సాక్షి, హైదరాబాద్: పబ్లో జరిగిన గొడవపై బిగ్బాస్ తెలుగు సీజన్-3 విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై జరిగిన దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పోలీసులను కోరాడు. గురువారం తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్ వచ్చి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. పబ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశామని గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపారు. వీడియోలు ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించి ఐపీసీ 324, 34 రెడ్ విత్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి బంధువు రితేశ్రెడ్డితో పాటు మరో ఐదుగురు దాడి చేశారని వెల్లడించారు.
‘బిగ్బాస్’పై దాడి; అసలేం జరిగిందంటే?
Mar 5 2020 3:42 PM | Updated on Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
Advertisement
