ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వివాదంపై 'ఔట్లుక్' పత్రిక చెప్పీ చెప్పనట్లుగా క్షమాపణలు చెప్పింది. 'ద బోరింగ్ బాబు' అనే కథనంలో తాము ఎవరి పేర్లూ పేర్కొనలేదని, అయినా.. తమకు తెలంగాణ ప్రభుత్వంలోని ఓ అధికారి లీగల్ నోటీసులు పంపారంటూ కొన్ని వార్తా పత్రికలు, టీవీ న్యూస్ చానళ్లు, వెబ్ సైట్లు చెప్పాయని ఔట్లుక్ పేర్కొంది. అయితే, మీడియా గందరగోళం మొదలై 36 గంటలు దాటిపోయినా, తమకు మాత్రం ఎలాంటి నోటీసు రాలేదని తెలిపింది. సోషల్ మీడియాలో కూడా తమ పత్రిక కరస్పాండెంటుపై వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని, ఆమెపై దాడి చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆ కథనంలో రాశారు.
Jul 2 2015 2:50 PM | Updated on Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement