అంత్యపుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్. చినరాజప్ప వెల్లడించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సరస్వతి ఘాట్లో అంత్య పుష్కరాలను చినరాజప్ప ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో అన్ని పుష్కర ఘాట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చినరాజప్ప తెలిపారు. గోదావరిలో పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు చేశారు. గోదావరి అంత్య పుష్కరాలు నేడు ప్రారంభమైనాయి. ఆగస్టు 11వ తేదీతో ఈ పుష్కరాలు ముగియనున్నాయి.
Jul 31 2016 7:28 AM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement