ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఊపిరి.. | YS Jagan Public Speech At Kaligiri | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఊపిరి..

Feb 13 2018 5:55 PM | Updated on Mar 21 2024 10:58 AM

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరని, హోదా సాధించేవరకూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ(వైఎస్‌ఆర్‌ సీపీ) విశ్రమించబోదని అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 5 నుంచి జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో హోదా కోసం పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారని చెప్పారు. ఏప్రిల్‌ 6 వరకూ(బడ్జెట్‌ సమావేశాలు ముగుస్తాయి) పోరాటం చేసినా ఫలితం లేకపోతే పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు.

86వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘  గత 12 రోజులుగా రాష్ట్రంలో జరగుతున్న డ్రామాను అందరూ గమనిస్తూనే ఉన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారన్న దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాకు తెర తీశారు. ఆయన డ్రామా ఏస్థాయిలో నడిచిందో మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు తెలుగుదేశం మంత్రులు ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement