‘‘శవం నోట్లో మద్యం పోసి, ప్రమాదంగా చిత్రీకరించు. ఈ క్రైమ్ సీన్ ఆంధ్రప్రదేశ్కు మారిస్తే మంచిది. కారులో శవాన్ని తీసుకుని ఒక్కడివే వెళ్లు. టోల్గేట్ల వద్ద, మద్యం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు’’– కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు నిందితుడు రాకేష్రెడ్డికి పోలీసు అధికారులు ఇచ్చిన సూచనలివి. జయరామ్ గతనెల 31న జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని రాకేష్ ఇంట్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేష్తోపాటు మరో నిందితుడు శ్రీనివాస్ను జూబ్లీహిల్స్ పోలీసులు మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు. తొలిరోజు బుధవారం వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, దర్యాప్తు అధికారిగా కె.శ్రీనివాసరావు జరిపిన విచారణలో పలు కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. జయరామ్ను హత్య చేసిన తర్వాత కొన్ని గంటల పాటు శవాన్ని కారులో వేసుకుని నగరంలోనే సంచరించినట్లు వెల్లడైంది.
పథకం ప్రకారం రప్పించి...
Feb 14 2019 9:50 AM | Updated on Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement