ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ను నిర్లక్ష్యం చేసి నిన్న పట్టిసీమ అన్న ప్రభుత్వం ఇప్పుడు సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల అంటూ కొత్త నాటకానికి తెరతీశారన్నారు.