రైతుల ఇళ్లలో పండుగ | AP CM YS Jagan launch YSR Rythu Bharosa | Sakshi
Sakshi News home page

రైతుల ఇళ్లలో పండుగ

Oct 16 2019 7:50 AM | Updated on Mar 21 2024 8:31 PM

‘‘చెప్పిన దాని కన్నా ముందుగా.. మాట ఇచ్చిన  దాని కన్నా మిన్నగా రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చాం.. అభివృద్ధి అంటే జీడీపీ లెక్కలు కాదు.. రైతు కుటుంబాలు బాగుంటేనే అభివృద్ధి.. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది.. రైతు భరోసాగా ఉంటేనే రాష్ట్రానికి కూడా భరోసా.. అన్నదాతలను ఆదుకునే దిశగా రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మార్పులు తీసుకొస్తాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మంగళవారం ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. అన్నం పెట్టే రైతులకు అండగా ఉండాలని, తోడుగా నిలవాలని ఈ పథకాన్ని తెచ్చామన్నారు. ఈ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
 

Advertisement
 
Advertisement
Advertisement