రాష్ట్రంలోని 5.4 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, ఆపరేషన్లు కూడా చేయిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆరు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతపురంలో గురువారం ఆయన డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేస్తున్నామన్నారు.