కార్డన్ సెర్చ్‌: 50 బైక్‌లు స్వాధీనం | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్‌: 50 బైక్‌లు స్వాధీనం

Published Mon, Feb 27 2017 10:24 AM

పాతబస్తీ, చంద్రాయణగుట్ట ప్రాంతంలో సోమవారం వేకువజామున పోలీసులు నిర్భంధ తనిఖీలు చేపట్టారు. దక్షిణ మండల డీసీపీ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు తనిఖీలు నిర‍్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో 90 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. పోలీసులు 11 మంది రౌడీషీటర్లు, 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement