తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్ర ఆగదని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ యాత్ర కొనసాగిస్తామని తెలిపారు. ఈ విషయమై తెలంగాణ హోంమంత్రి నాయని నర్సింహారెడ్డితో కోదండరాం శనివారం సమావేశమయ్యారు. దీనిపై ప్రభుత్వ స్పందన ఆశాజనకంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.