పాక్‌లో అయితే ఆడను! | Sakshi
Sakshi News home page

పాక్‌లో అయితే ఆడను!

Published Fri, Mar 2 2018 9:31 AM

‘మూలిగే నక్కమీద తాటి పండు పడ్టట్లుంది’ పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) నిర్వహాకుల పరిస్థితి. దుబాయ్‌ వేదికగా  పీఎస్‌ఎల్‌ మూడో సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైనా.. ప్రేక్షకాదరణ లేక స్టేడియాలన్నీ బోసిబోయి కనిపిస్తున్న విషయం తెలిసిందే.  దీంతో మ్యాచ్‌లను స్వదేశానికి తరలిస్తే అభిమానుల ఆదరణ పెరుగుతుందని భావించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఈ సీజన్‌ క్వాలిఫైయర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లను పాక్‌లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే  క్వెట్టా గ్లాడియేటర్స్‌ తరుఫున ఆడుతున్న ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ పీసీబీకి షాకిచ్చాడు. పాక్‌లో జరిగే మ్యాచ్‌ తాను ఆడనని కుండలు బద్దలుకొట్టాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement