ్సైట్లో ప్రచురించిన నోటీస్ ప్రకారం.. కారులోని ఎయిర్బ్యాగ్ వ్యవస్థకు సంబంధించిన లోపం కారణంగా రీకాల్ జారీ చేయడం జరిగిందని కంపెనీ స్పష్టం చేసింది.పోర్స్చే పనామెరా యజమానులు.. బ్రాండ్ అధికారిక రీకాల్ పోర్టల్కు వెళ్లి వారి వాహన గుర్తింపు సంఖ్య (VIN)ను ఇన్పుట్ చేసి వారి కారు రీకాల్ జాబితాలో ఉందో.. లేదో అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. 2023 జులై 19 నుంచి 2025 సెప్టెంబర్ 02 మధ్య తయారైన వాహనాలు రీకాల్ జాబితాలో ఉన్నాయి. ఈ సమస్య ప్రమాదంలో వాహన వినియోగదారులపై ప్రభావం చూపిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ రీకాల్ జారీచేయడం జరిగింది.ఇదీ చదవండి: కొత్త స్కూటర్ అమ్మకాల నిలిపివేత!రీకాల్ యూనిట్లలో సమస్యను.. సంస్థ ఉచితంగానే పరిష్కరిస్తుంది. కాబట్టి దీనికోసం కస్టమర్లు లేదా వినియోగదారులు డబ్బు చెల్లించాల్సిన అవసరామ్ లేదు. కాగా పోర్స్చే గతంలో ఆస్ట్రేలియాలోని పనామెరా కార్లలో కూడా.. ఇలాంటి సమస్యను గుర్తించి వాటికి కూడా రీకాల్ జారీ చేసింది.
ఉచితంగా ఏఐ సర్వీసులు ఇస్తే లాభమేంటి?
భారతదేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో ఉచితంగా ఏఐ (కృత్రిమ మేధస్సు) సేవలు అందుబాటులో ఉండటం అనేది రెండు వైపులా పదునున్న కత్తితో సమానమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఇది వినియోగదారులకు, సాంకేతిక అభివృద్ధికి గొప్ప అవకాశాలను అందిస్తుంది. మరోవైపు, దేశీయ జనరేటివ్ AI ఆవిష్కరణ, స్థానిక డెవలపర్ల దీర్ఘకాలిక పోటీతత్వానికి ఇది తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తుంది.ఉచిత AI సర్వీసులుఖర్చు లేకుండా ఏఐ సాధనాలను ఉపయోగించే అవకాశం లభించడం వల్ల సామాన్య ప్రజలకు కూడా అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. చిన్న వ్యాపారాలు, విద్యార్థులు, కంటెంట్ సృష్టికర్తలు తమ పనులను మెరుగుపరచుకోవడానికి, సృజనాత్మకతను పెంచుకోవడానికి దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఉచిత ప్లాట్ఫామ్లు విద్యార్థులకు, ఔత్సాహిక డెవలపర్లకు ఏఐ మోడల్లతో ప్రయోగాలు చేయడానికి, నేర్చుకోవడానికి, కొత్త పరిష్కారాలను ఆవిష్కరించడానికి ఒక పరీక్షా వేదికలా పనిచేస్తున్నాయి.ఉదాహరణకు, ఉచిత జనరేటివ్ ఏఐ టూల్స్ ద్వారా నివేదికలు రాయడం, ఈమెయిల్లకు సమాధానాలు ఇవ్వడం లేదా కోడింగ్లో సహాయం పొందడం వంటివి పనిలో వేగం, సామర్థ్యాన్ని పెంచుతాయి.లాభాలు ఉన్నప్పటికీ..ఉచిత సేవలను ఉపయోగించేటప్పుడు వినియోగదారులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన డేటాను ఆయా కంపెనీలకు తెలియకుండానే ఏఐకి ఇస్తున్నారు. ఈ డేటాను ఏఐ మోడల్ శిక్షణకు లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు. ఉచిత సంస్కరణలు తరచుగా పరిమిత ఫీచర్లు, తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. క్లిష్టమైన పనులకు లేదా మెరుగైన ఫలితాల కోసం వినియోగదారులు తరచుగా పెయిడ్ (చెల్లింపు) సేవలకు మారవలసి వస్తుంది. ఉచితంగా లభించే కొన్ని AI మోడళ్లు ట్రెయినింగ్ డేటాలోని అంశాలను కూడా యూజర్లకు అందించే అవకాశం ఉంది. దీని వల్ల వినియోగదారులు తప్పుడు ఫలితాలను పొందవచ్చు.కంపెనీలపై ప్రభావంభారతదేశంలో కొత్తగా జనరేటివ్ ఏఐ మోడళ్లను లేదా ఉత్పత్తులను సృష్టిస్తున్న స్థానిక స్టార్టప్లు, డెవలపర్లకు ఇది సవాలుగా మారవచ్చు. గ్లోబల్ టెక్ దిగ్గజాలు (ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, గూగుల్) తమ ఏఐ సేవలను ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకు అందించినప్పుడు స్థానిక స్టార్టప్లు తమ సర్వీసులకు ధర నిర్ణయించలేవు. అధిక పెట్టుబడి, వనరులు, మెరుగైన మోడళ్లను కలిగి ఉన్న అంతర్జాతీయ సంస్థలతో పోటీపడటం అసాధ్యం. కొత్త కంపెనీ ఉత్పత్తుల ద్వారా లాభాలు సంపాదించడం కష్టమని పెట్టుబడిదారులు గ్రహించినప్పుడు స్థానిక ఏఐ స్టార్టప్లకు నిధులు సమకూర్చడం తగ్గిపోతుంది. లాభదాయకత లేకపోవడం వల్ల స్థానిక కంపెనీలు ఆర్ అండ్ డీపై తగినంత పెట్టుబడి పెట్టలేక దేశీయ ఆవిష్కరణకు, ప్రపంచ స్థాయి AI మోడళ్లను నిర్మించడానికి ఆటంకం ఏర్పడుతుంది.ఏఐ సేవలు వాడేటప్పుడు యూజర్లు అనుసరించాల్సినవి..ఉచిత AI సాధనాలు తరచుగా వినియోగదారుల డేటాను శిక్షణ కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాయి. కాబట్టి బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు, సున్నితమైన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమాచారం వంటి అత్యంత గోప్యమైన డేటాను ఎప్పుడూ AI సిస్టమ్లలో నమోదు చేయకూడదు.ఏఐ సేవలను ఉపయోగించే ముందు ఆ టూల్స్ డేటా వినియోగ విధానాలు తెలుసుకోవాలి. వారు మీ డేటాను ఎలా నిల్వ చేస్తారు, ఎక్కడ ఉపయోగిస్తారు, ఎవరితో పంచుకుంటారు అనే దానిపై అవగాహన కలిగి ఉండాలి.కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు లేదా ముఖ్యమైన పత్రాల్లో ఈ సమాచారాన్ని ఉపయోగించే ముందు ఏఐ డేటాను విశ్వసనీయ మూలాల ద్వారా ధ్రువీకరించాలి.ఇదీ చదవండి: ‘అడ్డంకులు తొలిగాయి.. లెజెండ్స్ పుట్టారు’
‘నెల జీతాల ఉద్యోగాలు ఉండవ్..’
దేశంలో నెల జీతాల ఉద్యోగాలు ఉండబోవంటూ ఓ ఆర్థిక నిపుణుడు చేసిన హెచ్చరిక కలవరపెడుతోంది. భారతదేశ వైట్ కాలర్ జాబ్ యంత్రం ఆగిపోయే దశకు వచ్చిందని మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరిస్తున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే “భారతదేశంలో స్థిరమైన జీతం పొందే ఉపాధి యుగం ముగుస్తోంది”ఇటీవలి పాడ్కాస్ట్లో మాట్లాడిన ముఖర్జియా.. “ఉపాధి వృద్ధి ప్రధానంగా ఆగిపోయింది. ఈ పరిస్థితి కనిపించడమే కాదు.. కోలుకోలేనిదిగా ఉంది” అన్నారు. గత ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాల పెరుగుదల తక్కువగా ఉండటమే కాక, భవిష్యత్తులో కూడా వాటి పునరుజ్జీవనం “దాదాపు అసంభవం” అని ఆయన అభిప్రాయపడ్డారు.కారణం ఆటోమేషన్..ఈ పరిణామానికి ప్రధాన కారణాలు ఆటోమేషన్, కార్పొరేట్ సామర్థ్యం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు, ఇప్పుడు ఉద్యోగులను పెంచుకోకుండానే తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతున్నాయి. “ఈ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం చాలా తక్కువ. ఆటోమేషన్ వల్ల ఉద్యోగుల సంఖ్యను పెంచకుండానే ఎదగడం సాధ్యమవుతోంది” అని సౌరభ్ ముఖర్జియా అన్నారుగ్రాడ్యుయేట్ల వెల్లువ.. అవకాశాల కొరతప్రతి సంవత్సరం సుమారు 80 లక్షల మంది కొత్త గ్రాడ్యుయేట్లు భారత శ్రామికశక్తిలోకి ప్రవేశిస్తున్నారు. కానీ వీరికి తగిన అవకాశాలు ఉండటం లేదు. “అధికారిక కార్పొరేట్ నిర్మాణం లేకుండా ఈ కొత్త తరం యువతకు జీవనోపాధి కల్పించడం ఎలా అన్నదే దేశం ఎదుర్కొనే సవాలు” అని ఆయన చెప్పారు. రానున్న సంవత్సరాల్లో దేశంలో పని విధానం పూర్తిగా మారిపోతుందని సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు.గిగ్ ఎకానమీ వైపు ప్రయాణంసాంప్రదాయ వేతన ఉద్యోగాలు వేగంగా తగ్గిపోతాయనేది సౌరభ్ ముఖర్జియా అంచనా. “డ్రైవర్లు, కోడర్లు, పాడ్కాస్టర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు అందరూ స్వయం ఉపాధి వైపు వెళ్తున్నారు,” అని ఆయన చెప్పారు. “మనం గిగ్ ఉద్యోగాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. జీతం ఆధారిత ఉపాధి యుగం చరిత్రలో కలిసిపోతోంది” అన్నారు.గిగ్ ఎకానమీ భారత్కు కలిసివస్తుందని ముఖర్జియా ఆశాజనకంగా కూడా ఉన్నారు. 29 సంవత్సరాల సగటు వయస్సు ఉన్న యువ జనాభా, ప్రపంచంలోనే చౌకైన మొబైల్ బ్రాడ్బ్యాండ్, అలాగే ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ వ్యవస్థలు.. ఇవన్నీ భారత్ను “గిగ్ ఎకానమీ” యుగంలో బలంగా నిలబెడతాయని ఆయన నమ్మకం.“సాంప్రదాయ వైట్ కాలర్ ఉద్యోగాలు సవాలుగా మారతాయి. మన జీవితంలో ఎక్కువ భాగం గిగ్ కార్మికులుగా గడపాల్సిన భవిష్యత్తు కోసం మనమూ, మన పిల్లలూ సిద్ధం కావాలి” అని ఆయన స్పష్టం చేశారు.
‘అడ్డంకులు తొలిగాయి.. లెజెండ్స్ పుట్టారు’
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల సమక్షంలో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా జట్టుపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో భారత్ మొదటిసారి ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టెక్ పరిశ్రమ దిగ్గజాలు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోషల్ మీడియా వేదికగా ఇండియా జట్టును అభినందించారు.భారతదేశం ప్రతిష్టాత్మక క్రికెట్ విజయాలను గుర్తుచేస్తూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ ఫైనల్ను ఉత్కంఠభరితమైన మ్యాచ్గా అభివర్ణించారు. ‘భారత క్రికెట్ మహిళల జట్టుకు అభినందనలు. ఈ విజయంతో 1983, 2011నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ విజయం మొత్తం తరానికి స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నాను. దక్షిణాఫ్రికా టీమ్కు కూడా ఇదో గొప్ప టోర్నమెంట్’ అని తన ఎక్స్ ఖాతాలో టీమ్ ఇండియాను అభినందించారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ విజయంపై స్పందిస్తూ..‘ఉమెన్ ఇన్ బ్లూ = ప్రపంచ ఛాంపియన్లు! మహిళల క్రికెట్కు నిజంగా చారిత్రక రోజు. కొత్త అధ్యాయాలు లిఖించారు. అడ్డంకులు తొలిగాయి. లెజెండ్స్ పుట్టుకొచ్చారు. ఈ ఫార్మాట్లో తొలిసారి ఫైనల్కు చేరిన దక్షిణాఫ్రికాకు ప్రశంసలు’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్పై ఈడీ చర్య
ఫ్యామిలీ
వేగన్ వేవ్..! సస్టైనబుల్ లైఫ్స్టైల్గా వేగనిజం!
నగరంలో ఇటీవల వేగన్ ప్లీ మార్కెట్, వేగన్ ఫుడ్ డొనేషన్, వేగన్ వాక్స్ వంటి వినూత్న కార్యక్రమాలు జరుగుతుండడం విధితమే. అంతేకాకుండా రానున్న రోజుల్లో నగరంలో వేగన్ కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పదేళ్ల క్రితం నగరంలోని కొద్దిమంది మాత్రమే పాటించే ‘వేగన్ జీవనశైలి’ ప్రస్తుతం హైదరాబాద్ యువత, ఫిట్నెస్ ప్రేమికులు, జంతు ప్రేమికులు, పర్యావరణ హిత జీవనశైలిని ఆచరించే వారందరి మధ్య వేగంగా విస్తరిస్తోంది. రెస్టారెంట్ల మెనూలో ‘వేగన్ ఆప్షన్’లు కొత్తగా చేరడం, షాపింగ్ మాల్స్లో ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్కు ప్రత్యేక కౌంటర్లు రావడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వేగన్ ఫుడ్ను ప్రమోట్ చేయడం ఈ మార్పుకు ప్రతికూలంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు దేశంలో వేగన్ హబ్గా ఎదుగుతున్న నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. స్థానిక ఫుడ్ బ్రాండ్లు, క్లౌడ్ కిచెన్లు, ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా ప్లాంట్ బేస్డ్ సెగ్మెంట్ విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి. హైదరాబాద్లో వేగనిజం ఇప్పుడు ఒక ట్రెండ్ కాదు, ఒక చైతన్యం. జంతువుల పట్ల మమకారం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, భూమి పట్ల బాధ్యత కలిపి ఏర్పడిన ఈ వేగన్ వేవ్ నగర జీవనశైలిని కొత్త దిశలో నడిపిస్తోంది. ఈ మార్పు కేవలం ఫ్యాషన్ కోసం కాదు.., పర్యావరణం, జంతు సంరక్షణ, ఆరోగ్యానికి దోహదపడే విలువలపై ఆధారపడి ఉంది. వేగనిజం అనేది కేవలం స్వచ్ఛమైన శాకాహారం స్వీకరించే పద్ధతి మాత్రమే కాదు.. ఇది ఒక జీవన తత్వం. జంతువులకు హానికరమైన ఏ (ఎనిమల్ బెస్ట్ ప్రొడక్ట్స్) ఉత్పత్తినీ ఉపయోగించకుండా జీవించడమే దీని మంత్రం. అంటే పాలు, మాంసం, గుడ్లు, తేనె వంటి ఉత్పత్తులు తినకుండా, లెదర్, సిల్క్ వూల్ వంటి జంతు ఆధారిత వ్రస్తాలను వాడకుండా జీవించడం. పచ్చి ఆహారం, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలూ పొందడమే దీని లక్ష్యం.నగరంలో వేగన్ కల్చర్.. దశాబ్దం క్రితం హైదరాబాద్లో వేగన్ రెస్టారెంట్లు అరుదు. కానీ ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచి్చ»ౌలి, హైట్టెక్ సిటీ ప్రాంతాల్లో అనేక వేగన్ కేఫేలు తెరుచుకున్నాయి. ఈ స్పాట్స్ వేగన్ ఫుడ్ ప్రేమికుల అడ్డాగా మారాయి. వీటిలో సోయా మిల్క్ లాటేలు, టోఫూ బర్గర్లు, క్వినోవా బౌల్స్, ప్లాంట్–బేస్డ్ పిజ్జాలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. సోషల్ మీడియా, ఎన్జీవోల ప్రభావం.. జంతు హక్కుల కోసం పనిచేసే పీపుల్ ఫర్ యానిమల్స్ ( పీఎఫ్ఏ), బ్లూ క్రాస్ హైదరాబాద్, వేగన్ ఇండియా మూమెంట్ వంటి సంస్థలు వేగన్ లైఫ్స్టైల్పై విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో స్థానిక వేగనిస్టులు తమ రోజువారీ ఫుడ్ హ్యాబిట్స్, రెసిపీలు, షాపింగ్ టిప్స్ పంచుకుంటున్నారు. వేగన్ హైదరాబాద్ వంటి కమ్యూనిటీ గ్రూప్ సోషల్ మీడియాలో వేల మందికి పైగా సభ్యులను, ఫాలోవర్స్ను కలిగి ఉంది. వేగన్ ఫెస్టివల్స్, మార్కెట్లు.. హైదరాబాద్లో ప్రతి యేటా వేగన్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ స్టాల్స్, వేగన్ క్లాతింగ్, జీరో వేస్ట్ ప్రొడక్ట్స్, పర్యావరణ హిత జీవన పద్ధతులపై వర్క్షాప్స్ జరుగుతాయి. గచి్చ»ౌలి స్టేడియం, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకలు ప్రజల్లో భారీగా ఆదరణ పొందుతున్నాయి. తద్వారా వేగన్ పాప్ అప్ మార్కెట్లు కూడా కొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ స్థానిక బ్రాండ్లు హస్తకళలతో చేసిన ప్లాంట్ బేస్డ్ ఉత్పత్తులను అమ్ముతాయి.వేగన్ ఫుడ్ – హెల్తీ బెనిఫిట్స్.. ఫిట్నెస్ ప్రియులు, యోగా ప్రేమికులు ఈ జీవనశైలిని ఎక్కువగా అంగీకరిస్తున్నారు. రక్తపోటు, కొలె్రస్టాల్, మధుమేహం వంటి వ్యాధులను తగ్గించడంలో వేగన్ ఆహారం సహాయపడుతుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. వేగన్ డైట్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి డిటాక్సిఫై ప్రభావాన్ని ఇస్తుంది. కానీ సరైన మార్గదర్శకత్వంతో మాత్రమే దీని ప్రయోజనం పూర్తవుతుందని హైదరాబాద్ ఆధారిత న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాషన్ వైపు..వేగన్ ఫ్యాషన్ కూడా హైదరాబాద్ యువతలో కొత్త ట్రెండ్గా మారింది. లెదర్కు బదులుగా కార్క్, పైనాపిల్ ఫైబర్, రీసైకిల్ చేసిన కాటన్తో తయారు చేసిన బ్యాగులు, షూలు, బెల్టులు మార్కెట్లోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని బొటిక్ స్టోర్లలో వీటికి భారీ డిమాండ్ ఉంది. (చదవండి: సెన్స్లెస్ సెల్ఫీ..! ఆందోళన వ్యక్తం చేస్తున్న పోలీసులు, నిపుణులు)
సెన్స్లెస్ సెల్ఫీ..!
బడికెళ్తున్నా సెల్ఫీ... గుడి కొచ్చినా ఫొటో... వంట చేస్తూ వీడియో... స్మార్ట్ ఫోన్తో మొదలై, సోషల్మీడియాతో విపరీతంగా మారిన పోకడలకు ఉదాహరణలు ఇవి. ఇటీవలి కాలంలో వీటన్నింటినీ మించి వీడియో వైరల్ కిక్ కల్చర్ పెరుగుతోంది. జాఢ్యంలా విస్తరిస్తున్న దీని కారణంగా అనేక మంది మానవత్వాన్ని సైతం మర్చిపోతున్నారు. మొన్న నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్కు కత్తిపోట్ల ఉదంతం... నిన్న చిన్నటేకూరులో జరిగిన వి.కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం... ఇలా అనేక ఉదంతాల్లో స్పందించాల్సిన వ్యక్తులే వీడియో రికార్డింగ్కు పరిమితం అవుతున్నారు. ఆ ఉదంతంపై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య... ఈ ఉదంతంపై నగరవాసి హేమ ఈ ధోరణి పైనే ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పెరుగుతున్న ఈ వీడియో వైరల్ కల్చర్పై పోలీసులు, నిపుణులు చెప్తున్న అభిప్రాయాలివి... ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు, వాటి విలువలు తగ్గాయి. మనుషులను బట్టే సమాజం కూడా ఉంటుంది. అనేక మంది ఇళ్లల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగిపోవడంతో ఎదుటి వారికి సహాయం చేస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నారు. గతంలో వీరికి సహాయం అవసరమైనప్పుడు ఎవరూ ముందుకు రాకపోవడమూ ఈ ధోరణికి ఓ కారణమే. సినిమాలు, మీడియా తదితరాలు కూడా సక్సెస్ అంటే ఉన్నత స్థితికి చేరడం, డబ్బు సంపాదించడం అంటూ.. హీరోయిజమంటే ఎదుటి వారిని కొట్టడం అన్నట్లు చూపిస్తున్నాయి. ఇలాంటి వారికి లభిస్తున్న ప్రచారం పది మందికి సహాయపడిన, పడుతున్న వారికి లభించట్లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం కూడా మానవ సంబంధాలు, అనుబంధాలు–ఆప్యాయతలు తగ్గిపోవడానికి కారణమైంది. వీటితో పాటు సమాజంలో అనునిత్యం జరుగుతున్న నేరాలు చూడటం అలవాటుపడిన వాళ్లు తమ కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా స్పందించట్లేదు. సెన్సేషనలిజాన్ని ఆస్వాదించడానికే...కళ్లు జరుగుతున్న ఘోరాన్ని ఆపడానికి బదులు దాన్ని తమ సెల్ఫోన్లలో చిత్రీకరించే ధోరణి పెరిగిపోయింది. ఆ వీడియో వైరల్ కావడం వల్ల వచ్చే కిక్, ఆ సెన్సేషనలిజాన్ని ఆస్వాదించడానికి కొందరు ఇలా చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలను సోషల్మీడియాలో వైరల్ చేస్తూ లైక్స్, కామెంట్స్, ఫార్వర్డ్స్లో తమ సక్సెస్ వెతుక్కునే వాళ్లు పెరిగిపోయారు. స్మార్ట్ ఫోన్ సామాన్యుడి చేతికి రావడంతో ఈ మీడియా పరిధి పెరిగిపోవడం, ఇందులోని అంశాలు వేగంగా విస్తరించడం తదితర కారణాలతో తమ వీడియో వైరల్ కావడం ఓ కిక్గా భావిస్తున్నారు. కొన్నింటిని వైరల్ చేస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. సోషల్ ట్రోలర్స్..సోషల్మీడియాలో ట్రోలర్స్ ఎవరనేది ఎదుటి వారికి తెలీదు. దీంతో వాళ్లు చేసే కామెంట్స్, పోస్టులు నేరుగా వీళ్లపై ప్రభావం చూపదు. ఈ కారణంగానూ ఘోరాలను వీడియో తీసి వైరల్ చేయడం అనే ధోరణి పెరిగిపోయింది. ప్రస్తుత విద్యా వ్యవస్థ మార్కులు, ర్యాంకుల ఆధారితంగా మారిపోయింది. ఈ పరిస్థితులను మారాలంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి. తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువులు ఆ కోణంలో కృషి చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక బాధ్యతలు, విలువలు విద్యలో భాగంగా మారాలి. ప్రతి వ్యక్తి జీవితంలో రోల్ మోడల్స్ను ఎంచుకునే విధానం మారాలి. అలా ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే ఫలితాలు ఉంటాయి. (చదవండి: ఒకప్పుడు కూలీ..ఇవాళ ఏకంగా ఊరినే విమానంలో..)
దేవ దీపావళి... జ్వాలాతోరణం
కార్తీకమాసమంతా పర్వదినాల పరంపరే అయినప్పటికీ ఈ మాసంలో కొన్ని పర్వాలు కన్నుల పండువగా జరుగుతాయి. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్బంగా జ్వాలాతోరణ విశిష్టత ఏమిటి, ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం.కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అలా అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై ఆవునెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పార్వతీ పరమేశ్వరులని పల్లకిలో అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు. అలా వారి ఊరేగింపు అనంతరం భక్తులు కూడా ఆ మంటల కింది నుంచి దూరి వెళ్తారు.మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం, యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే శ్రీమన్నారాయణుని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి సర్వదేవతా కటాక్షం లభిస్తుందనీ, వారికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదనీ కార్తీక పురాణం చెబుతోంది. అందుకే భక్తులు తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు.దీనివెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద స్వామివారి పల్లకి పక్కనే నడుస్తూ...‘‘నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని సంకల్పం చెప్పుకోవాలి. అనంతరం ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి – ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం...లక్ష్మీనారాయణులను కూడా...కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శివుడితో పాటుగా లక్ష్మీనారాయణులను కూడా ఆరాధిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు వ్రతమాచరించి సత్యనారాయణ స్వామి వ్రత కథను వినాలి. సాయంకాలం ఆలయాల్లో లేదా రావిచెట్టు, తులసిచెట్టు ఈ మూడింట్లో ఎక్కడో ఒక చోట దీపం వెలిగించాలి.కాశీలో దేవ దీపావళికాశీలో ఈ కార్తీక పున్నమినాడు దేవదీపావళీ రూపంలో వేడుకలు జరుగుతుంటాయి. ఆ రోజున కాశీలోని గంగా ఘాట్లలో లక్షలాది దీపాలు వెలిగిస్తారు. ఒకేసారి ఘాట్లలో దీపాల వరుసలు వెలిగినప్పుడు, మొత్తం నగరం దీపతోరణంలా కనిపిస్తుంది. ఈ కమనీయ దృశ్యాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి భక్తులు అసంఖ్యాకంగా వారణాసికి చేరుకుంటారు.ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని వధించాడనీ, ఆ విజయాన్ని పురస్కరించుకుని దేవతలు కాశీలో దీపాలు వెలిగించి వేడుక చేసుకున్నార నీ, అప్పటినుండి ఈ పండుగ దేవ దీపావళిగా ప్రసిద్ధి చెందిందనీ స్థలపురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం గంగా హారతి చూడడం ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఈ దివ్య వీక్షణం కోసం గంటల తరబడి భక్తులు ఘాట్లలో ఓపిగ్గా ఎదురు చూస్తారు. కార్తీక పౌర్ణమిని సిక్కులు గురునానక్ జయంతిగా జరుపుకుంటారు. – డి.వి.ఆర్.
ఒకప్పుడు కూలీ..ఇవాళ ఏకంగా ఊరినే విమానంలో..
వచ్చింది కదా అవకాశం.. ఓ మంచి మాట అనుకుందాం.. ఎందుకు ఆలస్యం అందరినీ రమ్మందాం.. అంటూ బ్రహ్మోత్సవం సినిమాలో సీతారామశాస్త్రి రచించిన పాటను గుర్తుచేసేలా ఊరంతా ఒకేసారి విమానం ఎక్కారు. ఇందుకు హైదరాబాద్ నగరానికి చెందిన ఒకప్పటి అడ్డా కూలీ ఆతిథ్యం ఇచ్చాడు. ఒకరిని కాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా ఒకే ఊరికి చెందిన 500 మందిని విమానం ఎక్కించి గోవా తీసుకెళ్లాడు.. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.. ఆ వివరాలు.. ఒకప్పుడు ఆయనో అడ్డా కూలీ. పొట్టకూటికోసం నగరానికి వచ్చి దినసరి కూలీగా కాలం గడిపాడు.. 40 ఏళ్ల క్రితం ఫుట్పాత్పై దొరికే బ్రెడ్బన్ తిని బస్టాండ్ ఆవాసంగా బతికాడు.. పదేళ్ల తర్వాత 1995లో సెంట్రింగ్ పని ప్రారంభించాడు. అనతికాలంలో బీజే కన్స్ట్రక్షన్స్ పేరుతో పెద్ద కాంట్రాక్టర్గా స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు. సొంత ఊరు నుంచి 500 మందిని విమానం ఎక్కించాడు. దీనికి తన కుమారుడి వివాహాన్ని సందర్భంగా చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆయనే జవహర్నగర్ మాజీ మేయర్ మేకల కావ్య తండ్రి మేకల అయ్యప్ప. ఊరంతా ఒకేసారి.. నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లి మండల గుడ్లనర్వ గ్రామంలో కోళ్ల ఫారంలో కూలీగా పనిచేసే అయ్యప్ప పంటలు పండక ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం ఆర్థికంగా స్థిరపడిన ఆయన జవహర్నగర్లో నివాసం ఉంటున్నాడు. అయితే కుమారుడి నిశి్చతార్థం సందర్భంగా ఊరందరినీ ఒకేసారి విమానం ఎక్కించి గోవా తీసుకెళ్లాడు. ఆయన కల నెరవేర్చుకోవడంతో పాటు ఊరందరూ ఆనందపడేలా చేశాడు. ‘నా కుటుంబ సభ్యులతో పాటు.. ఊర్లో ఉన్న బంధువులను విమానంలో గోవాలో తీసుకెళ్లి వారితో ఆనందంగా గడిపాను.. ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటున్నారు అయ్యప్ప. (చదవండి: Success Story: ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్ జాబ్ వరకు అన్ని ఫెయిలే..! కానీ ఇవాళ..)
ఫొటోలు
యుక్తి తరేజా 'కె-ర్యాంప్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)
గ్లామరస్ బొమ్మలా 'నేషనల్ క్రష్' రష్మిక (ఫొటోలు)
హృదయవిదారకంగా.. చేవెళ్ల ఘోర ప్రమాద చిత్రాలు
స్టార్ హీరోకు భార్యగా నటించిన బ్యూటీ.. సుడిగాలి సుధీర్తో ఛాన్స్ (ఫోటోలు)
లూలు మాల్ లో సందడి చేసిన కామ్నా జఠ్మలానీ (ఫొటోలు)
శ్రీకాకుళం : దక్షిణ కాశీ అని పిలువబడే ఈ ఆలయాన్ని మీరు సందర్శించారా? (ఫొటోలు)
కార్తీక సోమవారం..ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
విశ్వవిజేతగా భారత్.. ముంబైలో మురిపించిన మహిళల జట్టు (ఫొటోలు)
కాశీబుగ్గ ఘటన.. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
అంతర్జాతీయం
చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?
చేతివాటం అని కొంత మంది ఏదో చులకనగా తేలికపాటి పదాలతో అంటూ ఉంటారు గానీ.. నిజానికి ‘హస్తలాఘవం’ అని గౌరవప్రదంగా అంటే ఆ విద్యలో ఉన్న కళాకౌశలానికి తగిన గుర్తింపు దక్కినట్టు అవుతుంది. అవును మరి.. ‘పిక్ పాకెట్’ లేదా ‘జేబు కత్తిరించుట’ అని చవకబారు భాషలో అనేసినంత మాత్రాన ఆ విద్యలో ఉన్న గొప్పదనం మరుగున పడిపోతుందా?. రెండు వైపులా పదును ఉండి.. పట్టుకున్న చేతినికూడా గాయపరచగల బ్లేడు వంటి చిన్న ఆయుధాన్ని, చాలా ఒడుపుగా రెండువేళ్ల మధ్యలో ఇరికించి పట్టుకుని.. ఎంతో టేలెంట్తో.. రోడ్డు మీద కనిపించిన వారి జేబును డబ్బులు లేదా మనీ పర్సు ఉన్నంత మేర మాత్రమే కత్తిరించడం ఆ విద్యలో మాస్టర్ డిగ్రీ అని చెప్పాల్సిందే. ఆ మాటకొస్తే జేబులు కత్తిరించడం మాత్రమేనా ఏమిటి? దుకాణాల్లో యజమానికి తెలియకుండా సరుకులు కొట్టేయడాలు, సూపర్ మార్కెట్లలో సీసీ కెమెరాల కనుగప్పి సరుకుల్ని మాయచేయడాలూ లాంటి వ్యవహారాలు అనేకం మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని చీప్గా చోరీలు అనకూడదు.. ‘కళాకౌశల ప్రదర్శన’ అని అనాలి. అందుకే మనం పొదుగుతున్న పిట్టకు తెలియకుండా గూట్లో గుడ్డును కొట్టేసే మహామహుల్ని గురించి కథలు తయారుచేసుకుని చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి చౌర్యం అనేది ఒక ఆర్టు.. చతుష్షష్ఠి కళలలో ఎన్నదగిన ఆర్టు. ఆ పనిచేసేవాళ్లు సదరు ఆర్టుని పెర్ఫార్మ్ చేస్తున్న కళాకారులు! మనకు అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. ఎవరో ఇద్దరు ఆడవాళ్లు బంగారం దుకాణానికి వస్తారు. మంచిగా మాటలు చెబుతూ నగల బేరం ప్రారంభిస్తారు. కొత్త కొత్త డిజైన్లు చూపించమని షాప్ కుర్రాడిని పురమాయిస్తారు. అతను వెనుదిరిగి మరో డిజైన్ అందుకుని చూపించేలోగా, ఆ బల్ల మీద ఉన్న వాటిని ఎంతో ఒడుపుగా తమ దుస్తుల మధ్యలోకి చేరవేస్తారు. కొన్ని క్షణాల వ్యవధిలో వీసమెత్తు తేడా రాకుండా ఎంతో పకడ్బందీగా ఈ కళను ప్రదర్శించాలంటే చాలా చాలా టేలెంట్ ఉండాలి. కానీ మనమేమో దానిని దొంగతనం అంటాం. నాలుగు తగిలించి పంపిస్తాం లేదా పోలీసులకు పట్టిస్తాం. Gujaratis are giving India a bad name internationally. Look at this Gujarati woman who stole 3 jeans, 7 tops, and 5 pairs of underwear from a shop in US. She was later caught with all the items, and her phone wallpaper had an image of Modi.pic.twitter.com/InTIuIzdxt— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) September 7, 2025తమ కళకు, టేలెంట్కు ఇక్కడ స్వదేశంలో అనుకున్న రీతిలో గౌరవం దక్కడం లేదని బాధపడుతున్నవారు ఏం చేయాలి, సాధారణంగా ఏం చేస్తుంటారు?. ఫరెగ్జాంపుల్ ఇంజినీరింగ్, మెడిసిన్ చదివిన వాళ్లు తమ ప్రతిభ మరింతగా రాణించాలంటే.. తమ విద్యతో మరింతగా ఆర్జించాలంటే అమెరికాకు వెళుతున్నారు కదా?. అదేమాదిరిగా మనం చోరకళాకారులు కూడా అమెరికాకు వెళుతున్నారు. అక్కడ తమ హస్తలాఘవాన్ని, కళాప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు. కానీ తమాషా ఏంటంటే.. వారి ఆర్టుకు అమెరికాలో కూడా గౌరవం దక్కడం లేదు. డిపార్టుమెంటల్ స్టోర్సులో, సూపర్ మార్కెట్లలో ఏదో తమకు తోచిన రీతిలో చేతివాటం ప్రదర్శిస్తే.. పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టేస్తున్నారు. మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ ఇదే పాట ఆమె కూడా పాడింది గానీ.. పోలీసులు కరుణించలేదు. ఆ పప్పులన్నీ ఉడకవని తేల్చేసి కటకటాల వెనక్కు పంపారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఇలాగే చోర కళాప్రదర్శనచేసి దొరికిపోయారు. అమెరికాలో ఈ కళను ‘షాప్ లిఫ్టింగ్’ అని వ్యవహరిస్తారట. అనగా.. స్టోర్సులో వస్తువులు పుచ్చుకుని డబ్బులివ్వకుండా జారుకునే విద్యకు అక్కడి పేరు అది! చదువుకోవడానికి అమెరికా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు న్యూజెర్సీలో ఇదే షాప్ లిఫ్టింగ్ కళను పెర్ఫార్మ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ వీడియో గత ఏడాదంతా మహా వైరల్ అయింది. చూడబోతే మన దేశంలో మాదిరిగానే అమెరికాలో కూడా కళకు సరైన గౌరవం లేదని అనిపిస్తోంది కదా!.గౌరవం లేకపోతే పాయె.. కానీ, ఈ సమస్య అక్కడితో ఆగడం లేదు. భారతదేశానికి చెందిన ఇలాంటి చోరకళాకారులు అడపాదడపా దొరికిపోతుండడం.. అమెరికాకు వెళ్లదలచుకునే వారి వీసాల ప్రక్రియ మీద కూడా ప్రభావం చూపిస్తోందట. చిన్న చిన్న చేతివాటానికి సంబంధించిన కేసులు ఉన్నా సరే.. అలాంటి వారు అమెరికాలో అడుగుపెట్టకుండా వీసాలు నిరాకరించాలని.. భారత్ లోని యూఎస్ ఎంబసీ ఆలోచిస్తున్నదట. వారి జైలుకు పోవడం సరే.. వారి దెబ్బకు మామూలు వాళ్లు కూడా అమెరికాకు వెళ్లాలంటే.. మనల్ని అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. ఇంటి దొంగలు ఇంట్లోనే ఉంటే కొంచెం పరువు దక్కుతుంది బజారున పడి దొంగతనాలు చేస్తే పరువు కూడా బజారుకెక్కుతుంది. చోరకళ అందరికీ అబ్బే విద్య కాదని వారు వాదించవచ్చు గానీ. ఈ అమాయక సమాజం దానిని నేరంగా పరిగణిస్తున్నప్పుడు.. వారు ప్రదర్శించకుండా మౌనంగా ఉండడమే మంచిది. ఏమంటారు?. -ఎం.రాజేశ్వరి👉ఇదీ చదవండి: ‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్’
టాంజానియా అధ్యక్షురాలిగా సమియా హసన్ ఎన్నిక
కంపాలా(ఉగాండా): టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హస్సన్ అపూర్వ విజయం సాధించారు. పోలైన ఓట్లలో ఆమెకు 97 శాతానికి పైగా ఓట్లు పడ్డాయని శనివారం అధికారులు ప్రకటించారు. ఎన్నికలు వివాదాస్పదంగా మారిన వేళ అధికారులు ఈ ప్రకటన చేయడం గమనార్హం. దేశ పరిపాలనా రాజధాని డొహొమాలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఆమెను ఎన్నికల్లో విజేతగా ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్ అందజేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలను పోటీలో లేకుండా చేయడం, చిన్న పార్టీలకు చెందిన 16 మంది అభ్యర్థులను హస్సన్ ఎదుర్కోవడం తదితర అంశాల్లో ఈ ఎన్నికలపై దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. అక్టోబర్ 29వ తేదీన ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో జనం వీధుల్లోకి రావడంతోపాటు పోలింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారు. అడ్డుకోబోయిన పోలీసులు, మిలటరీతో తలపడ్డారు. ఈ ఘర్షణల్లో కనీసం 10 మంది చనిపోయినట్లు ఐరాస మానవ హక్కుల విభాగం ప్రకటించింది. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన జాన్ పొంబె ముగుఫులి కొద్దిరోజులకే అనారోగ్యంతో చనిపోవడంతో, ఉపాధ్యక్షురాలిగా ఉన్న హస్సన్ 2021లో అధ్యక్షురాలయిన సంగతి తెలిసిందే.
అవి బందీల అవశేషాలు కావు: ఇజ్రాయెల్
జెరూసలేం: హమాస్ ఈ వారంలో రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేసిన అవశేషాలు బందీలవి కావని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ తమ వద్ద ఉన్న 30 మంది పాలస్తీనియన్ల మృతదేహాలను గాజాలో అందజేసింది. ప్రతిగా శుక్రవారం హమాస్ శ్రేణులు ముగ్గురు బందీల అవశేషాలను రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. ఇజ్రాయెల్ అధికారులు పరీక్షలు జరిపి అవి బందీలవి కావని తేల్చారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ శనివారం ప్రకటించారు. ఆ అవశేషాలు ఎవరివనే విషయం తేలాల్సి ఉంది. అక్టోబర్ 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక, 17 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. చిట్టచివరిగా 11 మంది మృతదేహాల అప్పగింత ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఇజ్రాయెల్ అందజేసిన 225 మంది పాలస్తీనియన్ల మృతదేహాల్లో 75 మందిని మాత్రమే కుటుంబాలు గుర్తించాయని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఈజిప్ట్’ మ్యూజియం ప్రారంభం
కైరో: పిరమిడ్లు మొదలు మమ్మీలు, ఫారో చక్రవర్తుల దాకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈజిప్ట్ మరోసారి అంతర్జాతీయ పురావస్తు ప్రపంచంలో తనదైన ముద్ర వేసేందుకు బయల్దేరింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘ గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం’ను దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్–సిసీ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో పలు దేశాల అగ్రనేతలు, రాజకుటుంబీకులు పాల్గొన్నారు. వేల సంవత్సరాల ఈజిప్ట్ ఘన చరిత్రను అందరికీ తెలియజేసేలా ఆనాటి రాజరిక సంబంధ అన్ని రకాల పురాతన వస్తువులను ఈ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. ఈజిప్ట్ను పరిపాలించిన 30 రాజవంశాలకు సంబంధించిన ప్రాచీన వస్తుసంపదను సందర్శకులు ఈ మ్యూజియంలో చూడొచ్చు. దేశ పర్యాటక రంగానికి పునర్వైభవ తేవడంతోపాటు ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందనే ఉద్దేశంతో ఈ మ్యూజియంను నిర్మించారు. ఈ మ్యూజియం నిర్మాణం 2005లో మొదలైంది. అయితే దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత ఈ మ్యూజియం నిర్మాణం ముందుకు సాగనివ్వలేదు. పాక్షికంగా పనులు జరగడం, తర్వాత ఆగడం పరిపాటిగా మారింది. ఎట్టకేలకు ఇటీవలే మ్యూజియం నిర్మాణం పూర్తయింది. కైరో నగర శివారులో లక్షలాది మంది సందర్శకులకు అనువుగా సకల సదుపాయాలతో దీనిని కట్టారు. నవంబర్ 4వ తేదీ నుంచి సాధారణ పర్యాటకులను లోపలికి అనుమతిస్తారు. ఈజిప్ట్ నాగరికత విశిష్టతన కళ్లకు కట్టేలా 1,00,000కుపైగా పురాతన వస్తువులను ప్రదర్శిస్తున్నారు. కేవలం ఒక్క దేశ నాగరికతను చూపే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా ఇది రికార్డ్లకెక్కనుంది. ది గ్రేట్ గిజా పిరమిడ్కు అత్యంత సమీపంలో దీనిని కట్టారు. గాజు పలకలతో పిరమిడ్ ఆకృతిలో నిర్మించారు. వేల కోట్ల రూపాయల వ్యయంతో..పిరమిడ్ ఆకృతిలో 2,58,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు రూ.8,878 కోట్ల వ్యయంతో ఈ మ్యూజియం కట్టారు. మలేరియా, ఎముక వ్యాధితో వేల ఏళ్ల క్రితం కన్నుమూసిన, శాపాలకు ప్రసిద్ధిచెందిన ఈజిప్ట్ యువరాజు కింగ్ టుటెంక్మెన్ మమ్మీ సహా ఎన్నో వస్తువులు ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
జాతీయం
ఉద్యోగం కోసం ఎమ్మెల్యేపై దాడి?.. యువకుడు అరెస్ట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్పై దాడి జరిగింది. సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఎమ్మెల్యే నివాసంలోకి చొరబడిన ఒక యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోలీసులు ఆ యువకుడిని అభిషేక్ దాస్గా గుర్తించిన దరిమిలా అరెస్ట్ చేశారు.ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే జ్యోతిప్రియ మల్లిక్ను వెంబడించిన ఆ యువకుడు అతని ఇంటిలోనికి చొరబడి, హఠాత్తుగా ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లి, అతని పొత్తికడుపుపై బలంగా కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే షాక్నకు గురయ్యారు. వెంటనే తేరుకుని, కేకలు వేయడంతో అతని భద్రతా సిబ్బందితో పాటు సమీపంలోని ఇతరులంతా ఆ యువకుడిని పట్టుకుని, బిధాన్నగర్ పోలీసులకు అప్పగించారు.పోలీసులు విచారణలో ఆ యువకుడు తాను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రా ప్రాంతానికి చెందినవాడినని, ఉద్యోగం కోసం మల్లిక్తో మాట్లాడాలనుకున్నానని చెప్పాడు. మల్లిక్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో హబ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఆ యువకుడు నగరంలోని ఒక ఆసుపత్రిలో మానసిక వైద్య చికిత్స పొందుతున్నాడని, సాల్ట్ లేక్లోని మల్లిక్ ఇంటికి పలుమార్లు వెళ్లాడని పోలీసు అధికారి తెలిపారు.ఎమ్మెల్యే మల్లిక్ విలేకరులతో మాట్లాడుతూ, ఆ యువకుడు ఇతర సందర్శకుల మాదిరిగానే తనను కలుసుకునేందుకు వచ్చాడని, అయితే అకస్మాత్తుగా ముందుకు దూకి, తనను కొట్టడంతో ఆశ్చర్యపోయానన్నారు. అతను మద్యం మత్తులో ఉన్నాడో లేదో తనకు తెలియదని, గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. మల్లిక్ రెండేళ్ల క్రితం అటవీ మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి కేసులో కేంద్ర సంస్థలు ఆయనను అరెస్టు చేశాయి. ఇది కూడా చదవండి: ‘ట్రంప్ ఏం చేస్తారో..’: ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
‘ట్రంప్ ఏం చేస్తారో..’: ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో జరుగుతున్న ఘటనలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత కాలంలో అన్నింటా అనిశ్చితి పెరిగిపోయిందని, సైబర్ సవాళ్లు మరింత వేగవంతం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, ట్రంప్ ఈ రోజు ఏమి చేస్తారో? రేపు ఏమి చేయబోతున్నారో అతనే చెప్పలేరని ద్వివేది వ్యాఖ్యానించారు.మధ్యప్రదేశ్లోని రేవాలో గల టిఆర్ఎస్ కళాశాలలో విద్యార్థులతో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, నేటి కాలంలో అనిశ్చితి సాధారణమైపోయిందని, భద్రత, సైబర్ యుద్ధం లాంటి సవాళ్లు వేగంగా చుట్టుముడుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సవాళ్లు మరింత అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత , అస్పష్టతకు దారితీస్తాయని వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో ఎవరూ ఊహిచలేరన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు ఏమి చేస్తారు? రేపు ఏమి చేయనున్నారు? అనేది అతనికే తెలియదని అనుకుంటున్నానన్నారు. సవాళ్లు చాలా త్వరగా వస్తున్నాయి. పాత సవాలును గ్రహించేలోపే, కొత్తది ఉద్భవిస్తోంది. దీనినే ఇప్పుడు సైన్యం ఎదుర్కొంటోంది. సరిహద్దుల్లో అయినా, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ యుద్ధం అయినా సవాళ్లు వేగంగా చుట్టుముడుతున్నాయన్నారు.ఇప్పుడు కొత్తగా అంతరిక్ష యుద్ధం, ఉపగ్రహాలు, రసాయన, జీవ, రేడియోలాజికల్, సమాచార యుద్ధాలు మొదలయ్యాయని ద్వివేది పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్లో కరాచీపై దాడి జరిగిందంటూ అనేక వార్తలు వచ్చాయని, అవి తమకూ చేరాయని, అయితే అవి ఎక్కడి నుండి వచ్చాయో తమకు తెలియదన్నారు. ఇటువంటి సవాళ్ల పరిషర్కారానికి భూమి, ఆకాశం, నీరు.. ఈ మూడింటిపైనా పని చేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Mexico: సూపర్ మార్కెట్లో పేలుడు.. 23 మంది మృతి
మట్టిలో కలిసిన మహా ప్రాణి
రాజస్థాన్లోని చారిత్రక పుష్కర్ జంతువుల మేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన రూ.21 కోట్ల విలువైన దున్నపోతు హఠాన్మరణం కలకలం రేపింది. లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించిన ఈ మేళాకు, ఆ దున్నపోతే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ భారీ విలువైన దున్నపోతును ప్రత్యేక ఏర్పాట్ల మధ్య రాజస్థాన్లోని పుష్కర్కు తీసుకువచ్చారు. దాని ఆరోగ్యం శుక్రవారం క్షీణించడంతో, వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్యుల బృందాన్ని హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపారు. కానీ, దాని అధిక శరీర బరువు, వేగంగా క్షీణిస్తున్న ఆరోగ్యం కారణంగా వైద్యులు ఎంత ప్రయతి్నంచినా ఆ మూగజీవిని కాపాడలేకపోయారు. వైరల్ వీడియోపై ప్రజాగ్రహం దున్నపోతు చనిపోయిన దృశ్యాలున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చనిపోయిన దున్నపోతు చుట్టూ సందర్శకులు, సంరక్షకులున్న ఈ వీడియో వేలాది మంది నెటిజన్లను కదిలించింది. నటి స్నేహ ఉల్లాల్ స్పందిస్తూ.. ‘మరిన్ని హార్మోన్లు, యాంటీబయాటిక్స్, గ్రోత్ హార్మోన్లను ప్రేరేపించండి. ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తూ.. దాన్ని సహజం అని పిలవండి. మీరంతా రోగగ్రస్థ మనుషులు’.. అని మండిపడ్డారు. ‘ఇది వ్యాపారం పేరుతో సాగించిన జంతు హింస’.. అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘ఇది హఠాన్మరణం కాదు. బీమా కోసం దాన్ని చంపాలని ప్లాన్ చేశారు.’.. అని ఇంకో నెటిజన్ ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెలు, పశువుల సంత పుష్కర్ మేళాగా కూడా పిలిచే ఈ జాతర రాజస్థాన్లోని పుష్కర్లో ఏటా నిర్వహిస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెలు, పశువుల సంతలలో ఒకటి. సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే ఈ వారం రోజుల మేళాకు.. భారతదేశం నలుమూలల నుంచి, విదేశాల నుండి వేలాది మంది సందర్శకులు తరలి వస్తారు. ఇది ఒంటెలు, గుర్రాలు, పశువుల వ్యాపారానికి ఒక ప్రధాన కేంద్రం. ఒంటె పందాలు, జానపద ప్రదర్శనలు, వివిధ రకాల హస్తకళలు, వ్రస్తాలు, స్థానిక రుచికరమైన వంటకాలతో రాజస్థాన్ విశిష్ట సాంస్కృతిక వారసత్వాన్ని ఈ మేళా ప్రదర్శిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్
లాలూ కొడుక్కి ఓటేస్తే.. హంతకులు, కిడ్నాపర్లే మంత్రులు
ముజఫర్పూర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూప్రసాద్ యాదవ్ కొడుకు (తేజస్వీ యాదవ్) కోసం ఓట్లు వేస్తే కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో హంతకులు, కిడ్నాపర్లు, దోపిడీరులే మంత్రులు అవుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ముఫరాబాద్, వైశాలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఎన్డీయేను గెలిపిస్తే వరదల నియంత్రణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లాలూ కుటుంబంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. ‘ఒకవేళ లాలూ కుమారుడు (తేజస్వీ యాదవ్) బిహార్ ముఖ్యమంత్రి అయితే.. మూడు కొత్త మంత్రిత్వ శాఖలు పుట్టుకొస్తాయి. అవే హత్యలు, కిడ్నాపులు, దోపిడీల శాఖలు. ఎన్డీయేకు ఓటు వేస్తే ఆర్జేడీ జంగిల్ రాజ్ నుంచి బిహార్ను కాపాడుతాం. కొత్త ముఖాలతో మళ్లీ జంగిల్రాజ్ను తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహాఘట్బంధన్లో సీట్ల కోసం కొట్టుకుంటుండగా, ఎన్డీయేలోని ఐదు భాగస్వామ్య పార్టీలు బిహార్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రయతి్నస్తున్నాయి. ఎన్డీయేలోని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ (ఆర్వీ), హెచ్ఏఎం, కుశ్వాహా పార్టీలు.. పంచపాండవులు’అని షా అభివర్ణించారు. ‘లాలూ కంపెనీ, రాహుల్ కంపెనీ రూ.12 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయి’అని ఆరోపించారు. ప్రాచీనకాలంలో లిచ్చవీ సామ్రాజ్యంలో విలసిల్లినట్లుగా వైశాలికి పూర్వవైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైశాలిలో 1,243 ఎకరాల్లో మెగా పారిశ్రామిక వాడను నిర్మిస్తామని, దీని ద్వారా వేలమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. నాడు ఉగ్రవాదులకు బిర్యానీలు పెట్టారు సోనియా, మన్మోహన్, లాలూ జమానాలో మనదేశంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు బిర్యానీలు తినిపించారని, మోదీ జమానాలో ఉగ్రవాదులను అంతం చేసి, వారి నివాసాలను కూల్చేస్తున్నామని అమిత్ షా తెలిపారు. దేశాన్ని ప్రధాని మోదీ సురక్షితంగా, సుసంపన్నంగా మార్చి అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారని తెలిపారు. ముజఫర్పూర్లో రూ.20,000 కోట్లతో మెగా ఫుడ్పార్కును నెలకొల్పుతున్నామని చెప్పారు.
ఎన్ఆర్ఐ
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం
ప్రపంచ శాంతికి, మానవతా విలువల పరిరక్షణకు కృషిచేస్తున్న గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్కు అరుదైన గౌరవం దక్కింది. సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరం ఈ నెల 19వ తేదీని “శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం”గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించేందుకు, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని, వివిధ మతాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించటం, సమాజాభివృద్ధికి కృషి చేయటం వంటి విషయాలలో గురుదేవుల చేసిన సేవకుగానూ ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడుతున్న మానవతావాది, ఆధ్యాత్మికవేత్త, శాంతిదూత అయిన శ్రీశ్రీ రవిశంకర్ ఒత్తిడి లేని, హింస లేని సమాజం నెలకొల్పాలనే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలలో 8కోట్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసిందని సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్, వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ పేర్కొన్నారు. రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్మూలన శిబిరాలు, యువ నాయకత్వ శిబిరాలు, సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు అక్కడి ప్రజలలో మానసిక దృఢత్వం, సౌభ్రాతృత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడటమేగాక శాంతియుత వాతావరణం, మహిళా సాధికారికతను పెంపొందించాయన్నారు. చివరగా ఇక అంతకు ముందురోజైన అక్టోబర్ 18వ తేదీన వాంకోవర్ నగరం సైతం గురుదేవుల్ని ఇదే విధంగా సత్కరించి, అక్టోబర్ 18వ తేదీని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దినం గా ప్రకటించటం గమనార్హం.(చదవండి: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా డబ్లిన్లో ఘనంగా దీపావళి వేడుకలు)
న్యూజెర్సీ హైవే దత్తతలో నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్థులు
ఈస్ట్ విండ్సర్, న్యూజెర్సీ: భావితరంలో సామాజిక బాధ్యత పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా న్యూజెర్సీలో హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టి హైవేను శుభ్రం చేసింది. ఈస్ట్ విండ్సర్, న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో అడాప్ట్-ఎ-హైవే క్లీన్ అప్ ప్రోగ్రామ్ పేరుతో నాట్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ సభ్యులు, పలువురు తెలుగు విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రహదారి పరిసరాలను శుభ్రం చేశారు. ఇలా తెలుగు విద్యార్థులు నాట్స్ ద్వారా చేసిన ఈ సామాజిక సేవకు అమెరికా ప్రభుత్వం నుంచి వాలంటీర్ అవర్స్గా గుర్తిస్తుంది.. ఇది విద్యార్థుల కాలేజీ ప్రవేశాలకు ఉపకరిస్తుంది. నాట్స్ న్యూజెర్సీ నాయకులు ప్రశాంత్ కూచు నాయకత్వంలో కిరణ్ మందాడి, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి తదితరులు హైవే దత్తత పరిశుభ్రత కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.తెలుగు వాళ్లు అమెరికా సమాజానికి సేవ చేయగలగడం పట్ల సంతోషంగా ఉందని నాట్స్ అధ్యక్షుడు శ్రీ హరి మందాడి అన్నారు. శుభ్రమైన, పచ్చని వాతావరణం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ పని గంటలు విద్యార్థులకుతమ వాలంటీర్ అవర్స్గా పాఠశాలలో ఉపయోగపడతాయన్నారు. ఇకపై ప్రతీ రెండు నెలలకొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని తెలుగు విద్యార్ధులు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.నాట్స్ న్యూజెర్సీ బృందం నుంచి శ్రీనివాసరావు భీమినేని, కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, వంశీ వెనిగళ్ల, ప్రశాంత్ కుచ్చు, సుఖేష్ సుబ్బాని, రాజేష్ బేతపూడి, శ్రీనివాస్ నీలం, సూర్య గుత్తికొండ, శంకర్ జెర్రిపోతుల, మల్లి తెల్ల, వెంకట్ గోనుగుంట్ల తదితరులు ఈ హైవే దత్తత, పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలుగు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంచే చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన న్యూజెర్సీ నాట్స్ టీమ్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.
మిస్సోరీలో నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్, ట్రోఫీలు
అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీ తెలుగువారి కోసం వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వరంలో ఫెంటన్ మిస్సోరీలోని లెగసీ వీటీసీలోఈ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు జరిగాయి. తెలుగు క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపుతూ సాగిన ఈ క్రీడా సంబరం తెలుగు క్రీడా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. చెస్టర్ఫీల్డ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు గ్యారీ చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ను నాట్స్ ప్రారంభించింది. ఈ టోర్నమెంట్లలో మొత్తం 25 జట్లు, 200 మందికి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్లు తెలుగువారి క్రీడా స్ఫూర్తిని, క్రీడల పట్ల ఉన్న మమకారాన్ని చాటి చెప్పాయి.నాట్స్ మిస్సోరీ విభాగం విశేష కృషిఈ క్రీడా పోటీలు విజయవంతం కావడానికి నాట్స్ ప్రముఖులు, మిస్సౌరీ ఛాప్టర్ నాయకత్వం, మిస్సోరీ నాట్స్ సభ్యులు విశేష కృషి చేశారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ పూర్వ అధ్యక్షులు ప్రస్తుత బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీస్ కొల్లిపరతో పాటు తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ మాజీ అధ్యక్షుడు సురేంద్ర బాచిన, మధుసూదన్ దద్దాల, మురళి బందరుపల్లి వంటి ప్రముఖులు ఈ పోటీల నిర్వహణను పర్యవేక్షించారు.నాట్స్ మిస్సోరీ ఛాప్టర్ బృందం తరుణ్ దివి, చైతన్య పుచకాయల, సంకీర్త్ కట్కం, రాకేష్ రెడ్డి మారుపాటి, సునీల్ స్వర్ణ, హరీష్ గోగినేని, నరేష్ రాయంకుల, నవీన్ కొమ్మినేని, శ్రీనివాస్ సిస్ట్ల తదితరులు ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావడానికి ఎంతో కృషి చేచేశారు. నాట్స్ వాలంటీర్లు కూడా ఈ టోర్నమెంట్ కోసం విలువైన సమయాన్ని, సేవలను వెచ్చించారు..విజేతలకు ట్రోఫీలు పంపిణీఐదు విభాగాలలో విజేతలు మరియు రన్నరప్లకు నాట్స్ ట్రోఫీలను పంపిణీ చేసింది.. క్రీడాకారుల అంకితభావం, ప్రతిభను ఈ సందర్భంగా నాట్స్ నాయకులు కొనియాడారు. నాట్స్ మిస్సోరి విభాగం వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను దిగ్విజయం చేయడంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
డల్లాస్ ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్
ఫ్రిస్కో, టెక్సాస్: భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ డల్లాస్ లో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. నాట్స్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫ్రిస్కో నగరంలోని మోనార్క్ వ్యూ పార్క్ వద్ద అడాప్ట్ ఏ పార్క్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొండ వెనుక భాగంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో మొక్కలు నాటి, వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా, సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ విభాగం సభ్యులు పిల్లలకు శుభ్రత, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించారు. సీతాకోకచిలుకల సంరక్షణకు అనుకూల వాతావరణం కల్పించడంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని పర్యావరణ పరిరక్షకులు తెలిపారు.గత ఆరు నెలలుగా నాట్స్ డల్లాస్ చాప్టర్ ఈ మొనార్క్ వ్యూ పార్క్ ను దత్తత తీసుకుని, అక్కడ తరచూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ కాలంలో విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తోంది. పార్క్ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ 2,000 కు పైగా మొక్కలను నాటిన ఘనతను నాట్స్ డల్లాస్ చాప్టర్ సాధించింది.నాట్స్ చేస్తున్న నిరంతర కృషిని సిటీ ఆఫ్ ఫ్రిస్కో ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న 25 మంది యూత్ వాలంటీర్లను గుర్తించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఆఫ్ ఫ్రిస్కో పార్క్ విభాగం అధికారి క్రిస్టల్, ప్రకృతి పరిరక్షకులు రిక్, లారా హాజరయ్యారు. నాట్స్ తరపున ప్రతినిధులు బాపు నూతి, రాజేంద్ర మాదాల, రవి తాండ్ర, కిశోర్ నారె, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి, శివ మాధవ్ లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.నాట్స్ డల్లాస్ చాప్టర్ ఇలాంటి సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని ప్రతినిధులు తెలిపారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
క్రైమ్
చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో 19మంది మరణించారని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చేవెళ్ల మండల పరిధిలో సోమవారం వేకువ ఝామున ఈ ఘోరం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ వేకువ జామున హైదరాబాద్కు బయల్దేరింది. తొలి ట్రిప్పు బస్సు కావడంతో అధిక సంఖ్యలో జనాలు ఎక్కారు. ఈలోపు.. బస్సు మీర్జాగూడ వద్దకు చేరుకోగానే కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఆపై టిప్పర్ ఒరిగిపోవడంతో కంకర లోడ్ మొత్తం బస్సులోకి పడిపోయింది. తాండూరు బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరిన దృశ్యంప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం ధ్వంసం అయ్యింది. బస్సు, టిప్పర్ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వాళ్లను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలం వద్ద, బస్సుల్లో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. తమను కాపాడాలంటూ కంకరలో కూరుకుపోయిన వాళ్లు వేడుకోవడం.. అచేతనంగా కొందరు పడి ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 32 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడినవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.బస్సులో కంకర మధ్య విగతజీవిగా యువతి.. ఆ వెనక సగం కూరుకుపోయి సాయం కోసం ఎదురు చూస్తున్న యువకుడుకంకర టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్.. అదుపు తప్పి బస్సుపై బోల్లా పడిందని పోలీసులు చెబుతున్నారు. కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ఈ తీవ్రత ఎక్కువైందని అంటున్నారు.ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు కావడంతో సిటీ నుంచి వెళ్లినవాళ్లు తిరుగు పయనమైనట్లు స్పష్టమవుతోంది. అందులో విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 20 మంది మృతుల్లో 10 మంది మహిళలు, ఒక చిన్నారి, 8 మంది పురుషులు(ఇద్దరు డ్రైవర్లుసహా) ఉన్నారు. మృతుల్లో పది నెలల పసికందు, ఆమె తల్లి కూడా ఉండడం కలిచివేస్తోంది. కేబిన్లలో ఇరుక్కుపోయిన టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మరో 15 మంది ప్రయాణికులను కాపాడగలిగారు. కంకరను పూర్తిగా తొలగించేందుకే జేసీబీ సహాయం తీసుకున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇదిలా ఉంటే.. సహయ చర్యల్లో పాల్గొన్న సీఐ భూపాల్కు గాయాలయ్యాయి. జేసీబీ ఆయన కాలు మీదకు ఎక్కింది. దీంతో ఆయనకు చికిత్స అందించారు. ఇక ఈ ప్రమాదం వల్ల చేవెళ్ల-వికారాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూడు కిలోమీటర్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అధికారులు రంగంలోకి ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు.
పెళ్లికి ముందు భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని..
పటాన్చెరు టౌన్: పెళ్లికి ముందు భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లాకు చెందిన రాములు (23) అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్పూర్ లో ఉంటూ స్థానికంగా ప్రైవేట్ స్కూల్లో బస్ డ్రైవర్గా పని చేస్తున్నా డు. రాములుకు వికారాబాద్కు చెందిన ఓ యువతి (18)తో నెల కిందట వివాహం జరిగింది.ఈ క్రమంలో అతను గతనెల 28వ తేదీన భార్యతో తాను పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి, నువ్వు ఎవ రినన్నా ప్రేమించావా? అని అడగడంతో అతని భార్య.. తాను కూడా ఒక వ్యక్తిని ప్రే మించానని చెప్పింది. దీంతో అప్పటి నుంచి ఆలోచిస్తూ.. మనస్తాపానికి గురైన రాములు శనివారం బయటకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాములు కోసం వెతుకుతుండగా సుల్తాన్పూర్ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వదిన, భార్య, బిడ్డను చంపి ఆపై ఆత్మహత్య
కుల్కచర్ల: కుటుంబ కలహాలు నలుగురి ప్రాణాలు బలితీసుకున్నాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్క చర్ల మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేపూరి యాదయ్య (36)కు 15 ఏళ్ల క్రితం గండీడు మండలం పగిడ్యాలకు చెందిన సాయమ్మ, కృష్ణయ్య దంప తుల కుమార్తె అలి వేలుతో వివాహమైంది. వారికి అపర్ణ (13), శ్రావణి (10) కూతు ర్లు ఉన్నారు. అయితే దంప తులు నాలుగేళ్లుగా గొడవప డుతూ పెద్దల సూచనతో వైవాహిక బంధాన్ని కొనసా గిస్తున్నారు. శుక్రవారం మరో మారు గొడవపడ్డారు. ఈ క్రమంలో అలివేలు సోద రి వల్లభరావుపల్లికి చెందిన హన్మమ్మ శనివారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్ట గా వారు రాజీ కుదిర్చారు.నిద్రలో ఉండగా దాడి ఇంటికి వచ్చిన యాదయ్య ముందస్తు ప్రణాళిక ప్రకారం భార్య, వదిన, పిల్లలు నిద్రించిన తర్వాత మొదట హన్మమ్మపై కత్తితో దాడి చేశాడు. ఆ శబ్దానికి నిద్రలోంచి లేచిన భార్యపై.. తదనంతరం మేము లేకుంటే మిమ్ముల్మి ఎవరు సాకుతారంటూ పిల్లలపై దాడి చేశాడు. దీంతో శ్రావణి మృతిచెందగా మరో కుమార్తె అపర్ణ తీవ్రంగా గాయపడి అక్కడి నుంచి పరారైంది. అనంతరం యాదయ్య సైతం ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అపర్ణ స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్, కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అలివేలు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కూటమి నేతల వేధింపులు భరించలేక చచ్చిపోతున్నా
బైరెడ్డిపల్లె: ‘నేను తెలుగుదేశం పార్టీకి ఓటేశా.. వైఎస్సార్సీపీ నాయకుల జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ ఇస్తే తిన్నా... అదేమన్నా తప్పా..? ఇంతమాత్రానికే నాపై అధికార కూటమి నేతలు కక్ష సాధింపులకు పాల్పడతారా? అయ్యా... ఇక నేను భరించలేను. చచ్చిపోతున్నా...’ అంటూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలోని పాతపేటకు చెందిన శ్రీనివాసులు(42) సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వివరిస్తూ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్థానికుల కథనం మేరకు... పాతపేట గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు, అతని సోదరుడికి మధ్య రెండు రోజుల క్రితం ఘర్షణ జరిగింది. అయితే శ్రీనివాసులును పోలీస్ స్టేషన్కు పిలిపించి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ నేతల జన్మదిన వేడుకల్లో పాల్గొనడం వల్లే కూటమి నేతలు కక్ష కట్టి పోలీస్స్టేషన్కు పిలిపిస్తున్నారని గ్రామస్తులు శ్రీనివాసులుకు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను తెలియజేస్తూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కొందరు కూటమి నేతల వల్లే తాను చనిపోతున్నానని వెల్లడించాడు. ఆ వీడియోను గ్రామస్తులకు షేర్ చేయడంతో అటవీ ప్రాంతానికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసులును తొలుత బైరెడ్డిపల్లె పీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వీడియోలు
స్కర్ట్లో రకుల్.. గ్లామర్ మామూలుగా లేదుగా! (ఫొటోలు)
Sajjala: డిజిటల్ మేనేజర్లతో సజ్జల కీలక సమావేశం
Jaipur Road Accident: 10 మంది దుర్మరణం, 50 మందికి గాయాలు
చేవెళ్ల ప్రమాదం.. కుటుంబ సభ్యుల ఆవేదన
Chevella Incident: తల్లిదండ్రులను కోల్పోయి గుక్కపెట్టి ఏడుస్తున్న పిల్లలు
Chevella: బస్సు ప్రమాద కారణాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
Chevella: చెవి నొప్పి అని తీసుకొచ్చా మా నాన్న చనిపోయాడు
Chevella Bus Incident: శోకసంద్రంలో చేవెళ్ల హాస్పిటల్
మీకు తగ్గట్టు జైళ్లు ఇప్పుడే రెడీ చేసుకోండి... మా స్ఫూర్తి వైఎస్ జగన్
Chevella Road Accident: బస్సు ప్రమాద ఘటనపై జగన్, దిగ్భ్రాంతి

