తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొలమూరు నీటి సంఘాల ఎన్నికలు వీరి మధ్య ఘర్షణకు దారి తీసింది. జిల్లాలోని అనపర్తి మండలం పొలమూరు నీటి సంఘాలకు సంబంధించి ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నేత కృష్ణారెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఉద్రిక్తత ఏర్పడినా ఎన్నికలు మాత్రం అధికారులు నిర్వహిస్తూనే ఉన్నారు.
Sep 11 2015 1:13 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement