విరాళాలివ్వండి బాబూ.. | hundi in ap secretariat for construction of capital city | Sakshi
Sakshi News home page

Jul 19 2014 3:19 PM | Updated on Mar 22 2024 11:06 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎలా ఉండాలో పరిశీలించేందుకు ఇద్దరు మంత్రులు సహా ఓ బృందాన్ని కొన్నాళ్ల పాటు సింగపూర్ పంపుతున్న ప్రభుత్వం.. తాజాగా ఈ రాజధాని నిర్మాణం కోసం ఏకంగా హుండీలు పెట్టేసింది. కొత్త రాష్ట్రానికి సరిపడగా డబ్బులు లేవని, బోలెడన్ని అప్పుల్లో మునిగిపోయామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక వర్గాల నుంచి భారీ ఎత్తున విరాళాలు సేకరించింది. అవి ఎంత అయ్యాయనే విషయాన్ని మాత్రం ఇంతవరకు ఎక్కడా వెల్లడించలేదు. కానీ ఇప్పుడు మళ్లీ మరోసారి విరాళాల కోసం జోలె పట్టేసింది. స్టీలుతో తయారుచేసిన భారీ హుండీ ఒకదాన్ని సచివాలయంలోని ఎల్ బ్లాకులో ఏర్పాటుచేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement