ప్రతి అడుగు విప్లవాత్మకమే.. | AP assembly passes 16 bills | Sakshi
Sakshi News home page

ప్రతి అడుగు విప్లవాత్మకమే..

Dec 17 2019 7:51 AM | Updated on Mar 20 2024 5:39 PM

ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కీలక బిల్లులను ఆమోదించి రాష్ట్ర శాసనసభ సువర్ణాక్షరాలతో కొత్త చరిత్రను లిఖించింది.. ప్రభుత్వ బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ బడుగు, బలహీన వర్గాలు, ఇతరత్రా పేద పిల్లల బంగారు భవిష్యత్‌కు శ్రీకారం చుట్టింది.. మద్యం మహమ్మారిపై ఉక్కుపాదం మోపింది.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం,  ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు.. తదితర కీలక నిర్ణయాలకు నాంది పలికింది.. ఐదున్నర కోట్ల రాష్ట్ర ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా గత శాసనసభ సమావేశాల్లో 19 బిల్లుల ఆమోదంతో తొలి అడుగు వేసిన వైఎస్‌ జగన్‌ సర్కారు.. తాజాగా యావత్‌ ప్రపంచంలోని తెలుగు వారు ప్రశంసించేలా సోమవారం 16 బిల్లులకు ‘ఎస్‌’ అంటూ మలి అడుగు వేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement