తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా కేంద్ర హోంశాఖ కీలక సమావేశం బుధవారం సాయంత్రం ఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీ విభజన, షెడ్యూల్ 9,10లలోని సంస్థల విభజన, ఆస్తులు, అప్పుల పంపిణీపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.