దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే బందరు పోర్టు పనులు ముందుకు సాగాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పారు. శనివారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ...మచిలీపట్నంలో పేద రైతులు ఎక్కువ మంది ఉన్నారన్నారు. ప్రభుత్వ భూములున్నచోటే పోర్టు నిర్మించాలని చంద్రబాబు సర్కార్కు ఆయన సూచించారు. ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతి భవిష్యత్లో పెద్ద కుంభకోణానికి నాంది కాబోతుందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు ఇప్పుడు బాధపడుతున్నారని వడ్డే చెప్పారు.
Oct 1 2016 4:43 PM | Updated on Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement