చంద్రబాబు అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని మరో నేత వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. గతంలో ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు ఇలాగే మాట్లాడారని గుర్తుచేశారు. ప్రజలను అడ్డుపెట్టుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చట్టవిరుద్ధంగా చేసిన పనుల వల్లే చంద్రబాబు భయపడుతున్నారని తెలిపారు. చంద్రబాబును ఎన్డీఏలోకి తిరిగి ఆహ్వానిస్తున్నామని కేంద్రమంత్రి అన్న మాటలు ఎల్లో మీడియాకు కనిపించవా అని ఆయన ప్రశ్నించారు. తమపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవినేని ఉమకు ధైర్యం ఉంటే 2019లో మైలవరం నుంచి పోటీ చేయగలరా అని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.
చంద్రబాబు అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు
Apr 27 2018 2:27 PM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement