జనజీవనంలో ప్రళయాన్ని సృష్టించిన తీవ్ర పెను తుపాను హుద్ హుద్... శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో అంతులేని అపార నష్టాన్ని మిగిల్చిన ఈ ఘటనకు నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. సమాచార వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంతో పాటు వేల ఎకరాల్లో పంటలను ముంచెత్తింది. ముఖ్యంగా హుద్ హుద్ విసిరిన పంజాకు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖ పట్టణం విషాద నగరంగా మారిపోయింది. తెలుగు నేలపై తుపాన్ల అలజడి కొత్త కాక పోయినా హుద్ హుద్ రూపంలో పోటెత్తిన విపత్తు ఓ పీడకలగా మిగిలిపోతుంది.
Oct 12 2016 3:15 PM | Updated on Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement